మహేష్ బాబు, సాయిథరమ్ తేజ్ లకు లవ్లీనా స్పెషల్ థ్యాంక్స్..!
టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, సాయి థరమ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను, నటి వరలక్ష్మీ శరత్ కుమార్ లు.. వీరంతా సోషల్ మీడియా వేదికగా ఆమెకు అభినందనలు తెలియజేశారు.
టోక్యో ఒలంపిక్స్ లో అమ్మాయిలు అదరగొట్టారు. బ్యాడ్మింటన్ లో సింధు, వెయిట్ లిఫ్టింగ్ లో మీరా భాయి చాను పతకాలు గెలవగా.. బాక్సింగ్ లో లవ్లీనా అదరగొట్టింది. గోల్డ్ గెలుస్తుందని ఆశపడ్డాం కానీ.. కాంస్యం సాధించింది. ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటి వరకూ ముగ్గురు బాక్సర్లు మాత్రమే భారత్కి పతకాలు అందించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో విజేందర్ కాంస్య పతకం గెలుపొందగా.., 2012 లండన్ ఒలింపిక్స్లో మేరీకోమ్ కూడా కాంస్యం గెలిచింది. తాజాగా లవ్లీనా వీరి సరసన కాంస్యంతో నిలిచింది.
ఈ నేపథ్యంలో.. ఆమెపై ప్రశంసల జల్లు కురిసింది. టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, సాయి థరమ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను, నటి వరలక్ష్మీ శరత్ కుమార్ లు.. వీరంతా సోషల్ మీడియా వేదికగా ఆమెకు అభినందనలు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో.. మహేష్ బాబు, సాయి ధరమ్ తేజ్, తాప్సీ, వరలక్ష్మీ శరత్ కుమార్ లకు.. లవ్లీనా... ట్విట్టర్ వేదికగా దన్యవాదాలు తెలియజేశారు. కాగా... వీరి ట్వీట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.