<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss version="2.0" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description>Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.</description>
        <image>
            <url>https://static.asianetnews.com/images/logos/telugu.asianetnews.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Mon, 13 Jan 2020 10:38:00 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/weekend-special" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title>రంగంలోకి బీజేపీ, ఢిల్లీకి పవన్: వారంలో తేలనున్న అమరావతి భవితవ్యం?</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/weekend-pawan-kalyan-reaches-delhi-to-seek-centre-s-intervention-on-andhra-pradesh-capital-issue-q3zr17</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/weekend-pawan-kalyan-reaches-delhi-to-seek-centre-s-intervention-on-andhra-pradesh-capital-issue-q3zr17</guid>
            <pubDate>Sun, 12 Jan 2020 16:40:00 +0530</pubDate>
            <description>అమరావతి:అమరావతి చుట్టూ గత వారంలోనూ ఏపీ రాజకీయాలు కొనసాగాయి. అమరావతిలోని రాజధాని కొనసాగించాలని బీజేపీ తీర్మానించింది. ఈ విషయమై కేంద్రం జోక్యం చేసుకోవాలని బీజేపీ నేతలు కొందరు డిమాండ్ చేశారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శనివారం నాడు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు.జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీకి రావడం చర్చకు దారితీస్తోంది&amp;nbsp;  ఈ నెల 20వ తేదీ నుండి విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసేందుకు ఏర్పాట్లు చేసేందుకు సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది. ఈ మేరకు పలు ప్రభుత్వ శాఖలు తరలించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.  also read:కారణమిదే:కేబినెట్‌లో భారీ మార్పులకు కేసీఆర్ ప్లాన్?  ఇదే సమయంలో అమరావతిలోని రాజధాని కొనసాగించాలని అమరావతి పరిసర ప్రాంతాలకు చెందిన 29 గ్రామాల ప్రజలు తమ ఆందోళన ఉధృతం చేశారు. ఈ ఆందోళనలకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణలు కూడా తమ మద్దతు ప్రకటించారు.  also read:తెలంగాణ ఎన్నికల సంఘానికి హైకోర్టు షాక్: మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్  అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన బస్సు యాత్రలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అమరావతి ఆందోళన కోసం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు &amp;nbsp;బిక్షాటన చేశారు.  Also read:సీఎంగా కేటీఆర్: ప్లాన్ రెడీ,కేసీఆర్ భవిష్యత్తు ఆచరణ ఇదీ?  ఈనెల 11వ తేదీన బీజేపీ కోర్ కమిటీ సమావేశం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని &amp;nbsp;బీజేపీ తీర్మానించింది. &amp;nbsp;ఈ విషయంలో &amp;nbsp;పార్టీలో కొందరు నేతల మధ్య &amp;nbsp;భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని &amp;nbsp;కొందరు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.  Also read:వీక్లీ రౌండప్:దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం, కరీంనగర్ కలెక్టర్‌ బదిలీ  ఈ నెల 11వ తేదీన అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులతో చర్చిస్తామని మంత్రి కొడాలి నాని ప్రకటించారు. &amp;nbsp;అమరావతిలోని రాజధాని కొనసాగించాలని కృష్ణ గుంటూరు జిల్లాల్లో ఆందోళనలు తీవ్రమయ్యాయి.  ఈనెల 7వ తేదీన గుంటూరు జిల్లా చినకాకాని వద్ద మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి పై ఆందోళనకారులు దాడికి దిగారు. అదే రోజున మరో ఎమ్మెల్యే అనిల్ అనిల్ టిడిపి కార్యకర్తలు ఘోరావ్ చేశారు.టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు 24 గంటల పాటు దీక్ష చేశారు. ఈ దీక్షకు చంద్రబాబు, లోకేష్ సంఘీభావం ప్రకటించారు.&amp;nbsp;  Also read: వీక్లీ రౌండప్: మంత్రుల మెడకు మున్సిపల్ ఉచ్చు, కేటీఆర్‌కు సీఎం పదవి?  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శనివారం నాడు ఢిల్లీకి చేరుకొన్నారు. ఆదివారంనాడు పలువురు బీజేపీ ముఖ్య నేతలను కూడ కలుసుకొనేందుకు వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఎవరెవరిని కలిశారనే విషయమై గోప్యంగా ఉంచారు.&amp;nbsp;  సీఎం హోదాలో కోర్టుకు జగన్  ఈ నెల 10వ తేదీన సీఎం హోదాలో తొలిసారిగా నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని &amp;nbsp;సీఎం జగన్ సీబీఐ కోర్టును కోరారు. ఈ విషయమై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈనెల 17వ తేదీకి ఈ కేసును కోర్టు వాయిదా వేసింది.  మరోవైపు ఆస్తుల కేసులో &amp;nbsp;ప్రస్తు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఉమ్మడి రాష్ట్రంలో &amp;nbsp;మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావుకు సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసింది.  Also read:రాజధాని రాజకీయం: అమరావతి భవితపై ఆందోళన, ముంచుతారా తేల్చుతారా?  రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలు కొందరు తమ ప్రాంతాన్ని కేంద్ర ప్రాంత ప్రాంతంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు వైజాగ్ రాజధానిగా చేస్తే తమకు ఉపయోగమని ప్రశ్నిస్తున్నారు టిడిపి వాళ్ళు ఉన్నారు.  మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన మరునాడే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో జెసి దివాకర్ రెడ్డి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది .జేసీ దివాకర్ రెడ్డి పైకి టీడీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. జేసీ దివాకర్ రెడ్డి బీజేపీలో చేరుతాననే ప్రచారం కూడ సాగుతోంది. </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dx3djz4pcdybvtfsmygkj5mb/whatsapp-image-2019-12-27-at-3-36-44-pm-jpeg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>వీక్లీ క్రైమ్ రౌండప్: ప్రేమోన్మాది ఘాతుకం.. మోడల్‌పై రేప్ కేసులో ట్విస్టులు, మరిన్ని</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q3zmu1</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q3zmu1</guid>
            <pubDate>Sun, 12 Jan 2020 15:09:00 +0530</pubDate>
            <description>వరంగల్‌‌లో ప్రేమోన్మాది దాడితో ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మోడల్‌పై అత్యాచారం కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఇలాంటి నేరవార్తలు మీ కోసం  ప్రాణం తీసిన ప్రేమోన్మాదం  వరంగల్‌ అర్బన్ జిల్లా హన్మకొండలోని రాంనగర్‌లో షాహిద్ అనే యువకుడు.. లష్కర్‌సింగారానికి చెందిన ఎంబీఏ విద్యార్ధిని హారతిని గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. శుక్రవారం షాహిద్ ఇంటికి హారతి వెళ్లింది. వారిద్దరికి ఏదో విషయంలో గొడవ జరగగా.. మాటామాటా పెరిగి షాహిద్‌ యువతిని కత్తితో దారుణంగా హత్య చేసి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన హారతి రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.  Also Read:ప్రేయసి హత్య కేసులో కొత్త ట్విస్ట్: ముందు రేప్ చేసి, ఆ తర్వాత...  యువతిపై దాడి అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. యువతి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. హారతి కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు.&amp;nbsp;  మోడల్‌పై&amp;nbsp;అత్యాచారం, ట్విస్టుల మీద ట్విస్టులు  మోడలింగ్ రంగంలో స్థిరపడేందుకు హైదరాబాద్‌కు వచ్చిన యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేయగా.. ఈ తతంగాన్ని అతని మిత్రుడు సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. దీనిపై ఈ నెల 7వ తేదీన మోడల్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అయితే ఫిర్యాదును మార్చి రాయాలంటూ పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చాడని ఆమె వాపోయింది. ఈ వ్యవహారంలో యువకుడి తల్లీ రంగంలోకి దిగడంతో కొత్త మలుపు తిరిగింది. సదరు &amp;nbsp;యువతి తన కుమారుడిని ట్రాప్ చేసి తప్పుడు కేసు పెట్టి 20 లక్షలు డిమాండ్ చేస్తోందని తెలిపింది.  Also Read:ఆమె నా కొడుకుని ట్రాప్ చేసింది.. మోడల్ పై అత్యాచార ఘటనలో నిందితుడి తల్లి  ముందు తన కొడుకుతో పెళ్లికి సిద్ధపడిందని.. అయితే తన కుమారుడు మైనర్ కావడంతో వివాహం కుదరదని తాను తేల్చి చెప్పినట్లు యువకుని తల్లి తెలిపారు. డబ్బు కోసం ఆ యువతి తల్లిదండ్రులు కూడా దిగజారారని.. వాళ్లు కూడా రూ.10 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకోమన్నారని ఆమె పేర్కొంది.&amp;nbsp;  శృతి మించుతున్న మందుబాబుల ఆగడాలు  హైదరాబాద్‌లో మందుబాబుల ఆగడాలు శృతిమించుతున్నాయి. పీకలదాకా తాగి రోడ్డుపై వీరంగం ఆడుతున్నారు. శనివారం రాత్రి పబ్‌ను మూయించడానికి వచ్చిన పోలీసులతో గొడవకు దిగారు. అదే పబ్‌కు వచ్చిన ఓ యువతిని బైకులతో వెంటాడి, అసభ్యకరంగా &amp;nbsp;ప్రవర్తించారు. ఈ తాగుబోతులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిని కఠినంగా శిక్షించాలని ఆయా ప్రాంతాల్లో జనం కోరుతున్నారు.&amp;nbsp;  మున్సిపల్ బరిలో ప్రణయ్ హత్య కేసు నిందితుడు  తెలుగునాట సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడు ఎంఏ కరీం తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచాడు. ప్రణయ్ హత్య కేసులో ఇతను ఏ-5గా ఆరోపణలు ఎదుర్కొన్నాడు.  Also Read:ప్రణయ్ హత్య, ఆ తర్వాతి పరిణామాల పూర్తి సమాచారం  మిర్యాలగూడలోని 20, 21 వార్డుల నుంచి కరీం ఇండిపెండెంట్ అభ్యర్థిగటా బరిలోకి నిలిచాడు. ప్రణయ్‌ని హత్య చేయించేందుకు గాను మారుతీ రావు ఓ ముఠాకు సుపారీ ఇచ్చాడు. ఈ పథకంలో కరీం పాలు పంచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.&amp;nbsp;  కుక్కపిల్లతో ఎర, యువతిపై అత్యాచారం, హత్య  మతిస్థిమితం లేని యువతికి కుక్క పిల్ల ఇస్తామని మాయమాటలు చెప్పి.. అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.&amp;nbsp;గూడురుకు చెందిన మతిస్థిమితం లేని యువతి ఈ నెల 5 రాత్రి ఏదో పనిపై బయటకు వచ్చింది. అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించి ఉన్న ఆమెను గమనించిన శివకుమార్, వెంకటేశ్, శరత్, లక్ష్యయ్య గుర్తించారు. కుక్క పిల్ల ఇస్తామంటూ మాయమాటలు చెప్పి.. ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు.  Also Read:కుక్క పిల్ల ఇస్తామని చెప్పి.. యువతిపై లైంగిక దాడి, హత్య  యువతి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఆ ప్రాంతమంతా వెతికారు. ఆ తర్వాతి రోజు యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహంపై సర్జికల్ బ్లేడ్‌తో కోసిన గాయాలు ఉండటంతో .. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేసి నిందితులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.&amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dychr1s0n56qcsee4p9kgn37/murder-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>వీక్లీ క్రైమ్ రౌండప్: యాప్‌తో బీటెక్ స్టూడెంట్ సెక్స్ దందా.. వైద్యుల మిస్సింగ్, మరిన్ని</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q3msf3</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q3msf3</guid>
            <pubDate>Sun, 05 Jan 2020 16:41:00 +0530</pubDate>
            <description>ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వైద్యులు ఢిల్లీలో ఆదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. గుంటూరులో వివాహితలు, కాలేజీ అమ్మాయిలతో బీటెక్ విద్యార్ధులు నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ గుట్టును పోలీసులు రట్టు చేయడం ఈ వారం సంచలనం కలిగించింది. మరిన్ని నేర వార్తలు మీకోసం.  వైద్యుడితో కలిసి అదృశ్యమైన వైద్యురాలు:  కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన డాక్టర్ హిమబిందు, అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన దిలీప్ సత్య గత నెల 25న అదృశ్యం కావడం సంచలనం కలిగిచింది. వీరిద్దరి ఫోన్లు కావడం, తర్వాత ఆచూకి లేకపోవడంతో హిమబిందు భర్త డాక్టర్ శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  Also Read:ఢిల్లీలో కర్నూల్‌కు చెందిన ఇద్దరు డాక్టర్ల మిస్సింగ్  రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే సాంకేతిక సాయంతో హిమబిందు, దిలీప్‌లు సిక్కింలో ఉన్నట్లు గుర్తించి డాక్టర్ శ్రీధర్‌కు సమాచారం అందించారు. అయితే వీరిద్దరూ సిక్కిం వెళ్లడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.&amp;nbsp;  యాప్ సాయంతో సెక్స్ దందాను నడిపిస్తున్న బీటెక్ స్టూడెంట్:  గుంటూరు నందివెలుగు రోడ్డులో గత కొన్నేళ్లుగా సాగుతున్న హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నిడిగొండ వీరబ్రహ్మం అనే బీటెక్ విద్యార్ధి యాప్ తయారు చేసి వివాహితలు, కాలేజీ విద్యార్థినిల ఫోటోలు అందులో అప్‌లోడ్ చేసి సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్నాడు.  Also Read:బిటెక్ స్టూడెంట్ కీ రోల్... గుంటూరులో హైటెక్ వ్యభిచారం  ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్న పెళ్లయిన మహిళలు, కాలేజ్ అమ్మాయిలకు డబ్బు ఆశ చూపి అతను వ్యభిచార కూపంలోకి దించాడు. ఈ క్రమంలో వీరబ్రహ్మం అద్దెకు ఉంటున్న ఇంటికి తరచుగా అమ్మాయిలు, అబ్బాయిలు వస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది.&amp;nbsp;  అత్తతో వివాహేతర సంబంధం, ఆత్మహత్య:  అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. త్రిపురాంతకం మండలం ముడివేముల గ్రామానికి చెందిన అరిపిరాల రవిశంకర శర్మ అనే వ్యక్తికి చదువుకునే రోజుల్లో మారుతి దేవి అనే వివాహితతో అక్రమ సంబంధం ఏర్పడింది.  దీనిని గమనించిన అతని తల్లిదండ్రులు రవికి డోర్నాలకు చెందిన ఓ యువతితో వివాహం చేశారు. అయితే తమ బంధానికి అడ్డొస్తుందనే సాకుతో మారుతి దేవి.. సదరు యువతితో రవికి విడాకులు ఇప్పించింది. అక్కడితో ఆగకుండా తన కూతురితోనే రవికి పెళ్లి జరిపించింది.  Also Read:అత్తతో వివాహేతర సంబంధం.. చివరకు అల్లుడు ఆత్మహత్య  ఇలా కొంతకాలం గడిచిన తర్వాత మారుతిదేవి అల్లుడిని వదిలేసి సముద్రాల రామాచారి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని హైదరాబాద్‌కు మకాం మార్చింది. అత్త దూరం కావడంతో రవిశంకర్ శర్మ భార్యాపిల్లలను పట్టించుకోవడం లేదు.  తన తల్లితో భర్తకు ఉన్న సంబంధం గురించి రవి భార్యకు తెలియడంతో ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన రవి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.&amp;nbsp;  వివాహేతర సంబంధం పెట్టుకుని: అత్తను చంపిన మేనల్లుడు  అత్తతో ఆమె మేనల్లుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమె పెళ్లి చేసుకోవాలని అడుగుతుండటంతో అత్తను మేనల్లుడే దారుణంగా హత్య చేశాడు. ఏలూరుకు చెందిన నాగమణికి శివాజీ అనే వ్యక్తితో వివాహం జరిగింది.  అయితే అతనికి మతిస్థిమితం లేకపోవడంతో వరుసకు మేనల్లుడయ్యే సంతోష్ కుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో భర్తను వదిలేసి సంతోష్‌ను పెళ్లి చేసుకోవాలని భావించింది.  Also Read:మేనల్లుడితో వివాహేతర సంబంధం... పెళ్లి చేసుకోమని అడగడంతో...  ఇదే విషయాన్ని సంతోష్‌కు చెప్పింది. ఆమెను వదిలించుకోవాలని చూసిన సంతోష్ హత్యకు పథకం పన్నాడు. దొండపాడు సమీపంలోని పంట బోదె వద్దకు తీసుకెళ్లి మేనత్త తలను నీటిలో ముంచి చంపేశాడు.   </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dxtp3g64v5mmcdn5750pg1zq/sex-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>వీక్లీ రౌండప్: మంత్రుల మెడకు మున్సిపల్ ఉచ్చు, కేటీఆర్‌కు సీఎం పదవి?</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/weekly-roundup-kcr-warms-up-trs-machinery-to-post-big-victory-in-municipal-polls-q3me2n</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/weekly-roundup-kcr-warms-up-trs-machinery-to-post-big-victory-in-municipal-polls-q3me2n</guid>
            <pubDate>Sun, 05 Jan 2020 11:31:00 +0530</pubDate>
