Asianet News TeluguAsianet News Telugu

ప్రత్యక్షసాక్షిగా ఉన్నందుకు ఆనందంగా ఉంది.. అనుష్క శర్మ

ఆసిస్ గడ్డపై టీం ఇండియా చరిత్ర సృష్టించింది. దాదాపు 70 సంవత్సరాల భారత క్రికెట్ అభిమానుల కలని కోహ్లీసేన సాకారం చేసింది. 

Anushka Sharma Posts Special Message For Virat Kohli, Team India After Historic ODI Series Win
Author
Hyderabad, First Published Jan 19, 2019, 11:19 AM IST

ఆసిస్ గడ్డపై టీం ఇండియా చరిత్ర సృష్టించింది. దాదాపు 70 సంవత్సరాల భారత క్రికెట్ అభిమానుల కలని కోహ్లీసేన సాకారం చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్, వన్డే సిరీస్‌లు కైవసం చేసుకొని.. టీ-20 సిరీస్‌ని టై చేసుకొని చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా కోహ్లీసేనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఈ విజయంపై బాలీవుడ్ నటి, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి ట్విట్టర్ వేదికగా స్పందించారు. 

ఈ పర్యటన జీవితంలో మరిచిపోలేనిదని ఆమె పేర్కొన్నారు. టీం ఇండియా చారిత్రిక  విజయానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నందుకు ఆనందంగా ఉందన్నారు. టీం ఇండియాకి శుభాకాంక్షలు తెలియజేశారు. తన భర్త విరాట్ కోహ్లీని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ ఆమె ట్వీట్ చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios