ధోనికి కృనాల్ పాండ్యా వార్నింగ్
టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కృనాల్ పాండ్యా వార్నింగ్ ఇచ్చాడా..? అవుననే అనిపిస్తోంది.
టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కృనాల్ పాండ్యా వార్నింగ్ ఇచ్చాడా..? అవుననే అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది కూడా మన్కడింగ్ విషయంలో.
ఇంతకీ మ్యాటరేంటంటే... ప్రస్తుతం ఐపీఎల్ లో మన్కడింగ్ గురించి చర్చ బాగా జరుగుతోంది. కింగ్స పంజాబ్ కెప్టెన్ అశ్విన్.. రాజస్థాన్ బ్యాట్స్మన్ బట్లర్ను మన్కడింగ్ ద్వారా రనౌట్ చేసినప్పటి నుంచి మన్కడింగ్ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఓ మ్యాచ్ లో పంజాబ్ బ్యాట్స్మన్ మయాంక్ అగర్వాల్ను ముంబయి టీం బౌలర్ కృనాల్ ఔట్ చేయకుండా వార్నింగ్ ఇవ్వడం అభిమానులను ఆకట్టుకుంది.
కాగా ఇలాంటి వార్నింగే ధోనికి ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. చెన్నై ఇన్నింగ్స్ 14వ ఓవర్లో కేదార్ జాదవ్కు బౌలింగ్ చేస్తున్న కృనాల్.. తన రనప్ను మధ్యలోనే ఆపి నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న ధోనీకి పరోక్షంగా మన్కడింగ్ వార్నింగ్ ఇచ్చినట్లు కనిపించాడు. అయితే ఆ సమయానికి ధోనీ ఇంకా పూర్తిగా క్రీజును వదల్లేదు. అతని బ్యాట్ ఇంకా క్రీజులో ఉంది. దీంతో అభిమానులు కృనాల్ చర్యపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. ధోనీ చాలా స్మార్ట్.. అతన్నే నువ్వు మన్కడింగ్ చేస్తావా అంటూ కృనాల్ ని ట్రోల్ చేస్తున్నారు.
Mankading MSD? Think again! https://t.co/s3uoPoc4dK via @ipl
— hariprasad (@hariprasads1683) April 4, 2019