            <description> హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలైతే మంత్రి పదవులను కోల్పోతారని సీఎం కేసీఆర్ మంత్రులను హెచ్చరించారు.  కాంగ్రెస్, బీజేపీలు కూడ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. కేటీఆర్ భావి సీఎం అంటూ టీఆర్ఎస్‌ నేతలు చర్చించడం మరోసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడేక్కించింది. టీఆర్ఎస్‌ లో చోటు చేసుకొంటున్న పరిణామాలను రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.&amp;nbsp;  మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది ఇందులో భాగంగానే గత ఏడాది చివర్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేటీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు.  ఈ నెల 4వ తేదీన తెలంగాణ భవన్‌లో మున్సిపల్ ఎన్నికలపై ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో &amp;nbsp;కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.&amp;nbsp;  మున్సిపల్ ఎన్నికల్లో &amp;nbsp;ఓటమి పాలైతే ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు తమ మంత్రి పదవులను కోల్పోతారని కేసీఆర్ హెచ్చరించారు.పార్టీ నేతల మధ్య, &amp;nbsp;పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల మధ్య &amp;nbsp;సమన్వయంతో పనిచేయాలని కేసీఆర్ సూచించారు.  టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు మేడ్చల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి మంత్రి మల్లారెడ్డి మధ్య నెలకొన్న సమన్వయలోపం గురించి చర్చించారు. సమావేశం నుండి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో సీఎం కేసీఆర్ మాట్లాడారు.  మున్సిపల్ ఎన్నికలను టిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ బిజెపిలు కూడా మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకొన్నాయి.. రిజర్వేషన్లు ప్రకటించకుండానే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.&amp;nbsp;  బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చూపాలని చూస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన సత్తాను చూపాలని భావిస్తుంది.ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో &amp;nbsp;మున్సిపల్ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను గెలుచుకోవాలని &amp;nbsp;కమలదళంభావిస్తోంది.  గత ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో &amp;nbsp;బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకొంది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ ఆ మేరకు స్థానిక సంస్థల్లో స్థానాలను కైవసం చేసుకోలేదు కానీ మున్పిపల్ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను కైవసం చేసుకోవాలని &amp;nbsp;ఆ పార్టీ భావిస్తోంది.   భావి సీఎం కేటీఆర్  తెలంగాణ రాష్ట్రానికి భావి సీఎం కేటీఆర్ అవుతారని ఆ పార్టీ నేతలు ఇటీవల కాలంలో ప్రకటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ భావి సీఎం కేటీఆర్ అంటూ చర్చకు తెరతీశారు. ఈ వ్యాఖ్యలకు మద్దతినిచ్చే రీతిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కవితలు మాట్లాడారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అవుతారని ప్రకటించారు.  గత ఏడాది చివర్లో మంత్రివర్గ విస్తరణకు ముందు కూడ కేటీఆర్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే చర్చ పార్టీ వర్గాల నుండి వచ్చింది. హైద్రాబాద్ ప్రాంతానికి చెందిన &amp;nbsp;పార్టీ సమావేశాల్లో పెద్ద ఎత్తున కేటీఆర్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే డిమాండ్ వచ్చింది.  also read:weekly roundup:తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఆయనే, మున్సిపోల్స్‌పై దృష్టి  ఆ తర్వాత కేటీఆర్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించారు కేసీఆర్. &amp;nbsp;ప్రస్తుతం కేటీఆర్ &amp;nbsp;భావి సీఎం అంటూ చేస్తున్న ప్రకటనలు &amp;nbsp;కూడ వ్యూహత్మకంగా సాగుతున్న ప్రచారంగా కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.&amp;nbsp;  అయితే ఈ ప్రచారాన్ని మంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు.వచ్చే పది నుండి 15 ఏళ్ల పాటు &amp;nbsp;కేసీఆర్ సీఎంగా ఉంటారని కేటీఆర్ చెప్పారు. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. తాను సీఎం అనే విషయమై కేటీఆర్ కొట్టిపారేశారు.&amp;nbsp;  ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా &amp;nbsp;కేటీఆర్ కొనసాగుతున్నారు. కేటీఆర్ ను సీఎం చేస్తే హరీష్ రావు ఏం చేస్తారనే చర్చ కూడ లేకపోలేదు. అయితే సీఎం పదవిని కేటీఆర్ కు కేటాయిస్తే కేటీఆర్ మంత్రివర్గంలో పనిచేస్తానని హరీష్ రావు గతంలో ప్రకటించారు.&amp;nbsp;   మరోసారి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు  ఈ ఏడాది జనవరి 1వ తేదీన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నమ్మకద్రోహం చేసిన వారు ఎప్పటికీ బాగుపడరని &amp;nbsp;ఆయన వ్యాఖ్యానించారు.&amp;nbsp;  Also read:వీక్లీ రౌండప్:దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం, కరీంనగర్ కలెక్టర్‌ బదిలీ  తాను నమ్మినవారే తనను మోసం చేసేందుకు ప్రయత్నించారన్నారు. ప్రజలు ఏనాడు కూడ ధర్మం తప్పరని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ప్రజలు ధర్మం తప్పితే తాను ఓటమి పాలయ్యేవాడినని ఈటల రాజేందర్ చెప్పారు. గత ఏడాదిలో కూడ మంత్రి ఈటల రాజేందర్ కూడ ఇదే రకమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీకి తాము ఓనర్లమన్నారు.  మంత్రి పదవి నుండి ఈటల రాజేందర్‌ను తొలగిస్తారనే ప్రచారం సాగిన సమయంలో మంత్రి ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో టీఆర్ఎస్‌లో సంచలనం కల్గించాయి. &amp;nbsp;  Also read:రాజధాని రాజకీయం: అమరావతి భవితపై ఆందోళన, ముంచుతారా తేల్చుతారా?  మంత్రి ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కూడ మద్దతుగా మాట్లాడారు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి గంగుల కమలాకర్, కేటీఆర్‌లకు కేసీఆర్ అవకాశం కల్పించారు. &amp;nbsp;ఈ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతల మధ్య సమన్వయం లేదనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dkraqx360rf1kxydc0bmyfnj/kcr-ktr1545962910-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>రాజధాని రాజకీయం: అమరావతి భవితపై ఆందోళన, ముంచుతారా తేల్చుతారా?</title>
            <link>https://telugu.asianetnews.com/gallery/weekend-special/weekly-roundup-bcg-committee-submits-report-to-cm-jagan-chandrababu-comments-against-to-report-q3m3ut</link>
            <guid>https://telugu.asianetnews.com/gallery/weekend-special/weekly-roundup-bcg-committee-submits-report-to-cm-jagan-chandrababu-comments-against-to-report-q3m3ut</guid>
            <pubDate>Sun, 05 Jan 2020 07:50:00 +0530</pubDate>
            <description>ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. అమరావతి వాసుల ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. అమరావతి నుండి రాజధానిని మార్చే అవకాశం ఉందనే ఆందోళ ఈ ప్రాంత రైతుల్లో నెలకొంది.&amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dxdxvbppr5ag79p0rahgpgat/jagan2-jpeg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>వీక్లీ క్రైమ్ రౌండప్: హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డి విచారణ.. సీరియల్ కిల్లర్ అరెస్ట్, మరిన్ని</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q39s1w</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q39s1w</guid>
            <pubDate>Sun, 29 Dec 2019 16:04:00 +0530</pubDate>
            <description>తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని 16 మందిని చంపి అనంతరం నగదు, నగలు దోచుకుంటున్న సీరియల్ కిల్లర్‌ను మహబూబ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి నేరవార్తలు మీకోసం.  నాపై తప్పుడు కేసులు పెట్టారు: హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డి  హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారణను కొనసాగిస్తోంది. గురువారం అతనిని నల్గొండలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు, ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలను సమర్పించారు.  Also Read:నాపై తప్పుడు కేసు పెట్టారు: హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డి  కాగా ఈ ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులు కావాలనే తనపై తప్పుడు కేసులు పెట్టారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. గ్రామంలోని కొందరితో తమ కుటుంబానికి భూతగాదాలు ఉన్నాయని.. వీటి వల్లే వారు తనపై ఫిర్యాదు చేశారని అతను అంటున్నాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి.. కేసు విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేశారు.  16 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్ అరెస్ట్:  ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని ఒంటిపై ఉన్న బంగారం, నగల కోసం 16 మందిని దారుణంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్‌ను మహబూబ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవాబుపేట మండలం కూచురు గ్రామానికి చెందిన ఆలివేలమ్మ అనే 53 ఏళ్ల మహిళ శవాన్ని ఈ నెల 17న పోలీసులు గుర్తించారు.  Also Read:సీరియల్ కిల్లర్: మత్తులోకి దించి 16 మంది మహిళలను చంపాడు  అయితే ఆమె హత్యకు గురైనట్లు క్లూస్ టీమ్ పోలీసులకు చెప్పడంతో ఇందులో ఎరుకల శ్రీను అనే వ్యక్తి హస్తముందని అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా తాను నేరాన్ని చేసినట్లు శ్రీను అంగీకరించాడు. ఇతను 2018 నుంచి షాద్‌నగర్, శంషాబాద్, మిడ్జిల్, భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట పరిధిలో మొత్తం 17 మంది మహిళలను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.  వివాహేతర సంబంధం: భర్తను చంపిన భార్య, జీవితఖైదు:  ప్రియుడిపై మోజుతో ఓ మహిళ భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేయడంతో న్యాయస్థానం వివాహితకు, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు విధించింది. రసూల్‌పురాకు చెందిన కుమార్, పద్మా భార్యభర్తలు ఈ క్రమంలో లక్ష్మణ్ అనే వ్యక్తితో పద్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది.  Also Read:ప్రియుడిపై మోజు... భర్త దారుణ హత్య.. కోర్టు జీవిత ఖైదు  దీని గురించి తెలుసుకున్న కుమార్.. లక్ష్మణ్‌ను హెచ్చరించాడు. దీనిపై కక్ష పెంచుకున్న పద్మ, లక్ష్మణ్‌లు 2013 సెప్టెంబర్ 22న కుమార్‌కు ఉరివేసి హత్య చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం ఆరో మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి.. నిందితులిద్దరికి జీవితఖైదుతో పాటు చెరో 5 వేల జరిమానా విధించింది.&amp;nbsp;  బావమరిదిని చంపిన బావ:  కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బాగిర్తిపల్లికి చెందిన పాపన్నగారి శేఖర్ &amp;nbsp;మృతదేహాం మెదక్ జిల్లా రామాయంపేట శివారులోని బావిలో దొరికింది. శేఖర్ ను అతడి బావ పోతుల శేఖర్ ఆయన స్నేహితుడు బిక్షపతి గురువారం నాడు హత్య చేశారు. మృతదేహాన్ని మెదక్ జిల్లా రామయంపేట శివారులోని బావిలో వేశాడు.  మృతదేహం విషయం వెలుగు చూడడంతో &amp;nbsp;నిందితుడు పోతుల శేఖర్ పోలీసులకు లొంగిపోయాడు. &amp;nbsp;ఈ విషయం తెలిసిన పాపన్నగారి శేఖర్ కుటుంబసభ్యులు, గ్రామస్తులు శనివారం ఉదయం &amp;nbsp;పోతుల శేఖర్ రెండు ఇళ్లను ధ్వంసం చేశారు. అంతేకాదుశేఖర్ కు సహకరించిన భిక్షపతి ఇంటిపై కూడ మృతుడి గ్రామస్తులు దాడి చేశారు.  Also Read:బావమరిదిని చంపిన బావ, నిందితుల ఇళ్లు ధ్వంసం, ఉద్రిక్తత  ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భఆరీ బందోబస్తు ఏర్పాటు చేశారు.&amp;nbsp;  నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై గ్రామస్తులు బైఠాయించడం వల్ల &amp;nbsp;ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు మృతుడి కుటుంబసభ్యులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.&amp;nbsp; &amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dx8kvymmc9j4p2dbrjc0r38n/crime-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>weekly roundup:తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఆయనే, మున్సిపోల్స్‌పై దృష్టి</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/weekly-roundup-this-week-important-incidents-in-telangana-state-q399wt</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/weekly-roundup-this-week-important-incidents-in-telangana-state-q399wt</guid>
            <pubDate>Sun, 29 Dec 2019 09:32:00 +0530</pubDate>
            <description> హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రిజర్వేషన్లు ప్రకటించకుండానే షెడ్యూల్ విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘంపై మండిపడుతోంది.&amp;nbsp;  Also read:కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం: మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలనం  మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకొనేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి.దిశ నిందితుల మృతదేహాలకు ఎట్టకేలకు అంత్యక్రియలు జరిగాయి. తెలంగాణకు కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. గత వారంలో తెలంగాణలో ప్రధానంగా చోటుచేసుకొన్న ఘటనలివి.  తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. జనవరి 7వ తేదీన నోటీఫికేషన్ విడుదల కానుంది.&amp;nbsp;  అయితే మున్సిపాలిటీలకు రిజర్వేషన్లను ప్రకటించకుండానే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై ఎలా నిర్ణయిస్తారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.  రిజర్వేషన్లను ప్రకటించకుండానే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంపై కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది.కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటమిపై భయంతోనే కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్తామని ప్రకటించిందని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు.  అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించేందుకు రిజర్వేషన్లు ప్రకటించకుండానే ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోంది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తమ అభిప్రాయాలను పంచుకొన్నారు.  మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం ఈ నెల 27వ తేదీన సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కోర్ కమిటీ సభ్యులు కాకుండా ఇతరులను కూడ ఆహ్వానించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  కోర్ కమిటీ సమావేశాన్ని బహిష్కరించారు. ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వి.హనుమంతరావును సమావేశానికి రావాలని ఆహ్వానించారు. కానీ, హనుమంతరావు మాత్రం సమావేశం నుండి బయటకు వచ్చారు.కోర్ కమిటీ సమావేశంలో కూడ కోర్ కమిటీ సభ్యులపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు.  మున్సిపల్ ఎన్నికలపై టీఆర్ఎస్ పై తాను చేసిన విమర్శలపై అధికార పార్టీ చేసిన ప్రతిదాడిపై పార్టీ నేతలు ఎవరూ కూడ స్పందించకపోవడంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ చేసిన విమర్శలపై ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నలు గుప్పించారు.  సీఏఏ, ఎన్ఆర్‌సీ అంశాలు మున్సిపల్ ఎన్నికల్లో &amp;nbsp;తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు సీఏఏకు వ్యతిరేకంగా ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆర్ఎస్ఎస్, ఎంఐఎం సభలకు ఎందుకు అనుమతి ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నించారు.  మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై &amp;nbsp;టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించారు. మెజారిటీ మున్సిపాలిటీ స్థానాలను కైవసం చేసుకొంటామని కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.  ఇదిలా ఉంటే తెలంగాణకు కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ క్రియాశీలకంగా వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ తరహాలోనే కేటీఆర్ కూడ వ్యవహరిస్తారని శ్రీనివాస్ గౌడ్ ప్రస్తావించారు. ఇప్పటికే కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు.&amp;nbsp;   ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ శుభవార్త  సమ్మె తర్వాత ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని తెలంగాణ సీఎం కేసీఆర్ నెరవేర్చారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ విరమణ వయస్సును 58 ఏళ్ల నుండి 60 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. &amp;nbsp;  సమ్మె తర్వాత ఆర్టీసీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు హామీ ఇచ్చారు.ఈ హామీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.&amp;nbsp;  మరోవైపు ఆర్టీసీ కార్మికులకు విధులు మారే సమయంలో సౌకర్యాలను అమలు చేసింది.ఈ మేరకు సంచార టాయిలెట్లను కూడ ఆర్టీసీ కార్మికులకు ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. మరో వైపు ఆర్టీసీని ఏపీ రాష్ట్రంలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఆర్టీసీ కార్మికుల పట్ల యాజమాన్యం వేధింపులకు గురి చేస్తోందని టీఎంయూ నేత ఆశ్వత్థామరెడ్డి విమర్శలు గుప్పించారు.   ఎట్టకేలకు దిశ నిందితుల అంత్యక్రియలు  దిశ నిందితుల అంత్యక్రియలు ఈ నెల 23వ తేదీన స్వగ్రామాల్లో జరిగాయి. ఈ నెల 23వ తేదీన దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించింది.హైకోర్టు &amp;nbsp;ఆదేశాల మేరకు ఈ నెల 23వ తేదీన ఎయిమ్స్ వైద్యులు రీపోస్టుమార్టం నిర్వహించారు.  రీ పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక హైకోర్టుకు చేరింది.దిశ నిందితులకు రీ పోస్టుమార్టం పూర్తైన తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు గాంధీ వైద్యులు. కుటుంబసభ్యులు అదే రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నెల 26వ తేదీ రాత్రి నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి కుర్మయ్యకు గాయాలయ్యాయి. నిమ్స్ ఆసుపత్రిలో కుర్మయ్యకు శస్త్రచికిత్స నిర్వహించారు. </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dkraqx360rf1kxydc0bmyfnj/kcr-ktr1545962910-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>వీక్లీ రౌండప్:దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం, కరీంనగర్ కలెక్టర్‌ బదిలీ</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/aiims-forms-team-for-second-autopsy-of-4-accused-in-hyderabad-karimnagar-collector-transferred-q2wt1k</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/aiims-forms-team-for-second-autopsy-of-4-accused-in-hyderabad-karimnagar-collector-transferred-q2wt1k</guid>
