ఆర్మీ క్యాప్ తో అమరవీరులకు టీమిండియా నివాళి
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీం ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీం ఇండియా అమరవీరులకు నివాళులర్పించింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీం ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీం ఇండియా అమరవీరులకు నివాళులర్పించింది.
ఆర్మీ క్యాపులను ధరించి బరిలోకి దిగిన కోహ్లీ సేన.. ల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘనంగా నివాళులర్పించింది. టాస్ గెలిచిన కెప్టెన్ కోహ్లి ఫీల్డింగ్వైపు మొగ్గుచూపాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీరజవాన్లు, వారి కుటుంబాలు దేశానికి చేసిన సేవకు చిహ్నంగా ఈ మ్యాచ్లో ఆర్మీక్యాప్లతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. అలాగే ఈ మ్యాచ్ ఫీజును నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళంగా ప్రకటిస్తున్నట్లు ప్రకటించాడు. ఎలాంటి మార్పుల్లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశాడు.
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. లెప్టనెంట్ కల్నల్ హోదా లో ఆటగాళ్లందరికీ ఆర్మీ క్యాప్లు అందజేశారు. ఈ వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ఇక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజును నేషనల్ డిఫెన్స్ ఫండ్ ద్వారా అమర జవాన్ల కుటుంబాల సంక్షేమానికి ఉపయోగిస్తామని ప్రకటించించింది.
#TeamIndia will be sporting camouflage caps today as mark of tribute to the loss of lives in Pulwama terror attack and the armed forces
— BCCI (@BCCI) March 8, 2019
And to encourage countrymen to donate to the National Defence Fund for taking care of the education of the dependents of the martyrs #JaiHind pic.twitter.com/fvFxHG20vi