Asianet News TeluguAsianet News Telugu

సింగపూర్ ఓపెన్ 2022: రీఎంట్రీ అదిరింది... క్వార్టర్ ఫైనల్‌కి దూసుకెళ్లిన సైనా నెహ్వాల్...

15 నెలల విరామం తర్వాత క్వార్టర్ ఫైనల్ ఆడబోతున్న సైనా నెహ్వాల్... వరల్డ్ నెం.9 ప్లేయర్‌ని జియావోపై అద్భుత విజయం...

Singapore Open 2022: Saina Nehwal moves into Quarter Finals of Singapore Open
Author
India, First Published Jul 14, 2022, 5:43 PM IST

15 నెలల విరామం తర్వాత భారత సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. వివాహం తర్వాత సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్న సైనా, సింగపూర్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ 500 టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది...

వరల్డ్ నెం.9 చైనా ప్లేయర్ హి బింగ్ జియావోతో జరిగిన మ్యాచ్‌లో 21-19, 11-21, 21-17 తేడాతో విజయం అందుకున్న సైనా నెహ్వాల్, సింగపూర్ ఓపెన్‌లో ముందుకు వెళ్లింది. కొద్ది కాలం గ్యాప్ తర్వాత తిరిగి బ్యాటు పట్టిన సీనియర్ ప్లేయర్ సైనా నెహ్వాల్, తొలి రౌండ్‌లో మరో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ మాళవిక బాన్సోద్‌పై 21-18, 21-14 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌కి అర్హత సాధించింది...  2010లో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచిన సైనా నెహ్వాల్, మరోసారి ఆ ఫీట్ రిపీట్ చేసి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశపడుతోంది. 

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌ని తొలి రౌండ్‌లో ఓడించి సంచలనం క్రియేట్ చేసిన మిథున్ మంజునాథ్, రెండో రౌండ్‌లో వరల్డ్ నెం.42 ర్యాంక్ ప్లేయర్ నాట్ గుయెన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10-21, 18-21, 16-21 తేడాతో పోరాడి ఓడాడు. 

భారత మెన్స్ డబుల్ జోడి అర్జున్, ధృవ్ కపిలా జోడి వరల్డ్ నెం.12 జోడి గో సీ ఫెయ్ - నుర్ ఇజాదుద్దీన్‌తో జరిగిన మ్యాచ్‌లో 18-21, 11-21, 21-18 తేడాతో సంచలన విజయం సాధించి ప్రీ క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లారు..

భారత బ్యాడ్మింటన్ టాప్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌కి, సింగపూర్ ఓపెన్ 2022 ఆరంభ రౌండ్‌లోనే ఊహించని షాక్ తగిలింది. వరల్డ్ నెం.11 ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, భారత్‌కే చెందిన మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ మిథున్ మంజునాథ్‌తో తలబడి 2-1 తేడాతో పోరాడి ఓడాడు...

తొలి సెట్‌ను 21-17 తేడాతో సొంతం చేసుకున్న మిథున్ మంజునాథ్, రెండో సెట్‌ను 15-21 తేడాతో చేజార్చుకున్నాడు. తొలి సెట్‌లో ఓడినా, రెండో సెట్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చిన కిడాంబి శ్రీకాంత్, మూడో సెట్‌లో తన ఆధిక్యాన్ని నిలుపుకోలేకపోయాడు...

మూడో సెట్‌లో మిథున్ మంజునాథ్ దూకుడును తట్టుకోలేకపోయిన కిడాంబి శ్రీకాంత్ 21-18 తేడాతో సెట్‌ని, మ్యాచ్‌ని కోల్పోయాడు...  మరో మ్యాచ్‌లో భారత స్టార్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్, థాయ్‌లాండ్‌కి చెందిన సితికోమ్ తమాసిన్‌పై రెండు సెట్లలో సునాయస విజయా అందుకుని, రెండో రౌండ్‌కి దూసుకెళ్లాడు...

తొలి రౌండ్‌లో 21-13, 21-16 తేడాతో సితికోమ్ తమాసిన్‌ని ఓడించిన ప్రణయ్.. రెండో రౌండ్‌లో తైవాన్‌కి చెందిన చో టెన్ చెన్‌ని ఓడించి ప్రీ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. వరల్డ్ నెం.4 ర్యాంకర్ చో టెన్ చెన్‌తో జరిగిన మ్యాచ్‌లో 14-21, 22-20, 21-18 తేడాతో విజయం సాధించాడు ప్రణయ్.. 


భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ 500 టోర్నీలో రెండో రౌండ్ గండాన్ని దాటేసింది. వరల్డ్ 59వ ర్యాంకర్ తుయ్ లిన్ గుయెన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయాన్ని అందుకుంది పీవీ సింధు...

వియత్నాంకి చెందిన తుయ్ లిన్ గుయెన్‌, మొదటి రౌండ్‌లో పీవీ సింధుపై మంచి ఆధిపత్యం కనబర్చింది. 19-21 తేడాతో మొదటి సెట్ కోల్పోయిన పీవీ సింధు, ఆ తర్వాత అదిరిపోయే రేంజ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చింది. 21-19 తేడాతో రెండో సెట్ గెలిచిన తెలుగు తేజం, 21-18 తేడాతో మూడో సెట్‌ని సొంతం చేసుకుని... మూడో రౌండ్‌కి దూసుకెళ్లింది...

మూడో రౌండ్‌లో  చైనాకి చెందిన వరల్డ్ 19వ ర్యాంకర్ హ్యాన్ యూయ్‌తో తలబడనుంది పీవీ సింధు. ఇంతకుముందు భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ అస్మిత చాలిహాని ఓడించిన హ్యాన్ యూయ్‌తో ఇంతకుముందు 2019లో జపాన్ ఓపెన్ ఫైనల్‌లో తలబడింది పీవీ సింధు. ఆ మ్యాచ్‌లో రెండు సెట్లను 9-21, 17-21  తేడాతో చైనీస్ ప్లేయర్‌ని చిత్తు చేసింది సింధు...

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ 500 సింగపూర్ ఓపెన్ తొలి రౌండ్‌లో బెల్జియంకి చెందిన లియానె టాన్‌పై 21-15, 21-11 తేడాతో సునాయస విజయం అందుకుంది పీవీ సింధు.  

Follow Us:
Download App:
  • android
  • ios