Asianet News TeluguAsianet News Telugu

దుబాయ్‌లో మండిపోతున్న ఎండలు.. ఐస్‌ బాక్స్‌లో తలపెట్టిన భారత క్రికెటర్లు

ఆసియా కప్‌ కోసం దుబాయ్ వెళ్లిన భారత క్రికెటర్లకు అక్కడి ఎండలు మంట పుట్టిస్తున్నాయి. సుమారు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆటగాళ్లు అల్లాడిపోతున్నారు

Team India players suffer for dubai temperature
Author
Dubai - United Arab Emirates, First Published Sep 20, 2018, 1:48 PM IST

ఆసియా కప్‌ కోసం దుబాయ్ వెళ్లిన భారత క్రికెటర్లకు అక్కడి ఎండలు మంట పుట్టిస్తున్నాయి. సుమారు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆటగాళ్లు అల్లాడిపోతున్నారు. వడగాల్పులతో ప్రాక్టీస్‌ చేయలేకపోతున్నారు. దీంతో ఎండ వేడిమి నుంచి సేదతీరేందుకు ఉపశమన చర్యలు పాటిస్తున్నారు.

ముంచుముక్కలు టోపీల్లో వేసుకోవడంతో పాటు..తలపై చల్లని వాటర్ బాటిళ్లు పెట్టుకున్నారు. కొందరైతే ఏకంగా ఐస్ డబ్బాలోనే తలదూర్చేశారు. టీమిండియా క్రికెటర్ల ఉపశమన చర్యలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios