ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మౌ అసెంబ్లీ స్థానం నుండి పలు దఫాలు ప్రాతినిథ్యం వహించిన డాన్ ముక్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందాడు.
NATIONAL Mar 29, 2024, 8:44 AM IST
సోంచంద్భాయ్ సోలంకీ, పురుషోత్తమ్ మౌలంకర్, అమృత్ పటేల్, శంకర్ సింగ్ వాఘేలా, ఎల్ కే అద్వానీ , అటల్ బిహారీ వాజ్పేయ్, అమిత్ షా వంటి దిగ్గజాలు గాంధీనగర్ నుంచి లోక్సభలో అడుగుపెట్టారు. 1989 నుంచి నేటి వరకు భారతీయ జనతా పార్టీ అక్కడ ఓడిపోలేదంటే కమలనాథుల పట్టును అర్ధం చేసుకోవచ్చు. బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ గాంధీ నగర్ నుంచి ఆరుసార్లు విజయం సాధించి పార్టీకి బలమైన పునాదిని వేశారు. గాంధీ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 19,45,772 మంది ఓటర్లున్నారు. వీరిలో 10,04,291 మంది పురుషులు.. 9,41,434 మంది మహిళలు. 1989 తర్వాతి నుంచి బీజేపీ కంచుకోటను బద్ధలు కొట్టేందుకు కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈసారి తమ అభ్యర్ధిగా సౌమ్య పుహాన్ను ఆ పార్టీ ప్రకటించింది.
NATIONAL Mar 15, 2024, 6:32 PM IST
గాంధీ పేరు వింటే మదిలో మెదిలే నియోజకవర్గం రాయ్బరేలి. ఇందిరా గాంధీ, ఆమె భర్త ఫిరోజ్ గాంధీ, అరుణ్ నెహ్రూ, షీలా కౌల్, సతీష్ శర్మ, సోనియా గాంధీ, రాజ్ నారాయణ్లు ఇక్కడి నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. ఇందిరా గాంధీని నెత్తిన పెట్టుకున్న జనమే.. ఎమర్జెన్సీ విధించినందుకు ఆమెను ఓడించి షాకిచ్చారు. ఇందిరమ్మపై రాజ్ నారాయణ్ గెలిచి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. 1952లో నియోజకవర్గం ఏర్పడి నాటి నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీదే హవా. ఇక్కడ ఆ పార్టీ 17 సార్లు విజయం సాధించగా.. బీజేపీ రెండు సార్లు, జనతా పార్టీ ఒకసారి గెలిచాయి. తన కంచుకోటకు బీటలు వారకుండా చూసేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వరుసగా నాలుగు సార్లు రాయ్బరేలి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా ఈసారి పోటీ చేయడం లేదని ప్రకటించడంతో తెరపైకి ప్రియాంక గాంధీ పేరు వచ్చింది.
NATIONAL Mar 15, 2024, 5:06 PM IST
1967లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి అమేథీ కాంగ్రెస్కు కంచుకోట. గాంధీ - నెహ్రూ కుటుంబానికి కంచుకోట ‘అమేథీ’.విద్యాధర్ భాజ్పాయ్, రవీంద్ర ప్రతాప్ సింగ్, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సతీశ్ శర్మ , సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, స్మృతీ ఇరానీ వంటి దిగ్గజాలు అమేథీ నుంచి ఎంపీలుగా పార్లమెంట్లో ప్రాతినిథ్యం వహించారు. 1967లో ఏర్పడిన అమేథీ నుంచి కాంగ్రెస్ పార్టీ 13 సార్లు, బీజేపీ రెండు సార్లు, జనతా పార్టీ ఒకసారి విజయం సాధించాయి. అమేథీ లోక్సభ పరిధిలో టిలోయ్, సలోన్, జగదీష్ పూర్, గౌరీగంజ్, అమేథీ శాసనసభ స్థానాలున్నాయి. అమేథీలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,43,515 మంది. వీరిలో పురుషుల సంఖ్య 8,18,812 మంది.. మహిళలు 9,24,563 మంది. నెహ్రూ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి దశాబ్థాలుగా కంచుకోటగా వున్న అమేథీలో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు.
NATIONAL Mar 15, 2024, 3:28 PM IST
1952లో నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్లలో కాంగ్రెస్కు కంచుకోటగా నిలిచిన లక్నో.. తర్వాత బీజేపీకి పెట్టని కోటగా మారింది. విజయలక్ష్మీ పండిట్, షిరోజ్వతి నెహ్రూ, షీలా కౌల్, హేమంత్ నందన్ బహుగుణ, అటల్ బిహారీ వాజ్పేయ్, లాల్జీ టాంటన్, రాజ్నాథ్ సింగ్ వంటి వారు ఇక్కడి నుంచే లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. దివంగత మాజీ ప్రధాని వాజ్పేయ్ 1991 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు లక్నో నుంచి ఎంపీగా గెలిచి బీజేపీకి గట్టి పునాది వేశారు. దీనిని ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ కొనసాగిస్తున్నారు. 1991 నుంచి నేటి వరకు బీజేపీ లక్నోలో ఓడిపోకపోవడం ఆ పార్టీకి ఇక్కడున్న పట్టును అర్ధం చేసుకోవచ్చు. పూర్తిగా అర్బన్ ప్రాంతంలో లక్నో పార్లమెంట్ స్థానం విస్తరించి వుంది. ఓటర్లలో అత్యధికులు అగ్రవర్ణాలకు చెందినవారే. 2014, 2019లలో వరుసగా రెండు సార్లు లక్నో నుంచి గెలిచిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తున్నారు.