            <pubDate>Sun, 22 Dec 2019 15:57:00 +0530</pubDate>
            <description>హైదరాబాద్:దిశ నిందితుల మృతదేహాలు ఈ నెల 23వ తేదీన ఆయా కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఈ నెల 21వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.&amp;nbsp;  Also read:దిశ కేసు నిందితుల మృతదేహాలపై హైకోర్టు కీలక ఆదేశాలు  ఈ మృతదేహాలకు రీ పోస్టుమార్టం కూడ నిర్వహించాలని కూడ ఆదేశించింది.కరీంనగర్ కల్లెక్టర్ సర్ఫరాజ్ అహ్మాద్‌పై తెలంగాణ సర్కార్ బదిలీ వేటు వేసింది. గద్వాల కలెక్టర్‌ శశాంకను కరీంనగర్ కలెక్టర్‌ గా బాధ్యతలను అప్పగించింది.  Also read:దిశ నిందితుల మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయాయి: హైకోర్టుకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్  సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టులో సామాజిక కార్యకర్త సజయ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు రెండు రోజుల పాటు విచారించింది. కీలక ఆదేశాలు &amp;nbsp;జారీ చేసింది.  Also read:దిశ నిందితులు: చెన్నకేశవులు భార్య కూడ మైనరే  తెలంగాణ హైకోర్టులో &amp;nbsp;సజయ పిటిషన్‌పై ఈ నెల 20, 21 తేదీల్లో విచారణ సాగింది. దిశ నిందితుల మృతదేహాల సంరక్షణ, కుటుంబసభ్యులకు అప్పగించడంపై విచారణ చేశారు. ఇప్పటికే మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయినట్టుగా తెలంగాణ హైకోర్టుకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శ్రవణ్ చెప్పారు.  Also Read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: మృతదేహాల అప్పగింతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు  దేశంలోని ఇతర ఆసుపత్రుల్లో మృతదేహాలను నెలల తరబడి పాడు కాకుండా కాపాడే సౌకర్యాలు ఉన్న విషయాలు తెలియవని హైకోర్టుకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శ్రవణ్ హైకోర్టుకు తెలిపారు.  also read:Weekly roundup:దిశ నిందితుల మృతదేహాలు గాంధీలోనే, మరో పోరాటానికి పసుపు రైతులు  దీంతో దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని &amp;nbsp;హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. &amp;nbsp;ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో &amp;nbsp;రీ పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.దిశ నిందితుల రీ పోస్టుమార్టం కార్యక్రమాన్ని వీడియో తీయాలని ఆదేశించింది.&amp;nbsp;  అంతేకాదు నివేదికను హైకోర్టు రిజిష్ట్రార్‌కు &amp;nbsp;అందజేయాలని కోరింది.ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపుగా రీ పోస్టు మార్టం పూర్తి చేసిన తర్వాత బంధువులకు మృతదేహాలను అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది.  దిశ కేసులో నిందితులుగా ఉన్న ఆరిఫ్, చెన్నకేశవులుకు కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడ జరిగిన కొన్ని ఘటనలతో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.&amp;nbsp;  ఈ మేరకు ఈ నిందితుల డీఎన్ఏ రిపోర్టుతో ఈ మూడు రాష్ట్రాల్లో పోలీసుల బృందం విచారణ జరుపుతోంది. హైవేల పక్కన జరిగిన హత్యలకు సంబంధించిన కేసుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఈ నెల 27వ తేదీన ఛార్జీషీట్ దాఖలు చేయనున్నారు. షాద్‌నగర్ కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.&amp;nbsp;   కరీంనగర్ కలెక్టర్ బదిలీ  ప్రస్తుత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌తో కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడిన పోన్ సంభాషణ లీక్ కావడంతో రాజకీయంగా చర్చ సాగింది.ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషీ విచారణ జరిపారు. కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మాద్ ను బదిలీ చేశారు. గద్వాల కలెక్టర్ శశాంకను కరీంనగర్ కు బదిలీ చేశారు.  ఈ ఫోన్ సంభాషణను టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకొంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ టీఆర్ఎస్ కు చెందిన ప్రజాప్రతినిధులతో &amp;nbsp;మంచి సంబంధాలు లేవనే &amp;nbsp;ఆ పార్టీ వర్గాల్లో అభిప్రాయాలు ఉన్నాయి.  సర్ఫరాజ్ అహ్మద్‌ &amp;nbsp;అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ సమయంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్‌తో ఫోన్ లో మాట్లాడారు.ఈ ఫోన్ సంభాషణను ఎడిట్ చేసి లీక్ చేశారని కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.&amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dwpjsdf4byzcbrx5hwqt9qgx/high-court-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>క్రైమ్ రౌండప్: కుల్‌దీప్‌ సెంగార్‌కు జీవిత ఖైదు.. జైపూర్ నిందితులకు ఉరిశిక్ష, మరిన్ని</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q2wrt8</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q2wrt8</guid>
            <pubDate>Sun, 22 Dec 2019 15:30:00 +0530</pubDate>
            <description>దేశంలో సంచలనం సృష్టించిన రెండు కేసులపై న్యాయస్ధానాలు ఈ వారం కీలక తీర్పులు వెలువరించాయి. ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ మాజీ నేత కుల్‌దీప్‌ సెంగార్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే 2008లో జైపూర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లుకు సంబంధించి నలుగురికి ఉరిశిక్ష విధించింది. వీటిలో పాటు మరిన్ని నేరవార్తలు మీకోసం.  ఉన్నావ్ కేసు: కుల్‌దీప్ సెంగార్‌కు జీవితఖైదు  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటనలో యూపీ బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీలోని తీస్‌హజారీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. బాధ్యతగల ప్రజా ప్రతినిధిగా ఉండాల్సిన సెంగార్‌.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని కోర్టు అభిప్రాయపడింది.  Also Read:ఉన్నావ్ రేప్‌ కేసు:బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు  అత్యాచార బాధితురాలిని భయపెట్టే విధంగా సెంగార్ వ్యవహరించారని.. ఇందుకు గాను ఆయన జీవితాంతం జూలు శిక్షను అనుభవించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. నెలరోజుల్లోగా బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని సెంగార్‌ను ఆదేశించింది.  దీనితో పాటు బాధితురాలి కుటుంబానికి భద్రత కల్పించాలని.. ఆమె మరికొన్ని రోజులు ఢిల్లీలో ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.&amp;nbsp;  2008 జైపూర్ బాంబు పేలుళ్లు: నలుగురికి ఉరిశిక్ష  2008లో జరిగిన జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురు దోషులకు రాజస్థాన్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించగా.. ఒకరిని దోషిగా తేల్చింది. 2008 మే నెలలో జైపూర్ పాత నగరంలోని హనుమాన్ ఆలయ సమీపంలో నిమిషాల వ్యవధిలో 9 వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.  Also read:2008 జైపూర్ పేలుళ్ల కేసు: నలుగురికి మరణశిక్ష విధించిన ప్రత్యేక కోర్టు  ఈ ఘటనలో 80 మంది మరణించగా, 170 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మరో నాలుగు బాంబులను కనుగొని నిర్వీర్యం చేశారు. ఈ ప్రాంతంలోని హనుమాన్ భక్తులు, విదేశీ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.  ఈ ఘటన వెనుక బంగ్లాదేశ్‌కు చెందిన హర్కతుల్ జిహాదీ ఇస్లామీ(హుజి) అనే ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. మొహమ్మద్‌ షాబాజ్‌ హుస్సేన్‌, మొహమ్మద్‌ సైఫ్‌ అకా కారియోన్‌, మొహమ్మద్‌ సర్వార్‌ అజ్మి, మొహమ్మద్‌ సైఫ్‌ అలియాస్‌ సైఫుర్‌ రహమాన్‌ అన్సారీ, మొహమ్మద్‌ సల్మాన్‌లను నిందితులుగా అదుపులోకి తీసుకున్నారు.  దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం  దిశ నిందితుల మృతదేహాల భద్రత, మృతదేహాల అప్పగింతపై సామాజిక కార్యకర్త సజయ దాఖలు చేసిన పిటిషన్ పై &amp;nbsp;తెలంగాణ హైకోర్టు శనివారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని సూచించింది.&amp;nbsp;  Also Read:దిశ నిందితుల మృతదేహాల రీ పోస్టుమార్టం కోసం ఎయిమ్స్ డాక్టర్లు  ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపుగా రీ పోస్టుమార్టం పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల మృతదేహాలు ఇప్పటికే 50 శాతం కుళ్లిపోయినట్టుగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శనివారం నాడు హైకోర్టుకు వివరించారు. దీంతో రీ పోస్టుమార్టం నిర్వహించి రిపోర్టులను భద్రపర్చాలని హైకోర్టు ఆదేశించింది.  తెలంగాణకు చెందిన నిపుణులైన వైద్య బృందం నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన విషయాన్ని కూడ అడ్వకేట్ జనరల్ దృష్టికి తెచ్చినా కూడ హైకోర్టు అంగీకరించలేదు. రీ పోస్టుమార్టం చేయాలని ఆదేశించింది. రీపోస్టుమార్టం ప్రక్రియను మొత్తం షూట్ చేసి సీడీలను హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్‌కు అప్పగించాలని సూచించింది.  నాగర్‌కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో శిశువు తల కోసిన వైద్యుడు  నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో డెలీవరీ సమయంలో వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు తలను కోసిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ ప్రజారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనితో పాటు సదరు వైద్యులపై మెడికల్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు.&amp;nbsp;  డెలీవరి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడు శిశువు తల కోసేయడంతో.. బిడ్డ మొండెం తల్లిగర్భంలోనే ఉండిపోయింది. ఈ ఘటనపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నివేదిక ఆధారంగా ఆధారంగా కుటుంబసభ్యుల నుంచి నిపుణుల బృందం వివరాలు సేకరించింది.  Also Read:అచ్చంపేట శిశువు మరణంపై సర్కార్ సీరియస్: ఇద్దరు వైద్యుల సస్పెన్షన్  దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ తారాసింగ్ మాట్లాడుతూ.. సదరు గర్భిణీ కుటుంబసభ్యులు మృత శిశువుతోనే ఆసుపత్రికి వచ్చారని చెబుతున్నారు. కుళ్లిన దశ ఉండటంతో డెలివరీ చేసే సమయంలో తల ఊడి వచ్చిందని ఆయన తెలిపారు.  తల్లిని బతికించేందుకు హుటాహుటిన హైదరాబాద్‌ తీసుకెళ్లామని శిశువు తలను పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. శుక్రవారం డాక్టర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధితురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేశారు     </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dwpgsdt75k7cjeck696nq221/disha-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>Weekly roundup:దిశ నిందితుల మృతదేహాలు గాంధీలోనే, మరో పోరాటానికి పసుపు రైతులు</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/weeklya-roundup-disha-accused-dead-bodies-in-gandhi-hospital-farmers-plans-to-protest-for-turmeric-board-q2jwb3</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/weeklya-roundup-disha-accused-dead-bodies-in-gandhi-hospital-farmers-plans-to-protest-for-turmeric-board-q2jwb3</guid>
            <pubDate>Sun, 15 Dec 2019 16:39:00 +0530</pubDate>
            <description>హైదరాబాద్: దిశ నిందితుల మృతదేహాలను సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు గాంధీ ఆసుపత్రిలోనే భద్రపర్చాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన తమ వారిని కడసారి చూసుకొనేందుకు అవకాశం కల్పించాలని మృతుల కుటుంబసభ్యులు కోరుతున్నారు.&amp;nbsp;  Also read:సమత గ్యాంగ్ రేప్, హత్య: 44 మంది సాక్షుల విచారణ, ఛార్జీషీట్ ఇదీ...  ఇదిలా ఉంటే పసుపు బోర్డు కంటే మించి &amp;nbsp;ప్రయోజనం కలిగేలా కేంద్రం నుండి జనవరిలో ప్రకటన ఉండే అవకాశం ఉందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఈ వారంలో ప్రకటించారు. మరో వైపు పసుపు రైతులు ఆందోళనకు సిద్దమౌతున్నారు.  దిశ నిందితులతో &amp;nbsp;సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో &amp;nbsp;నిందితులు &amp;nbsp;పారిపోయే ప్రయత్నం చేసే సమయంలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు. ఈ నిందితుల మృతదేహాలకు ఈ నెల 6వ తేదీన అంత్యక్రియలు చేయాలని పోలీసులు భావించారు. అయితే ఈ విషయమై హైకోర్టు కీలకమైన ఆదేశాలను &amp;nbsp;జారీ చేసింది. మృతదేహాలను భద్రపర్చాలని 6వ తేదీన ఆదేశించింది.  also read:ప్రధానమంత్రి గాల్లో లెక్కలు కట్టే మనిషి కాదు... ఇది తథ్యం: ధర్మపురి అరవింద్  దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవహక్కుల సంఘం కేసు నమోదు చేసింది. ఈ కేసు విషయమై జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు వరుసగా విచారణ నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన దిశ కుటుంబసభ్యులతో కూడ జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు విచారించారు.&amp;nbsp;  దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై &amp;nbsp;జాతీయ మానవ హక్కుల సంఘానికి &amp;nbsp;సైబరాబాద్ పోలీసులు నివేదికను &amp;nbsp;సమర్పించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆరు మాసాల్లో విచారణను పూర్తి చేసి నివేదికను ఇవ్వాలని &amp;nbsp;సుప్రీంకోర్టు ఆదేశించింది.  వచ్చే వారంలో కమిటీ తెలంాణ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది. దిశ నిందితుల మృతదేహాలను &amp;nbsp;గాంధీ ఆసుపత్రిలో భద్రపర్చాలని &amp;nbsp;తెలంగాణ హైకోర్టు ఈ నెల 14వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు &amp;nbsp;కూడ మృతదేహాలను భద్రపర్చాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  మరోవైపు దిశ నిందితుల ఎన్‌కౌంటర్ &amp;nbsp;తర్వాత సోషల్ మీడియాలో సైబరాబాద్ సీపీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్‌ (వీసీ సజ్జనార్)పై ప్రశంసలు కురిపించారు. సజ్జనార్ సుప్రీంకోర్టు విచారణకు స్వయంగా హాజరయ్యారు. ఆ తర్వాత ఈ నెల 14వ తేదీన సజ్జనార్ &amp;nbsp;తన ఫ్యామిలీతో కలిసి లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. &amp;nbsp;సజ్జనార్‌తో స్థానికులు సెల్పీలు తీసుకొన్నారు.  నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు రైతులు పసుపు బోర్డు కోసం చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ రెండు రోజుల క్రితం కీలక ప్రకటన చేశారు. జనవరి మాసంలో పసుపు రైతులకు ఆనందించే ప్రకటన కేంద్రం చేసే అవకాశం ఉందని అరవింద్ ప్రకటించారు. పసుపు బోర్డు కంటే మేలైన పథకం కేంద్రం ప్రకటించే అవకాశం ఉందని &amp;nbsp;నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రకటించారు.  మరోవైపు నిజామాబాద్ కు చెందిన &amp;nbsp;పసుపు రైతులు పసుపు బోర్డు కోసం పాదయాత్ర చేయాలని తలపెట్టారు. ఆరు మాసాల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ నేతలు &amp;nbsp;ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేదని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dvdnswk44wx4fsjcjnq2hn01/haidrabad-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>క్రైమ్ రౌండప్: సమత హత్యాచారంపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.. ఒడిషాలో మరో దిశ, మరిన్ని</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q2jvyt</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q2jvyt</guid>
