ఏషియా నెట్ న్యూస్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డిఏ కూటమి మళ్ళీ గెలిచే అవకాశాలు తేల్చింది. చివరకు కాంగ్రెస్ పాలిత తెలంగాణలోనూ ప్రజలు ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసారు.
Telangana Mar 27, 2024, 9:29 PM IST
ఏషియా నెట్ న్యూస్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఈ లోక్ సభ ఎన్నికల్లో బిజెపి గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్లు తేల్చింది. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తప్పదని ఈ సర్వే ఫలితాలు సూచించాయి.
NATIONAL Mar 27, 2024, 6:00 PM IST
కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందని ఆ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రానికి నేరపూరిత చర్య అని వివరించింది. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలు మీడియా సమావేశం నిర్వహించింది.
NATIONAL Mar 21, 2024, 4:42 PM IST
లోక్ సభ ఎలక్షన్స్ 2024 షెడ్యూల్ వెలువడింది... దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి మరింత పెరిగింది. ఈ క్రమంలో ఓటర్ల నాడి పట్టి ఈ ఎన్నికల్లో గెలుపెవరిది? ఓటర్లపై ప్రభావం చూపే అంశాలేమిటి? తదితల వివరాలను తెలియజేసేందుకు ఏషియా నెట్ న్యూస్ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో మీరు పాల్గొనండి.
NATIONAL Mar 21, 2024, 3:25 PM IST
ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలకు భయపడి చాలా మంది బీజేపీ వైపు వెళ్తున్నారని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ముంబైలో నిర్వహించిన భారత్ జోడో న్యాయ్ మంజిల్ ర్యాలీలో ఆయన ప్రధాని మోడీపై విమర్శలు చేశారు.
NATIONAL Mar 17, 2024, 10:03 PM IST
విజయరాజే సింధియా ఆరు సార్లు , మాధవ్ రావ్ సింధియా నాలుగు సార్లు, జ్యోతిరాదిత్య సింధియా నాలుగు సార్లు గుణ నుంచి ప్రాతినిథ్యం వహించారు. వీజీ దేశ్పాండే, జేబీ కృపాలాణి వంటి దిగ్గజాలను ఈ గడ్డ పార్లమెంట్కు పంపింది. మధ్యప్రదేశ్లోని 29 పార్లమెంట్ స్థానాల్లో గుణ ఒకటి. శివపురి, పిచోర్, కొలారస్, బామోరి, గుణ, అశోక్ నగర్, చందేరి, ముంగవోలి అసెంబ్లీ స్థానాలు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో గుణ నియోజకవర్గంలో 16,75,724 మంది ఓటర్లు వున్నారు. వీరిలో పురుషులు 8,89,161 మంది.. మహిళా ఓటర్లు 7,86,519 మంది. బీజేపీ 1,25,549 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి.. గుణలో సింధియా ఫ్యామిలీ జైత్రయాత్రకు బ్రేక్ వేసింది.
NATIONAL Mar 15, 2024, 9:28 PM IST
మరాఠా చరిత్రలోనూ , బ్రిటీష్ వారి పాలనలోనూ, స్వాతంత్ర పోరాటంలోనూ నాగ్పూర్ కీలకపాత్ర పోషించింది. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి నాగ్పూర్ కంచుకోటగా విలసిల్లుతోంది. అనసూయభాయ్ కాలే, మాధవ్ శ్రీహరి అనే, జాంబవంతరావు ధోతే, భన్వరీలాల్ పురోహిత్, విలాస్ ముత్తేమ్వార్, నితిన్ గడ్కరీ వంటి హేమాహేమీలు నాగ్పూర్ నుంచి ప్రాతినిథ్యం వహించారు. నాగ్పూర్లో కాంగ్రెస్ 13 సార్లు, బీజేపీ మూడు సార్లు, ఇతరులు రెండు సార్లు విజయం సాధించారు. నాగ్పూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో నాగ్పూర్ సౌత్ వెస్ట్, నాగ్పూర్ సౌత్, నాగ్పూర్ ఈస్ట్, నాగ్పూర్ సెంట్రల్, నాగ్పూర్ వెస్ట్, నాగ్పూర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని నితిన్ గడ్కరీ భావిస్తున్నారు.
NATIONAL Mar 15, 2024, 8:04 PM IST
సోంచంద్భాయ్ సోలంకీ, పురుషోత్తమ్ మౌలంకర్, అమృత్ పటేల్, శంకర్ సింగ్ వాఘేలా, ఎల్ కే అద్వానీ , అటల్ బిహారీ వాజ్పేయ్, అమిత్ షా వంటి దిగ్గజాలు గాంధీనగర్ నుంచి లోక్సభలో అడుగుపెట్టారు. 1989 నుంచి నేటి వరకు భారతీయ జనతా పార్టీ అక్కడ ఓడిపోలేదంటే కమలనాథుల పట్టును అర్ధం చేసుకోవచ్చు. బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ గాంధీ నగర్ నుంచి ఆరుసార్లు విజయం సాధించి పార్టీకి బలమైన పునాదిని వేశారు. గాంధీ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 19,45,772 మంది ఓటర్లున్నారు. వీరిలో 10,04,291 మంది పురుషులు.. 9,41,434 మంది మహిళలు. 1989 తర్వాతి నుంచి బీజేపీ కంచుకోటను బద్ధలు కొట్టేందుకు కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈసారి తమ అభ్యర్ధిగా సౌమ్య పుహాన్ను ఆ పార్టీ ప్రకటించింది.
NATIONAL Mar 15, 2024, 6:32 PM IST
గాంధీ పేరు వింటే మదిలో మెదిలే నియోజకవర్గం రాయ్బరేలి. ఇందిరా గాంధీ, ఆమె భర్త ఫిరోజ్ గాంధీ, అరుణ్ నెహ్రూ, షీలా కౌల్, సతీష్ శర్మ, సోనియా గాంధీ, రాజ్ నారాయణ్లు ఇక్కడి నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. ఇందిరా గాంధీని నెత్తిన పెట్టుకున్న జనమే.. ఎమర్జెన్సీ విధించినందుకు ఆమెను ఓడించి షాకిచ్చారు. ఇందిరమ్మపై రాజ్ నారాయణ్ గెలిచి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. 1952లో నియోజకవర్గం ఏర్పడి నాటి నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీదే హవా. ఇక్కడ ఆ పార్టీ 17 సార్లు విజయం సాధించగా.. బీజేపీ రెండు సార్లు, జనతా పార్టీ ఒకసారి గెలిచాయి. తన కంచుకోటకు బీటలు వారకుండా చూసేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వరుసగా నాలుగు సార్లు రాయ్బరేలి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా ఈసారి పోటీ చేయడం లేదని ప్రకటించడంతో తెరపైకి ప్రియాంక గాంధీ పేరు వచ్చింది.
NATIONAL Mar 15, 2024, 5:06 PM IST
1967లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి అమేథీ కాంగ్రెస్కు కంచుకోట. గాంధీ - నెహ్రూ కుటుంబానికి కంచుకోట ‘అమేథీ’.విద్యాధర్ భాజ్పాయ్, రవీంద్ర ప్రతాప్ సింగ్, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సతీశ్ శర్మ , సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, స్మృతీ ఇరానీ వంటి దిగ్గజాలు అమేథీ నుంచి ఎంపీలుగా పార్లమెంట్లో ప్రాతినిథ్యం వహించారు. 1967లో ఏర్పడిన అమేథీ నుంచి కాంగ్రెస్ పార్టీ 13 సార్లు, బీజేపీ రెండు సార్లు, జనతా పార్టీ ఒకసారి విజయం సాధించాయి. అమేథీ లోక్సభ పరిధిలో టిలోయ్, సలోన్, జగదీష్ పూర్, గౌరీగంజ్, అమేథీ శాసనసభ స్థానాలున్నాయి. అమేథీలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,43,515 మంది. వీరిలో పురుషుల సంఖ్య 8,18,812 మంది.. మహిళలు 9,24,563 మంది. నెహ్రూ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి దశాబ్థాలుగా కంచుకోటగా వున్న అమేథీలో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు.
