Asianet News TeluguAsianet News Telugu

ఆ రెండు ఓవర్లు నరకంలా అనిపించాయి.. శ్రేయాస్ అయ్యర్

విశాఖ వేధికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ ని ఎట్టకేలకు ఢిల్లీ సొంతం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో విజయం ఢిల్లీకే దక్కింది.

IPL 2019: Felt like hell, says Shreyas Iyer after DC beat SRH in tense Eliminator
Author
Hyderabad, First Published May 9, 2019, 11:55 AM IST

విశాఖ వేధికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ ని ఎట్టకేలకు ఢిల్లీ సొంతం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో విజయం ఢిల్లీకే దక్కింది. దీంతో.. ఢిల్లీ ట్రోఫి అందుకోవడానికి రెండు అడుగుల దూరంలో ఉంది . ఈ మ్యాచ్ గెలవడం పట్ల ఢిల్లా క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్ చివరి రెండు ఓవర్లు తాను ఎంతో  ఒత్తిడికి గురయ్యానని శ్రేయాస్ పేర్కొన్నాడు.

విజయానంతరం శ్రేయాస్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘నా భావోద్వేగాలను వ్యక్తం చేయలేను. అలాంటి ఒత్తిడి పరిస్థితిని ఎదుర్కొన్నాను.  నేను నా సహచరులతో కూర్చొని  ఉన్నాను. కానీ కొన్ని సంవత్సరాలపాటు  వారితో కూర్చుని ఉన్నట్లు అనిపించింది! నిజం చెప్పాలంటే.. చివరి రెండు ఓవర్లు నాకు నరకంలా అనిపించాయి. ’’ అని శ్రేయాస్ పేర్కొన్నాడు.

‘‘ మ్యాచ్ గెలిచిన తర్వాత నేను ప్రతి ఒక్కరి ముఖాల్లోని ఆనందాన్ని చూడగలిగాను. వాళ్లంతా బయటకు వచ్చి తమను తాము వ్యక్తం చేయడాన్ని చూస్తేంటే.. చాలా బాగా అనిపించింది.  తర్వాతి మ్యాచ్ లో చెన్నైను ఎదురుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఆ మ్యాచ్ గురించే ఆలోచిస్తున్నాను’’ అని శ్రేయాస్ తెలిపాడు.

మ్యాచ్ అందరూ సన్ రైజర్స్ గెలుస్తుందని భావించారు. కానీ..చివరి ఓవర్ లో పంత్ మాయ చేశాడు. తన బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. తన ఒంటి చేత్తో మ్యాచ్ ని విజయం దిశగా నడిపించాడు. ఈ శుక్రవారం ఢిల్లీ... చెన్నైతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించన వారు ఫైనల్స్ లో ముంబయి ఇండియన్స్ తో తలపడతారు. 

Follow Us:
Download App:
  • android
  • ios