<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss version="2.0" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description>Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.</description>
        <image>
            <url>https://static.asianetnews.com/images/logos/telugu.asianetnews.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Thu, 18 Jul 2019 16:48:00 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/world-cup" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title>ఇంగ్లాండ్-కివీస్ ఫైనల్:  ఉత్కంఠభరిత సూపర్ ఓవర్... గుండెపోటుతో నీషమ్ కోచ్ మృతి</title>
            <link>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/new-zealand-all-rounder-neesham-s-childhood-coach-died-during-eng-nz-super-over-puu4q4</link>
            <guid>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/new-zealand-all-rounder-neesham-s-childhood-coach-died-during-eng-nz-super-over-puu4q4</guid>
            <pubDate>Thu, 18 Jul 2019 16:48:00 +0530</pubDate>
            <description>ఇటీవల ముగిసిన ఐసిసి ప్రపంచ కప్ టోర్నీ న్యూజిలాండ్ జట్టును తీవ్రంగా నిరాశపర్చింది. అద్భుత &amp;nbsp;పోరాటం ఫలితంగా వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకున్నప్పటికి విశ్వవిజేతగా నిలవలేకపోంది. ఇలా ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఓటమిపాలవడంతో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్ బాధపడుతుండగా దాన్ని రెట్టింపు చేసే ఛేదు వార్త అతడు వినాల్సి వచ్చింది. ఉత్కంభరితంగా సాగిన ఈ మ్యాచ్ చూస్తూ నీషమ్ చిన్ననాటి క్రికెట్ కోచ్ డేవిడ్ జేమ్స్ గోర్డాన్ మృతిచెందాడు.&amp;nbsp;  గోర్డాన్ హటాన్మరణం గురించి ఆయన కూతురు లియోనీ ఈ విధంగా వివరించారు. '' ఇంగ్లాండ్-న్యూజిలాండ్ ల మధ్య లార్డ్స్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ మా నాన్న గోర్డాన్ టీవిలో చూస్తున్నాడు. అయితే ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్ ను చూస్తూ అతడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ముఖ్యంగా మ్యాచ్ టై అయిన తర్వాత సూపర్ ఓవర్లో తన శిష్యుడు నీషమ్ బ్యాటింగ్ ను చూస్తూ అతడు మరింత ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే నీషమ్ సిక్స్ బాదిన సమయంలో ఆయనకు హాట్ స్ట్రోక్ వచ్చింది.'' అంటూ లియోనీ ఆవేధనకు లోనయ్యారు.&amp;nbsp;  ఇప్పటికే ప్రపంచ కప్ టోర్నీ ఓటమితో బాధలో వున్న తనకు చిన్ననాటి గురువు మరణం &amp;nbsp;మరింత బాధలోకి నెట్టిందని నీషమ్ అన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్న నీషమ్ ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని ప్రకటించాడు. '' డేవ్ గోర్డాన్... నా హై స్కూల్ టీచరే కాదు చిన్ననాటి కోచ్ మరియు మంచి స్నేహితుడు. నువ్వు(గోర్డాన్) క్రికెట్ అంటే ఎంత ఇష్టపడేవాడివో నాకు తెలుసు. మీలాంటి &amp;nbsp;గొప్ప వ్యక్తి దగ్గర క్రికెట్ ఓనమాలు &amp;nbsp;నేర్చుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. &amp;nbsp;&amp;nbsp;  ఈ మ్యాచ్ లో మా ఆటతీరు చూసి మీరు గర్వించి వుంటారని అనుకుంటున్నా. క్రికెటర్ నేను ఈ స్థాయిలో వుండటానికి &amp;nbsp;సహకరించిన మీకు నేను ఎల్లపుడు రుణపడి వుంటాను. మీరు నాకు అందించిన సహాకారానికి ధన్యవాదాలు.'' అంటూ నీషమ్ తన గురువు మృతికి సంతాపం ప్రకటించారు.&amp;nbsp;   Dave Gordon, my High School teacher, coach and friend. Your love of this game was infectious, especially for those of us lucky enough to play under you. How appropriate you held on until just after such a match. Hope you were proud. Thanks for everything. RIP — Jimmy Neesham (@JimmyNeesh) July 17, 2019    </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01d2q2ym0p00g66vhbvsd2f4x7/Jimmy-Neesham_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>కప్ పోయిందన్న బాధ ముఖంపై లేదు: విలియమ్సన్‌పై సచిన్ ప్రశంస</title>
            <link>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/former-team-india-cricketer-sachin-tendulkar-praises-new-zealand-kane-williamson-puu2m3</link>
            <guid>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/former-team-india-cricketer-sachin-tendulkar-praises-new-zealand-kane-williamson-puu2m3</guid>
            <pubDate>Thu, 18 Jul 2019 16:02:00 +0530</pubDate>
            <description>ఉత్కంఠభరితంగా సాగిన ప్రపంచకప్ ఫైనల్‌లో తృటిలో కప్పు చేజార్చుకున్న న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఆ సమయంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. మొక్కవోని దీక్షతో జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లిన విలియమ్సన్ ధోనీ తర్వాత కెప్టెన్ కూల్‌గా ప్రశంసలు పొందుతున్నాడు.  తాజాగా ఈ లిస్ట్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా చేరాడు. నెమ్మదిగా ఉండటమే విలియమ్సన్‌కు ఆభరణమని పేర్కొన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ ప్రదానం చేసే సమయంలోనూ తనకిదే మాట చెప్పానని ఆయన తెలిపారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ అతడు తన గుణాన్ని మర్చిపోయి ప్రవర్తించాడని పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తూ విలియమ్సన్ ప్రపంచకప్ గెలవలేకపోయాడని.. ఆ బాధను తన ముఖంపైన కనిపించకుండా అప్పుడు కూడా తన స్వభావాన్ని మరోసారి నిరూపించాడని సచిన్ తెలిపారు. ప్రపంచ క్రికెట్‌లో అందరి సారథుల్లో కాకుండా విలియమ్సన్ మ్యాచ్‌ను భిన్న కోణంలో చూస్తాడని సచిన్ ప్రశంసించాడు.&amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dg2a5mf1zpgmkm7vdpnbt0af/sachin-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ఐసిసి స్పెషల్... మరో అరుదైన ఘనత సాధించిన రోహిత్ శర్మ</title>
            <link>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-top-5-batsmans-in-icc-world-cup-putzgc</link>
            <guid>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-top-5-batsmans-in-icc-world-cup-putzgc</guid>
            <pubDate>Thu, 18 Jul 2019 14:54:00 +0530</pubDate>
            <description>ప్రపంచ కప్ మెగా టోర్నీలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ విశ్వరూపం చూపించిన విషయం తెలిసిందే. తన అద్బుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఐదు&amp;nbsp;సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో చెలరేగి టీమిండియాను విజయాలబాటలో నడిపించాడు. ఇలా ఈ టోర్నమెంట్ లో 648 పరుగులు చేసిన అతడు అత్యధిక పరుగుల&amp;nbsp;వీరుడిగా నిలిచి ఐసిసి నుండి గోల్డెన్ బ్యాట్ &amp;nbsp;కూడా అందుకున్నాడు. తాజాగా ఐసిసి &amp;nbsp;రోహిత్ కు మరో అరుదైన గౌరవాన్ని అందించింది.&amp;nbsp;  ఈ మెగా టోర్నీలో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టి ఐదుగురు ఆటగాళ్ల జాబితాను ఐసిసి ప్రత్యేకంగా రూపొందించింది. ఈ జాబితాలో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ టాప్ 5 ఆటగాళ్ల జాబితాలో టీమిండియా నుండి మరే ఆటగాడికి చోటు దక్కలేదు. 81 సగటుతో పరుగులు సాధిస్తూ టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ కీలకంగా వ్యవహరించినందుకే అతడికి టాప్ 1 స్థానాన్ని కట్టబెట్టినట్లు ఐసిసి తెలిపింది.&amp;nbsp;  ఇక ఈ జాబితాలో రోహిత్ తర్వాత స్థానాన్ని డేవిడ్ వార్నర్ దక్కించుకున్నాడు. అతడు ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు బాదిన రెండో బ్యాట్ మెన్. 71 సగటులో 647 పరుగులు చేసి ఆసిస్ విజయంలో కీలకపాత్ర పోషించినందుకు వార్నర్ టాప్ 2 స్థానాన్ని ఆక్రమించాడు. ఇక బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ మూడు, కివీస్ కెప్టెన్ విలియమ్సన్ నాలుగు, ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ ఐదో స్థానాన్ని ఆక్రమించాడు. వీరందరు కూడా వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక పరుగుల సాధించిన ఆటగాళ్లే కావడం విశేషం.&amp;nbsp;  మరిన్ని వార్తలు  ప్రపంచ కప్ 2019: వాటిపై ఐసిసి సీరియస్ గా దృష్టిపెట్టాలి: రోహిత్ శర్మ  టార్గెట్ 2023 వరల్డ్ కప్... టీమిండియా కెప్టెన్ గా రోహిత్...?  ప్రపంచ కప్ 2019: టీమిండియా మిస్సయింది....కానీ రోహిత్ మాత్రం పట్టేశాడు </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dfwj9n5bv92a0jq9gdvch0zc/rohit-sharma-captian-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>వరల్డ్ కప్ వివాదం: రూ.2000ల ఉదాహరణ.... ఐసిసిపై అమితాబ్ సెటైర్లు</title>
            <link>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-final-issue-amitabh-bacchan-satirical-tweet-on-icc-puqsaz</link>
            <guid>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-final-issue-amitabh-bacchan-satirical-tweet-on-icc-puqsaz</guid>
            <pubDate>Tue, 16 Jul 2019 21:26:00 +0530</pubDate>
            <description>ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ &amp;nbsp;టోర్నీలో ఐసిసి వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడాస్పూర్తికి విరుద్దంగా &amp;nbsp;వుండేలా ఐసిసి రూపొందించిన కొన్ని నిబంధనలు ఈ టోర్నీ ద్వారా &amp;nbsp;బయటపడ్డాయి. ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్ తుది విజేతను నిర్ణయించడానికి ఈ నిబంధనలు వాడాల్సి రావడం మరింత వివాదాస్పదమవుతోంది. వరల్డ్ కప్ ఫైనల్లో బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ ను విజేతగా నిర్ణయించడంపై క్రికెట్ ప్రియులు, మాజీ క్రికెటర్లు, క్రికెటర్లే కాకుండా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఐసిసిని తప్పుబడుతున్నారు. ఇలా బాలీవుడ్ స్టార్ యాక్టర్, బిగ్ బి &amp;nbsp;అమితాబ్ బచ్చన్ కూడా ఐసిసి నిబంధనలపై సెటైర్లు విసిరారు.&amp;nbsp;  ప్రపంచ కప్ ఫైనల్లో &amp;nbsp;ఐసిసి &amp;nbsp;అనుసరించి విధానాన్ని ఓ ఉదాహరణ ద్వారా అమితాబ్ వివరించారు. '' మీ దగ్గర రూ.2000, నా దగ్గర కూడా ఓ రూ.2000 ఉన్నాయనుకొండి. మీ వద్ద రెండు వేల రూపాయల నోటు వుంటే నా దగ్గర మాత్రం నాలుగు రూ.500 నోట్లు వున్నాయి. అప్పుడు మనిద్దరిలో ఎవరు ధనవంతుడని ప్రశ్నిస్తే ఎక్కువ నోట్లున్నాయి కాబట్టి నేనే ధనవంతున్నని ఐసిసి నిర్ణయిస్తుంది. '' అంటూ అమితాబ్ ఐసిసిపై ట్విట్టర్ ద్వారా సెటైర్లు విసిరారు.&amp;nbsp;  ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచ కప్ 2019 ఫైనల్లో ఇరు జట్లు ఒకే స్కోరు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించాల్సి &amp;nbsp;వచ్చింది. ఈ సూపర్ ఓవర్లో ఇరు జట్లు సమానంగా పరుగులు సాధించడంతో ఐసిసి కొత్త నిబంధన ఒకటి బయటకు వచ్చింది. ఇలాంటి సమయంలో ఏ జట్టయితే అత్యధిక బౌండరీలు బాదిందో ఆ జట్టున విజేతలుగా ప్రకటించాలన్నది ఆ నిబంధన సారాంశం.  ఇలా అత్యధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్ ప్రపంచ కప్ విజేతగా నిలవగా న్యూజిలాండ్ రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐసిసి రూపొందించిన ఇలాంటి నిబంధనల వల్ల కేవలం అదృష్టంతోనే విజేతలుగా మారుతున్నారని...అత్యుత్తమంగా ఆడిన జట్లకు న్యాయం జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి. తాజాగా అమితాబ్ కూడా ఇలాంటి నిబంధనల వల్ల ఎలా నష్టం జరుగుతుందో కాస్త సెటైరికల్ గా వివరించాడు.&amp;nbsp;   T 3227 - आपके पास 2000 रूपये, मेरे पास भी 2000 रुपये, आपके पास 2000 का एक नोट, मेरे पास 500 के 4 ... कौन ज्यादा अमीर???  ICC - जिसके पास 500 के 4 नोट वो ज्यादा रईस.. #Iccrules😂😂🤣🤣 प्रणाम गुरुदेव Ef~NS — Amitabh Bachchan (@SrBachchan) July 15, 2019    </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01ddfhwxy3jy6ww5kcdqw327g6/b1-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ప్రపంచ  కప్ 2019: వాటిపై ఐసిసి సీరియస్ గా దృష్టిపెట్టాలి: రోహిత్ శర్మ</title>
            <link>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/some-rules-in-cricket-definitely-needs-a-serious-look-in-rohit-sharma-puqqhm</link>
            <guid>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/some-rules-in-cricket-definitely-needs-a-serious-look-in-rohit-sharma-puqqhm</guid>
            <pubDate>Tue, 16 Jul 2019 20:47:00 +0530</pubDate>
            <description>ప్రపంచ కప్ 2019 ఆరంభం నుండి ఐసిసి తీవ్ర విమర్శలకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఆరంభంలో ఇంగ్లాండ్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా మ్యాచ్ లు రద్దయ్యాయి. దీంట్లో ఐసిసి తప్పులేకున్నా వరుసగా మ్యాచ్ లు రద్దవడంతో అసహనానికి గురైన అభిమానులు దానిపై విమర్శలకు దిగారు. ఇక ఈ టోర్నీలో చివర్లో కూడా ముందే నిర్ణయించిన ప్రకారం నిబంధనలకు లోబడి ఫైనల్ విజేతను ఐసిసి నిర్ణయించింది. అయితే మొదటిసారి అత్యధిక బౌండరీల &amp;nbsp;నిబంధనను ఉపయోగించిన ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.&amp;nbsp;  ఇలా ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్ లో ఐసిసి వ్యవహరించిన తీరు ఏకపక్షంగా వుందంటూ అభిమానులు, క్రికెట్ పండితులు విమర్శిస్తున్నారు. &amp;nbsp;ఇంగ్లాండ్-న్యూజిలాండ్ లు సమఉజ్జీలుగా నిలిచినా ఆతిథ్య జట్టును విజేతలుగా ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. గల్లీ క్రికెట్లో కూడా &amp;nbsp;ఇలాంటి నియమాలుండవని అభిమానులు ఐసిసిపై సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు.&amp;nbsp;  ఇక వివిధ &amp;nbsp;దేశాలకు చెందిన క్రికెటర్లు, మాజీలు కూడా ఇలాంటి వివాదాస్పద నిబంధనలను మార్చాలంటూ ఐసిసికి సూచిస్తున్నారు. ఆ జాబితాలోకి టీమిండియా హిట్టర్ రోహిత్ శర్మ కూడా చేరిపోయాడు. క్రీడాస్పూర్తిని దెబ్బతీస్తూ కేవలం అదృష్టంతో విజేతలను నిర్ణయించే పలు నిబంధనల్లో మార్పులు చేపట్టాల్సిన అవసరం వుందని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి &amp;nbsp;నిబంధనలపై ఐసిసి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అతడు ఐసిసికి &amp;nbsp;సూచించాడు.&amp;nbsp;  ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్లో ఇరు జట్లు ఒకే స్కోరు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించాల్సి &amp;nbsp;వచ్చింది. ఈ సూపర్ ఓవర్లో ఇరు జట్లు సమానంగా పరుగులు సాధించడంతో ఐసిసి కొత్త నిబంధన ఒకటి బయటకు వచ్చింది. ఇలాంటి సమయంలో ఏ జట్టయితే అత్యధిక బౌండరీలు బాదిందో ఆ జట్టున విజేతలుగా ప్రకటిస్తారు. ఇలా ఇంగ్లాండ్ ప్రపంచ కప్ విజేతగా &amp;nbsp;నిలవగా న్యూజిలాండ్ రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐసిసి రూపొందించిన ఇలాంటి నిబంధనలు క్రీడా స్పూర్తిని దెబ్బతీస్తున్నాయంటూ తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో రోహిత్ కూడా తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.&amp;nbsp;   Some rules in cricket definitely needs a serious look in. — Rohit Sharma (@ImRo45) July 15, 2019    &amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dfwj9n5bv92a0jq9gdvch0zc/rohit-sharma-captian-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>మీరిలా ప్రశ్నిస్తారని నేను అస్సలు ఊహించలేదు: మీడియాతో విలియమ్సన్</title>
            <link>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-no-one-lost-the-world-cup-final-kane-williamson-puqlui</link>
            <guid>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-no-one-lost-the-world-cup-final-kane-williamson-puqlui</guid>
            <pubDate>Tue, 16 Jul 2019 19:07:00 +0530</pubDate>
            <description>సొంత గడ్డపై జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ విజయం సాధించి ప్రపంచ కప్ ట్రోఫీని మొదటిసారి అందుకుంది. అదే క్రమంలో న్యూజిలాండ్ ను దురదృష్టం&amp;nbsp; వెంటాడడంతో రెండో సారి కూడా ఫైనల్లో బోల్తా పడింది. లార్డ్స్ వేదికగా &amp;nbsp;జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో సమఉజ్జీగా నిలిచినప్పటికి కివీస్ ట్రోఫీని &amp;nbsp;కోల్పోవాల్సి&amp;nbsp;వచ్చింది. మరీ విచిత్రంగా బౌండరీల ఆధారంగా ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిపాలై రన్నరన్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. &amp;nbsp;  సాధారణ అభిమానులే కేవలం ఈ ఐసిసి నిబంధనల వల్ల న్యూజిలాండ్ ఓటమిపాలవడంపై తీవ్ర ఆవేధనతో వున్నారు. అలాంటిది ఆ జట్టు ఆటగాళ్ల పరిస్థితి ఎలా&amp;nbsp;వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా తృటిలో ట్రోఫీని కోల్పోయిన తర్వాత కేన్ విలియమ్సన్ మొదటిసారి మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అతడు తన&amp;nbsp;అసహనాన్ని బయటపెట్టాడు.&amp;nbsp;  ఐసిసి నిబంధనల &amp;nbsp;వల్లే ఓటమి  అసలు ప్రపంచ కప్ ఫైనల్లో ఎవరూ ఓడిపోలేదు...మరెవరూ విజేతలుగా నిలవలేదని పేర్కొన్నారు. కేవలం ఇంగ్లాండ్ జట్టు ట్రోఫీని మాత్రమే అందుకుంది. మా&amp;nbsp;దురదృష్టం కారణంగా మేము అందుకోలేకపోయాం. అంతే తేడా అని విలియమ్సన్ పేర్కొన్నాడు.&amp;nbsp;  బౌండరీల ఆధారంగా మీరు ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక ట్రోఫీని కోల్పోవాల్సి రావడంపై మీరెలా స్పందిస్తున్నారని &amp;nbsp;ఓ మీడియా &amp;nbsp;ప్రతినిధి విలియమ్సన్ ను&amp;nbsp;ప్రశ్నించారు. అందుకు అతడు కాస్త సెటైరికల్ గా జవాభిచ్చాడు. ''మీరిలా ఈ ప్రశ్న వేయాల్సి వస్తుందని గానీ...నేను అందుకు సమాధానం చెబుతానని గానీ అస్సలు&amp;nbsp;ఊహించలేదు. కానీ ఆ పరిస్థితి వచ్చింది'' అని విలియమ్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు.&amp;nbsp; &amp;nbsp;   </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dfgfpsk039q04wzanny6bmh7/kane-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>తండ్రిగా మాత్రమే గెలిచా...కానీ  ఓ పౌరుడిగా మాత్రం ఓడిపోయా: స్టోక్స్ తండ్రి</title>
            <link>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/im-most-hated-father-in-new-zealand-ba-stokes-father-puqipj</link>
            <guid>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/im-most-hated-father-in-new-zealand-ba-stokes-father-puqipj</guid>
            <pubDate>Tue, 16 Jul 2019 17:59:00 +0530</pubDate>
            <description>స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది. క్రికెట్ కు పుట్టినిల్లయిన ఆ దేశానికి ఇన్నేళ్లు వరల్డ్ కప్ ట్రోఫీ అనేది అందని ద్రాక్షలా మిగిలిపోయింది. కానీ తాజాగా ఆ జట్టు లార్డ్స్ వేదికన జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించి ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడగలిగింది. ఇలా ఈ మెగా టోర్నీలో ఆతిథ్య జట్టును విజేతగా నిలబెట్టిన ఘనత బెన్ స్టోక్స్ కు దక్కుతుంది. ఫైనల్లో అతడు ఓ వైపు సహచరులు వరుసగా వికెట్లు కోల్పోతున్నా సమయోచితంగా బ్యాటింగ్ చేసి 84 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయం వైపు నడిపించాడు.  అయితే ఇలా ఇంగ్లాండ్ &amp;nbsp;గెలుపుకు కారణమైన స్టోక్స్ పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. కేవలం ఇంగ్లాండ్ క్రికెట్ ప్రియులే కాదు ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రికెట్ అభిమానులు స్టోక్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాంటిది అతడి తల్లిదండులు ఆనందం మరోస్థాయిలో వుంటుందని మనం భావిస్తాం. అయితే స్టోక్స్ తల్లిదండ్రుల పరిస్థితి అందుకు భిన్నంగా వుంది.&amp;nbsp;  సొంత దేశాన్ని ఓడించిన స్టోక్స్:  స్టోక్స్ అద్భుతంగా ఆడి &amp;nbsp;ఇంగ్లాండ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం చాలా ఆనందాన్నిచ్చిందని బెన్ స్టోక్స్ తండ్రి గెరార్డ్ స్టోక్స్ పేర్కొన్నాడు. కానీ తాము పుట్టిన దేశమైన న్యూజిలాండ్ ప్రపంచ కప్ ట్రోఫీకి వరుసగా రెండోసారి మిస్సవడం బాధించిందన్నాడు. ఓ వైపు స్టోక్స్ ఆటతీరుతో ఆనందం, &amp;nbsp;మరోవైపు కివీస్ ఓటమితో బాధ ఒకేసారి కలిగించిన ఈ ఫైనల్ తనకు జీవితాంతం గుర్తిండిపోతుందని గెరార్డ్ స్టోక్స్ తెలిపారు.&amp;nbsp;  ఇకపై తమ స్వదేశంలో అత్యధిక &amp;nbsp;ప్రజలు అసహ్యించుకునే తండ్రిని తానే కాబోతున్నానేమో అనిపిస్తోంది. &amp;nbsp;ట్రోఫీతో స్వదేశానికి వెళ్లాల్సిన కివీస్ తన కొడుకు వల్లే ఉత్త చేతులతో వెళుతోంది. ఇలా &amp;nbsp;స్టోక్స్ ఇంగ్లాండ్ ను గెలిపించినందుకు ఆనందిస్తున్నా... న్యూజిలాండ్ ఓడించినందుకు బాధ పడుతున్నానని గెరార్డ్ తన వింత పరిస్థితి &amp;nbsp;గురించి వివరించారు.&amp;nbsp; &amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dfx5sp8e2mht1zfdkz2kpbmt/stokes-new-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ప్రపంచకప్ హీరోలకు ర్యాంకుల పంట, టాప్ ప్లేస్‌ కోహ్లీదే..!!</title>
            <link>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/icc-announces-odi-rankings-after-world-cup-2019-puq961</link>
