Asianet News TeluguAsianet News Telugu

ప్రో కబడ్డి 2019: సొంత గడ్డపై బెంగాల్ తొలి విజయం...పోరాడిఓడిన పూణే

ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో బెంగాల్ వారియర్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. హెూం గ్రౌండ్ లో పుణేరీ పల్టాన్ ను చిత్తుచేసి విజయాన్ని అందుకుంది.  

pro kaaddi 2019: bengal warriors beat puneri paltans
Author
Kolkata, First Published Sep 8, 2019, 9:57 PM IST

హోం గ్రౌండ్...సొంత ప్రేక్షకుల మధ్య బెంగాల్ వారియర్స్ తొలి విజయాన్ని అందుకుంది. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో పుణేరీ పల్టాన్ జట్టుతో తలపడి వారియర్స్ అద్భుత విజయాన్ని సాధించింది. చివరివరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో  స్థానికజట్టు కేవలం 3 పాయింట్ల తేడాతో గెలుపొందింది. పుణేరీ పల్టాన్ చివరివరకు పోరాడినా ఓటమిని చవిచూసింది. 

బెంగాల్ ఆటగాళ్లలో మణీందర్ సింగ్ 10, ఇస్మాయిల్ 6, సుఖేష్ హెగ్డే 6, ప్రభంజన్ 5, బల్దేవ్ సింగ్ 5 పాయింట్లతో రాణించారు.  మయూర్ 2, రింకు 2 పాయింట్లతో వారియర్స్ విజయంలో  తమవంతు పాత్ర పోషించారు. ఇలా బెంగాల్ జట్టు రైడింగ్ లో  30, ట్యాకిల్స్ లో 10, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్‌ట్రాల రూపంలో 1  మొత్తం 42  పాయింట్లు సాధించి విజయాన్ని అందుకుంది. 

పుణేరీ జట్టు కూడా అంత తొందరగా ఓటమిని అంగీకరించలేదు. పంకజ్ 10, మంజిత్ 9 పాయింట్లతో అదరగొట్టినా ఫలితంలేకుండా పోయింది.  హదీ 4, గిరీశ్ 3, సుర్జిత్ 2, దర్శన్ 2 పాయింట్లు సాధించారు. అయితే రైడింగ్ లో 21, ట్యాకిల్స్ 12,  ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్‌ట్రాల ద్వారా  మరో 2 మొత్తం 39 పాయింట్లు సాధించింది. అయినప్పటికి కేవలం 3 పాయింట్లు తేడాతో ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. 

  

Follow Us:
Download App:
  • android
  • ios