            <pubDate>Sun, 15 Dec 2019 16:31:00 +0530</pubDate>
            <description>కొమురం భీం జిల్లాలో వివాహిత సమత‌పై అత్యాచారం, హత్య కేసులో విచారణకు గాను ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. మరోవైపు ఇద్దరు బిడ్డలున్న వ్యక్తి ప్రేమ పేరుతో తనను మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక ఓ డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇలాంటి నేరవార్తలు మీకోసం.  సమత హత్యాచారంపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సమతపై గ్యాంగ్‌రేప్, హత్య చేసిన ఘటనపై చార్జీషీట్‌లో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. ఈ కేసులో 44 మంది సాక్షులను పోలీసులు విచారించి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులకు శిక్ష పడేందుకుగాను శాస్త్రీయ ఆధారాలను కూడ పోలీసులు సేకరించారు.  గత నెల 24వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ కుమరంభీమ్ జిల్లా రామ్ నాయక్ తండా సమీపంలో ముగ్గురు నిందితులు గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు.&amp;nbsp;దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత సమత హత్య కేసు నిందితులను కూడ కఠినంగా శిక్షించాలనే డిమాండ్ మొదలైంది. ఆందోళనలు కూడ కొనసాగాయి.దీంతో పోలీసులు కూడ ఈ కేసు విషయమై చర్యలు చేపట్టారు.  Also Read:సమత గ్యాంగ్ రేప్, హత్య: 44 మంది సాక్షుల విచారణ, ఛార్జీషీట్ ఇదీ...  సమతపై గ్యాంగ్‌రేప్, హత్య కేసులో 44 మంది సాక్షులను విచారించి పోలీసులు చార్జీషీట్ ను శనివారం నాడు దాఖలు చేశారు. 96 పేజీలతో పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చశారు. శాస్త్రీయ ఆధారాలను కూడ చార్జీషీట్ లో పొందుపర్చారు.&amp;nbsp;96 పేజీల చార్జీషీట్‌లో 13 పేజీల్లో ఛార్జీషీట్. మిగిలిన పేజీల్లో సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ నివేదికతో పాటు పంచనామా వివరాలు ఉన్నాయి.  ఒడిషాలో మరో దిశ:&amp;nbsp;  నవరంగపూర్ జిల్లాలోని కొశాగుమడ&amp;nbsp;సమితిలోని గమండల గ్రామంలో ఓ బాలికపై కొందరు దుండగులు సామూహితక అత్యాచారానికి పాల్పడి, అనంతరం దారుణంగా హత్య చేశారు. శుక్రవారం రాత్రి గ్రామంలో దియాలి పర్వదినం చేసుకుని బాధితురాలు ఇంటికి చేరుకునింది. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో బహిర్భూమి కోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లింది.  అయితే ఎంతసేపటికి ఆమె తిరిగి రాకపోవడంతో బాలిక కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. గ్రామస్తులు, బంధువుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ బాలిక ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో శనివారం గ్రామానికి చెందిన కొందరు మహిళలు బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని గ్రామస్తులు, బాలిక కుటుంబసభ్యులకు తెలియజేయగా వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు.  అక్కడ బాధితురాలి మృతదేహంతో పాటు రెండు పురుషుల జీన్స్ ప్యాంటులు, చెప్పులు పడివుండటంతో పాటు బాలిక శరీరంపై రక్కిన గాయాలను చూశారు. దీంతో వారు బాలిక అత్యాచారానికి గురైందని నిర్థారించారు. వెంటనే బాలిక కుటుంబసభ్యులు కొశాగుమడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  కాగా బాలికై అత్యాచారం, హత్య ఘటనపై నవరంగ‌పూర్ జిల్లా మాఘొరొ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు కాదంబనీ త్రిపాఠి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణంపై విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను డిమాండ్ చేశారు.&amp;nbsp;  డిగ్రీ విద్యార్ధినిని ట్రాప్ చేసిన ఇద్దరు పిల్లలు తండ్రి  చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మోసాన్ని తట్టుకోలేక ఫాతిమా అనే డిగ్రీ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే మదనపల్లిలోని ఓ డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్న ఫాతిమా అనే విద్యార్ధిని ఇబ్రహీం అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరూ సన్నిహితంగా మెలగడంతో ఫాతిమా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అయితే ఇబ్రహీం ఆమెను రేపు మాపు అంటూ దూరం పెట్టసాగాడు. ఈ క్రమంలో అతనికి అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నట్లు తెలుసుకున్న ఫాతిమా తీవ్ర మనస్తాపానికి గురైంది.  Also Read:నా బిడ్డని చంపిందెవరో రోజాకి తెలుసు.. ఆయేషా మీరా తల్లి సంచలన కామెంట్స్  ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోవడానికి ముందు ఇబ్రహీం తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, తల్లిదండ్రులకు వాట్సాప్‌లో మేసేజ్ చేసిన ఫాతిమా.. అతనితో కలిసి దిగిన ఫోటోను సైతం పంపించింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఉరికి వేలాడుతున్న తమ బిడ్డను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.  ఆమె మృతదేహాన్ని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న తల్లిదండ్రులు అతనిని కఠినంగా శిక్షిస్తేనే తమ కూతురికి అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇబ్రహీం కోసం గాలిస్తున్నారు. కాగా అతను గతంలోనే మరో ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో మోసిగించినట్లుగా తెలుస్తోంది.&amp;nbsp;  ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం  దాదాపు 12 సంవత్సరాల క్రితం.. ఏపీలో ఓ బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కలకలం రేపింది. తాను ఉండే హాస్టల్ బాత్రూమ్ లోనే ఆయేషా మీరా మృతదేహం నగ్నంగా పడి ఉంది. ఆమెపై అత్యాచారం జరిపి అనంతరం అతి &amp;nbsp;కిరాతకంగా హత్య చేశారు. కాగా... ఈ కేసును దర్యాప్తును దాదాపు 12 సంవత్సరాల తర్వాత సీబీఐ అధికారులు మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా అయేషామీరా మృతదేహానికి శనివారం రీ పోస్టు మార్టం ప్రారంభించారు.  Also Read:ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం ప్రారంభం  తెనాలిలోని చెంచుపేట స్మశాన వాటికలో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. 2007 డిసెంబర్ 27వ తేదీన ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు హాస్టల్‌లో అయేషా మీరా హత్య జరిగిన విషయం తెలిసిందే. హత్య జరిగిన 12 సంవత్సరాల తర్వాత రీ పోస్టుమార్టం కేసు సిబిఐకి అప్పగించినందున ఆధారాల కోసం రీ పోస్టు మార్టం చేస్తున్నారు. &amp;nbsp; ఆయేషా మీరా హత్యకేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఆమె మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ కార్యక్రమం ప్రొసీజర్‌ ప్రకారం, కుటుంబసభ్యుల సమక్షంలోనే నిర్వహించాలంటూ షరతులు విధించింది </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dw4kf2e60jyrek687qvb5ee7/crime-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>దిశ నిందితుల ఎన్‌కౌంటర్: దేశం చూపు తెలంగాణ వైపు, ఆర్టీసీ కార్మికులకు వరాలు</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/weekend-review-disha-accused-encouter-kcr-meeting-with-rtc-workers-q26zjx</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/weekend-review-disha-accused-encouter-kcr-meeting-with-rtc-workers-q26zjx</guid>
            <pubDate>Sun, 08 Dec 2019 17:20:00 +0530</pubDate>
            <description>హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. దిశపై అత్యాచారం, హత్య కావడానికి పోలీసుల నిర్లక్ష్యం కారణమనే విమర్శలు కూడ లేకపోలేదు.&amp;nbsp;  దిశ ఘటన విషయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చేసిన కామెంట్స్ కూడ పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఈ అంశాన్ని విపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేశాయి.. అయితే దిశ ఎన్‌కౌంటర్‌తో కేసీఆర్ సర్కార్‌కు అనుకూలంగా మారింది.&amp;nbsp;  also read:Year Roundup 2019:రికార్డు సృష్టించిన ఆర్టీసీ సమ్మె, ఎవరిది పై చేయి  అయితే నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత యావత్తూ దేశం తెలంగాణ వైపు చూసింది. గతంలో చోటు చేసుకొన్న ఘటనలపై కూడ నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలనే డిమాండ్ నెలకొంది.&amp;nbsp;  దిశ నిందితులపై చర్యలు తీసుకోవాలని రాజకీయపార్టీల నేతలను కూడ బాధిత కుటుంబం పరామర్శించకుండా అడ్డుకొన్న కాలనీవాసులు &amp;nbsp;దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత అదే కాలనీవాసులు సీఎంను ప్రశంసలతో ముంచెత్తారు.&amp;nbsp;  Also read:సజ్జనార్: నాడు వరంగల్‌లో, నేడు షాద్‌నగర్‌లో నిందితుల ఎన్‌కౌంటర్  గత నెల 27వ తేదీన శంషాబాద్‌ సమీపంలోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు‌ వద్ద దిశపై నలుగురు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన 24 గంటలలోపుగానే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  దిశ గ్యాంగ్‌రేప్, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధిత కుటుంబాన్ని రాజకీయ నాయకులు పరామర్శించారు. అయితే కాలనీవాసులు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. రాజకీయనేతలు, పోలీసులు , మీడియా ఎవరూ కూడ బాధిత కుటుంబాన్ని కలవకుండా ఈ నెల 1వ తేదీన &amp;nbsp;గేటుకు తాళం వేశారు.  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డిలు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే కాలనీవాసులు అడ్డుకొన్నారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అతి కష్టం మీద బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.  దిశ ఘటనపై ప్రభుత్వ తీరుపై విపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పించాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో దిశ ఉదంతం కూడ చర్చకు వచ్చింది. ఈ ఘటనపై అన్ని పార్టీలు తీవ్రంగా ఖండించాయి. పోలీసులు వ్యవహరించిన తీరును నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి &amp;nbsp;లోక్‌సభలో ప్రస్తావించారు.&amp;nbsp;  దిశ నిందితులను ఈ నెల 4వ తేదీన షాద్‌నగర్ కోర్టు 10 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అందించింది. &amp;nbsp;ఈ నెల 6వ తేదీన ఉదయం చటాన్‌పల్లి వద్ద సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు జరిపిన కాల్పుల్లో &amp;nbsp;నలుగురు నిందితులు మృతి చెందారు.  ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిశాయి. దిశ నిందితులు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న సమయంలో పోలీసులపై రాళ్లు రువ్విన ప్రజలు.. నిందితులు ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిన తర్వాత సంఘటన స్థలానికి చేరుకొన్న చాలా మంది పూల వర్షం కురిపించారు.  దిశ ఘటన విషయమై సీఎం కేసీఆర్ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసిన దిశ కాలనీవాసులు కూడ ఈ ఎన్‌కౌంటర్ తర్వాత కేసీఆర్‌ను అభినిందించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను ప్రశంసలతో ముంచెత్తారు.  తెలంగాణ సీఎం మౌనం ఎంత తీవ్రంగా ఉంటుందో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత తెలిసి వచ్చిందని &amp;nbsp;తెంగాణ రాష్ట్ర మంత్రి &amp;nbsp;తలసాని శ్రీనివాస్ యాదవ్ &amp;nbsp;చేసిన వ్యాఖ్యలు సంచలనం కల్గించాయి.  ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాలు  ఈ నెల 1వ తేదీన &amp;nbsp;రాష్ట్రంలోని 97 ఆర్టీసీ బస్ డిపోల నుండి ఐదుగురు ఎంపిక చేసిన కార్మికులతో తెలంగాణ సీఎం కేసీఆర్ &amp;nbsp;సమావేశం నిర్వహించారు.ఆర్టీసీ కార్మికులతో &amp;nbsp; సీఎం కేసీఆర్ లంచ్ చేశారు. &amp;nbsp;ఆ తర్వాత &amp;nbsp;ఆర్టీసీని బలోపేతం చేయడంపై &amp;nbsp;కార్మికులతో సీఎం కేసీఆర్ చర్చించారు.  ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. రాత్రి 8 గంటల వరకే మహిళా కండక్టర్లకు విధులు ఉంటాయని సీఎం హామీ ఇచ్చారు. టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేసిన ప్రయాణీకులనే బాధ్యత చేసేలా నిర్ణయం తీసుకొంటామని సీఎం హామీ ఇచ్చారు.  సమ్మె చేసిన కాలానికి వేతనాన్ని ఇవ్వనుంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. సెప్టెంబర్ జీతం వెంటనే చెల్లిస్తామని ఆయన ప్రకటించారు. అన్నట్టుగానే &amp;nbsp;వెంటనే సెప్టెంబర్ జీతాలను చెల్లించారు.  ఆర్టీసీని కాపాడేందుకు కార్మికులతో చర్చించారు. మరో నాలుగు మాసాల్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు. &amp;nbsp;   &amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dvjnr6ehk622txr6p3r2cr8k/kcr-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>క్రైమ్ రౌండప్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్.. ఉన్నావ్ రేప్ బాధితురాలు మృతి, మరిన్ని</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q26t0z</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q26t0z</guid>
            <pubDate>Sun, 08 Dec 2019 14:59:00 +0530</pubDate>
            <description>దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన శంషాబాద్ దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపడం ఈ వారం సంచలనం సృష్టింది. దీనితో పాటు ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని కోర్టుకు వెళ్లకుండా మధ్యలోనే అడ్డుకున్న నిందితులు ఆమెకు నిప్పంటించడంతో ఆమె మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. ఇలాంటి మరిన్ని నేరవార్తలు మీకోసం  దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్  దిశ హత్యాచారం నిందితులను సైబరాబాద్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా కస్టడిలోకి తీసుకున్న సిట్ బృందం వారిని సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా ఎక్క‌డైతే దిశను పెట్రోల్ పోసి నిప్పింటించారో అక్కడికి తీసుకొచ్చి విచారణ చేపట్టారు.  ఇదే సమయంలో పోలీసులకు సహకరిస్తున్నట్లుగానే నటించిన నిందితులు.. పోలీసు బలగాల చేతుల్లోంచి తుపాకులను లాక్కొని కాల్పులు జరిపడంతో పాటు రాళ్లు, కర్రలతో దాడికి దిగారు.  ఆత్మరక్షణ కోసం గత్యంతరం లేని పరిస్ధితుల్లో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు నిందితులు మహ్మద్ పాషా, నవీన్, శివ, చెన్నకేశవులు అక్కడికక్కడే మరణించినట్లు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ మీడియాకు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సజ్జనార్ మరోసారి జనం దృష్టిలో హీరోగా నిలిచారు.  అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమీషన్ సైబరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. దీనితో పాటు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పర్యటించే వరకు నిందితుల అంత్యక్రియలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశంపై పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారంటూ పలువురు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో.. న్యాయస్థానం కూడా విచారణకు ఆదేశించింది.  సోమవారం వరకు మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలోనే నిందితుల మృతదేహాలను భద్రపరచాలని అలాగే ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసుల వివరాలు, పంచనామా నివేదిక తదితర వివరాలను మహబూబ్‌నగర్ జిల్లా జడ్జికి అప్పగించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది.&amp;nbsp;   ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతి  ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి చెందింది. ఢిల్లీలోని సఫ్థార్‌గంజ్ ఆస్పత్రిలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. నిన్న రాత్రి 11.10 గంటలకు ఆమెకు గుండెపోటు వచ్చిందని డాక్టర్లు చెప్పారు. లైఫ్ సపోర్ట్‌ సిస్టమ్‌పై ఉంచి చికిత్స అందించినా... ఆమె శరీరం సహకరించలేదని తెలిపారు.&amp;nbsp;  కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన 23 ఏళ్ల యువతిపై గత డిసెంబర్‌లో అత్యాచారం జరిగింది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితులను అరెస్ట్ చేశారు. నవంబర్‌ 30న ఇద్దరు నిందితులు బెయిల్‌ మీద బయటకు వచ్చారు. బాధితురాలిపై కక్ష పెంచుకున్న నిందితులు... చంపేందుకు కుట్ర చేశారు. కేసు విచారణలో భాగంగా గురువారం రాయ్‌బరేలీలోని కోర్టుకు వెళ్లిన ఆమెను దారిలోనే అడ్డుకున్నారు. అంతా చూస్తుండగానే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పటించారు.&amp;nbsp;  Also Read:వారికో న్యాయం... మాకో న్యాయమా? ఉన్నావ్ బాధితురాలి తండ్రి సూటి ప్రశ్న  బాధితురాలు కేకలు వేస్తూ కిలోమీటరు మేర పరుగులు తీసింది. అయినా ఎవరూ ఆమెకు సహాయం చేయలేదు. బాధితురాలే కాలిన గాయాలతో స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చింది. లక్నో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత ఉన్నావ్ బాధితురాలు మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చింది. తనపై దాడి చేసిన వాళ్ల వివరాలను తెలిపింది.&amp;nbsp;  తనపై అత్యాచారం చేసిన ఇద్దరు సహా మొత్తం ఐదుగురు తనపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారని తెలిపింది. మరోవైపు నిందితులకు ఉరిశిక్షపడాలన్నది తన చివరి కోరికంటూ నిన్న ఉదయం తన తల్లిదండ్రులకు ఆమె చెప్పడం గమనార్హం. అది నెరవేరకుండానే కన్నుమూయడం బాధాకరం.   సనత్‌నగర్‌లో టెక్కి అనుమానాస్పద మృతి   హైదరాబాద్‌ సనత్ నగర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పూర్ణిమ అనుమానాస్పద స్థితిలో మృతి &amp;nbsp;చెందింది. పూర్ణిమ మృతిపై భర్త కార్తీక్ పై పూర్ణిమ కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. &amp;nbsp;పూర్ణిమను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్టుగా బాధిత కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పూర్ణిమ 20 రోజుల క్రితం తన ప్రియుడు కార్తీక్ ‌ను ప్రేమించి పెళ్లి చేసుకొంది. వీరిద్దరూ సనత్‌నగర్ లో కాపురం పెట్టారు. అయితే పెళ్లైన 20 రోజులకే &amp;nbsp;పూర్ణిమ అనుమానాస్పదంగా మృతి చెందడంపై &amp;nbsp;పూర్ణిమ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పూర్ణిమను కార్తీక్ హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు.  Also Read:సనత్‌నగర్‌లో టెక్కీ అనుమానాస్పద మృతి  సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ ముందు బాధిత కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు.పూర్ణిమ ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పూర్ణిమ మరణానికి కారకులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.&amp;nbsp;  హైద్రాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త కూతురే పూర్ణిమ.హైద్రాబాద్‌లో పూర్ణిమ తండ్రికి ఓ ఫ్యాక్టరీ ఉంది. పూర్ణిమకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ సమయంలోనే తమ ఫ్యాక్టరీలో పనిచేసే కార్తీక్ ను విహవాం చేసుకొన్నట్టుగా పూర్ణిమ తల్లిదండ్రులకు పోటోలను చూపింది.  ఈ విషయమై తల్లిదండ్రులతో పూర్ణిమ గొడవకు దిగింది. ఈ విషయమై పోలీస్ కేసుల వరకు కూడ వెళ్లింది. ఈ విషయమై పూర్ణిమకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే తన ప్రియుడితోనే తాను ఉంటానని పూర్ణిమ పోలీసుల కౌన్సిలింగ్ లో చెప్పింది. దీంతో పూర్ణిమ సనత్ నగర్ లో కార్తీక్ తో కలిసి ఉంటుంది.&amp;nbsp;  ప్రియుడితో కలిసి భర్తను సజీవదహనం చేసిన భార్య  హైదరాబాద్ వనస్థలిపురం ఎస్‌కెడి నగర్ లో రమేష్ అనే వ్యక్తి సజీవ దహనం కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని &amp;nbsp;భావించి &amp;nbsp;భర్త రమేష్ ను చంపింది భార్య స్వప్న. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  హైద్రాబాద్ వనస్థలిపురంలోని ఎస్‌కెడి నగర్ లో ఈ ఏడాది నవంబర్ 26వ తేదీన రమేష్ తన గుడిసెలో సజీవ దహనమయ్యాడు. కొంత కాలం క్రితం రమేష్, స్వప్నను పెళ్లి చేసుకొన్నాడు.&amp;nbsp;రమేష్, స్వప్నల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. స్వప్నకు వెంకటయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్ని గుర్తించిన రమేష్ భార్యను హెచ్చరించారు.&amp;nbsp;  Also Read:హైద్రాబాద్‌లో దారుణం: ప్రియుడితో కలిసి భర్తను సజీవ దహనం చేసిన భార్య  అయినా ఆమెలో మార్పు రాలేదు. పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టాడు. అయితే &amp;nbsp;తాను తన ప్రియుడు వెంకటయ్యతో సంబంధాలను తెగదెంపులు చేసుకొంటానని స్వప్న తేల్చి చెప్పింది.అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. &amp;nbsp;తన ప్రియుడితో వివాహేతర సంబంధానికి భర్త రమేష్ అడ్డుగా ఉన్నాడని స్వప్న భావించింది. &amp;nbsp;తన భర్త అడ్డును తొలగించుకోవాలని భావించింది.  ఈ నెల 26వ తేదీన తన గుడిసెలో నిద్రపోతున్న రమేష్ను స్వప్న ప్రియుడితో కలిసి హత్య చేసింది. రమేష్ నిద్రిస్తున్న సమయంలో &amp;nbsp;గుడిసెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే రమేష్ షార్ట్ సర్క్యూట్ &amp;nbsp;తో మంటల్లో సజీవ దహనమయ్యాడని భార్య స్వప్న స్థానికులను నమ్మించింది. </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dvjdaqazq48cqyb8r82hgzcf/disha-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>క్రైమ్ రౌండప్: దృశ్యం సినిమా స్ఫూర్తితో తప్పించుకునేందుకు డ్రామా.. మరిన్ని</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q1gwlw</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q1gwlw</guid>
            <pubDate>Sun, 24 Nov 2019 15:19:00 +0530</pubDate>
            <description>దృశ్యం సినిమా లాగా... హత్య కేసులో తప్పించుకునేందుకు  పదేళ్ల పాటు సహజీవనం చేసిన వ్యక్తిని దారుణంగా హత్య చేసింది ఓ మహిళ. &amp;nbsp;ఈ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గ్రామంలో చోటు చేసుకొంది. అయితే ఈ హత్య కేసులో &amp;nbsp;ప్రధాన పాత్ర పోషించిన తన &amp;nbsp;కూతురు, అల్లుడిని కేసు నుండి తప్పించుకొనేందుకు గాను దృశ్యం సినిమా‌ను ఫాలో అయింది. ఈ హత్యను ఎలా చేసిందో పోలీసులకు నిందితురాలు వివరించింది.&amp;nbsp;  కర్ణాటకకు చెందిన విజయకుమార్ బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం కృష్ణా జిల్లాకు వచ్చాడు. &amp;nbsp;జిల్లాలోని జగ్గయ్యపేట ధనంబోర్డులో మకాం పెట్టాడు. అదే ప్రాంతానికి చెందిన వివాహిత రాధతో విజయ్‌కుమార్‌కు పరిచయం ఏర్పడింది. రాధ తన భర్తకు దూరమై ఇద్దరు బిడ్డలతో నివాసం ఉంటుంది. దీంతో రాధతో విజయ్ కుమార్ సహజీవనం చేస్తున్నాడు.  విజయ్‌కుమార్‌ సహకారంతో రాధ తన పిల్లల్ని పెంచింది. రాధ పెద్ద కొడుకు ఇంటర్ పూర్తి చేశాడు. అతను ఓ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. కూతురికి వివాహం కూడ చేసింది. అంతేకాదు రాధ ఓ ఇల్లును కూడ కొనుగోలు చేసింది. కొద్ది రోజుల క్రితం రాధ అల్లుడు విజయ్‌కుమార్‌ వద్ద రూ. 50వేలు అప్పుగా తీసుకొన్నాడు. అయితే ఈ డబ్బును తిరిగి చెల్లించాలని &amp;nbsp;విజయ్ కుమార్ &amp;nbsp;రాధను అడిగాడు. ఈ విషయమై ఇంట్లో గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో శనివారం నాడు మరోసారి గొడవ జరిగింది.&amp;nbsp;  దీంతో ఆగ్రహంతో రాధ విజయ్‌కుమార్‌ను గడ్డపారతో పొడిచింది. &amp;nbsp;అంతేకాదు ఇంట్లో రక్తపు మరకలను తుడిచేసింది. ఈ కేసు నుండి తన కొడుకు,. కూతురు, అల్లుడిని తప్పించేందుకు ఆమె ప్రయత్నించింది.&amp;nbsp;ఈ హత్య విషయమై పోలీసులు నిందితురాలిని &amp;nbsp;ప్రశ్నిస్తే అసలు విషయాన్ని చెప్పింది. తన అల్లుడు, కూతురిపై విజయ్‌పై దాడి చేస్తోంటే అడ్డుకొనే క్రమంలో తాను విజయ్‌కుమార్‌పై గడ్డపారతో దాడి చేసినట్టుగా నిందితురాలు చెప్పారు. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.  కాకినాడలో కిడ్నాప్ కలకలం  తూర్పు గోదావరి &amp;nbsp;జిల్లా కాకినాడ పట్టణంలో &amp;nbsp;జగన్నాథపురం వాటర్‌ ట్యాంక్‌ వద్ద నేతాజీ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ కు గురైంది. పోలీసులు &amp;nbsp;పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ బాలిక కిడ్నాప్ వెనుక సవతి తల్లి పాత్ర ఉందని చిన్నారి నాయనమ్మ ఆరోపిస్తోంది.  సవతి తల్లి శాంతి కుమారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. దీప్తిశ్రీని గొంతునులిమి హత్యచేసి ఉప్పుటేరు కాల్వలో పడేశానని కాసేపు, సంజయ్‌ నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ వద్ద పడేసానని పోలీసుల విచారణలో రకరకాలుగా సమాధానాలు చెప్తుండడంతో పోలీసులు దీప్తిశ్రీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.&amp;nbsp;  శుక్రవారం నుంచి దీప్తిశ్రీ &amp;nbsp;కన్పించకుండాపోయింది. తూరంగి పంచాయతీ పగడాలపేటకు చెందిన బాలిక సూరాడ దీప్తిశ్రీ ఐసానిని శుక్రవారం పాఠశాల నుంచి నేరుగా కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లిపోయారు. ఉదయం 9 గంటలకు చిన్న నానమ్మ ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లింది.&amp;nbsp;సాయంత్రం ఆమె ఇంటికి చేరకపోవడంతో తండ్రి సూరాడ సత్యశ్యామ్‌ కుమార్‌ ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు.  నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిలింగ్: రూ.50 లక్షల వసూలు    విశాఖకు చెందిన ఓ వ్యక్తి ఓ ప్రభుత్వ ఉద్యోగితో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరిట ఆమెకు దగ్గరయ్యాడు. &amp;nbsp;ఆ తర్వాత ఆమెకు మత్తుమందు ఇచ్చి.. స్పృహలేని సమయంలో ఆమె అభ్యంతరకర చిత్రాలు తీశాడు. వాటిని ఆన్ లైన్ లో పెడతానని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. &amp;nbsp;ఆ తర్వాత పలు మార్లు బెదిరించి ఆమె వద్ద నుంచి దాదాపు రూ.50లక్షలు వసూలు చేశాడు.  ఇంకా ఇవ్వాలని బెదిరించడంతో... తన దగ్గరలేవని ఆమె చెప్పింది. తన దగ్గర ఇంక డబ్బులు లేవని.. అప్పుల్లో కూరుకుపోతానని ఆమె చెప్పినా అతను వినిపించుకోలేదు. దీంతో... అతని తల్లిదండ్రులను ఆమె బ్రతిమిలాడింది. అయితే... వాళ్లు కూడా ఆమె బాధను పట్టించుకోకపోవడం గమనార్హం. అక్కడితో ఆగకుండా...తమ కొడుకు చెప్పింది కరక్టేనంటూ వాధించడం గమనార్హం.  దీంతో బాధితురాలు చిట్టచివరగా పోలీసులను ఆశ్రయించింది. దీంతో.. విచారణలో పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకొని విస్తుపోయారు. &amp;nbsp;యువతి ఇచ్చిన డబ్బులను అతనితోపాటు తల్లిదండ్రులు కూడా పంచుకునేవారని తెలిసి పోలీసులు విస్తుపోయారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.  పెళ్లయిన రెండు రోజులకే భర్తకు విషం  పెళ్లి జరిగిన వారానికే భర్తను చంపేందుకు యువతి మజ్జిగలో విషం కలిపిందన్న వార్త తీవ్ర సంచలనం సృష్టించింది. పెళ్లి ఇష్టం లేనందువల్ల మజ్జిగలో విషం కలిపి భర్తను హత్య చెయ్యాలని చూసిందంటూ వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేగింది.  కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన లింగమయ్యకు ఈ నెల 11న మద్దికెర మండలం మందనంతపురానికి చెందిన నాగమణితో వివాహమైంది. వారం రోజుల తర్వాత భార్యతో కలిసి ఆమె పుట్టింటికి వెళ్లాడు లింగమయ్య.  అదే రోజు సాయంత్రం తన భార్య మజ్జిగలో విషం కలిపి ఇచ్చిందంటూ లింగమయ్య అనంతపురం ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయం బయటికి పొక్కడంతో మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది. &amp;nbsp;పెళ్లి ఇష్టం లేనందువల్ల భార్య తనకు పురుగుల మందు కలిపిన మజ్జిగ ఇచ్చిందంటూ ఆ మజ్జిగ గ్లాసును కూడా అతను అందరికీ చూపించాడు.&amp;nbsp;  దీంతో అంతా నిజమేనని భావించారు. అయితే, కొత్తపెళ్లికూతురు నాగమణి కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. భర్తకు ఇచ్చిన మజ్జిగను ముందుగా తాను తాగిందని &amp;nbsp;వధువు కుటుంబసభ్యులు చెప్పారు. పురుగుల మందు కలిపి ఉంటే ఎలా తాగుతుందంటున్నారు. ఆమెకు భర్తను చంపాల్సిన ఉద్దేశం ఎంతమాత్రమూ లేదంటున్నారు.&amp;nbsp;  Read Also:&amp;nbsp;  అచ్చు దృశ్యం సినిమానే: పదేళ్లు సహజీవనం, హత్య  కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ కలకలం </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dtecyjwxtr44phgt4wg5p22d/drishyam-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>వీక్లీ రివ్యూ: తెలంగాణలో పరిణామాలు ఇవీ...</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/weekend-political-review-important-incidents-from-nov-17-to-nov-24-in-telangana-q1gfe9</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/weekend-political-review-important-incidents-from-nov-17-to-nov-24-in-telangana-q1gfe9</guid>
            <pubDate>Sun, 24 Nov 2019 09:07:00 +0530</pubDate>
            <description>హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చేసిన రాజకీయ సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలు, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనానికి కారణంగా మారాయి. గత వారంలో ప్రధానంగా రాజకీయ వర్గాల్లో ఇదే అంశం చుట్టూ చర్చ సాగింది. ఆర్టీసీ సమ్మెపై జేఎసీ నేతలు ఆదివారం నాడు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.&amp;nbsp;  Also readకేసీఆర్ కు జగన్ షాక్: ఆర్టీసీపై మొండిపట్టు, టీపీసీసీ రేసులో రేవంత్  త్వరలోనే మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలో కూడ రాజకీయ సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బలపడాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే పలు పార్టీల నేతలతో బీజేపీ నాయకత్వం టచ్‌లోకి వెళ్లింది.  తెలంగాణ రాష్ట్రంలో బలపడాలని బీజేపీ చాలా కలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం కూడ రంగంలోకి దిగింది.  బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడ తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీ సభ్వత్యాన్ని తీసుకొన్నాడు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను బీజేపీలో చేర్చుకొన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు చెందిన నేతలపై కూడ బీజేపీ కన్నేసింది. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నారు బీజేపీ నేతలు.  కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు కూడ బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే గతంలోనే వీరంతా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ, వీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.  త్వరలోనే వీరంతా బీజేపీ తీర్థం పుచ్చుకొంటారనే చర్చ సాగుతోంది. మరోవైపు బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొంటారు. సంస్థాగత ఎన్నికలు పూర్తైన తర్వాత ఇతర పార్టీల నుండి వలసలు ఉండే అవకాశం ఉందనే ప్రచారం బీజేపీ వర్గాల్లో ఉంది.  మహారాష్ట్రలో బీజేపీ రాత్రికి రాత్రే అధికారాన్ని కైవసం చేసుకొంది. అదే తరహాలోనే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కూడ కైవసం చేసుకొంటుందని బీజేపీ నాయకత్వం ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చేసిన రాజకీయ సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి.  భవిష్యత్తులో బీజేపీ తన కార్యాచరణకు సంబంధించిన వ్యూహాన్ని లక్ష్మణ్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మరో వైపు వ్యూహాత్మకంగానే లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ కూడ లేకపోలేదు.వచ్చే ఎన్నికల నాటికి పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో బీజేపీ జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది.  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలపై ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడ దూకుడుగా విమర్శలు చేస్తోంది. కార్యక్రమాలను కూడ నిర్వహిస్తోంది.ఈ క్రమంలోనే ఆర్టీసీ సమ్మె విషయంలో బీజేపీ కీలకంగా వ్యవహరిస్తోంది.  ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ కేసీఆర్ సర్కార్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్  తెలంగాణ రాష్ట్రంలోని 5100 రూట్ల ప్రైవేటీకరణ &amp;nbsp;కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆర్టీసీ జేఎసీ నేతలు సమ్మె చేస్తున్న సమయంలో రూట్లను ప్రైవేటీకరించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలోని 5100 రూట్లను ప్రైవేటీకరిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.  ఈ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఎంవీ 1988 చట్టం సెక్షన్ 102 ప్రకారంగా రూట్ల ప్రైవేటీకరణను సమర్ధించింది హైకోర్టు. రాష్ట్రంలోని 5100 రూట్లను ప్రైవేటీకరిస్తూ తీసుకొన్న నిర్ణయాన్ని సమర్ధించింది.&amp;nbsp;  ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు సూచన మేరకు భేషరతుగా తాము విధుల్లో చేరేందుకు సిద్దమేనని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి ప్రభుత్వాన్నికోరారు. కానీ, ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాలేదు. దీంతో సమ్మె యధాతథంగా కొనసాగిస్తామని జేఎసీ ప్రకటించింది. ఆర్టీసీ జేఎసీ నేతలు ఆదివారం నాడు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు.  సమ్మెను విరమిస్తామని విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినా కూడ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంపై ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన నెలకొంది. ఆర్టీసీని ఇప్పుడున్న స్థితిలో నడపలేమనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది.  మరో వైపు ఆర్టీసీ కార్మికుల సమస్యలను రెండు వారాల్లో పరిష్కరించాలని లేబర్ కోర్టును హైకోర్టు ఆదేశించింది.అయితే ఈ సమస్య రెండు వారాల్లో పరిష్కరమయ్యే అవకాశం ఉందా అనే చర్చ కూడ లేకపోలేదు. ఈ విషయమై న్యాయ నిపుణులతో చర్చించిన జేఎసీ నేతలు భేషరతుగా తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు.&amp;nbsp;   చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట  వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో స్టే కోరుతూ చెన్నమనేని రమేష్ హైకోర్టును ఆశ్రయించాడు.హోంమంత్రిత్వశాఖ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. నాలుగు వారాల పాటు కేసును వాయిదా వేసింది.  కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ ఈ విషయమై చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హైకోర్టులో ఈ ఆదేశాలను అమలు చేయకుండా రమేష్ స్టే తెచ్చుకొన్నాడు. పదేళ్లుగా రమేష్ పౌరసత్వం విషయమై ఆది శ్రీనివాస్ పోరాటం చేస్తున్నాడు.&amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01dpxannphptxd8164yht5xrx8/kcr-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>కేసీఆర్ కు జగన్ షాక్: ఆర్టీసీపై మొండిపట్టు, టీపీసీసీ రేసులో రేవంత్</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/weekend-review-important-incidents-from-nov-11-to-nov-17-in-telangana-politics-q14225</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/weekend-review-important-incidents-from-nov-11-to-nov-17-in-telangana-politics-q14225</guid>
            <pubDate>Sun, 17 Nov 2019 16:48:00 +0530</pubDate>
            <description>హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా సాగుతోంది.కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం తెలంగాణకు షాకిచ్చింది. జాతీయ హోదా ఇవ్వకూడదని సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది.తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోసం జగ్గారెడ్డి &amp;nbsp;కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ధరఖాస్తు చేసుకొన్నాడు. గత వారంలో తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా ఆర్టీసీ సమ్మెపైనే రాజకీయ పార్టీలు కేంద్రీకరించాయి.&amp;nbsp;  తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. ప్రధానమైన ఆర్టీసీ విలీనం డిమాండ్‌తో పాటు మరో &amp;nbsp;46 డిమాండ్లను &amp;nbsp;నెరవేర్చాలని &amp;nbsp;ఆర్టీసీ జేఎసీ డిమాండ్ చేస్తోంది.&amp;nbsp;  Alo read:నా ఫోన్‌ను కూడ ట్యాప్ చేసి ఉండొచ్చు: ఎంపీ బండి సంజయ్  అయితే ఆర్టీసీ జేఎసీ నేతలు తమ ప్రధానమైన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్‌పై వెనక్కు తగ్గారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే డిమాండ్‌ విషయంలో వెనక్కి తగ్గి ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.  తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఎసీ ఈ నెల 18వ తేదీన సడక్ బంద్‌కు పిలుపునిచ్చింది. &amp;nbsp;మరో వైపు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇందిరాపార్క్ వద్ద దీక్షకు ఈ నెల 17న పిలుపునిచ్చాడు. దీంతో తార్నాకలోని మందకృష్ణ మాదిగను పోలీసులు ఈ నెల 17న ఉదయం అరెస్ట్ చేశారు.  మరో వైపు ఈ నెల 16వ తేదీ నుండే ఆర్టీసీ జేఎసీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నెల 16వ తేదీనే ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన తన ఇంట్లోనే దీక్షకు దిగారు. మరోవైపు జేఎసీ కో కన్వీనర్ రాజిరెడ్డి కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్వత్థామరెడ్డి ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు ప్రకటించారు.  ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ సమయంలో ప్రభుత్వంపై ఆర్టీసీ ఈ వారంలో కీలక వ్యాఖ్యలు చేసింది.ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విషయంలో కేబినెట్ నిర్ణయంపై కూడ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు సమర్పించారు.  అయితే కేబినెట్ నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జిల కమిటీకి ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఆర్టీసీ విభజన విషయమై హైకోర్టు విచారణ చేసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారంగా ఆర్టీసీ విభజన జరగలేదని కేంద్రం హైకోర్టుకు స్పష్టం చేసింది.ఆర్టీసీ సమ్మె విషయమై ఈ నెల 18వ తేదీన హైకోర్టు మరోసారి విచారణ చేయనుంది.  టీపీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ  ఇక తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ తీవ్రంగా నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వి.హనుమంతరావు, జగ్గారెడ్డిలు ఈ పదవిని తమకు కట్టబెట్టాలని కోరుతున్నారు. రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు &amp;nbsp;పోటీ పడుతున్నారు.  పీసీసీ అధ్యక్ష పదవి కోసం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎఐసీసీకి తన బయోడేటాను పంపారు. వెరైటీగా ఈ బయోడేటాను ఆయన పార్టీ నాయకత్వానికి పంపించారు. ఏ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఏ సమయంలో పార్టీ మారారనే విషయాలను బయోడేటాలో చేర్చారు. అంతేకాదు తనపై ఉన్న కేసుల వివరాలను కూడ &amp;nbsp;ఆయన బయోడేటాలో పొందుపర్చాడు.మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడ తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కోరారు. ఇటీవల గులాం నబీ ఆజాద్ &amp;nbsp;హైద్రాబాద్‌ వచ్చిన సమయంలో ఆయన ఈ విషయమై ఆజాద్ ను కలిసి &amp;nbsp;విన్నవించారు.  బీసీ సామాజిక వర్గం నుండి &amp;nbsp;తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని వి.హనుమంతరావు కూడ పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడ ఈ పదవిని ఆశిస్తున్నారు.&amp;nbsp;  అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వడాన్ని పార్టీ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో కొత్తగా చేరిన రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే పార్టీ కోసం ఇంత కాలం కష్టపడిన వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.&amp;nbsp;  కాళేశ్వరంపై కేసీఆర్ కు షాకిచ్చిన జగన్  కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వొద్దని కోరుతూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని &amp;nbsp;తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్మిస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.  కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ కూడ హాజరయ్యారు. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ఇవ్వకూడదని అడ్డుపడుతూ అఫిడవిట్ దాఖలు చేయడంపై టీఆర్ఎస్ నేతలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో &amp;nbsp;టీఆర్ఎస్ ఎంపీలు &amp;nbsp;కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయమై డిమాండ్‌ చేయనున్నారు.&amp;nbsp;   </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dswj6z46z3v8yrjefytq7edr/untitled-1-copy-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>వల్లభనేని వంశీ వ్యూహం ఇదే: అదే జరిగితే చంద్రబాబుకు పెద్ద దెబ్బ</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/a-blow-to-chandrababu-vallabhaneni-strategy-may-help-other-tdp-mlas-q140fv</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/a-blow-to-chandrababu-vallabhaneni-strategy-may-help-other-tdp-mlas-q140fv</guid>
            <pubDate>Sun, 17 Nov 2019 16:13:00 +0530</pubDate>
            <description>విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై, ఆయన కుమారుడిపై, టీడీపీ నేతలపై విరుచుకుపడడంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యూహాత్మకంగా వ్యవహిస్తున్నట్లు కనిపిస్తోంది. తీవ్రమైన వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్ ఆయన టీడీపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. తాను కోరుకుందీ అదే, చంద్రబాబు ఇచ్చిందీ అదే అన్నట్లు పరిస్థితి మారింది.&amp;nbsp;  పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇది ఒక రకంగా ఫిరాయింపులను నిరోధిస్తుందని నమ్ముతున్నారు. అయితే, ఆయనే మరో మాట కూడా అన్నారు. వంశీ సస్పెండ్ అయిన ఎమ్మెల్యేగా ఉంటే ఆయనకు ప్రత్యేక సీటు కేటాయిస్తామని సీతారాం అన్నారు.&amp;nbsp;  Also Read:&amp;nbsp;వల్లభనేని వంశీపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆసక్తికర కామెంట్స్  తమ్మినేని సీతారాం మాటలను బట్టి వంశీ శాసనసభ్యుడిగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తనకు ప్రత్యేక సీటు కేటాయించే విధంగా సస్పెన్షన్ కు గురై వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడదలుచుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అందుకే తాను వైసీపీలో చేరబోనని, వైఎస్ జగన్ తో కలిసి నడుస్తానని వంశీ చెప్పారు. తాను వైసీపీలో చేరుతున్నట్లు ఓ సందర్భంలో మాట జారిన వంశీ తాను వైసీపీలో చేరబోవడం లేదని చెప్పి తర్వాత సర్దుబాటు చేసుకున్నారు&amp;nbsp;  వంశీ వ్యూహం గనుక ఫలిస్తే టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు ఆయన భాటలో నడిచే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇసుక కొరతపై చంద్రబాబు చేసిన దీక్షకు దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వారు ఎందుకు దీక్షకు రాలేదనేది తెలియదు. కానీ వారంతా వంశీ బాటలో నడిచే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది.&amp;nbsp;  డిసెంబర్ 2వ తేదీ నుంచి శాసనసభ శీతాకాలం సమావేశాలు జరగనున్నాయి. వంశీని టీడీపీ సస్పెండ్ చేసినట్లుగా స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాచారాన్ని ఆసరా చేసుకుని వంశీకి స్పీకర్ ప్రత్యేకమైన సీటును కేటాయిస్తారు. అలా కేటాయించిన తర్వాత టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఆయన బాటలో నడవవచ్చునని భావిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా సస్పెన్షన్ ను ఎత్తివేసే వరకు స్వతంత్ర ఎమ్మెల్యేలుగా కొనసాగవచ్చు.&amp;nbsp;  Also Read:&amp;nbsp;చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఎసరు: జగన్ కి టచ్ లో 10మంది టీడీపీ ఎమ్మెల్యేలు  ఎంత మంది ఎమ్మెల్యేలు వంశీ బాటలో నడుస్తారనేది శీతాకాలం సమావేశాల్లో తేలిపోతుందని అంటున్నారు. అనర్హత వేటు పడకుండా, వైసిపీ వైపు రావడానికి ఇది సరైన మార్గమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ కూడా దీన్ని ఆమోదించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.&amp;nbsp;  ఇసుక కొరతపై, పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై వంశీ జగన్ ప్రభుత్వాన్ని శాసనసభలో సమర్థించే అవకాశాలున్నాయి. సస్పెన్షన్ కు గురి కావడానికే వంశీ తీవ్ర పదజాలం వాడారని, దానికితోడు చంద్రబాబును, లోకేష్ ను లక్ష్యం చేసుకున్నారని అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు గీత దాటుతూనే వేటు పడకుండా చూసుకుంటే చంద్రబాబుకు పెద్ద దెబ్బ అవుతుందని అంటున్నారు.  టబు&amp;nbsp;హాట్ పిక్స్.. @48లో కూడా తగ్గని&amp;nbsp;అందాల&amp;nbsp;ఘాటు </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dqyk222ypc6rnxvzjdddj7ra/vallabhaneni-vamsi-not-going-to-change-party-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>క్రైమ్ రౌండప్: ప్రియుడితో ఉండగా చూసిందని బిడ్డ హత్య, భార్య వీడియోలతో భర్త బెదిరింపులు..మరిన్ని</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q13wzv</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q13wzv</guid>
            <pubDate>Sun, 17 Nov 2019 14:58:00 +0530</pubDate>
            <description>ప్రియుడితో రాసలీలలు చూసిందని బిడ్డ హత్య:    తమ వివాహేతర సంబంధాన్ని చూసిందనే కారణంగా కన్న కూతురిని ప్రియుడితో కలిసి చంపేసింది తల్లి.అయితే ఏమీ తెలియనట్టుగానే కూతురు కన్పించడం లేదంటూ ఆమె వెతికింది. విజయవాడ భవానీపురంలో ఈ ఘటన చోటు చేసుకొంది.&amp;nbsp;విజయవాడ గ్రామీణ పరిధిలోని గొల్లపూడి భవానీపురంలో మొవ్వ అనిల్, వెంకటరమణలు భార్యాభర్తలు. అనిల్ ప్రభుత్వ మద్యం సరఫరా చేసే గోదాంలో కూలీ పని చేసేవాడు.  అనిల్ భార్య వెంకటరమణ తాము నివాసం ఉండే ప్రైవేట్ కాలేజీలో స్వీపర్ గా పనిచేసేది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కొడుకులను నందిగామ మండలం గోళ్లమూడిలో బంధువుల ఇంటి దగ్గర ఉంచి చదివిస్తున్నారు.ఎనిమిదేళ్ల కూతురు ద్వారక మాత్రం &amp;nbsp;తల్లిదండ్రుల వద్దే ఉంటుంది.&amp;nbsp;ద్వారక స్థానికంగా ఉన్న పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. అనిల్ , వెంకటరమణ దంపతులు నివాసం ఉండే ఇంటి పక్కనే పెంటయ్య తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అనిల్ భార్య ఆదివారం నాడు పుట్టింటికి వెళ్లింది.  Also Read:ప్రియుడితో తల్లి రాసలీలలు: విజయవాడ ద్వారక హత్యలో ట్విస్ట్  ఆదివారం కావడంతో ద్వారక ఆడుకొంటూ టీవీ చూసేందుకు పెంటయ్య ఇంటికి వెళ్లింది. అప్పటికే అదే ఇంట్లో తన తల్లి వెంకటరమణ పెంటయ్యతో రాసలీలలో మునిగితేలుతోంది.&amp;nbsp;ఈ విషయాన్ని ద్వారక చూసింది. వివాహేతర సంబంధం విషయమై ద్వారక తల్లి వెంకటరమణను నిలదీసింది. నాన్నకు చెబుతానని ద్వారక తెగేసి చెప్పింది.ఈ విషయం తన భర్తకు తెలిసే అవకాశం ఉందని భావించిన వెంకటరమణ తన ప్రియుడు పెంటయ్యను తన కూతురు చంపాలని పురమాయించి తన ఇంటికి వెళ్లిపోయింది.  దీంతో ద్వారకను పెంటయ్య హత్య చేశాడు. ద్వారక మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో గోనెసంచిలో మూటగట్టి ఇంట్లోనే దాచాడు.ఆదివారం మధ్యాహ్నం నుండి తన కూతురు కన్పించడం లేదని వెంకటరమణ ఏమీ తెలియనట్టుగానే నాటకం ఆడింది. కుటుంబసభ్యులతో కలిసి వెంకటరమణ కూడ వెతికింది.  ఆరేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారయత్నం    ప్రసాదం కోసం గుడికి వెళ్లి తిరిగి వస్తున్న ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది.&amp;nbsp;వివరాల ప్రకారం పమిడిముక్కల మండలం ఐనపూరు గ్రామానికి చెందిన దూడల సాంబశివరావు కుమార్తె కార్తీకమాసం మొదలైన దగ్గర నుంచి ప్రసాదం &amp;nbsp;కోసం శివాలయంకు ప్రతి రోజు వెళ్లి వస్తుంది.&amp;nbsp;  ఈ క్రమంలో గురువారం సాయంత్రం ప్రసాదానికి వెళ్ళిన పాప తిరిగి రాకపోవడంతో కంగారు పడుతూ తండ్రి సాంబశివరావు సాయంత్రం 6.30 పాప ను వెతుక్కుంటూ వెళ్లాడు. &amp;nbsp;రైస్ మిల్లు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో పాప &amp;nbsp;తనుశ్రీ పై అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ళ దూడల ధనుష్ ఉండగా తండ్రి సాంబశివరావు కేకలు వేసుకుంటూ &amp;nbsp;పరుగెత్తాడు.  Also Read:విజయవాడ: చిన్నారి హత్య కేసులో అత్యాచారం కోణం.. మెడపై గోళ్లతో రక్కిన గుర్తులు  అతడి అరుపులకు భయపడ్డ &amp;nbsp;ధనుష్ అక్కడి నుంచి &amp;nbsp;పారిపోయాడు. తీవ్ర రక్త &amp;nbsp;రక్త స్రావంతో &amp;nbsp;ఉన్న &amp;nbsp;పాపను RMPడాక్టర్ వద్దకు తీసుకు &amp;nbsp;వెళ్లగా అత్యాచారం &amp;nbsp;జరిగినట్లు నిర్ధారించాడు. గురువారం రాత్రి పమిడి ముక్కల పోలీసు స్టేషన్ లో బాలిక తండ్రి సాంబశివరావు పిర్యాదు చేశాడు. &amp;nbsp;ఈ మేరకు శుక్రవారం ధనుష్ పై IPC 376, పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై G. శ్రీనివాస్ తెలిపారు.  పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను చంపిన భర్త    భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడం భర్తకు నచ్చలేదు. దీంతో...ఆమెను తన సోదరుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన అనంతపురంలో చోటుచేసుకుంది.&amp;nbsp;పూర్తి వివరాల్లోకి వెళితే.... గోవిందరాయునిపేటకు చెందిన ఫకృద్దీన్‌ 12 ఏళ్ల కిందట శింగనమలకు చెందిన శంషాద్‌ను వివాహం చేసుకున్నాడు. మేకలు మేపుకుంటూ దంపతులు జీవనం సాగించేవారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంత కాలంగా తన భార్య శంషాద్‌కు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు ఫకృద్దీన్‌ అనుమానించాడు.&amp;nbsp;  ఇదే విషయాన్ని తన బావమరిది దాదాఖలందర్‌కు వివరించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని భావించిన ఫకృద్దీన్‌ ఆమెను అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇందులో భాగంగా సోదరుడు దస్తగిరితో కలిసి ఈనెల 7వతేదీ సాయంత్రం ఇంటి సమీపంలోని మాల కొండపైన మేకలను మేపుతున్నాడు. మేకల వద్దకు రావాలని తన భార్యకు ఫోన్‌ చేసి పిలిచాడు. దీంతో శంషాద్‌ కొండపైకి వెళ్లింది.&amp;nbsp;  అప్పటికే కాపుకాచిన భర్త ఫకృద్దీన్‌, ఆమె మరిది దస్తగిరిలు ఆమెపై రాళ్లతో దాడి చేసి హత మార్చారు. అనంతరం పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పు పెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే శంషాద్‌ది ఆత్మహత్య కాదని, హత్యచేశారని కొందరు గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో శంషాద్‌ను తామే చంపినట్లు భర్త ఫకృద్దీన్‌, మరిది దస్తగిరి ఒప్పుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.    వృద్ధ దంపతులను మోసం చేసిన బంగ్లాదేశీయులు    బంగ్లాదేశ్ కి చెందని జువెల్ హుస్సేన్(21), లాబ్లూ హుస్సేన్(33) పది రోజుల క్రితం మన దేశంలోకి ప్రవేశించారు. &amp;nbsp;కేరళలోని ఓ గుడి నిర్మాణ పనుల్లో కూలీలుగా రెండు రోజులు పనిచేశారు. ఆ తర్వాత మరోచోట గడ్డికోసే పనికి మారారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో నివసిస్తున్న వృద్ధ దంపతులతో పరిచయం పెంచుకున్నారు. &amp;nbsp; వారి ఒంటిపై బంగారు ఆభరణాలు గమనించి, ఇంట్లో డబ్బు ఎక్కువగా ఉండొచ్చని భావించారు. ఈ నెల 11న వృద్ధ దంపతుల ఇంట్లోకి చొరబడి వారిపై ఇనుపరాడ్లతో దాడిచేసి హతమార్చారు. సొత్తు సర్దుకుని 12న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. అయితే అక్కడి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేరళ పోలీసుల నుంచి మంగళవారం విశాఖపట్నం ఆర్పీఎఫ్‌ పోలీసులకు సమాచారం వచ్చింది.  అనుమానితుల ఫొటోలు పంపడంతో ఈ మేరకు విశాఖ రైల్వేస్టేషన్‌లో పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించారు. తనిఖీలు చేస్తుండగా, పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.11 లక్షల విలువైన బంగారు ఆభరణాలుస్వాధీనం చేసుకున్నారు.  అదనపు కట్నం కోసం భార్యను నగ్నంగా వీడియో తీసి, భర్త బ్లాక్‌మెయిలింగ్     గుంటూరు జిల్లా శ్రీనివాసరావుపేటకు చెందిన దంపతులు తమ పెద్ద కుమార్తెను తాడికొండకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి 2017లో వివాహం జరిపించారు. కాగా.. పెళ్లైన కొద్ది రోజులు భార్యతో ప్రేమగా ఉన్న వ్యక్తి తర్వాతర్వాత తనలోని రాక్షసుడిని నిద్రలేపాడు. అదనపు కట్నం కావాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.  అదనపు కట్నం ఇవ్వడానికి ఆమె అంగీకరిచకపోవడంతో.. బ్లాక్ మెయిల్ కి దిగాడు. భార్య స్నానం చేస్తున్న క్రమంలో రహస్యంగా వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియో చూపించి.. అదనంగా కట్నం తేకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అతని వేధింపులు రోజూ తీవ్రతరం కావడంతో... సదరు మహిళ తన తల్లి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.&amp;nbsp;     </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dswbscncd181ggby06270cgn/vijayawada-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>చంద్రబాబు ఇసుక దీక్షకు ఎమ్మెల్యేల డుమ్మా : ఏమవుతోంది...?</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/10-tdp-mlas-are-attend-chandrababu-naidu-sand-deeksha-12-mlas-are-absent-q109qn</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/10-tdp-mlas-are-attend-chandrababu-naidu-sand-deeksha-12-mlas-are-absent-q109qn</guid>
            <pubDate>Fri, 15 Nov 2019 15:43:00 +0530</pubDate>
            <description>విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలుగు తమ్ముళ్లు షాక్ లపై షాక్ లు ఇస్తున్నారు. వల్లభనేని వంశీమోహన్, దేవినేని అవినాష్ లు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే చంద్రబాబునాయుడుకు మరో షాక్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యేలు.&amp;nbsp;  చంద్రబాబు నాయుడు విజయవాడ కేంద్రంగా ఇసుక దీక్షకు దిగారు. ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు దీక్ష చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు అంటే 12గంటల పాటు దీక్ష చేశారు.&amp;nbsp;  ఈ దీక్షకు అన్ని పార్టీల మద్దతు కోరారు. అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీజేపీ మద్దతు ప్రకటించింది కానీ దీక్షలో పాల్గొనలేదు. లోక్ సత్తా పార్టీ నుంచి భీశెట్టి బాబ్జీ, జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆమ్ ఆద్మిపార్టీ నేతలతో సహా పలు పార్టీల నేతలు చంద్రబాబు దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.&amp;nbsp;  ఇతర పార్టీల నుంచి నేతలు దీక్షకు సంఘీభావం ప్రకటించినా టీడీపీ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. చంద్రబాబు చేసిన 12 గంటల దీక్షలో కేవలం తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది. దీక్ష చేసిన చంద్రబాబును కలుపుకుంటే మెుత్తం 10 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని తెలుస్తోంది. అంటే 13 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారని సమాచారం.&amp;nbsp; &amp;nbsp; విజయవాడలో చేపట్టబోతున్న ఇసుక దీక్ష అత్యంత ప్రతిష్టాత్మకమైనదని ఈ దీక్షలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు నాయుడు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఆదేశాలను 13 మంది ఎమ్మెల్యేలు ఖాతరు చేయలేదు.&amp;nbsp;  ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ టీడీపీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆయన హాజరుకారని అంతా ఊహించారు. దీక్షకు వంశీ హాజరవుతారని కూడా చంద్రబాబు అనుకోరు. &amp;nbsp;వంశీని తీసెయ్యగా మిగిలిన 12 మంది ఎమ్మెల్యేలు ఎందుకు హాజరుకాలేదన్నదానిపైనా ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. దీక్ష ఉందని దాదాపు 20 రోజులు ముందుగానే ప్రకటించినప్పటికీ ఎందుకు ఎమ్మెల్యేలు హాజరుకాలేదనే అంశంపై టీడీపీలో జోరుగా చర్చ జరుగుతుంది. &amp;nbsp;  ఇకపోతే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లాలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు దీక్షలో కనుచూపు మేరలో కనబడలేదు. ఇప్పటికే పార్టీకి దూరంగా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతోపాటే మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారా అన్న చర్చ జరుగుతుంది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు గంటాతోపాటు టీడీపీకి గుడ్ బై చెప్తారా అన్న కోణంలో చర్చ &amp;nbsp;జరుగుతుంది. &amp;nbsp;  మరోవైపు ప్రకాశం జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు కరణం బలరాం, ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయులు, గొట్టిపాటి రవికుమార్ లు కూడా సభలో ఎక్కడా కనిపించలేదని తెలుస్తోంది. కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ లు పార్టీ మారతారంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. అందువల్లే హాజరు కాలేదా లేక వేరే కారణాలు ఉన్నాయా అన్న కోణంలో టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు.&amp;nbsp;  ఇకపోతే రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణలు సైతం హాజరుకాలేదు. రూలర్ సినిమాలో హీరో బాలకృష్ణ బిజీబిజీగా గడుపుతున్నారు. డిసెంబర్ నెలలోనే సినిమా విడుదల &amp;nbsp;కానున్న నేపథ్యంలో షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. &amp;nbsp;  ఇకపోతే చంద్రబాబు నాయుడు ఇసుక దీక్షలో ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, నిమ్మకాయల చినరాజప్పలు మాత్రమే సభావేదికపై హల్ చల్ చేశారు. సినీనటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి స్టేజ్ పై హల్ చల్ చేశారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం ఇసుక దీక్ష వేదికపై వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.&amp;nbsp;  చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఇతర పార్టీల నేతలు వచ్చి సంఘీభావం ప్రకటించి ప్రభుత్వంపై విమర్శలు చేసినా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గైర్హాజరవ్వడంపై టీడీపీకి మింగుడుపడటం లేదు. అధినేత దీక్షకే గైర్హాజరైతే భవిష్యత్ లో పార్టీ పరిస్థితి ఏంటంటూ పసుపు శిబిరంలో చర్చ జరుగుతుంది.&amp;nbsp;  ఈ వార్తలు కూడా చదవండి  మీ కళ్లు గద్దలు పొడవా, పౌరుషమున్న సీఎంవైతే... :జగన్ పై దివ్యవాణి ఫైర్   దొంగ దీక్షలు చేయడంలో చంద్రబాబు దిట్ట...ఆళ్ల ఫైర్   జూ.ఎన్టీఆర్‌తో పోలికా, ఉన్న పళ్లు ఊడిపోతాయి: బాబుపై వంశీ ఘాటు వ్యాఖ్యలు   జూ.ఎన్టీఆర్ ది ముగిసిన కథ, వంశీ నీకు సిగ్గుందా: నారా లోకేష్ ధ్వజం..   అమ్మాయిలతో కలిసున్న ఫోటోలతో ప్రచారం... పోలీస్ కమీషనర్ కు వంశీ ఫిర్యాదు  </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01de7jyha2hzjwbr3hj0wce97q/indiatv9660b9-chandrababu-naidu-son-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ఈ వారం ట్రేడ్‌ టాక్‌: బూతు కథకి వసూళ్లు, బట్టతలేమో హిట్టు!</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/box-office-report-of-yedu-chepala-katha-thippara-meesam-and-bala-movies-q1077t</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/box-office-report-of-yedu-chepala-katha-thippara-meesam-and-bala-movies-q1077t</guid>
            <pubDate>Fri, 15 Nov 2019 14:49:00 +0530</pubDate>
            <description>గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా పడడం లేదు. డిసంబర్&amp;nbsp;నుండి పెద్ద సినిమా తాకిడి ఉండడంతో చిన్న సినిమాలన్నీ ముందుకు&amp;nbsp;జరుగుతూ ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.  అడల్ట్ కంటెంట్&amp;nbsp;ఉన్న సినిమాలకు సేల్స్ బాగుంటాయని 'ఏడు చేపల కథ' మరోసారి&amp;nbsp;నిరూపించింది. కేవలం బూతు కంటెంట్ తో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్&amp;nbsp;రాబట్టుకుంది. ఆ తర్వాత ఆ స్థాయిలో నిలబడలేకపోయినప్పటికీ నిలకడగా&amp;nbsp;వసూళ్లను మాత్రం సాధిస్తోంది.  మూడు గుడ్లుకు రూ.1672 బిల్లు.. షాకైన మ్యూజిక్ డైరెక్టర్!  ఈ సినిమాతో పాటు కుర్ర హీరో శ్రీవిష్ణు నటించిన&amp;nbsp;'తిప్పరామీసం' సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ&amp;nbsp;సినిమాకి కనీసపు ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడిలో&amp;nbsp;సగం కూడా రాక బయ్యర్లు లబోదిబోమంటున్నారు.  ఇక బాలీవుడ్ యంగ్&amp;nbsp;హీరో హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన 'బాలా' సినిమా ప్రేక్షకుల&amp;nbsp;ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. ఈ సినిమాతో మరోసారి&amp;nbsp;తన ఖాతాలో వంద కోట్ల సినిమా వేసుకున్నాడు ఆయుష్మాన్. బట్టతల&amp;nbsp;ఉన్న వ్యక్తి.. అతడి ప్రేమ, పెళ్లి వంటి విషయాలతో ఈ సినిమా సాగుతుంది.&amp;nbsp;  కథ ఎంపిక విషయంలో వైవిధ్యం కనబరుస్తూ నటనలో తన సత్తా చాటుతూ&amp;nbsp;హిట్ల మీద హిట్లు అందుకుంటున్నాడు ఆయుష్మాన్. ఇక ఈ వారం సందీప్&amp;nbsp;కిషన్ నటించిన ' 'తెనాలి రామకృష్ణ బిఏబిఎల్‌' , అలానే విశాల్ నటించిన&amp;nbsp;'యాక్షన్' అనే డబ్బింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.&amp;nbsp; &amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dsq5p32qn0jag6zf66b21n25/botu-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ఈ వారం ట్రేడ్ టాక్.. ఊహించినంత లేదు!</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/this-week-box-office-trade-talk-q0nfff</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/this-week-box-office-trade-talk-q0nfff</guid>
            <pubDate>Fri, 08 Nov 2019 17:17:00 +0530</pubDate>
            <description>టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి రూపొందించిన&amp;nbsp;చిత్రం 'మీకు మాత్రమే చెప్తా' గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.&amp;nbsp;ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ చాలానే శ్రమ పడ్డాడు. తానే స్వయంగా ఓ&amp;nbsp;ప్రచార పాటను కూడా చేశాడు.  కానీ ఎంత చేసినా.. ఈ సినిమాకి సరైన బజ్&amp;nbsp;మాత్రం రాలేదు. మొదటిరోజే వీక్ గా మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ ఆ&amp;nbsp;తరువాత కూడా అదే రీతిన కొనసాగింది. విజయ్ కి లాభాలు వచ్చినా కానీ థియేటర్&amp;nbsp;ఫీడింగ్ కి మాత్రం ఈ సినిమా ఉపయోగపడలేదు. ఈ సినిమాతో పాటు&amp;nbsp;విడుదలైన రవిబాబు 'ఆవిరి' సినిమా నిజంగానే ఆవిరైపోయింది.  మెగా ఫ్యామిలీ అమెరికా లాంటిది.. మిగిలిన వాళ్లకు ఆ అర్హత కూడా&amp;nbsp;లేదు: ఆర్జీవీ!  ఈ&amp;nbsp;సినిమాకి కనీసం పోస్టర్ల ఖర్చు కూడా రానంత దారుణంగా ఫ్లాప్&amp;nbsp;అయింది. ఈ సినిమా కోసం దిల్ రాజుని రంగంలోకి దింపినా ఉపయోగంలేకుండా పోయింది. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో డబ్బింగ్&amp;nbsp;సినిమాలు 'విజిల్', 'ఖైదీ'లకు కలెక్షన్స్ పెరిగాయి. ఈ రెండు సినిమాలకు&amp;nbsp;తెలుగులో లాభాలు వచ్చాయి.  ఇక ఈ వారం శ్రీవిష్ణు నటించిన&amp;nbsp;'తిప్పరామీసం'తో పాటు మరో డీగ్రేడ్ సినిమా 'ఏడు చేపల కథ' బాక్సాఫీస్&amp;nbsp;వద్ద విడుదలయ్యాయి. బూతు ప్రోమోలు, పోస్టర్లతో బజ్ తెచ్చుకున్న&amp;nbsp;'ఏడు చేపల కథ' సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. చీప్ ట్రిక్స్ తో ఈ&amp;nbsp;బూతు సినిమాను ఆడియన్స్ మీద రుద్దాలను భావించారు.  కానీ వర్కవుట్&amp;nbsp;కాలేదు. ఈ సినిమా చూసిన జనాలు మేకర్లను తిట్టిపోస్తున్నారు. ఎరోటిక్ థ్రిల్లర్పేరుతో ఇంతగా దిగాజారుతారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. కనీసపు&amp;nbsp;ప్రొడక్షన్ వాల్యూస్ లేని ఈ సినిమా తొలిరోజే చతికిలపడింది.  ఇక&amp;nbsp;శ్రీవిష్ణు నటించిన 'తిప్పరామీసం' సినిమా ట్రైలర్ బాగుండడంతో సినిమాపై&amp;nbsp;అంచనాలు పెరిగాయి. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.&amp;nbsp;ఈ వారంలో కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే సినిమా రాలేదనే చెప్పాలి! &amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01ds5d8msgr91skxtf3kbq9ezm/movies-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>క్రైమ్ రౌండప్: తల్లిని చంపిన కీర్తి జైలుకి.. భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య, మరిన్ని</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q0e2oj</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q0e2oj</guid>
            <pubDate>Sun, 03 Nov 2019 16:03:00 +0530</pubDate>
