దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్.. మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది అక్టోబర్లో భారతదేశంలో యాపిల్ ఫోన్లు వాడుతున్న రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు సహా పలువురు ప్రముఖులకు ఆ సంస్థ నుంచి అలర్ట్ మెసేజ్లు వచ్చాయి. దీనిపై వాషింగ్టన్ పోస్ట్ రాసిన కథనంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
NATIONAL Dec 28, 2023, 9:33 PM IST
ప్రిమెచ్యుర్ గా పుట్టిన పాపను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి కావాల్సిన చికిత్స అందిస్తున్నారు.
INTERNATIONAL Nov 21, 2023, 2:05 PM IST
భారత్ జోడో పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ జమ్ము కశ్మీర్లో అడుగుపెట్టినప్పుడు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన వద్దకు వచ్చి తాము మాట్లాడతామని కోరినట్టు వివరించారు. నిజంగానే ప్రజల గోస వినడానికి వచ్చారా? అని అడిగారని పేర్కొన్నారు. ఆ తర్వాత వారంతా ఉగ్రవాదులను తనకు చెప్పారని, వారు తలుచుకుంటే నన్ను చంపేయగలవారే అని తెలిపారు.
NATIONAL Mar 3, 2023, 12:57 PM IST
పెగాసెస్ పై ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీ అసెంబ్లీకి సమర్పించిన మధ్యంతర నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించారు. కొన్ని ఐపీ అడ్రస్ లను గూగుల్ కూడా గుర్తించలేదని కూడా ఈ నివేదిక తెలిపింది.
Andhra Pradesh Sep 20, 2022, 4:53 PM IST
ప్రజల డేటా చోరీ చేసిన విషయమై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఏపీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. తమకు ఓటు వేయని వారి ఓట్లను తొలగించేందుకు చంద్రబాబు సర్కార్ సేవా మిత్ర యాప్ ను ఉపయోగించుకుందన్నారు.
Andhra Pradesh Sep 20, 2022, 1:40 PM IST
చంద్రబాబు సర్కార్ రాష్ట్రప్రజల డేటా చౌర్యం చేసిందని పెగాసెస్ పై ఏర్పాటు చేసిన శాసనసభ సంఘం అభిప్రాయపడింది.ఈ మేరకు మధ్యంతర నివేదికను హౌస్ కమిటీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.
Andhra Pradesh Sep 20, 2022, 12:10 PM IST
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ కొనుగోలు, వ్యక్తుల డేటా చౌర్యం ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ హౌస్ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నివేదిక రేపు అసెంబ్లీ ముందుకు రానుంది.
Andhra Pradesh Sep 19, 2022, 4:29 PM IST
పెగాసస్ స్పైవేర్ కేసుల దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వం ప్యానెల్కు సహకరించడం లేదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే విపక్షాలు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
NATIONAL Aug 26, 2022, 3:05 AM IST
పెగాసస్ స్పైవేర్: అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన స్పైవేర్ పెగాసస్ బారిన పడేందుకు లక్ష్యంగా చేసుకున్న భారతీయులలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.
NATIONAL Aug 25, 2022, 10:51 PM IST
టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం నిఘా పెట్టిందని.. దీనిపై ఆడిట్ కు సిద్ధమా అని సవాల్ విసిరారు పయ్యావుల కేశవ్. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్ ట్యాప్ లను తాము వాడటం లేదని ఆయన తెలిపారు.
Andhra Pradesh Jul 7, 2022, 2:31 PM IST
వైసీపీకి చెందిన ఓటర్లను తొలగించేందుకు ఆనాడు చంద్రబాబు సర్కార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తుల డేటాను చౌర్యం చేసిందని పెగాసెస్ పై ఏర్పాటు చేసిన శాసనసభ కమిటీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.
Andhra Pradesh Jul 6, 2022, 2:32 PM IST
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రానికి చెందిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఏపీ అసెంబ్లీ కమిటీ పెగాసెస్ పై నియమించిన హౌస్ కమిటీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై అవసరమైతే కొందరిని సభా సంఘం ముందుకు పిలుస్తామన్నారు.
Andhra Pradesh Jul 5, 2022, 4:17 PM IST
ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజుల క్రితం పెగాసస్ స్పై వేర్ వ్యవహారం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెగాసస్ వివాదంపై సమగ్ర విచారణకు హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని శాసనసభ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
Andhra Pradesh Jun 14, 2022, 5:00 PM IST
స్పైవేర్ పెగాసెస్పై భారత్లో వచ్చిన ఆరోపణలపై విచారించడానికి సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీని వచ్చే నెల 20వ తేదీలోగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది. జూలైలో తదుపరి విచారణ ఉంటుందని తెలిపింది.
NATIONAL May 20, 2022, 1:03 PM IST
స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్, రక్షణ మంత్రి మార్గరీటా రోబుల్స్ల మొబైల్ ఫోన్లపై స్పైవేర్ పెగాసెస్ దాడి జరిగిందని ప్రభుత్వమే ప్రకటించింది. మంత్రి ఫెలిక్స్ బలానోస్ సోమవారం ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వంపై కాటాలోనియా వేర్పాటువాదుల ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది.
INTERNATIONAL May 3, 2022, 3:24 PM IST