ప్రత్యక్షసాక్షిగా ఉన్నందుకు ఆనందంగా ఉంది.. అనుష్క శర్మ
ఆసిస్ గడ్డపై టీం ఇండియా చరిత్ర సృష్టించింది. దాదాపు 70 సంవత్సరాల భారత క్రికెట్ అభిమానుల కలని కోహ్లీసేన సాకారం చేసింది.
ఆసిస్ గడ్డపై టీం ఇండియా చరిత్ర సృష్టించింది. దాదాపు 70 సంవత్సరాల భారత క్రికెట్ అభిమానుల కలని కోహ్లీసేన సాకారం చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్, వన్డే సిరీస్లు కైవసం చేసుకొని.. టీ-20 సిరీస్ని టై చేసుకొని చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా కోహ్లీసేనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఈ విజయంపై బాలీవుడ్ నటి, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఈ పర్యటన జీవితంలో మరిచిపోలేనిదని ఆమె పేర్కొన్నారు. టీం ఇండియా చారిత్రిక విజయానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నందుకు ఆనందంగా ఉందన్నారు. టీం ఇండియాకి శుభాకాంక్షలు తెలియజేశారు. తన భర్త విరాట్ కోహ్లీని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ ఆమె ట్వీట్ చేశారు.
What an unforgettable & outstanding tour it's been !! Happy to have witnessed the historic victories by the men 👏 🙏 👏 HUGE congratulations 🇮🇳 And so proud of you my love @imVkohli ❤️ 😁 pic.twitter.com/QdAdN9OFaz
— Anushka Sharma (@AnushkaSharma) January 18, 2019