Asianet News TeluguAsianet News Telugu

ప్రో కబడ్డి 2019: ఉత్కంఠ పోరులో డిల్లీదే విజయం...పోరాడి ఓడిన తమిళ తలైవాస్

డిల్లి దబాంగ్స్ గచ్చిబౌలి స్టేడియంలో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన  మ్యాచ్ లో తమిళ్ తలైవాస్ పై కేవలం ఒక్క పాయింట్స్ తేడాతో డిల్లీ విజయాన్ని అందుకుంది. 

pro kabaddi 2019: delhi dabang wins against tamil thalaivas match
Author
Hyderabad, First Published Jul 25, 2019, 8:48 PM IST

గచ్చిబౌలి స్టేడియం మరో ఉత్కంఠ పోరుకు వేదికయ్యింది. డిల్లీ దబాంగ్, తమిళ్ తలైవాస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్ లో చివరకు డిల్లీదే  పైచేయిగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్  చివర్లో కొన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకుని తమిళ ఆటగాళ్లు రెఫరీలతో వాగ్వాదానికి దిగే స్థాయికి చేరుకున్నాయి. అయినప్పటికి రెఫరీలు డిల్లీ దబాంగ్స్ నే విజేతలుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం 1 పాయింట్ తేడాతో విజేతగా నిలిచి డిల్లీ పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. 


ఈ మ్యాచ్ లో ఇరు జట్ల హోరాహోరీగా  పోరాడి అన్నిట్లోనూ సమానంగా నిలిచినా డిల్లీకి రెండు ఎక్స్ ట్రా పాయింట్స్ లభించాయి.  ఇదే తమిళ్ తలైవాస్ కొంపముంచింది. డిల్లీ జట్టు ఎక్స్‌ట్రాల రూపంలో 5 పాయింట్స్ లభించగా తమిళ జట్టుకు 3 పాయింట్స్ మాత్రమే లభించాయి.

ఇక డిల్లీ దబాంగ్ ప్రదర్శన విషయానికి వస్తే నవీన్ కుమార్ అత్యధికంగా 8 పాయింట్స్ తో ఆకట్టుకున్నాడు. అలాగే మేరాజ్ 6, జోగిందర్ సింగ్ 4, విశాల్ 2, చంద్రన్ 1, సయిద్ 1 పాయింట్స్ సాధించి డిల్లీ విజయానికి సహకారం అందించారు. ఇలా  రైడింగ్ 13, ట్యాకిల్స్ లో 10, ఆలౌట్స్ ద్వారా 2 పాయింట్స్ లభించగా అదనంగా మరో 5  పాయింట్స్  లభించాయి. దీంతో డిల్లీ తలైవాస్ కంటే 1 పాయింట్ అదనంగా  పొంది విజేతగా నిలిచింది. 

ఇక తలైవాస్ విషయానికి  వస్తే స్టార్ రైడర్ రాహుల్ చౌదరి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అతడు కేవలం 7 పాయింట్లు మాత్రమే సాధించాడు. మంజిత్ చిల్లర్ 5, అజయ్ ఠాకుర్ 5 పాయింట్స్ తో పరవాలేదనిపించారు. మోహిత్ చిల్లర్  2, అజిత్ 2, రన్ సింగ్ 1, అజిత్ 1 పాయింట్ సాధించారు.  ఇలా రైడర్స్ 12, డిపెండర్స్ 12, ఆలౌట్ 2, ఎక్స్‌ట్రాల ద్వారా 3 పాయింట్స్ లభించాయి.

అయితే డిల్లీతో చివరివరకు హోరాహోరీగా పోరాడికి తమిళ జట్టు చివరికి 29-30 తేడాతో  ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.   

Follow Us:
Download App:
  • android
  • ios