NATIONAL Mar 15, 2024, 3:28 PM IST
1952లో నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్లలో కాంగ్రెస్కు కంచుకోటగా నిలిచిన లక్నో.. తర్వాత బీజేపీకి పెట్టని కోటగా మారింది. విజయలక్ష్మీ పండిట్, షిరోజ్వతి నెహ్రూ, షీలా కౌల్, హేమంత్ నందన్ బహుగుణ, అటల్ బిహారీ వాజ్పేయ్, లాల్జీ టాంటన్, రాజ్నాథ్ సింగ్ వంటి వారు ఇక్కడి నుంచే లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. దివంగత మాజీ ప్రధాని వాజ్పేయ్ 1991 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు లక్నో నుంచి ఎంపీగా గెలిచి బీజేపీకి గట్టి పునాది వేశారు. దీనిని ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ కొనసాగిస్తున్నారు. 1991 నుంచి నేటి వరకు బీజేపీ లక్నోలో ఓడిపోకపోవడం ఆ పార్టీకి ఇక్కడున్న పట్టును అర్ధం చేసుకోవచ్చు. పూర్తిగా అర్బన్ ప్రాంతంలో లక్నో పార్లమెంట్ స్థానం విస్తరించి వుంది. ఓటర్లలో అత్యధికులు అగ్రవర్ణాలకు చెందినవారే. 2014, 2019లలో వరుసగా రెండు సార్లు లక్నో నుంచి గెలిచిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తున్నారు.
NATIONAL Mar 14, 2024, 9:17 PM IST
ఉత్తరప్రదేశ్లోని 80 పార్లమెంట్ స్థానాల్లో అత్యంత కీలకమైనది వారణాసి. 1957 నుంచి నేటి వరకు భారత రాజకీయాల్లో కీలకపాత్ర పోషించింది. యూపీ మాజీ సీఎంలు త్రిభువన్ సింగ్, కమలాపతి త్రిపాఠి, బీజేపీ కురువృద్ధుడు మురళీ మనోహర్ జోషి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీలు వారణాసి నుంచే లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. ఆధ్యాత్మికపరంగానే కాదు.. రాజకీయంగానూ వారణాసికి ఎంతో ప్రత్యేకత వుంది. వారణాసి పార్లమెంట్ పరిధిలో రోహనియా, వారణాసి నార్త్, వారణాసి సౌత్, వారణాసి కంటోన్మెంట్, సేవాపురి అసెంబ్లీ స్థానాలున్నాయి. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ పట్టుదలతో వున్నారు. వారణాసిని కాపాడుకోవడం బీజేపీకి, దాని హిందుత్వ బ్రాండ్ రాజకీయాలకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకం
NATIONAL Mar 14, 2024, 8:02 PM IST
రేపో మాపో లోక్ సభ ఎలక్షన్ షెడ్యూల్ వెలువడేలా వుంది. రాజకీయ పార్టీలన్ని ఇప్పటికే ఎన్నికల కదనరంగంలోకి దిగి తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నికల హంగామా సాగినవేళ ప్రజల మూడ్ ఎలా తెలుసుకునేందుకు ఏషియానెట్ తెలుగు ఆసక్తికర సర్వే చేపట్టింది.
NATIONAL Mar 13, 2024, 4:22 PM IST
కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ పలు సూచలను చేసింది. ప్రధాని నరేంద్ర మోడీపై వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. గత నవంబర్ లో ప్రధానిపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ విధంగా స్పందించింది.
NATIONAL Mar 7, 2024, 10:25 AM IST
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం సాయంత్రం ఢిల్లీలో సమావేశం కానుంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భేటీ కానున్న ఈ కమిటీ నేడు మొదటి విడత జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.
NATIONAL Mar 7, 2024, 7:51 AM IST