Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ చెస్ ఒలింపియాడ్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. తొలిసారిగా స్వర్ణ పతకం

ఫిడే ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. రష్యాతో కలిసి ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ని సొంతం చేసుకుంది.

India Russia declared joint winners in Online Chess Olympiad
Author
New Delhi, First Published Aug 30, 2020, 8:44 PM IST

ఫిడే ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. రష్యాతో కలిసి ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ని సొంతం చేసుకుంది. 93 ఏళ్ల ఫిడే ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ తొలిసారి స్వర్ణం సాధించింది.

భారత్‌ను విజేతగా నిలపడంలో తెలుగు తేజం కోనేరు హంపి కీలక పాత్ర పోషించారు. ఫైనల్‌లో రష్యాకు చెందిన అలెగ్జాండ్రాతో ఆమె తలపడ్డారు. మ్యాచ్ డ్రా కావడంతో భారత్- రష్యాను నిర్వాహకులు ఉమ్మడి విజేతగా ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios