Asianet News TeluguAsianet News Telugu

థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్ జోడీ

థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్‌‌-చిరాగ్ శెట్టిల జోడి అద్భుత ప్రదర్శనను కనబరిచింది

Thailand Open 2019: Satwiksairaj and Chirag Shetty pair to win a BWF Super 500
Author
Thailand, First Published Aug 4, 2019, 4:20 PM IST

థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత్ సంచలనం సృష్టించింది. చరిత్రలో తొలిసారిగా పురుషుల డబుల్స్‌ టైటిల్స్‌ను ఖాతాలో వేసుకుంది. థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్‌‌-చిరాగ్ శెట్టిల జోడి అద్భుత ప్రదర్శనను కనబరిచింది.

చైనాకు చెందిన లి జున్ హు- యు చెన్ జంటను 21-19, 18-21, 21-18 తేడాతో మట్టికరిపించి రికార్డుల్లోకి ఎక్కింది. తొలి గేమ్‌లో పోరాడి గెలిచిన సాత్విక్-చిరాగ్ జంట... రెండో గేమ్‌ను చేజార్చకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సాత్విక్ జోడీ రెచ్చిపోయింది. చైనా జంటను ఒత్తిడిలోకి నెట్టి... చివరి గేమ్‌ను సొంతం చేసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios