మలేషియన్ ఓపెన్లో సింధుకి షాక్
మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో సుంగ్ జీ హ్యూన్ చేతిలో ఓటమి పాలయ్యారు
మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో సుంగ్ జీ హ్యూన్ చేతిలో ఓటమి పాలయ్యారు. తొలి గేమ్లో పోరాడి ఓడిన సింధూ... రెండో గేమ్లో కనీసం పోరాటం చేయడంలో విఫలమై 18-21, 7-21 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత యువ సంచలనం కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్కు చేరుకున్నాడు.