NATIONAL Mar 14, 2024, 9:17 PM IST
ఉత్తరప్రదేశ్లోని 80 పార్లమెంట్ స్థానాల్లో అత్యంత కీలకమైనది వారణాసి. 1957 నుంచి నేటి వరకు భారత రాజకీయాల్లో కీలకపాత్ర పోషించింది. యూపీ మాజీ సీఎంలు త్రిభువన్ సింగ్, కమలాపతి త్రిపాఠి, బీజేపీ కురువృద్ధుడు మురళీ మనోహర్ జోషి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీలు వారణాసి నుంచే లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. ఆధ్యాత్మికపరంగానే కాదు.. రాజకీయంగానూ వారణాసికి ఎంతో ప్రత్యేకత వుంది. వారణాసి పార్లమెంట్ పరిధిలో రోహనియా, వారణాసి నార్త్, వారణాసి సౌత్, వారణాసి కంటోన్మెంట్, సేవాపురి అసెంబ్లీ స్థానాలున్నాయి. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ పట్టుదలతో వున్నారు. వారణాసిని కాపాడుకోవడం బీజేపీకి, దాని హిందుత్వ బ్రాండ్ రాజకీయాలకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకం
NATIONAL Mar 14, 2024, 8:02 PM IST
ఎన్ ఆర్సీకి సీఏఏ ఒక ముందడుగు మాత్రమే అని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఎస్టీ హసన్ అని అన్నారు. ఎన్నికల ముందు ప్రజల దృష్టి మరల్చే ఒక ఎత్తుగడ అని విమర్శించారు.
NATIONAL Mar 12, 2024, 2:49 PM IST
Shafiqur Rahman Barq : సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ షఫీకుర్ రెహ్మాన్ బార్క్ కన్నుమూశారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
NATIONAL Feb 27, 2024, 11:58 AM IST
యూపీలో ఆర్ఎల్డీ యూటర్న్ తీసుకుంది. కేంద్రంలోని మాజీ పీఎం బీజేపీ చౌదరి చరణ్ సింగ్కు భారత రత్న అవార్డు ప్రకటించడంతో చరణ్ సింగ్ మనవడు జయంత్ చౌదరి పార్టీ ఆర్ఎల్డీ బీజేపీతో పొత్తుకు సై అన్నది. సమాజ్వాదీతో తెగదెంపులు చేసుకుంది.
NATIONAL Feb 9, 2024, 8:12 PM IST
ఇండియా కూటమిలోని పార్టీకి గాలం వేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నది. ఆర్ఎల్డీకి ఏడు సీట్లు ఆఫర్ చేస్తూ సంధికి ప్రయత్నిస్తున్నది. ఆర్ఎల్డీ ప్రస్తుతం ఇండియా కూటమిలోని పార్టీ. యూపీలో ఎస్పీతో అవగాహనలో ఉన్నది.
NATIONAL Feb 7, 2024, 1:59 PM IST
శ్రీరాముడు తనకు గుడి కట్టడాన్ని వ్యతిరేకించిన వారందరినీ చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ పార్టీలు తీసుకున్న నిర్ణయాల పరిణామాలు రానున్న వారాల్లో తేలనుంది అంటున్నారు ఎస్ గురుమూర్తి..
Opinion Jan 31, 2024, 1:14 PM IST
ఇండియా కూటమి (India alliance)లో కొనసాగి ఉంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar) ప్రధాని అయ్యేవారని (Bihar CM Nitish Kumar would have become the Prime Minister) సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (samajwadi party chief akhilesh yadav) అన్నారు. కాంగ్రెస్ కూడా ఈ విషయంలో ఆయనతో చర్చించి ఉండాల్సిందని అన్నారు. నితీష్ కుమార్ ఇండియా కూటమిలోనే కొనసాగాలని తాను కోరుకుంటున్నాని చెప్పారు.
NATIONAL Jan 27, 2024, 8:09 AM IST
బ్యాంకులోకి ప్రవేశించిన ఎద్దును చూసి ఖాతాదారులు , సిబ్బంది భయపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది
NATIONAL Jan 11, 2024, 2:44 PM IST
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో సమాజ్ వాదీ పార్టీ (SP) మొత్తం ఆస్తుల విలువ రూ. 561.46 కోట్లను ప్రకటించింది, అయితే 2021-22లో 1.23 శాతం పెరిగి రూ. 568.369 కోట్లకు చేరుకుంది.
business Dec 4, 2023, 12:07 PM IST
ఈ భూప్రపంచం మీద పుట్టిన ప్రతి ఒక్కరికి రెండు చేతులు, రెండు కాళ్లు, రెండు కళ్లు,రెండు నాసికారంధ్రాల ముక్కు ఉంటాయని, కానీ, లక్ష్మీ దేవత నాలుగు చేతులతో ఎలా పుట్టిందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
NATIONAL Nov 13, 2023, 9:41 PM IST