            <guid>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/icc-announces-odi-rankings-after-world-cup-2019-puq961</guid>
            <pubDate>Tue, 16 Jul 2019 14:33:00 +0530</pubDate>
            <description>ప్రపంచ క్రికెట్ సమరం.. వరల్డ్ కప్ ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి ర్యాంకులను ప్రకటించింది. బ్యాట్స్‌మెన్ జాబితాలో 886 పాయింట్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి అగ్రస్థానంలో... 881 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు.  ఇక సెమీస్‌లో భారత్‌పై 67 పరుగులతో రాణించిన న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ 796 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన జేసన్ రాయ్ 774 పాయింట్లతో అతను పదో స్థానంలో నిలిచాడు.  ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను గెలిపించిన బెన్‌స్టోక్స్‌ 694 పాయింట్లతో టాప్-20లో స్థానం దక్కించుకున్నాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే.. 809 పాయింట్లతో యార్కర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ఇంగ్లీష్ ఆటగాడు క్రిస్ వోక్స్ ఏడో స్థానంలో.. కివీస్ బౌలర్ మాట్ హెన్రీ పదో స్థానంలో నిలిచాడు.  ఇక టోర్నీలో 20 వికెట్లు పడగొట్టి.. ఇంగ్లాండ్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆర్చర్ టాప్-30లో చోటు సంపాదించాడు. ఆల్‌రౌండర్ విభాగంలో బంగ్లాదేశ్ ఆటగాడు షకిబ్ అల్ హసన్ అగ్రస్థానంలో నిలవగా... బెన్‌స్టోక్స్ రెండో స్థానంలో నిలిచాడు.&amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dfx09f514xbjdt2v2cftc3yv/world-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>టార్గెట్ 2023 వరల్డ్ కప్... టీమిండియా కెప్టెన్ గా రోహిత్...?</title>
            <link>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-bcci-plans-to-appoint-rohit-sharma-as-team-india-captain-puq8g5</link>
            <guid>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-bcci-plans-to-appoint-rohit-sharma-as-team-india-captain-puq8g5</guid>
            <pubDate>Tue, 16 Jul 2019 14:18:00 +0530</pubDate>
            <description>ఐసిసి 2019 ప్రపంచ కప్ ముగిసింది. ఇంగ్లాండ్ వేదికన జరిగిన ఈ టోర్నీలో టీమిండియా అద్భుతంగా ఆడినా విశ్వవిజేతగా నిలవలేకపోయింది. దురదృష్టం వెంటాడటంతో కోహ్లీ సేన సెమీఫైనల్ నుండే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. లీగ్ దశలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు జోరును సెమీస్ లో న్యూజిలాండ్ అడ్డుకుంది. అయితే ఇలా అర్థాంతరంగా భారత జట్టు ప్రపంచ కప్ నుండి నిష్క్రమించడంలో ఆటగాళ్ల మధ్య కొనసాగుతున్న విబేధాలే కారణమంటూ ఓ ప్రచారం జరుగుతోంది. దీనిపై బిసిసిఐ కూడా దృష్టిసారించినట్లు &amp;nbsp;సమాచారం.  టీమిండియాలో ప్రస్తుతమున్న సీనియర్ ఆటగాళ్ల మధ్య విభేదాలు తలెత్తినట్లుగా ఓ వార్త బాగా ప్రచారమవుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, &amp;nbsp;వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య అగాదం ఈ మెగా టోర్నీ ద్వారా మరింత పెరిగినట్లు సమాచారం. దీంతో ఆటగాళ్లు&amp;nbsp;రెండు వర్గాలుగా చీలిపోయినట్లు... ఓ వర్గానికి కోహ్లీ, మరో వర్గానికి రోహిత్ లు &amp;nbsp;సారథ్యం వహిస్తున్నట్లు సమాచారం. క్రీడా వర్గాల్లో ఇప్పుడు ఇదే వార్తపై తీవ్ర చర్చ జరుగుతోంది.&amp;nbsp;  దీంతో బిసిసిఐ కూడా ఆటగాళ్ల మధ్య విబేధాలున్నట్లు సాగుతున్న ప్రచారంపై విచారణ జరపడానికి సిద్దపడినట్లు &amp;nbsp;తెలుస్తోంది. కోహ్లీ, రోహిత్ ల మధ్య నిజంగానే ఆదిపత్య పోరు సాగుతుందో లేదో ఈ విచారణ ద్వారా తేలనుందని ఓ బిసిసిఐ అధికారి తెలిపారు. ఒకవేళ ఈ ప్రచారం నిజమేనని తేలితే అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తామని సదరు అధికారి తెలిపారు.  అయితే ఇప్పటికే &amp;nbsp;2019 ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుతంగా ఆడినా విజయం సాధించలేకపోయింది. దీంతో 2023 వరల్డ్ కప్ లక్ష్యంగా భారత జట్టును తీర్చిదిద్దాలని బిసిసిఐ భావిస్తోందట. అందుకోసం జట్టులో భారీ మార్పులు చేపట్టనున్నట్లు...ముఖ్యంగా కెప్టెన్సీ బాధ్యతల నుండి కోహ్లీని తప్పించి రోహిత్ శర్మ ను నియమించాలని చూస్తోందని తెలిపారు. కేవలం వన్డే జట్టుకు మాత్రమే రోహిత్ ను సారథిగా ఎంపికచేసి టెస్టులకు మాత్రం కోహ్లీనే కొనసాగించాలని చూస్తున్నట్లు &amp;nbsp;బిసిసిఐ అధికారి తెలిపారు. &amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01ctd3828ak477zgnzhz5x5bx7/kohli-rohit_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>మమ్మల్ని ఓడించింది ఇంగ్లాండ్ కాదు...ఐసిసి: కివీస్ కోచ్ గ్యారీస్టెడ్‌</title>
            <link>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-new-zealand-coach-gary-stead-wants-icc-rules-review-puq4cr</link>
            <guid>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-new-zealand-coach-gary-stead-wants-icc-rules-review-puq4cr</guid>
            <pubDate>Tue, 16 Jul 2019 12:49:00 +0530</pubDate>
            <description>ప్రపంచ కప్ విజేతగా నిలవడం ద్వారా ఇంగ్లాండ్ జట్టు చిరకాల కోరిక నెరవేరింది. ఇదే క్రమంలో వరుసగా రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్ కు చేరినప్పటికి &amp;nbsp;న్యూజిలాండ్ ఆశలపై ఐసిసి నిబంధనలపై నీళ్లు చల్లాయి. &amp;nbsp;ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుని ఇరు జట్లు సమఉజ్జీలుగా నిలిచాయి. అయితే ఐసిసి నిబంధనల వల్ల అదృష్టం కలిసివచ్చి ఇంగ్లాండ్ ప్రపంచ కప్ ను జయించింది. దీంతో ప్రతిష్టాత్మకమైన ఇలాంటి టోర్నీలో ఐసిసి అనుసరించిన నిబంధనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.&amp;nbsp;  తాజాగా న్యూజిలాండ్ కోచ్ గ్యారీస్టెడ్ కూడా తమ జట్టు ఓటమికి కారణమైన ఐసిసి పై మండిపడ్డాడు. '' దాదాపు నెలన్నర పాటు పది జట్లతో పోరాడి ఇంగ్లాండ్-న్యూజిలాండ్ &amp;nbsp;లు ఫైనల్ కు చేరాయి. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు సమానమైన స్కోర్లు సాధించడంతో మ్యాచ్ టై అయ్యింది. &amp;nbsp;ఆ తర్వాత సూపర్ ఓవర్ లోనూ ఇరుజట్లు సమాన మైన పరుగులు సాధించాయి. కాబట్టి ఈ రెండు జట్లను విజేతలుగా ప్రకటించి వుండాల్సింది. ఆ దిశగా ఐసిసి నిర్ణయముంటే మరింత హుందాగా వుండేది.'' అని గ్యారీ పేర్కొన్నాడు.  ఇక ఇదే అభిప్రాయాన్ని బ్యాటింగ్ కోచ్ మెక్ మిల్లన్ వ్యక్తపర్చాడు. ఇంగ్లాండ్ తో &amp;nbsp;పాటు న్యూజిలాండ్ జట్టును కూడా ప్రపంచ కప్ విజేతగా ప్రకటిస్తే బావుండేదని అన్నాడు. అలా కాకుండా ఐసిసి బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ జట్టుకు ట్రోఫీ అందించడం కాస్త బాధించింది. అయితే ఆటలో భాగంగా రూపొందించిన నియమ నిబంధనలు పాటించడం అందరి భాద్యత... కాబట్టి మౌనంగా వుండిపోవాల్సి వస్తోందని మెక్ మిల్లన్ తెలిపారు.&amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dfwtc1wdpqzs4kxx0w6dxk13/gary-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి...కివీస్ ప్రధాని ఏమన్నారంటే...</title>
            <link>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-new-zealand-prime-minister-jacinda-ardern-comments-on-world-cup-final-puq2bf</link>
            <guid>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-new-zealand-prime-minister-jacinda-ardern-comments-on-world-cup-final-puq2bf</guid>
            <pubDate>Tue, 16 Jul 2019 12:05:00 +0530</pubDate>
            <description>ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసిసి ప్రపంచ కప్ సమరం ముగిసింది. అయితే ఆతిథ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ &amp;nbsp;మ్యాచ్ నాటకీయ పరిణామాల మధ్య సాగింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో &amp;nbsp;జరిగిన ఈ &amp;nbsp;టైటిల్ పోరుల ఇరు జట్టు సమఉజ్జీలుగా నిలవడంతో &amp;nbsp;మొదట మ్యాచ్, ఆ తర్వాత సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది. &amp;nbsp;దీంతో ఐసిసి నిబంధనల ప్రకారం ఎక్కువ బౌండరీలు బాదిన జట్టును విశ్వవిజేతగా ప్రకటించారు. ఇలా తమ న్యూజిలాండ్ జట్టు ఉత్కంఠ పోరులో అనూహ్య ఓటమిని చవిచూడటంపై ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్ స్పందించారు.&amp;nbsp;  ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టును వారి స్వదేశంలోనే సమర్ధవంతంగా ఎదుర్కొన్న న్యూజిలాండ్ టీం ను ఆమె &amp;nbsp;ప్రశంసించారు. ఈ జట్టును చూస్తే తనకే కాదు యావత్ దేశ ప్రజలు కూడా ఎంతో గర్వంగా ఫీలవుతున్నారని &amp;nbsp;తెలిపారు. అయితే సూపర్ ఓవర్ కూడా టై అవగా కేవలం అత్యధిక బౌండరీల ద్వారా ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. కాబట్టి తమ జట్టు ఓడిపోయినట్లుగా తాను భావించడం లేదని...అయితే దురదృష్టవశాత్తు మాత్రమే టైటిల్ సాధించలేకపోయామని అన్నారు.&amp;nbsp;  ప్రపంచ కప్ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ కు జసిండా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మెగా టోర్నీ ద్వారా తమ క్రికెట్ జట్టు మరింత మెరుగయ్యిందన్నారు. &amp;nbsp; న్యూజిలాండ్ లో క్రికెట్ ను మరింత అభివృద్ది చేయడానికి తనవంతు సహకారం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఇలా మెరుగైన ఆటగాళ్లను తీర్చిదిద్దే దిశగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డును ప్రోత్సహిస్తామని ప్రధాని జసిండా ఆర్డెర్న్ పేర్కొన్నారు.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;                   View this post on Instagram                             That was undeniably an incredible game. I think as a nation we all aged a year in that super over. Congratulations to England. And to the Black Caps, I feel nothing but pride. What a team.  A post shared by  Jacinda Ardern (@jacindaardern) on Jul 14, 2019 at 11:46am PDT   </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dfsy74qb7c5vjxp2nv0tde7x/williamson-lead-new-zealand-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>అంపైర్లే కివీస్‌ను ముంచారు: ఓవర్‌త్రో వివాదంపై మాజీ అంపెర్లు</title>
            <link>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/simon-taufel-and-hariharan-comments-on-overthrow-incident-during-world-cup-final-pupzdh</link>
            <guid>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/simon-taufel-and-hariharan-comments-on-overthrow-incident-during-world-cup-final-pupzdh</guid>
            <pubDate>Tue, 16 Jul 2019 11:02:00 +0530</pubDate>
            <description>నరాల తేగే ఉత్కంఠ మధ్య జరిగిన ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే కివీస్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఇంగ్లాండ్‌ది అసలు గెలుపుకాదని.. అంపైర్లు నిబంధలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ కామెంట్ చేస్తున్నారు.  మరీ ముఖ్యంగా గప్టిల్ ఓవర్‌త్రో గురించే... &amp;nbsp;ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మాజీ అంపైర్లు సైమన్ టౌఫెల్, హరిహరన్ సైతం పెదవి విరిచారు. గప్టిల్ ఓవర్ త్రోకు ఇంగ్లాండ్‌కు ఇవ్వాల్సింది ఐదు పరుగులేనని.. ఆరు కాదని సైమన్ టౌఫెల్ అన్నాడు.  మరో అంపైర్ హరిహరన్ స్పందిస్తూ... కుమార ధర్మసేన న్యూజిలాండ్ ప్రపంచకప్ ఆశలను చిదిమేశాడు.. ఆ ఓవర్ త్రోకు ఇవ్వాల్సింది 5 పరుగులేనని తెలిపాడు. ఈ సందర్భంగా ఐసీసీ నిబంధనను ఒక్కసారి గమనిస్తే.. నిబంధన 19.8 ఓవర్‌త్రో గురించి చెబుతోంది.  ఫీల్డర్ ఓవర్‌త్రోకు బంతి బౌండరీ దాటితే ఆ పరుగులను ప్రత్యర్ధి జట్టుకు ఇస్తారు. ఫీల్డర్ త్రో విసిరిన సమయంలో బ్యాట్స్‌మెన్ పూర్తి చేసిన పరుగులు.. చేస్తున్న పరుగును కూడా బౌండరీకి కలుపుతారు.  అయితే వరల్డ్‌కప్ సెమీఫైనల్‌లో స్టోక్స్, రషీద్ రెండో పరుగు కోసం ప్రయత్నిస్తుండగా.... గప్టిల్ త్రో విసిరే సమయానికి ఒకరినొకరు దాటలేదని టీవీ రీప్లయిలలో స్పష్టంగా కనిపించింది.  కానీ ఫీల్డ్ అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్ మాత్రం ఇంగ్లాండ్‌కు ఆరు పరుగులిచ్చేశారు. ఇటువంటి పరిస్ధితితో టీవీ అంపైర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సిందని.. అంతేకానీ రెండో పరుగును ఎట్టి పరిస్ధితుల్లోనూ లెక్కలోకి తీసుకోకూడదని హరిహరన్ అభిప్రాయపడ్డాడు.  కాగా.. న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో పరుగు కోసం ప్రయత్నించగా.. &amp;nbsp;డీప్ మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న గప్టిల్ బంతిని అందుకుని వికెట్ల మీదకు విసిరాడు. అయితే ఆ త్రో స్టోక్స్‌ బ్యాట్‌కు తగలడంతో బంతి బౌండరీ దాటింది. దీంతో అంపైర్లు ఇంగ్లాండ్‌కు మొత్తం ఆరు పరుగులివ్వడం ఇప్పుడు వివాదాస్పదమైంది.&amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dfwm5qhzkffcdn3hdy9dh1hq/guptil-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ప్రపంచ కప్ ఫైనల్... సూపర్ ఓవర్ కూడా టై అవగానే ఇలా చేయాల్సింది: షేన్ వార్న్</title>
            <link>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-ausis-cricketer-shane-warne-comments-about-world-cup-final-match-puow93</link>
            <guid>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-ausis-cricketer-shane-warne-comments-about-world-cup-final-match-puow93</guid>
            <pubDate>Mon, 15 Jul 2019 20:57:00 +0530</pubDate>
            <description>ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో విజేతలను తేల్చడంతో ఐసిసి విఫలమైందని ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ మెగా టోర్నీ ఫైనల్లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ లు సమఉజ్జీలుగా నిలిచినా ఆతిథ్య జట్టును విజేతలుగా నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. అసలు సూపర్ ఓవర్ పేరుతో కేవలం ఆరు బంతుల్లోనే జట్ల బలాబలాలను ఎలా తేలుస్తారని కొందరు తప్పుబడుతుంటే బౌండరీల ద్వారా విజేతను నిర్ణయించడం అనేది మరింత వివాదాస్పద అంశంగా మారింది. అదీ ప్రపంచ కప్ మెగా టోర్నీ ఫైనల్లో కావడం మరింత చర్చకు దారితీస్తోంది. &amp;nbsp;తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ కూడా దీన్ని తప్పుబట్టారు.  ''ఆదివారం ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అద్భుతంగా సాగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఆటగాళ్లు తమ అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్ పలు మలుపులు తిరుగుతూ ఉత్కంఠభరితంగా సాగింది. రన్నరప్ తో సరిపెట్టుకున్నప్పటికి న్యూజిలాండ్ అత్యద్భుతంగా ఆడింది. &amp;nbsp;అలాగే ఇంగ్లాండ్ కూడా చాలా బాగా ఆడింది.&amp;nbsp;  అయితే ఫలితం పూర్తిగా తేలకముందే విజేతలను నిర్ణయించడం &amp;nbsp;కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక్క సూపర్ ఓవర్ టై అయితే మరో సౌపర్ ఓవర్ నిర్వహించాల్సింది. ఇలా ఫలితం తేలేవరకు ఎన్ని సూపర్ ఓవర్లయినా ఆడించాల్సింది. కానీ అలా చేయకుండా బౌండరీల ఆధారంగా ప్రపంచ కప్ విజేతను నిర్ణయించడం &amp;nbsp;బాధాకరం'' అని వార్న్ పేర్కొన్నాడు.&amp;nbsp;  ఇప్పటికే అత్యధిక &amp;nbsp;బౌండరీల విధానం ద్వారా న్యూజిలాండ్ కు ఐసిసి అన్యాయం చేసిందని చాలా మంది క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. వారికి మద్దతిస్తూ&amp;nbsp;తాజాగా వార్న్ కూడా ట్వీట్ చేయడం మరింత చర్చకు దారితీస్తోంది.&amp;nbsp;మరో సూపర్ ఓవర్ నిర్వహిస్తే నష్టమేమీ వుండేది కాదని....అలా కాకుండా ఐసిసి తప్పుడు నిర్ణయానికి కివీస్ బలికావాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇలా ఆయన చేసిన ట్వీట్ కు మద్దతుగా చాలామంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. &amp;nbsp;   What a game of cricket yesterday. Congrats to both teams for putting on a terrific show - full of skill, drama and courage. Feel for NZ as they were outstanding. Well done England. I just wish there was another super over or as many super overs as required to have a clear winner — Shane Warne (@ShaneWarne) July 15, 2019    &amp;nbsp;&amp;nbsp; &amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01cskej7xsz515vnjfxe04tecs/gettyimages-877591548--1-_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ఐసిసి ప్రపంచ కప్ టీం...కోహ్లీకి దక్కని అవకాశం వారిద్దరికి దక్కింది</title>
            <link>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-icc-announced-team-of-the-tournament-puordo</link>
            <guid>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-icc-announced-team-of-the-tournament-puordo</guid>
            <pubDate>Mon, 15 Jul 2019 19:11:00 +0530</pubDate>
            <description>స్వదేశంలో జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ జట్టు తన చిరకాల వాంఛను పూర్తిచేసుకుంది. నిన్న(ఆదివారం) లార్డ్స్ వేదికన జరిగిన ఫైనల్ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఇంగ్లాండ్ ను మొదటిసారి విశ్వవిజేతగా నిలబెట్టింది. వరుసగా రెండోసారి ఫైనల్ కు చేరినప్పటికి న్యూజిలాండ్ ప్రపంచ కప్ ట్రోఫీ మరోసారి మిస్సయ్యింది. ఇలా ఐసిసి ప్రపంచ కప్ మెగా టోర్నీ విజవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. &amp;nbsp;అయితే ఈ టోర్నీలో అత్యుత్తమంగా ఆడిన ఆటగాళ్లందరిని కలిపి ఐసిసి తాజాగా &amp;nbsp;ఓ క్రికెట్ జట్టును రూపొందించింది. ఈ జట్టులో టీమిండియా నుండి ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది.&amp;nbsp;  ఐసిసి ప్రకటించిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. అతడు ఈ టోర్నీలో మ్యాచ్ ను మలుపు తిప్పగలిగే ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేకపోయాడు. సాధారణంగా హాఫ్ సెంచరీలతో చెలరేగి మంచి పరుగులే సాధించినా ఫలితాన్ని ప్రభావితం చేసేలా ఆడలేకపోయాడు. దీంతో &amp;nbsp;అతడికి ఐసిసి పరిగణలోకి తీసుకోనట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&amp;nbsp;  అయితే ఈ ఐసిసి జట్టులో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది. అందులో ఒకరు గోల్డెన్ బ్యాట్ విజేత రోహిత్ శర్మ కాగా మరొకరు యార్కర్ స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా. ఇంగ్లాండ్ గడ్డపై వీరిద్దరు తమ అద్బుత ప్రదర్శనతో ప్రతి గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. దీంతో వీరు ఐసిసి జట్టులో &amp;nbsp;చేరడం పెద్ద ఆశ్చర్యమేమీ కలిగించడం లేదు. వీరిద్దరికి ఐసిసి టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో చేరడానికి అన్ని అర్హతలున్నాయి.  ఇక ఈ జట్టులో ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన ఇంగ్లాండ్ నుండి నలుగురు, న్యూజిలాండ్ నుండి ముగ్గురు ఎంపికయ్యారు. ఆ తర్వాత భారత్, ఆస్ట్రేలియాల నుండి ఇద్దరేసి ఆటగాళ్లకు చోటు దక్కింది. బంగ్లాదేశ్ నుండి ఒక ఆటగాడు ఈ జట్టులో చేరాడు. అయితే &amp;nbsp;ఈ జట్టులో దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండిస్,పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ జట్ల నుండి &amp;nbsp;ఒక్క ఆటగాడికి కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు.&amp;nbsp;  టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు(దేశాలవారిగా)  ఇండియా: రోహిత్ శర్మ, జస్ప్రీత్ సింగ్ బుమ్రా&amp;nbsp;  ఆస్ట్రేలియా: &amp;nbsp;అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్&amp;nbsp;  బంగ్లాదేశ్: షకిబ్ అల్ హసన్  ఇంగ్లాండ్: జేసన్ రాయ్, జో రూట్, బెన్ &amp;nbsp;స్టోక్స్, జోఫ్రా ఆర్చర్  న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్, పెర్గ్ సన్, ట్రెంట్ బౌల్ట్(12వ ఆటగాడు) &amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dftxtc38hdebmf277mj7rpg9/team-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ప్రపంచ కప్: ఇంగ్లాండు నుంచి ఇండియా నేర్చుకోవాల్సింది ఇదే... (వీడియో)</title>
            <link>https://telugu.asianetnews.com/video/cricket-world-cup-videos/world-cup-india-should-learn-from-england-puop7q</link>
            <guid>https://telugu.asianetnews.com/video/cricket-world-cup-videos/world-cup-india-should-learn-from-england-puop7q</guid>
            <pubDate>Mon, 15 Jul 2019 18:25:00 +0530</pubDate>
            <description>ప్రపంచ కప్: ఇంగ్లాండు నుంచి ఇండియా నేర్చుకోవాల్సింది ఇదే...&amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dftv3bajhfae2w5m3ps9ndwk/jagan-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ప్రపంచ కప్ 2019: టీమిండియా మిస్సయింది....కానీ రోహిత్ మాత్రం పట్టేశాడు</title>
            <link>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-team-india-opener-rohit-sharma-won-golden-bat-award-puolwb</link>
            <guid>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-team-india-opener-rohit-sharma-won-golden-bat-award-puolwb</guid>
            <pubDate>Mon, 15 Jul 2019 17:13:00 +0530</pubDate>
            <description>ఐసిసి వన్డే ప్రపంచ కప్ సమరం ముగిసింది. స్వదేశంలో జరిగిన ఈ మెగా టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ తన చిరకాల కోరికను పూర్తిచేసుకుంది. అయితే ఈ &amp;nbsp;టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి &amp;nbsp;దిగిన టీమిండియా సెమీస్ నుండే నిష్క్రమించింది. &amp;nbsp;ఇలా టైటిల్ పోరుకు కేవలం రెండడుగులు దూరంలో నిలిచిపోవడంతో ఆటగాళ్లే కాదు మాజీలు, అభిమానులు ఇలా యావత్ దేశం తీవ్ర నిరాశకు గురయ్యింది. అలా నిరుత్సాహపర్చిన ప్రపంచ కప్ లోనే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్ బ్యాట్ ను అందుకోవడం భారత క్రికెట్ ప్రియులకు కాస్త ఆనందం కలిగించింది.&amp;nbsp;  ఈ ప్రపంచ కప్ టోర్నీలో మొదటి &amp;nbsp;మ్యాచ్ నుండి రోహిత్ జోరు కొనసాగింది. అతడు ఏకంగా ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో ఈ టోర్నీలోనే అత్యధికంగా 648 &amp;nbsp;పరుగులు చేశాడు. ఇలా ఒకే ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలవడంతో పాటు అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. దీంతో ఈ మెగాటోర్నీలో రోహిత్ శర్మ &amp;nbsp;గోల్డెన్ బ్యాట్ అందుకున్నాడు.&amp;nbsp;  ఓ ప్రపంచ కప్ టొర్నీలో అత్యధిక పరుగులు చేసి &amp;nbsp;ఈ గోల్డెన్ బ్యాట్ అందుకున్న భారత ఆటగాళ్లలో రోహిత్ మూడోవాడు. అతడి కంటే ముందు సచిన్ రెండుసార్లు, రాహుల్ ద్రావిడ్ ఒకసారి ఈ ఘనత సాధించారు.&amp;nbsp;  ఈ మెగా టోర్నీలో రోహిత్ తర్వాత అత్యధిక పరుగుల జాబితాలో డేవిడ్ వార్నర్(647) పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్(606 పరుగులు), కివీస్ కెప్టెన్ విలియమ్సన్(576 పరుగుల), ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్‌ (556)తో తర్వాతి స్థానాల్లో నిలిచారు. &amp;nbsp; &amp;nbsp; ఇక బౌలర్ల విషయానికి వస్తే అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా యార్కర్ స్పెషలిస్ట్ స్టార్స్ కు గోల్డెన్ బాల్ అవార్డు లభించింది. అతడు ఏకంగా 27 వికెట్లు పడగొట్టి &amp;nbsp;ఈ &amp;nbsp;అవార్డును పొందడమే కాదు ఓ ప్రపంచ కప్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా &amp;nbsp;చరిత్ర సృష్టించాడు. &amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01df42gq8t38wapg2ewq6d796e/pjimage--6--jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>క్రికెట్ కంటే అదే నయం... ప్రపంచ కప్ ఓటమిపై జిమ్మీ నీషమ్ తీవ్ర అసహనం</title>
            <link>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-new-zealand-all-rounder-jimmy-neesham-tweets-advising-kids-not-to-take-up-sports-puof0j</link>
            <guid>https://telugu.asianetnews.com/cricket-world-cup-special/world-cup-2019-new-zealand-all-rounder-jimmy-neesham-tweets-advising-kids-not-to-take-up-sports-puof0j</guid>
            <pubDate>Mon, 15 Jul 2019 14:44:00 +0530</pubDate>
            <description>స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ జట్టు తమ చిరకాల వాంఛను నెరవేర్చుకుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికన జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్&amp;nbsp;జట్టును ఓడించి ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఫైనల్ పోరులో కివీస్ చివరి వరకు శక్తివంచన &amp;nbsp;లేకుండా పోరాడినా అదృష్టం కలిసిరాక&amp;nbsp;ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. దీంతో వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన ఆ జట్టు రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.&amp;nbsp;  తీవ్ర ఉత్కంఠతో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్ లో ఇరు జట్లు సమఉజ్జీలుగా నిలిచాయి. మొదట మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు.&amp;nbsp;అందులో కూడా ఇరుజట్లూ సమానమైన పరుగులు చేశారు. దీంతో చివరకు మ్యాచ్ లో అత్యధిక బౌండరీలు బాదిన జట్టును విజేతగా నిర్ణయించారు. ఇలా ఇంగ్లాండ్&amp;nbsp;ను అదృష్టం వరించి ప్రపంచ కప్ ట్రోఫీని అందుకోగా....కివీస్ దురదృష్టవశాత్తు ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. ఈ ఓటమి న్యూజిలాండ్ ఆటగాళ్లను తీవ్ర నిరాశకు&amp;nbsp;గురిచేసింది.&amp;nbsp;  ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్ ను ఈ ఓటమి మరింత ఆవేదనకు గురిచేసినట్లుంది. దీంతో అతడు క్రికెట్ పై ప్రేమ&amp;nbsp;పెంచుకుంటూ క్రికెటర్లుగా మారాలని కలలుకంటున్న చిన్నారులకు ఓ సలహా ఇచ్చాడు. '' పిల్లలూ...క్రీడల్లోకి మాత్రం మీరు రావద్దు. వంటపని గానీ మరేదైన&amp;nbsp;ప్రొపెషన్ ను ఎంచుకొండి. అలా అయితేనే 60 ఏళ్లకే ఆరోగ్యంగా వుంటూ హ్యాపీగా చనిపోవచ్చు'' అంటూ నీషమ్ ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశాడు. &amp;nbsp;&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;   Kids, don’t take up sport. Take up baking or something. Die at 60 really fat and happy. — Jimmy Neesham (@JimmyNeesh) July 15, 2019 </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01d2q2ym0p00g66vhbvsd2f4x7/Jimmy-Neesham_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ఆ విషయంలో న్యూజిలాండ్‌ కన్నా భారతే నయిం</title>
            <link>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/team-india-lost-2-matches-only-in-world-cup-2019-puoc8j</link>
            <guid>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/team-india-lost-2-matches-only-in-world-cup-2019-puoc8j</guid>
            <pubDate>Mon, 15 Jul 2019 13:44:00 +0530</pubDate>
            <description>44 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లాండ్ జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడింది. &amp;nbsp;వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్ అనూహ్య పరిణామాల మధ్య కప్ పొందలేకపోయింది.  అయితే న్యూజిలాండ్ ఓటమి తర్వాత భారత జట్టు కూడా బహుశా నిరాశ చెంది ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచకప్‌లో అతి తక్కువ పరాజయాలు చవిచూసిన జట్టు భారత్ మాత్రమే. జగజ్జేతగా ఆవిర్భవించిన ఇంగ్లాండ్ సైతం.. తాజా టోర్నమెంటులో మూడు పరాజయాలు చవిచూసింది.  లీగ్ దశలో ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఇండియా.. సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ ఎనిమిది విజయాలు సాధించగా.. భారత్, ఆస్ట్రేలియా ఏడు విజయాలు, న్యూజిలాండ్ 6, పాక్ 5, శ్రీలంక, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ 3, వెస్టిండీస్ 2 విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఇక పసికూనగా బరిలోకి దిగిన అఫ్ఘనిస్తాన్ ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది.&amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01desxp0a7enttbgt43q0agkja/pjimage--10--jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ఫైనల్‌లో గప్టిల్ రనౌట్: ధోనిని ఔట్ చేసిన కర్మ ఫలమేనా.. ఫ్యాన్స్ ట్రోలింగ్</title>
            <link>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/karma-back-martin-guptill-run-out-trolled-by-indian-cricket-fans-puo8c8</link>
            <guid>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/karma-back-martin-guptill-run-out-trolled-by-indian-cricket-fans-puo8c8</guid>
            <pubDate>Mon, 15 Jul 2019 12:20:00 +0530</pubDate>
            <description>మూడు రోజుల కిందట భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్‌లో లక్ష్యఛేదనలో ఉన్న టీమిండియా మ్యాచ్‌పై ఆశలు వదులుకున్న వేళ.. ధోని ఒంటరి పోరాటంపై ఆశలు పెట్టుకుంది.  అయితే సెకండ్ రన్‌ కోసం ప్రయత్నించిన ధోని... గప్టిల్ వేసిన అద్భుతమైన త్రోకు రనౌట్ అవ్వడంతో 130 కోట్ల మంది భారతీయుల కల చెదిరిపోయింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ గప్టిల్‌ను విమర్శిస్తూ.. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.  అయితే ప్రపంచకప్‌ ఫైనల్‌లో గప్టిల్‌కు ధోనికి ఎదురైన అనుభవమే పునరావృతమైంది. ఫైనల్ మ్యాచ్ సూపర్‌ఓవర్‌ చివరి బంతికి రెండో పరుగు తీయబోయిన గప్టిల్ రనౌట్‌ కావడంతో ప్రపంచకప్ ఇంగ్లాండ్ వశమైంది.  ఆర్చర్ వేసిన సూపర్ ఓవర్ చివరి బంతిని బలంగా బాదిన మార్టిన్ గప్టిల్ మొదటి పరుగును సురక్షితంగా పూర్తి చేయగా.... రెండో పరుగు కోసం గప్టిల్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఫీల్డర్‌ నుంచి బంతిని అందుకున్న కీపర్ బట్లర్ రెప్పపాటులో వికెట్లను గిరాటేశాడు.  దీంతో మ్యాచ్ టై అవ్వడం.. అత్యధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించడం జరిగిపోయాయి. అంతేకాదు సూపర్‌ఓవర్‌లో గప్టిల్ విసిరిన బంతి స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీకి దూసుకుపోవడంతో ఇంగ్లాండ్‌కు అదనంగా నాలుగు పరుగులు రావడం మ్యాచ్‌ను మలుపుతిప్పింది.  ధోనిని రనౌట్ చేసి భారత ఆశలను సమాధి చేసినందుకు గప్టిల్‌కు తగిన శాస్తి జరిగిందంటూ టీమిండియా అభిమానులు ఈ సంఘటనను ట్రోల్ చేస్తున్నారు.&amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dft697jjqef0my5jjb0b8avh/dhoni-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>గెలిచామంటే... ఓవర్ త్రో వల్లే: నిజం ఒప్పుకున్న మోర్గాన్</title>
            <link>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/england-captain-eoin-morgan-comments-on-over-throw-issue-during-the-world-cup-final-puo6o5</link>
            <guid>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/england-captain-eoin-morgan-comments-on-over-throw-issue-during-the-world-cup-final-puo6o5</guid>
            <pubDate>Mon, 15 Jul 2019 11:44:00 +0530</pubDate>
            <description>ప్రపంచకప్‌‌లో విజయం సాధించడం పట్ల ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆసక్తికర్ వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరిగా క్రిస్ వోక్స్ ఔటనప్పుడు ప్రపంచకప్‌ మళ్లీ చేజారిందని అనుకున్నామని తెలిపాడు.  అయితే సూపర్‌ ఓవర్‌లో గప్టిల్ ఓవర్‌త్రో కారణంగా తిరిగి జట్టు సభ్యుల్లో ఆశలు చిగురించాయని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. సూపర్‌ ఓవర్‌లో బెన్‌స్టోక్స్, బట్లర్ బాగా ఆడారని అతను ప్రశంసించాడు.  ఫైనల్‌లో భాగంగా లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ చేసిన పరుగులు న్యూజిలాండ్‌ పరుగులతో సమానం కావడంతో అంపైర్లు సూపర్ ఓవర్ ఆడించారు. ఈ &amp;nbsp;సందర్భంగా &amp;nbsp;ఇంగ్లాండ్ క్రికెటర్లు బెన్‌స్టోక్స్, బట్లర్‌లు బ్యాటింగ్‌కు దిగారు.  బౌల్ట్ బౌలింగ్‌లో స్టోక్స్ ఆడిన బంతి డీప్ మిడ్‌వికెట్ మీదుగా వెళ్లింది. అతను రెండో పరుగుకు ప్రయత్నిస్తుండగా ఫీల్డింగ్ చేస్తున్న గప్టిల్ బంతిని వికెట్ల మీదకు వేశాడు. ఈ సమయంలో బంతి స్టోక్స్ బ్యాట్‌కు తగిలి &amp;nbsp;బౌండరీ చేరింది.  దీంతో ఇంగ్లాండ్‌కు మొత్తం ఆరు పరుగులు రావడం న్యూజిలాండ్ ఆశలపై నీళ్లు చల్లింది. సూపర్‌ఓవర్‌లోనూ ఇరు జట్లు చెరో 15 పరుగులు చేయడంతో మ్యాచ్ మళ్లీ టై అయ్యింది. దీంతో ఎక్కువ ఫోర్లు కొట్టిన ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు.&amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01ddq5kznyywvpb88q561130c4/eoin-morgan-pc-new-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ఓవర్‌ త్రో..  ఆశలు సమాధి: ఈ పరిస్ధితి ఎవరికీ రావొద్దన్న విలియమ్సన్</title>
            <link>https://telugu.asianetnews.com/cricket-world-cup-viral-news/new-zealand-captain-kane-williamson-comments-on-over-throw-issue-puo5gu</link>
            <guid>https://telugu.asianetnews.com/cricket-world-cup-viral-news/new-zealand-captain-kane-williamson-comments-on-over-throw-issue-puo5gu</guid>
            <pubDate>Mon, 15 Jul 2019 11:18:00 +0530</pubDate>
            <description>ప్రపంచ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మ్యాచ్‌గా 2019 ప్రపంచకప్ ఫైనల్ గుర్తుండిపోతోంది. నరాలు తెగే ఉత్కంఠ, అనూహ్య పరిణామాల మధ్య న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ గెలుపొంది జగజ్జేతగా ఆవిర్భవించింది.  ఇంగ్లాండ్ పండగ చేసుకుంటుంటే... కివీస్ ఆటగాళ్లు మాత్రం కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ మాట్లాడుతూ... ఓటమి తీవ్ర నిరాశ కలిగించిందని.. తమ ఆటగాళ్ల బాధ వర్ణనాతీతమన్నాడు.  మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగిందని.. పిచ్‌లు అంచనా వేసిన దానికంటే భిన్నంగా మారాయని విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. ఫైనల్ మ్యాచ్ టైగా మారడం వెనుక చాలా కారణాలున్నాయని... ఇది నిజంగా దురదృష్టకరమని, విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లాండ్‌ జట్టుకు కివీస్ కెప్టెన్ అభినందనలు తెలిపాడు.  ఇది కేవలం ఒక్క ఎక్స్‌ట్రా పరుగుకు సంబంధించిన విషయం కాదని.. ఎన్నో అంశాలు తమకు విజయాన్ని దూరం చేశాయన్నాడు. &amp;nbsp;మ్యాచ్ మధ్యలో చోటు చేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాలు న్యూజిలాండ్‌కు శరాఘాతంగా మారాయని వలియమ్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు. &amp;nbsp;  గప్టిల్ వేసిన బంతి స్టోక్స్ బ్యాట్‌ను తాకి ఓవర్‌త్రో రూపంలో బౌండరీకి వెళ్లి.. ఆరు పరుగులు రావడం ఇంగ్లాండ్‌‌కు బాగా కలిసివచ్చిందని అభిప్రాయపడ్డాడు. ఇటువంటి సంఘటనలు జరిగి ఉండాల్సింది కాదని.. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని కోరుకుంటున్నానని విలియమ్సన్ పేర్కొన్నాడు.  లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ చేసిన పరుగులు న్యూజిలాండ్‌ పరుగులతో సమానం కావడంతో అంపైర్లు సూపర్ ఓవర్ ఆడించారు. ఈ &amp;nbsp;సందర్భంగా &amp;nbsp;ఇంగ్లాండ్ క్రికెటర్లు బెన్‌స్టోక్స్, బట్లర్‌లు బ్యాటింగ్‌కు దిగారు.  బౌల్ట్ బౌలింగ్‌లో స్టోక్స్ ఆడిన బంతి డీప్ మిడ్‌వికెట్ మీదుగా వెళ్లింది. అతను రెండో పరుగుకు ప్రయత్నిస్తుండగా ఫీల్డింగ్ చేస్తున్న గప్టిల్ బంతిని వికెట్ల మీదకు వేశాడు. ఈ సమయంలో బంతి స్టోక్స్ బ్యాట్‌కు తగిలి &amp;nbsp;బౌండరీ చేరింది. దీంతో ఇంగ్లాండ్‌కు మొత్తం ఆరు పరుగులు రావడం న్యూజిలాండ్ ఆశలపై నీళ్లు చల్లింది.&amp;nbsp; &amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dfsrbrg13sf2677njfr4h79c/kane-williamson-wc-final-pc-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>టర్నింగ్ పాయింట్: స్టోక్స్ చేసిన నమ్మశక్యం కాని పని ఇదే...</title>
            <link>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/icc-world-cup-final-2019-turning-point-puo51d</link>
            <guid>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/icc-world-cup-final-2019-turning-point-puo51d</guid>
            <pubDate>Mon, 15 Jul 2019 11:09:00 +0530</pubDate>
            <description>లండన్: ఇంగ్లాండు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ న్యూజిలాండ్ పై జరిగిన ఫైనల్ మ్యాచులో బ్యాట్ తో వీరోచితంగా పోరాడాడు. కానీ, అతను చేసిన పనికే న్యూజిలాండ్ ఇంటి దారి పట్టి, ఇంగ్లాండు కప్ ను ఎగురేసుకుపోయింది. తాను కావాలని చేయలేదని, అందుకు కివీస్ కెప్టెన్ కానే విలియమ్సన్ కు జీవితాంతం క్షమాపణలు చెప్తూనే ఉంటానని అతను అన్నాడు.&amp;nbsp;  బెన్ స్టోక్స్ తప్పు చేసినా చేయకపోయినా మ్యాచ్ ను మలుపు తిప్పి విజయాన్ని ఇంగ్లాండు ఖాతాలో వేసింది మాత్రం అతనే. విరోచితంగా పోరాడినప్పటికీ న్యూజిలాండ్ కు అదృష్టం కలిసి రాలేదని చెప్పడానికి ఇదో ముఖ్యమైన ఉదాహరణ. మ్యాచ్ 50 ఓవర్‌లో జరిగిన అనూహ్యమైన ఘటన కివీస్‌ జట్టును ఓటమి పాలు చేసింది. చివరి ఓవర్‌లో ఇంగ్లండ్‌ విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి.&amp;nbsp;  కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటున్న బెన్ స్టోక్స్ ఓవైపు ఉన్నాడు. న్యూజిలాండ్ వేసిన చివరి ఓవర్‌లో మొదటి రెండు బంతులకు పరుగులేమీ రాలేదు. మూడో బంతిని స్టోక్స్‌ సిక్సర్‌గా మలిచాడు. మరో &amp;nbsp;మూడు బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన దశలో నాలుగో బంతికి అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది.&amp;nbsp;  నాలుగో బంతి వేసిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. నాలుగో బంతిని స్టోక్స్ డీప్ లోకి తరలించాడు. రెండు పరుగులు తీశాడు. కానీ, రెండో పరుగు తీస్తున్న సమయంలో మార్టిన్‌ గుఫ్టిల్‌ విసిరిన బంతి నేరుగా స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలింది. అంతే, న్యూజిలాండ్ ఆటగాళ్లకు దిమ్మ తిరిగింది.  స్టోక్స్ బ్యాట్ కు తగిలిన బంతి బౌండరీ దాటింది. దాంతో ఇంగ్లాండుకు ఆరు పరుగులు వచ్చాయి. దీంతో ఇంగ్లాండ్‌ చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు చేస్తే విజయం అందుకునే పరిస్థితి. కానీ, అయితే చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు చేసి ఇద్దరు రన్నౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ 241 పరుగుల వద్ద ఆగిపోయింది.&amp;nbsp;  దాంతో మ్యాచ్‌ టై అయింది. ఆ తర్వాత సూపర్‌ ఓవర్‌ కూడా టై అయింది. దీంతో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్‌ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dfrz4cnjdxb94recx97537ma/ben-stokes-wc-final-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>కావాలని చేయలేదు, విలియమ్సన్ కు క్షమాపణలు చెప్తూనే ఉంటా: స్టోక్స్</title>
            <link>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/ben-stokes-says-he-will-apologise-kane-williamson-puo3db</link>
            <guid>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/ben-stokes-says-he-will-apologise-kane-williamson-puo3db</guid>
            <pubDate>Mon, 15 Jul 2019 10:33:00 +0530</pubDate>
            <description>లండన్‌: &amp;nbsp;న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కానే విలియమ్సన్‌కు తాను జీవితాంతం క్షమాపణలు చెప్తూనే ఉంటానుని ఇంగ్లాండు స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్అన్నాడు. ఇది తాను కావాలని చేసింది కాదని, బంతి అలా అనుకోకుండా తన బ్యాట్‌ను తాకిందని ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. అయితే అదే తమ గెలుపులో కీలకంగా మారిందని అన్నాడు&amp;nbsp;  బంతి తన బ్యాట్ కు తాకి బౌండరీ దాటిన ఘటనపై విలియమ్సన్ కు క్షమాపణలు చెబుతున్నట్లు స్టోక్స్ చెప్పాడు. అయితే విజయం కోసం తమ జట్టు నాలుగేళ్లుగా ఎంతో కష్ట పడిందని, ఎన్నో మాటలు పడిందని అన్నాడు. &amp;nbsp;చివరికి తాము అనుకున్నది సాధించామని తెలిపాడు. ఇలాంటి మ్యాచ్‌ క్రికెట్‌ చరిత్రలో మరోటి ఉంటుందని తాను అనుకోవడం లేదని అన్నాడు.  ప్రపంచ కప్ 2019 ఫైనల్‌ మ్యాచ్‌ క్రికెట్‌ చరిత్రలోనే &amp;nbsp;అద్భుతమైందిగా నిలుస్తుంది. ప్రపంచకప్‌ ఫైనల్‌ టై కావడం ఒక్కటైతే, తర్వాత జరిగిన సూపర్‌ ఓవర్‌ సైతం టై కావడం తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. ఇది అరుదైన ఘటన కూడా.&amp;nbsp;  అయితే మ్యాచ్‌ను టైగా మార్చింది మాత్రం ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌. చివరి ఓవర్లో ఇంగ్లాండ్‌ మూడు బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా కప్పు గెలవడానికి న్యూజిలాండ్‌కే ఎక్కువ అవకాశాలని అందరూ భావించారు.  స్టోక్స్‌ ఫోర్‌ కొట్టాలని చూసిన బంతి గుప్తిల్‌కు దొరికింది. త్రో విసిరాడు, క్రీజును అందుకునేందుకు దూకిన స్టోక్స్‌ బ్యాటును ఆ బంతి తాకింది. దాంతో బంతి ఓవర్‌ త్రో రూపంలో బౌండరీ దాటింది. ఆరు పరుగులొచ్చాయి. ఆ బంతి అలా స్టోక్స్‌ బ్యాటుకు తగలకపోయి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది.  కప్పు న్యూజిలాండ్‌ వశమై ఉండేది కూడా. కానీ త్రో రూపంలో వచ్చిన ఆరు పరుగులు ఇంగ్లాండ్‌కు కలిసి వచ్చాయి. ఇంగ్లాండ్‌ విజయం తర్వాత బెన్‌ స్టోక్స్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dfswtt73ta9rbj89z0d23e9x/2-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>చెత్త రూల్: విజేత నిర్ణయానికి పెట్టిన నిబంధనపై గంభీర్ ఫైర్</title>
            <link>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/don-t-understand-how-the-game-of-such-proportions-puo2j6</link>
            <guid>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/don-t-understand-how-the-game-of-such-proportions-puo2j6</guid>
            <pubDate>Mon, 15 Jul 2019 10:15:00 +0530</pubDate>
            <description>న్యూఢిల్లీ: సూపర్ ఓవర్ కూడా టై కావడంతో విజేతగా నిర్ణయించడానికి అత్యధిక బౌండరీలను కొలమానంగా తీసుకోవడంపై భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు గౌతం గంభీర్ తీవ్రంగా మండిపడ్డారు. అదో చెత్త నిబంధన అని ఆయన విరుచుకపడ్డారు. ఇరు జట్లను సంయుక్తంగా విజేతలుగా ప్రకటించకుండా బౌండరీలను లెక్క తీసి జయాపజయాలను నిర్ణియించే పద్ధతి సరైంది కాదని అన్నారు. &amp;nbsp;  లార్డ్స్ మైదానం వేదికగా ఆదివారం రోజున న్యూజిలాండ్‌తో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్స్‌లో ఇంగ్లండ్ విజయం సాధించి ప్రపంచ కప్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు హెన్రీ నికోల్స్ 55, టామ్ లాథం 47 పరుగులు చేయడంతో 50 ఓవర్లలో 241 పరుగులు సాధించింది.&amp;nbsp;  242 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్‌ 241 పరుగులకు ఆలౌట్‌ కావడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. మ్యాచ్ టై అవడంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం కోసం ఐసీసీ సూపర్ ఓవర్ నిర్వహించింది. ఈ సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కూడా ఆరు బంతుల్లో 1 వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ సైతం మళ్లీ టైగానే మిగిలింది.&amp;nbsp;  సూపర్‌ ఓవర్‌లోనూ స్కోర్లు ‘టై’ కావడంతో మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్‌ ను విజేతగా ప్రకటించారు. బౌండరీ కౌంట్ నిబంధనను హాస్యాస్పదంగా ఉందని గౌతమ్ గంభీర్ ఐసీసీపై విరుచుకుపడ్డాడు. అత్యంత ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ టై అయిన తర్వాత ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే గత నిబంధనను మార్చి బౌండరీల ద్వారా విజేతను ప్రకటించడంపై గంభీర్‌ ఐసీసీ తీరును తప్పుపట్టారు.&amp;nbsp;  ఈ తరహా విధానం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. &amp;nbsp;ఇదొక చెత్త రూల్‌ అంటూ మండిపడ్డాడు. మెగా ఫైట్‌లో కడవరకూ పోరాడిన ఇరు జట్లను గంభీర్‌ అభినందించాడు.     Don't understand how the game of such proportions, the #CWC19Final, is finally decided on who scored the most boundaries. A ridiculous rule @ICC. Should have been a tie. I want to congratulate both @BLACKCAPS &amp; @englandcricket on playing out a nail biting Final. Both winners imo. — Gautam Gambhir (@GautamGambhir) July 14, 2019 </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dagdcr3vrgann9pwps8vfys9/gambhir_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ప్రపంచ కప్: ఇండియా ఓటమిపై యువీ, రాయుడిపై దిగ్భ్రాంతి</title>
            <link>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/india-didn-t-plan-properly-for-no-4-yuvraj-singh-pun6g7</link>
            <guid>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/india-didn-t-plan-properly-for-no-4-yuvraj-singh-pun6g7</guid>
            <pubDate>Sun, 14 Jul 2019 22:42:00 +0530</pubDate>
            <description>న్యూఢిల్లీ: వన్డే ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ లో ఓటమి చవి చూసి తిరుగు ముఖం పట్టడంపై మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ స్పందించాడు. భారత జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ సరిగా లేకపోవడం వల్లే ఇండియా ఫైనల్ కు చేరుకోలేకపోయిందని అన్నాడు. ప్రధానంగా నాల్గో స్థానంలో నాణ్య‌మైన బ్యాట్స్‌మన్ లేక‌పోవ‌డం వ‌ల్లే ఈ ఓట‌మి ఎదురైంద‌ని తాను భావిస్తున్నట్లు తెలిపాడు.&amp;nbsp;  నాలుగో స్థానాన్ని ఎంత త్వ‌ర‌గా భ‌ర్తీ చేస్తే అంత మంచిద‌ని యువీ అభిప్రాయపడ్డాడు. ఓ మంచి బ్యాట్స్‌మెన్‌తో ఈ స్థానాన్ని భ‌ర్తీ చేయ‌క‌పోతే బ్యాటింగ్ లైన‌ప్ మ‌రింత బలహీనపడుతుందని అన్నాడు. యువ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి అర్ధాంత‌రంగా త‌ప్పుకోవ‌డం ప‌ట్ల ఆయన దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశాడు. ప్రపంచ‌క‌ప్ టోర్న‌మెంట్ కోసం ఎంపిక చేసిన జ‌ట్టులో అంబ‌టి రాయుడిని తీసుకోక‌పోవ‌డం వ్యూహాత్మ‌క త‌ప్పిద‌మ‌ని ఆయన అన్నాడు.  టీమిండియా బ్యాటింగ్ లైన‌ప్‌లో నాలుగో స్థానం అత్యంత కీల‌క‌మైనద‌ని ఆయన అన్నాడు. దీన్ని భ‌ర్తీ చేసుకోక‌పోతే దాని ప్ర‌భావం బ్యాటింగ్ లైన‌ప్ మొత్తంపై ప‌డుతుంద‌ని అన్నాడు. అంబ‌టి రాయుడిని జ‌ట్టులోకి తీసుకునినాలుగో నంబ‌ర్ స్థానాన్ని అత‌నితో భ‌ర్తీ చేయించి ఉండాల్సింద‌ని చెప్పాడు.&amp;nbsp;  ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో అంబ‌టి రాయుడికి చోటు ద‌క్క‌క‌పోవ‌డం త‌న‌ను షాక్‌కు గురి చేసింద‌ని అన్నాడు. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ అయినా ఈ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి విఫ‌ల‌మైతే అత‌ణ్ని ప‌క్క‌న‌ పెడుతున్నార‌ని, అది స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాల్గో స్థానాన్ని ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించాడు.  టీమిండియాలో నాలుగో నంబ‌ర్ స్థానం మ్యూజిక‌ల్ ఛైర్‌లా మారింద‌ని ఆయన అన్నాడు. నాలుగైదు మ్యాచ్‌ల్లో విఫ‌ల‌మైన త‌రువాత అంబ‌టి రాయుడు న్యూజిలాండ్‌పై జ‌రిగిన మ్యాచ్‌లో రాణించాడ‌ని, మ‌ళ్లీ అత‌ణ్ని త‌ప్పించార‌ని మండిపడ్డాడు. తాజాగా రిష‌బ్ పంత్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తున్న‌ప్ప‌టికీ అత‌ను ఎన్నాళ్లు &amp;nbsp;ఆ స్థానంలో ఉంటాడో తెలియ‌ద‌ని అన్నాడు.&amp;nbsp;  నాలుగో స్థానంలో ఆడ‌గ‌ల‌డ‌న్న న‌మ్మ‌కం ఉంచిన ఓ ఆట‌గాడిని మ‌ళ్లీ, మ‌ళ్లీ తొల‌గించ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌ద‌ని యువీ అన్నాడు. దీనివ‌ల్ల ఆ ఆట‌గాడు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని యువ‌రాజ్ అన్నాడు </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dd5sfnm4495bycxak6tt3yes/yuvraj-singh-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ప్రపంచ కప్: కివీస్ పేసర్ హెన్రీ అరుదైన ఘనత</title>
            <link>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/world-cup-2019-matt-henry-creats-record-pun5sb</link>
            <guid>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/world-cup-2019-matt-henry-creats-record-pun5sb</guid>
            <pubDate>Sun, 14 Jul 2019 22:27:00 +0530</pubDate>
            <description>లండన్‌: ప్రపంచ కప్ పోటీల్లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ అరుదైన ఘనతను సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో తొలి పవర్‌ ప్లేలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అతను నిలిచాడు.&amp;nbsp;  తాజా ప్రపంచ కప్ టోర్నీలో హెన్రీ మొదటి పవర్‌ ప్లేలో 8 వికెట్లను తీశాడు. దాంతో ఈ మెగా టోర్నీలో పది ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. &amp;nbsp;వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ పోరులో భాగంగా జేసన్‌ రాయ్‌ వికెట్‌ను సాధించడం​ ద్వారా హెన్రీ ఈ ఫీట్‌ నమోదు చేశాడు.&amp;nbsp;  ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ఆరో ఓవర్‌ నాల్గో బంతికి రాయ్‌ను పెవిలియన్‌కు పంపాడు. &amp;nbsp;ఈ జాబితాలో కాట్రెల్‌(వెస్టిండీస్‌), జోఫ్రా ఆర్చర్‌( ఇంగ్లండ్‌), క్రిస్‌ వోక్స్‌( ఇంగ్లండ్‌)లు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వీరు తలో ఏడు వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ( ఇక్కడ చదవండి: కేన్‌ విలియమ్సన్‌ వరల్డ్‌ రికార్డు)  కివీస్‌ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్‌ 28 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆరంభం నుంచి కివీస్‌ పేసర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డ రాయ్‌.. హెన్రీ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత జానీ బెయిర్‌ స్టోకు లైఫ్‌ లభించింది. బెయిర్‌ స్టో ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను &amp;nbsp;గ్రాండ్‌ హోమ్‌ వదిలేశాడు.&amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dfrdfxdy95excgysj4cjdr5b/henry-nicholls-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ఏడ్చేశాడు, ఓదార్చడం మా తరం కాలేదు: జడేజా భార్య</title>
            <link>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/ravindra-jadeja-s-wife-reveals-he-was-inconsolable-after-india-s-heartbreaking-semi-final-loss-vs-new-zealand-pun3r3</link>
            <guid>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/ravindra-jadeja-s-wife-reveals-he-was-inconsolable-after-india-s-heartbreaking-semi-final-loss-vs-new-zealand-pun3r3</guid>
            <pubDate>Sun, 14 Jul 2019 21:43:00 +0530</pubDate>
            <description>న్యూఢిల్లీ: ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ పై ఇండియా ఓడిపోవడంతో రవీంద్ర జడేజా ఏడ్చేశాడని ఆయన భార్య రివాబా అన్నారు. ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచులో రవీంద్ర జడేజా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన ద్వారా టీమిండియాను విజయం అంచు దాకా తెచ్చాడు.జట్టు స్వల్ప తేడాతో పరాజయం పాలు కావడంతో జడేజాను ఓదార్చలేక పోయామని అతడి భార్య రివాబా తెలిపింది.  92 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన స్థితిలో ధోనీ అండగా జడేజా మరిచిపోలేని ఇన్నింగ్స్‌ ఆడాడు. 59 బంతుల్లో 77 పరుగులు చేసి టీమ్‌ను గెలుపు ముంగిట నిలబెట్టాడు. కానీ, హెన్రీ బౌలింగ్‌లో భారీషాట్‌ ఆడే క్రమంలో జడేజా అవుటయ్యాడు.&amp;nbsp;  ఆ తర్వాత భారత్‌ లక్ష్య ఛేదనలో విఫలమై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ పరాజయంతో జడేజా గుండె పగిలిందని అతడి భార్య రివాబా చెప్పింది. "జడ్డూను ఓదార్చలేకపోయాం. నేను అవుట్‌ కాకుండా ఉండుంటే తప్పకుండా గెలిచే వాళ్లమని పదేపదే చెబుతూ ఎంతో బాధపడ్డాడు" అని రివాబా తెలిపింది.  జడేజా జర్నీని చూస్తే కీలకమైన మ్యాచుల్లో అతను ఎలా వికెట్లు తీశాడో, ఎలా పరుగులు చేశాడో అర్థమవుతుందని ఆమె అన్నది. 2013 ఇండియా చాంపియన్స్ ట్రోఫీ విజయంలో జడేజా పోషించిన పాత్రను ఆమె గుర్తు చేసింది. ఆల్ రౌండ్ ప్రదర్శన ద్వారా ఫైనల్ మ్యాచులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా ఎంపికయ్యాడని ఆమె చెప్పింది.&amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dfr97pb3hmy5twyw8rkngvmr/ravindra-jadeja-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ప్రపంచ కప్: జయవర్ధనే రికార్డును బద్దలు కొట్టిన విలియమ్సన్</title>
            <link>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/world-cup-2019-kane-williamson-breaks-jayawardhane-record-pun2dj</link>
            <guid>https://telugu.asianetnews.com/icc-cricket-world-cup-2019/world-cup-2019-kane-williamson-breaks-jayawardhane-record-pun2dj</guid>
            <pubDate>Sun, 14 Jul 2019 21:14:00 +0530</pubDate>
            <description>లండన్: ఇంగ్లాండుతో ఆదివారం జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కానే విలియమ్సన్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 30 పరుగులు చేసి అవుటైన విలియమ్సన్ ప్రపంచకప్‌ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు.  28 ఏళ్ల విలియమ్సన్ ఈ ప్రపంచకప్‌లో 549 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో ఓ కెప్టెన్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. ఈ క్రమంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే రికార్డును అతను బద్దలు కొట్టాడు.&amp;nbsp;  2007 ప్రపంచకప్‌లో జయవర్ధనే 548 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 539 (2007), ప్రస్తుత కెప్టెన్ అరోన్ ఫించ్ 507 (2019) పరుగులతో ఉన్నారు. </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dfrgsha6rhm27ke0rwzdj9kx/kane-williamson-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>'సూపర్' విశ్వవిజేత ఇంగ్లాండు:  న్యూజిలాండ్ ఆశలు గల్లంతు</title>
            <link>https://telugu.asianetnews.com/cricket-world-cup-ground-story/new-zealand-vs-england-icc-world-cup-2019-final-live-updates-pumkt4</link>
            <guid>https://telugu.asianetnews.com/cricket-world-cup-ground-story/new-zealand-vs-england-icc-world-cup-2019-final-live-updates-pumkt4</guid>
            <pubDate>Sun, 14 Jul 2019 14:54:00 +0530</pubDate>
            <description>ఇంగ్లాండు 42 ఏళ్ల కలను నెరవేర్చుకుంది. సూపర్ ఓవరులో న్యూజిలాండ్ ఇంగ్లాండు స్కోరును సమం చేసింది అయితే, మ్యాచులో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లాండు విజయాన్ని అందుకుంది. తొలిసారి ఇంగ్లాండు విశ్వవిజేతగా నిలిచింది. ఇంగ్లాండు తరఫున ఆర్చర్ సూపర్ వేశాడు. తొలి బంతి వైడ్ అయింది. మధ్యలో ఓ సిక్స్ కూడా వెళ్లింది. కానీ, చివరి బంతికి రెండు పరుగుల చేయాల్సిన స్థితిలో న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ గుప్తిల్ రన్నవుట్ అయ్యాడు. జోసన్ రాయ్ మిడ్ వికెట్ నుంచి విసిరిన బంతితో గుప్తిల్ రన్నవుట్ అవుటయ్యాడు. దీంతో ఇంగ్లాండు ప్రపంచ&amp;nbsp; కప్ విజేతగా నిలిచింది.  ఫైనల్ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవరులో బ్యాటింగ్ కు ఇంగ్లాండు ఆటగాళ్లు స్టోక్స్, బట్లర్ దిగారు. సూపర్ ఓవరులో ఇంగ్లాండు 15 పరుగులు చేసింది. 16 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ చేతులెత్తేసింది.  విజయం కోసం ఒక్క బంతికి రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో రెండో పరుగు&amp;nbsp;చేయబోయి వుడ్ రన్నవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ టై అయింది. న్యూజిలాండ్ చేసిన 241 పరుగులను ఇంగ్లాండు చివరి ఓవరు చివరి బంతికి సమం చేసింది. స్టోక్స్ ఒంటరి పోరాటం చేశాడు. అతను 84 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 227 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆర్చర్ నీషం బౌలింగులో డకౌట్ అయ్యాడు.ఇంగ్లాండు 220 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ప్లంకెట్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నీషం బౌలింగులో అవుటయ్యాడు.  ఇంగ్లాండు 203 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. వోక్స్ 2 పరుగులు మాత్రమే చేసి ఫెర్గూసన్ బౌలింగులో అవుటయ్యాడు.196 పరుగుల వద్ద ఇంగ్లాండు ఐదో వికెట్ కోల్పోయింది. బట్లర్ 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫెర్గూసన్ బౌలింగులో సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు.  ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో ఫెర్గూసన్ అద్భుతమైన క్యాచ్ ద్వారా ఇంగ్లాండు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ను పెవిలియన్ కు చేర్చాడు. నీషం వేసిన బంతిని మోర్గాన్ గాలిలోకి లేపాడు. ఫెర్డూసన్ తన స్థానం నుంచి పరుగెత్తి వస్తూ బంతిని మైదానానికి కొద్ది ఎత్తులో గాలిలోనే పట్టుకున్నాడు. దీంతో మోర్గాన్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరుకున్నాడు. ఇంగ్లాండు 86 పరుగుల స్కోరు వద్ద మోర్గాన్ అవుట్ తో నాలుగో వికెట్ కోల్పోయింది.  ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండు 71 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెయిర్ స్టో ఫెర్గూసన్ బౌలింగులో వికెట్ ను జారవిడుచుకున్నాడు.  ఇంగ్లాండు 59 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. జో రూట్ 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గ్రాండ్ హోమ్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు. అంతకు ముందుఇంగ్లాండు 28 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోియంది. జోసన్ రాయ్ 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హెన్రీ బౌలింగులో లాథమ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  ప్రపంచకప్‌ తుదిపోరులో న్యూజిలాండ్.. ఇంగ్లాండ్ జట్టు ముందు 242 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పిచ్ నుంచి సరైన సహకారం అందడంతో ఇంగ్లీష్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు.ఆది నుంచి వికెట్లు కోల్పోతూ వచ్చిన న్యూజిలాండ్‌ చివరి ఓవర్లలో ధాటిగా ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల &amp;nbsp;నష్టానికి 241తో చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. కివీస్ ఆటగాళ్లలో నికోలస్ 55, లేథమ్ 47 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ 3, ఫ్లంకేట్ 3, వుడ్, ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు.&amp;nbsp;  చివరి ఓవర్లలో ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చిపోయారు. నిలకడగా ఆడిన టామ్ లేథమ్‌ 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వోక్స్ బౌలింగ్‌లో విన్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.కివీస్ కీలక సమయంలో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న గ్రాండ్ హోమ్మీ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వోక్స్ బౌలింగ్‌లో విన్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  కివీస్ ఐదో వికెట్ కోల్పోయింది. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో ధాటిగా ఆడిన నీషమ్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫ్లంకెట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రూట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రమాదకర రాస్ టేలర్‌ను 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్క్ వుడ్ ఎల్బీగా వెనక్కి పంపాడు. దీంతో కివీస్ కష్టాల్లో పడింది.&amp;nbsp;  నిలకడగా రాణిస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించిన ఓపెనర్ నికోలస్‌ ఔటయ్యాడు. 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫ్లంకెట్ వేసిన అద్భుతమైన బంతికి నికోలస్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 118 పరుగులకు మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో న్యూజిలాండ్ ఒత్తిడిలో పడింది. టేలర్, లేథమ్ క్రీజులో ఉన్నారు.&amp;nbsp;  కివీస్ ఓపెనర్ నికోలస్ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 71 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో అతను హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. కెప్టెన్ విలియమ్సన్‌తో కలిసి 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అతను ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.&amp;nbsp;కీలకమైన వికెట్‌ను న్యూజిలాండ్ కోల్పోయింది. నిలకడగా రాణిస్తున్న కెప్టెన్ విలియమ్సన్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫ్లంకెట్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విలియమ్సన్ ఓపెనర్ నికోలస్‌తో కలిసి రెండో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.&amp;nbsp;  న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ గప్టిల్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాత్రి వర్షం కురవడంతో టాస్ షెడ్యూల్ సమయాని కంటే ఆలస్యంగా వేశారు. &amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dfrrb8fptpa3y19svkngc77z/engo-eb-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>మేం ఫైనల్‌కు వెళ్లడమే పెద్ద విషయం: మోర్గాన్ ఆసక్తికర వ్యాఖ్యలు</title>
            <link>https://telugu.asianetnews.com/cricket-world-cup-ground-story/england-captain-eoin-morgan-interesting-comments-on-world-cup-finals-pumi1u</link>
            <guid>https://telugu.asianetnews.com/cricket-world-cup-ground-story/england-captain-eoin-morgan-interesting-comments-on-world-cup-finals-pumi1u</guid>
            <pubDate>Sun, 14 Jul 2019 13:55:00 +0530</pubDate>
            <description>మరికొద్దిసేపట్లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచకప్ ఫైనల్ పోరు మొదలుకానుంది. బలాబలాలు, ఫామ్ దృష్ట్యా ఇంగ్లాండ్ జట్టుకే అవకాశాలున్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.  ఈ క్రమంలో ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరడమే అతిపెద్ద విజయంగా భావిస్తున్నామని... ఫలితం గురించి ఆలోచించి అనవసరంగా ఒత్తిడికి గురికాదలుచుకోలేదని స్పష్టం చేశాడు.  తాను ట్రోఫీ ఎత్తుకుంటాననే విషయాన్ని పట్టించుకోవడం లేదని.. అనవసరమైన విషయాలను పట్టించుకోకుంటే దాని ఫలితం మరోలా ఉంటుందని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం తాను చాలా ప్రశాంతంగా ఉన్నానని.. ఫైనల్స్‌లో ఆడటం కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నానన్నాడు.  తమ జట్టులోని ప్రతి ఆటగాడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండటం శుభపరిణామమని మోర్గాన్ తెలిపాడు. కాగా.. ఇప్పటి వరకు ఈ రెండు జట్లూ ప్రపంచకప్ గెలవకపోవడంతో ఈ రోజు ఎవరు గెలుపొందినా చరిత్ర సృష్టించనున్నారు. అయితే లీగ్ దశలో కీవీస్‌పై 119 పరుగుల తేడాతో విజయం ఇంగ్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.&amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dfqm5gsa7vrkfxpjq7z7n33y/2019-07-13-jpg_760x400.jpg"/>
        </item>
    </channel>
</rss>