లిల్లీపుట్.. నువ్వు నిన్న మెదక్కు నామినేషన్ వేయడానికి వచ్చావంటేనే దానికి కారణం కేసీఆర్
Telangana Apr 25, 2024, 7:11 PM IST
కే.కేశవరావుకు బీఆర్ఎస్ పార్టీ రెండు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అలాంటి పార్టీని క్లిష్ట పరిస్థితుల్లో వదిలేసి వెళ్లడం దురదృష్టకరమని చెప్పారు.
Telangana Mar 31, 2024, 4:41 PM IST
బీజేపీతో బీఆర్ఎస్ పొత్తును నిరాకరించిందని, అందుకే కవితను ఈడీ అరెస్టు చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
Telangana Mar 26, 2024, 9:51 PM IST
టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉన్నది. 2004 మొదలు ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పోటీ చేసింది. కానీ, 2024 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఆయన కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు.
Telangana Mar 25, 2024, 6:59 PM IST
Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులోకి వెళ్తున్న క్రమంలో కవిత మాట్లాడుతూ 'తనది అక్రమ అరెస్టు' అంటూ కామెంట్ చేశారు.
Telangana Mar 16, 2024, 11:47 AM IST
Kavitha’s arrest - KTR : ప్రస్తుతం రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ సర్కారుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Cricket Mar 16, 2024, 9:56 AM IST
Excise policy case- Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు రాత్రి ఢిల్లీకి తరలించారు. రాత్రి 8.55కి ఫ్లైట్ బుక్ చేయగా, కవితను తీసుకెళ్లే రూట్ ను పోలీసులు క్లియర్ గా ఉంచారు. కోర్టులో ఈడీ విచారణను కోరే అవకాశముంది.
Telangana Mar 16, 2024, 8:44 AM IST
Kavitha’s arrest: ఈడీ దాడులకు ముందే అరెస్టుకు ప్లాన్ చేసిందనీ, సోమవారం వరకు అప్పీలు కోసం కోర్టులను ఆశ్రయించలేమనీ, అందుకే శుక్రవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేశారని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. రాజకీయ కక్షగా ఆరోపించారు.
Telangana Mar 16, 2024, 7:05 AM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
Telangana Mar 15, 2024, 8:45 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో మాజీ మంత్రి కేటీఆర్ అక్కడికి చేరుకున్నారు. ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
Telangana Mar 15, 2024, 6:56 PM IST
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆఫీస్కి చేరుకున్న హరీష్ రావు
Telangana Mar 15, 2024, 11:45 AM IST
సికింద్రాబాద్పై పట్టు సాధిస్తే.. హైదరాబాద్ను గెలిచినట్లేనని రాజకీయ వర్గాల్లో వున్న పేరు. లష్కర్ అని సికింద్రాబాద్ను ముద్ధుగా పిలుచుకుంటారు. బీసీలు, మైనారిటీలు, క్రైస్తవులు, ఉత్తరాది ఓటర్లతో పాటు ఆంధ్రా సెటిలర్లు , రైల్వే ఉద్యోగులు అభ్యర్ధుల గెలుపొటములను శాసిస్తున్నారు. ప్రఖ్యాత రైల్వే జంక్షన్, ఆర్మీ రీజినల్ సెంటర్ వంటివి సికింద్రాబాద్ కేంద్రంగా వున్నాయి. పేరుకే సికింద్రాబాద్ కానీ.. ఈ పార్లమెంట్ పరిధిలోనివన్నీ హైదరాబాద్ జిల్లా స్థానాలే. అహ్మద్ మొహినుద్దీన్, పీ శివశంకర్, టంగుటూరి అంజయ్య, టీ మనెమ్మ, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి వంటి ఉద్ధండులైన నేతలను పార్లమెంట్కు పంపిన చరిత్ర సికింద్రాబాద్ది. బీఆర్ఎస్ విషయానికి వస్తే.. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు గులాబీ జెండా ఇక్కడ ఎగరలేదు. ప్రస్తుతం సికింద్రాబాద్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా గులాబీ పార్టీకి చెందిన వారే కావడంతో ఈసారి మాత్రం ఇక్కడ పాగా వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
Telangana Mar 14, 2024, 6:48 PM IST
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు లోక్సభ నియోజకవర్గాలు విస్తరించి వున్నాయి. వీటిలో హైదరాబాద్ ఒకటి. పాతబస్తీ మొత్తం దీని కిందకు వస్తాయి. ఈ నియోజకవర్గం మొత్తం ముస్లింల ప్రాబల్యం అధికం. అందులోనూ ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ కంచుకోట . ఇక్కడ ఆదిలో కాంగ్రెస్ ఆధిపత్యం సాగినప్పటికీ.. తర్వాత ఎంఐఎం పార్టీ హైదరాబాద్ లోక్సభ పరిధిలో తిరుగులేని శక్తిగా అవతరించింది. దశాబ్థాలుగా బీజేపీ హిందుత్వ ఎజెండాతో హేమాహేమీలను రంగంలోకి దింపి ఒవైసీ కంచుకోటను బద్ధలు కొట్టేందుకు ప్రయత్నిస్తూనే వుంది. సుల్తాన్ సలావుద్దీన్ 1984 నుంచి 1999 వరకు ఆరు సార్లు హైదరాబాద్ ఎంపీగా గెలిచారు. ఆయన తర్వాత సలావుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ 2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగు సార్లు గెలిచారు. 1984 నుంచి నేటి వరకు హైదరాబాద్లో మరో పార్టీకి స్థానం లేదంటే ఎంఐఎం పట్టును అర్ధం చేసుకోవచ్చు.
Telangana Mar 14, 2024, 5:37 PM IST
నియోజకవర్గాల పునిర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో సంచలనాలు సృష్టించింది. ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలిచిన వారికి దేశవ్యాప్తంగా కిర్తీ ప్రతిష్టలు రావడంతో పాటు రాజకీయంగా ఉన్నత పదవులు దక్కుతాయన్న సెంటిమెంట్ నిజమవుతూ వస్తోంది. భిన్నత్వంలో ఏకత్వానికి ఈ నియోజకవర్గం ప్రతీకగా నిలుస్తోంది. గతంలో మల్కాజ్గిరి ఎంపీలుగా గెలిచిన సర్వే సత్యనారాయణ, మల్లారెడ్డిలు కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి ఏకంగా టీపీసీసీ చీఫ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్నారు. బీఆర్ఎస్ విషయానికి వస్తే.. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి మల్కాజ్గిరి అందని ద్రాక్షగానే వుంది. 2014, 2019 ఎన్నికల్లో గులాబీ గాలి బలంగా వీచినా మల్కాజిగిరిలో కారు గెలవలేకపోయింది.
Telangana Mar 14, 2024, 3:29 PM IST
ఐటీ కంపెనీలకు, పారిశ్రామిక సంస్థలకు, పచ్చని ప్రకృతికి చేవేళ్ల కేంద్రం. రెడ్డి సామాజిక వర్గమే తొలి నుంచి ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తోంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఈ నియోజకవర్గం విస్తరించి వుంది. హేమాహేమీలైన కొండా వెంకట రంగారెడ్డి, కొండా లక్ష్మారెడ్డి, ఇంద్రారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వంటి వారు ఈ ప్రాంతం వారే. 2009లో చేవేళ్ల లోక్సభ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఎస్ జైపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలు విజయం సాధించారు. చేవేళ్లలో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ పట్టుదలగా వున్నారు. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి బదులుగా బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్కు టికెట్ కేటాయించారు. బీజేపీ సైతం బలమైన అభ్యర్ధిని బరిలోకి దించింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశర్ రెడ్డికి టికెట్ ఖరారు చేయడంతో ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
Telangana Mar 13, 2024, 10:10 PM IST