Asianet News TeluguAsianet News Telugu

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ 2024 : మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌ల జట్టు ఇదే..

ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు సిరీస్‌లో తలపడే భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది.

India vs England Test Series 2024 : This is the team for the first two Test matches - bsb
Author
First Published Jan 13, 2024, 2:12 PM IST

ఈ ఏడాది స్వదేశంలో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు టెస్టు మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌తో తలపడే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం ప్రకటించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు జనవరి 4న కేప్ టౌన్‌లో తన మొట్టమొదటి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది, ఇది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) స్టాండింగ్‌లలో అగ్రస్థానంలో నిలిచింది.

జనవరి 25న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీమిండియా తొలి టెస్టు ఆడనుంది. ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్-బ్యాటర్ ధృవ్ జురెల్ జాతీయ జట్టులో తొలిసారి స్థానం సంపాదించాడు. కెఎల్ రాహుల్, కేఎస్ భరత్ తర్వాత జట్టులో మూడో వికెట్ కీపర్ గా ఉంటారు. 

వెటరన్‌లు ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే, ఇషాన్‌ కిషన్‌ లకు ఈసారి చోటు దక్కలేదు. తొలి రెండు టెస్టులకు 16 మందితో కూడిన టీంను ఎంపిక చేసినట్లుగా బీసీసీఐ తెలిపింది. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మను ఎంపిక చేసింది. జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్ గా ఉండబోతున్నాడు. జనవరి 25 నుంచి టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టులు ప్రారంభం కానున్నాయి 

మొదటి రెండు  టెస్టులకు..
కెప్టెన్ గా రోహిత్ శర్మ
వైస్ కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా 
శుభ్ మన్ గిల్
యశస్వి జైస్వాల్
శ్రేయస్ అయ్యర్
విరాట్ కోహ్లీ
కేఎల్ రాహుల్
ధ్రువ్రె జురెల్
అశ్విన్
జడేజా
అక్షర్ పటేల్
కుల్దీప్ యాదవ్
మహమ్మద్ సిరాజ్
ముఖేష్ కుమార్
అవేశ్ ఖాన్ లు
ఉండబోతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios