Asianet News TeluguAsianet News Telugu

ప్రో కబడ్డి 2019: జైపూర్ పింక్ పాంథర్స్ అదుర్స్... యూ ముంబాపై ఘన విజయం

హైదరాబాద్ వేదికన జరుగుతున్న ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు అదరగొట్టింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో యూ ముంబాతో తలపడి ఏకంగా 19 పాయింట్స్ తేడాతో జైపూర్ విజయాన్ని అందుకుంది. 

pro kabaddi 2019: jaipur pink panthers beats u mumba in 23-42
Author
Hyderabad, First Published Jul 22, 2019, 8:39 PM IST

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ప్రో కబడ్డి లీగ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ అదరగొట్టింది. మొదటి మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ పై విజయంతో ఘనంగా టోర్నీని ప్రారంభించిన యూ ముంబాను పాంథర్స్ మట్టికరిపించింది. ఏకంగా 23-42 పాయింట్ల తేడాతో జైపూర్ జట్టు ఘన విజయం సాధించింది. 

ఈ  మ్యాచ్ ఆరంభం నుండి జైపూర్ జట్టు ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా స్టార్ రైడర్ దీపక్ హుడా 10 రైడ్, 1 బోనస్ పాయింట్ తో  ఏకంగా 11 పాయింట్స్ సాధించాడు. అతడికి తోడుగా నితిన్ రావల్ 7, దీపక్ నర్వాల్ 6, డిఫెండర్స్ అమిత్ హుడా 5, విశాల్ 3 పాయింట్లతో ఆకట్టుకున్నారు. ఇక సచిన్ నర్వాల్ 2, సందీప్ 1, అంజింక్య 1 పాయింట్ తో తమవంతు సహకారం అందించారు.  ముంబైని ఆలౌట్ చేయడం ద్వారా పింక్ పాంథర్స్ మరో ఆరు పాయింట్లతో మొత్తం 42 పాయింట్స్ తో అదరగొట్టింది. 

pro kabaddi 2019: jaipur pink panthers beats u mumba in 23-42

ఇక మొదటి మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ ను ఓడించిన యూ ముంబా  ఈ మ్యాచ్ లో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. రైడర్స్ పరవాలేదనిపించిన డిఫెండర్స్ ఆకట్టుకోలేకపోయారు. అభిషేక్ సింగ్ అత్యధికంగా 7 పాయింట్స్ సాధించాడు. లీ  డాంగ్ 6, సురేందర్ సింగ్ 3, ఫజల్ 2, అతుల్ 2, రోహిత్ 1, సందీప్ 1,  అజింక్య 1 పాయింట్స్ సాధించారు. ముంబై జట్టు ఒక్కసారి కూడా జైపూర్ ను ఆలౌట్ చేయలేకపోయింది. 

ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ మైదానానికి విచ్చేశాడు. తమ  జట్టు జైపూర్ పింక్ పాంథర్స్ కు అతడు మద్దతుగా కాస్సేపు సందడి చేశారు.  

pro kabaddi 2019: jaipur pink panthers beats u mumba in 23-42
 

Follow Us:
Download App:
  • android
  • ios