Asianet News TeluguAsianet News Telugu

టోక్యో ఒలింపిక్స్‌: సెమీస్‌లో పోరాడి ఓడిన భారత రెజ్లర్ భజరంగ్ పూనియా...

అజేర్‌బాయ్‌జాన్‌కి హజి అలియెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5-12 తేడాతో పోరాడి ఓడిన భజరంగ్ పూనియా...

Tokyo Olympics: Indian wrestler Bajrang Punia losses in Semi-finals CRA
Author
India, First Published Aug 6, 2021, 3:15 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం తెస్తాడని భావించిన భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా, ఫైనల్‌కి చేరలేకపోయాడు. 65 కేజీల విభాగంలో సెమీ ఫైనల్ మ్యచ్‌లో అజేర్‌బాయ్‌జాన్‌కి హజి అలియెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5-12 తేడాతో పోరాడి ఓడాడు.

భజరంగ్ తొలి పాయింట్ సాధించినా, ఆ తర్వాత ఎదురుదాడికి దిగిన హజి వరుస పాయింట్లతో 1-8 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత భజరంగ్ కోలుకుని 5-9 తేడాతో కమ్‌బ్యాక్ ఇచ్చినా, హజి మరో 3 పాయింట్లు సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

సెమీస్‌లో ఓడినా కాంస్య పతకం కోసం జరిగే మ్యాచ్‌లో జపాన్‌కి చెందిన టకుటో ఒటోగురోతో మ్యాచ్ ఆడబోతున్నాడు భజరంగ్ పూనియా. అంతకుముందు 20కి.మీ.ల వాకింగ్ రేసులో భారత రేసర్ ప్రియాంక గోస్వామి 17వ స్థానంలో నిలిచింది. మరో అథ్లెట్ భావన జాట్ 32వ స్థానంలో నిలిచింది. 

Follow Us:
Download App:
  • android
  • ios