క్రికెట్ లో విషాదం.. బాల్ తగిలి.. అంపైర్ మృతి
ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో భాగంగా జులై 13న పెమ్బ్రోక్షైర్ X నార్బెత్ జట్ల మధ్య కౌంటీ క్రికెట్ జరిగింది. ఆ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించిన జాన్ విలియమ్స్(80) తలకు బంతి తగలడంతో తీవ్ర గాయమైంది.
క్రికెట్ లో విషాదం చోటుచేసుకుంది. బాల్ తలకు తగిలి ఓ అంపైర్ మృతి చెందాడు. ఈ సంగటన ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది. అంపైర్ తలకు బాల్ గత నెలలో తగలగా...ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. నెల రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల కన్నుమూశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో భాగంగా జులై 13న పెమ్బ్రోక్షైర్ X నార్బెత్ జట్ల మధ్య కౌంటీ క్రికెట్ జరిగింది. ఆ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించిన జాన్ విలియమ్స్(80) తలకు బంతి తగలడంతో తీవ్ర గాయమైంది.
గాయపడిన వెంటనే విలియమ్స్ను కార్డిఫ్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా కోమాలోకి వెళ్లాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హావర్ఫోర్డ్వెస్ట్లోని మరో ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పెమ్బ్రోక్షైర్ క్రికెట్ క్లబ్ గురువారం ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపింది. ‘అంపైర్ జాన్ విలియమ్స్ గురించి చేదు వార్త వినాల్సివచ్చింది. ఈ ఉదయం ఆయన ఆస్పత్రిలో మృతిచెందారు. పెమ్బ్రోక్షైర్ క్రికెట్ తరఫున సంతాపం తెలుపుతున్నాం’ అంటూ ట్వీట్ చేసింది.