            <description>భర్తతో విభేదాలు.. అత్తపై పగ: మెట్టినింటికి కన్నం వేసిన కోడలు  సికింద్రాబాద్ సమీపంలోని బోయిన్‌పల్లిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. అత్తపై పగ తీర్చుకోవడానికి మెట్టింట్లోనే దొంగతనం చేసిన కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డికి చెందిన కొల్లూరి శ్రీనివాస్ తన కుమార్తె సుప్రియను పాత బోయిన్‌పల్లి మల్లిఖార్జున‌నగర్‌కు చెందిన వడ్డీ వ్యాపారి సరళ కుమారుడు ధీరజ్‌తో నాలుగు నెలల క్రితం పెళ్లి చేశారు.  పెళ్లయిన కొద్దిరోజులకే సుప్రియ, ధీరజ్‌ల మధ్య తీవ్రస్థాయిలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఇక తన జీవితం ఇక బాగుపడదని భావించిన సుప్రియ ధీరజ్ విషయంపై అత్తను ప్రశ్నించి పుట్టింటికి వెళ్లిపోయింది. దసరా పండుగకు మెట్టినింటికి వచ్చిన సుప్రియ ధీరజ్ విషయంపై అత్తను మరోసారి ప్రశ్నించినా ఆమె బదులివ్వలేదు. దీంతో సుప్రియ తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చేసింది.  Also Read:నిండు గర్భిణి... ఇద్దరు ప్రియులతో కలిసి... భర్తను అతి కిరాతకంగా....  వచ్చేటప్పుడు ఇంటి తాళాలను తీసుకొచ్చింది. అత్తపై ప్రతీకారం తీర్చుకుంటానని, సహకరించాలని సోదరుడు, తల్లిదండ్రులను కోరింది. కూతురి ఆనందం కోసం వారు అంగీకరించారు. ఇందుకోసం అత్తింటికి కన్నం వేయాలని భావించి నకిలీ తాళం చెవిని సృష్టించింది. ప్లాన్‌లో భాగంగా ఈ నెల 21న హైదరాబాద్ వచ్చింది. సరళ ఇంటి పరిసరాల్్లో మాటువేసి.. ఆమె బయటకి వెళ్లిన వెంటనే తల్లిదండ్రులు, సోదరుడు సాత్విక్ సాయంతో నకిలీ తాళం చెవితో లోపలికి ప్రవేశించింది.  బంగారు ఆభరణాలు, వెండిని సంచిలో వేసుకుని.. దీనిని దొంగతనంగా చిత్రీకరించేందుకు గాను దుస్తులను చిందరవందర చేశారు. పడకగది తలుపు తెరిచి.. బయటకు వచ్చేటప్పుడు గుమ్మం దగ్గర ద్వారానికి గడియ పెట్టకుండా వదిలేసి పరారయ్యారు. బయట పనిముగించుకుని ఇంటికి వచ్చిన సరళ బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో అదే రోజు రాత్రి బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.&amp;nbsp;  ఆస్తి కోసమే కీర్తితో శశి ప్రేమాయణం, తల్లిపై ద్వేషం పెంచి... హత్యకు కుట్ర  హైదరాబాద్ హయత్‌నగర్‌లో తల్లిని చంపిన కీర్తి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తల్లిని చంపేలా కీర్తిని ప్రోత్సహించింది ఆమె ప్రియుడేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. కేవలం ఆస్తి కోసమే ఆమె ప్రియుడు శశి... కీర్తిని ప్రేమించాడని తమ ప్రేమకు ఆమె తల్లి రజిత అడ్డుగా ఉందని అతను కక్ష కట్టాడు. ఇదే క్రమంలో తల్లిపై కీర్తికి లేనిపోని విషయాలను నూరిపోసి ద్వేషం ఏర్పడేలా చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో పక్కా ప్లాన్ ప్రకారం ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసింది కీర్తి.&amp;nbsp;  Also Read:తల్లిని చంపిన కీర్తి: చంచల్‌గూడ జైల్లో ప్రత్యేక నిఘా  కూతురు కీర్తి ఇద్దరు యువకులతో ప్రేమ వ్వహారం నడిపిస్తున్న విషయాన్ని తల్లి రజిత (38) గుర్తించింది. కూతురు కీర్తిని తల్లి రజిత మందలించింది. దాంతో కక్ష పెంచుకుని ప్రియుడితో కలిసి హతమార్చింది.&amp;nbsp;తండ్రి లారీ డ్రైవర్ గా డ్యూటీకి వెళ్లగా తల్లి మృత దేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ప్రియుడితో కలిసి కీర్తి ఇంట్లో మూడు రోజుల పాటు గడిపింది. దుర్వాసన రావడంతో అదే ప్రియుడి సహాయంతో స్వగ్రామం రామన్నపేట సమీపంలో రైలు పట్టాల వద్ద మృతదేహాన్ని పడేసింది.&amp;nbsp;  తాను విశాఖపట్నం పర్యటనకు వెళ్లానని తండ్రికి చెప్పి ఇంటి వెనకాల ఉండే మరో ప్రియుడితో కీర్తి గడిపింది. తండ్రి శ్రీనావాస్ రెడ్డి నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.&amp;nbsp;  తిరుమలలో రెచ్చిపోతున్న దళారీలు  ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. నకిలీ సిఫారసు లేఖలు సృష్టించి దర్శనాలు చేయిస్తామని భక్తులను మభ్యపెడుతున్నారు. మూడు దర్శనాలు.. ఆరు డబ్బులు అన్నట్లుగా వీరి దందా సాగుతోంది. అయితే టీటీడీ అదనపు ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత గడ్డుకాలం మొదలైంది. క్యూలైన్ల వద్ద అనుమానం కలిగిన టిక్కెట్లను తనిఖీలు చేయడం ప్రారంభించడంతో దళారుల బాగోతం బయటపడుతోంది.  గత రెండు నెలల కాలంలో మొత్తం 300 మంది దళారులను టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న దళారి చారి వ్యవహారంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 46 మంది మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫారసు లేఖలపై కొందరు దర్శనాలు పొందినట్లుగా అధికారులు గుర్తించారు.  Also Read:తల్లి రజితను చంపిన కీర్తి: దృశ్యం సినిమాకు రెండో వెర్షన్  తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం సిఫారసు లేఖపై 36 సార్లు టిక్కెట్లు పొందగా.. అంబర్‌పేట ఎమ్మెల్యే సిఫారసుపై 23, వరంగల్ ఎమ్మెల్యే కోటాలో 17, ఎంపీ కోటాలో 11 సార్లు టిక్కెట్లు పొందారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ, ప్రస్తుత హోంమంత్రులను సైతం దళారులు వదిలిపెట్టలేదు. ఒక్క దళారే వందల సార్లు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై టిక్కెట్లు పొంది భక్తులకు విక్రయించాడు. అలాగే ఇంటిదొంగ గుట్టును కూడా విజిలెన్స్ రట్టుచేసింది. టీటీడీలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న మధుసూదన్ సులభ దర్శనాలు చేయిస్తానని భక్తుల నుంచి వసూళ్లకు పాల్పడ్డాడు.&amp;nbsp;  మరో మహిళతో ఎఫైర్: చచ్చిపోమంటూ వేధింపులు, భార్య ఆత్మహత్య  హైదరాబాద్ అంబర్‌పేటలో దారుణం జరిగింది. భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే... అంబర్‌పేటకు చెందిన వ్యాపారి మురళి కుమారుడు సుకీత్ ఐదేళ్ల క్రితం కార్వాన్ ప్రాంతానికి చెందిన శివానీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కావడంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి అభ్యంతరం తెలపలేదు.  Also read:మెదక్ లో కలకలం... మహిళను ముక్కలు ముక్కలుగా నరికి..  వివాహం తర్వాత కొన్నేళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న సుకీత్ తన భార్యను నిర్లక్ష్యం చేశాడు. వీరిద్దరి వ్యవహారం తెలుసుకున్న శివానీ భర్తను ప్రశ్నించడంతో అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆరు నెలలుగా వేధింపులు మరింత తీవ్రమవ్వడంతో శుక్రవారం రాత్రి శివానీ అంబర్‌పేటలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.&amp;nbsp; &amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dr9cf5hj0ggyjspwvqp0pn1z/murder-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ఇసుక సంక్షోభంపై పవన్ లాంగ్ మార్చ్: ముప్పేటదాడికి దిగిన వైసీపీ</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/janasena-long-march-ysr-congress-party-fires-on-pawan-kalyan-over-pawan-longmarch-q0cfdy</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/janasena-long-march-ysr-congress-party-fires-on-pawan-kalyan-over-pawan-longmarch-q0cfdy</guid>
            <pubDate>Sat, 02 Nov 2019 18:43:00 +0530</pubDate>
            <description>అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేను గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.&amp;nbsp;  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తన సత్తా ఏంటో నిరూపించేందుకు రెడీ అవుతున్నారు. జనసేన కార్యకర్తలు, మెగా ఫ్యామిలీ అభిమానుల అండదండలతో ప్రభుత్వంపై పోరాటానికి దిగుతున్నారు. అందులో భాగంగా ఏపీలో ఇసుక కొరతతో ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికుల కోసం నిరసనకు దిగారు.&amp;nbsp;  విశాఖపట్నం వేదికగా ఛలో విశాఖపట్నంకు పిలుపు ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇసుక సంక్షోభం అంశాన్ని ఒక అస్త్రంగా చేసుకున్న పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి శంఖారావం పూరించారు. &amp;nbsp;  విశాఖలో ఆదివారం తలపెట్టిన లాంగ్ మార్చ్ ను విజయవంతం చేసి జనసేన అంటే ఏంటో నిరూపించాలని పవన్ వ్యూహరచన చేస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చేలా పోరాటం చేసి రాజకీయ ఉనికిని &amp;nbsp;కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు.&amp;nbsp;  జనసేన పార్టీ లాంగ్ మార్చ్ కు రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో వైసీపీ మాటల యుద్ధానికి దిగింది. పవన్ పై బూతు పురాణం ఇప్పుతోంది. పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు అనేక పార్టీలను ఆహ్వానించారు. అయితే టీడీపీ,లోక్ సత్తా మినహా మరే పార్టీ మద్దతు ప్రకటించ లేదు.&amp;nbsp;  జనసేనకు ఒక్క టీడీపీ మాత్రమే మద్దతు ప్రకటిండంతోపాటు ముగ్గురు మాజీ మంత్రులను లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించడంతో వైసీపీకి ఒక అస్త్రంగా దొరికింది. చంద్రబాబు నాయుడు గతంలో పవన్ చేసిన ఉపకారానికి రుణం తీర్చుకుందామనుకున్నారో లేక తన రాజకీయ ప్రాబల్యం పెంచుకునేందుకు సంఘీభావం ప్రకటించారో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ను కార్నర్ చేసే పరిస్థితికి తీసుకు వచ్చేశారు.  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒక్కరే అంటూ పదేపదే ఆరోపిస్తోంది వైసీపీ. గతంలో తాము ఆరోపిస్తున్నది వాస్తవమేనని ఈ బంధంతో నిరూపితమైందంటూ మంత్రులు పవన్ కళ్యాణ్ పై ముప్పేట దాడికి దిగుతున్నారు.&amp;nbsp;  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శల దాడికి దిగారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. రాష్ట్రంలో ఇసుక కొరతకు కారణాలు ఏమిటో పవన్ కు తెలియడం లేదా అని నిలదీశారు.&amp;nbsp;  ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌కు ఇవేమీ పట్టడం లేదని ఇసుకతోనే రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. గుంటూరులో సొంత పుత్రుడు లోకేశ్‌ దీక్ష చేస్తే వైజాగ్‌లో దత్తపుత్రుడు పవన్‌ లాంగ్ మార్చ్ చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.&amp;nbsp; &amp;nbsp; పవన్ దీక్షకు టీడీపీ నేతలు జన సమీకరణ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో బొగ్గు గనుల్లో తవ్వినట్లు నదిలో అక్రమంగా ఇసుకను తవ్విన విషయాన్ని గుర్తు చేశారు.&amp;nbsp;  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు ప్రభుత్వానికి రూ. 100 కోట్లు జరిమానా విధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇసుక అక్రమాలపై వార్తలు రాసిన రిపోర్టర్లపై టీడీపీ నేతలు దాడి దిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని నిలదీశారు.  అక్రమ ఇసుకను అడ్డుకున్న మహిళా అధికారి వనజాక్షిపై మాజీఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే ఎందుకు స్పందించలేదని అప్పుడు ఏమైపోయారని నిలదీశారు కన్నబాబు. &amp;nbsp;ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న వారిని లారీలతో తొక్కించి చంపించారు. మరి అప్పుడు పవన్ కల్యాణ్ ఎక్కడికి పోయారు అంటూ ప్రశ్నించారు.&amp;nbsp;  ఆనాడు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారు కాబట్టి మాట్లాడలేదా అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ బంధం ఏనాడు విడిపోలేదన్నారు. వారి లాంగ్ జర్నీ కొనసాగుతూనే ఉందని చెప్పుకొచ్చారు.&amp;nbsp;  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. చంద్రబాబు నాయుడు పాలనలో కొన్నికోట్ల మేర ఇసుక దందా నడిచిందని ఆనాడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.&amp;nbsp;  నవంబర్ 3న పవన్ కళ్యాణ్ చేపట్టబోయే లాంగ్ మార్చ్ పై సెటైర్లు వేశారు. పవన్‌ చేస్తోంది లాంగ్‌ మార్చా?... రాంగ్‌ మార్చా? అంటూ ప్రశ్నించారు. ఉనికి కోసమే పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.&amp;nbsp;  ఏ ప్రభుత్వం అయినా ఇసుకను దోచుకుంటుందా? అయిదేళ్లుగా ఎవరు ఇసుక మాఫియా చేశారో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. అందుకే ప్రజలు చంద్రబాబుకు 23 సీట్టిచ్చారని తిట్టిపోశారు.&amp;nbsp;  ఏ రోజూ చంద్రబాబును పవన్‌ ప్రశ్నించిన దాఖలాలు లేవని విమర్శించారు. ఆనాడు చంద్రబాబుతో పవన్ కుమ్మక్కు అయ్యారు కాబట్టే నోరు మెదపలేదన్నారు. విశాఖలో ఎందుకు లాంగ్ మార్చ్ చేస్తున్నారో చెప్పాలని చంద్రబాబు, పవన్‌ కళ్యాన్ ను నిలదీశారు అనిల్ కుమార్ యాదవ్. &amp;nbsp;కృష్ణా, గోదావరి, వంశధార ఒడ్డున చేయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు హితవు పలికారు.&amp;nbsp;  ఇకపోతే మరోమంత్రి ధర్మాన కృష్ణదాస్ అయితే పవన్ పై ఘాటు వ్యాఖ్యలే చేశారు. రాష్ట్రంలో అన్ని విధాలుగా విఫలమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో ఇసుక మాఫియా చెలరేగిపోయిందని గుర్తు చేశారు.&amp;nbsp;  ఆనాడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెుదపలేదని నిలదీశారు. ఇప్పుడు మాత్రం తగుదునమ్మా అంటూ వచ్చి నిరసనల పేరుతో రాజకీయం చేస్తారా అంటూ మండిపడ్డారు .&amp;nbsp;  ఒక పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఒక్కచోట కూడా గెలవలేకపోయాడని విమర్శించారు. పార్టీ అధినేతగా ఆయనకే దిక్కులేనప్పుడు ఏదో పోరాటం చేసేస్తాడంట అంటూ మండిపడ్డారు.&amp;nbsp;  పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు అధికార దాహం ఎక్కువ అంటూ తిట్టిపోశారు. అందువల్లే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారంటూ ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు.&amp;nbsp;  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన కుటిల రాజకీయాలను ప్రజలు గమనించారని చెప్పుకొచ్చారు. అందువల్లే 2019 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని అయినప్పటికీ నేతల్లో మార్పు రావడం లేదని మండిపడ్డారు మంత్రి ధర్మాన కృష్ణదాస్.&amp;nbsp;  మరోవైపు మాజీమంత్రి సి రామచంద్రయ్య సైతం పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. దేశచరిత్రలో ఒక పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల ఓడిపోయిన దాఖలాలు లేవన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయిన ఘనత దేశ చరిత్రలో పవన్‌కల్యాణ్‌కు మాత్రమే ఉందంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తలపెట్టే కార్యక్రమాలను భుజానికెత్తుకునే పవన్‌కు జగన్‌ నైతికత గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు.&amp;nbsp;  పవన్ కళ్యాణ్ సొంతంగా రాజకీయాలు చేయాలని చంద్రబాబునాయుడు చెప్పినట్లు చేయోద్దంటూ మరోమంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు. చంద్రబాబు నాయుడును నమ్ముకుంటే గతంలో నష్టపోయినట్లు మరోసారి కూడా నష్టపోవడం ఖాయమని హెచ్చరించారు.&amp;nbsp;  ఈ వార్తలు కూడా చదవండి  అనిశ్చితి నెలకొంది, మేము పాల్గొనం: పవన్ లాంగ్ మార్చ్ కి హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్  లాంగ్ మార్చ్ కు అన్ని అనుమతులు రెడీ...కావాలనే దుష్ప్రచారం..: నాదెండ్ల   ట్రాక్టర్లతో తొక్కించి చంపారు-వనజాక్షిపై దాడి చేశారు: పవన్ పై మంత్రి కన్నబాబు   జనసేన లాంగ్ మార్చ్ కి బాబు టీం రెడీ: పవన్ తో అడుగేయనున్న ముగ్గురు మాజీమంత్రులు   జనసేన లాంగ్ మార్చ్ కి బాబు టీం రెడీ: పవన్ తో అడుగేయనున్న ముగ్గురు మాజీమంత్రులు  </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dqmhcdmmcnencyfsg0zy36vp/pawan-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>"మహా" మలుపులు: ఫడ్నవీస్ భార్య స్పందన ఇదీ, పవార్ కు శివసేన ఫీలర్లు</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/better-sense-should-prevail-says-wife-of-devendra-fadnavis-q0cc2x</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/better-sense-should-prevail-says-wife-of-devendra-fadnavis-q0cc2x</guid>
            <pubDate>Sat, 02 Nov 2019 17:31:00 +0530</pubDate>
            <description>ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ఏర్పడిన స్తంభనపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ చాలా జాగ్రత్తగా స్పందించారు. రాజకీయ నాయకులు వివేకంతో వ్యవహరించాలని ఆమె అన్నారు.&amp;nbsp;  ప్రభుత్వ ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆమె ఆచితూచి స్పందించారు. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు ఎటు వైపు నిలబడలానే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాకీయ నాయకులు సరైన నిర్ణయం తీసుకోవాలని ఆమె అన్నారు.&amp;nbsp;  అమృత ఫడ్నవీస్ యాక్సిస్ బ్యాంకులో సీనియర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అక్టోబర్ 24వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడి బిజెపి - శివసేన కూటమికి పూర్తి మెజారిటీ లభించింది. అయితే, ముఖ్యమంత్రి పదవి తమకే కావాలని శివసేన పట్టుబడుతుండడంతో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది.&amp;nbsp;  ఇదిలావుంటే, సోమవారంనాడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కానున్నారు. మహారాష్ట్రలో బిజెపి, శివసేన మధ్య తగువు కారణంగా ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఆ భేటీకి ప్రాధాన్యం చేకూరింది.&amp;nbsp;  సోనియా గాంధీతో మాట్లాడాల్సిందిగా శివసేన ముఖ్య నేతలు పవార్ తో చెప్పినట్లు తెలుస్తోంది. దేశ ఆర్థిక పరిస్థితిపై పవార్ సోనియాతో మాట్లాడుతారని అంటున్నారు. కానీ మహారాష్ట్ర రాజకీయాలపైనే ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.&amp;nbsp;  శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలు కలిగేలా చూడాలని కాంగ్రెసు రాజ్యసభ ఎంపీ హుస్సేన్ దల్వాయి ఒకరు సోనియా గాంధీని కోరుతూ లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే సోనియాతో పవార్ భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది.&amp;nbsp;  కాంగ్రెసు, ఎన్సీపీలు శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కాంగ్రెసు మద్దతుదారుల్లోని కొన్ని వర్గాలు అంటున్నాయని, ఆ వర్గాల్లో మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారు కూడా ఉన్నారని హుస్సేన్ దాల్వాయి సోనియాకు రాసిన లేఖలో అన్నారు.&amp;nbsp;  బిజెపిపై తెంపు లేకుండా విరుచుకుపడుతున్న శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ గురువారంనాడు ముంబైలో పవార్ ను కలిశారు. దీపావళి సందర్భంగా మర్యాదపూర్వకంగానే పవార్ ను కలిసినట్లు రౌత్ చెప్పారు శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే అవసరమైన సంఖ్యా బలం తమకు లభిస్తుందని కూడా ఆయన అన్నారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పవార్ తో శుక్రవారం ఫోన్ లో మాట్లాడారు. అయితే, అటువంటిదేమీ జరగలేదని ఎన్సీపీ అన్నది.&amp;nbsp;  శాసనసభ ఎన్నికల్లో బిజెపి, శివసేన కూటమి 161 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద కూటమిగా అవతరించింది. &amp;nbsp;మొత్తం స్థానాలు 288. అయితే, బిజెపి &amp;nbsp;105 స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే 56 మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మంత్రి పదవులు సగం సగం పంచుకోవడమే కాకుండా ప్రభుత్వాన్ని కూడా రోటేషన్ పద్దతిలో రెండు పార్టీలు పంచుకోవాలని డిమాండ్ చేస్తోంది.&amp;nbsp;  ఎన్సీపీ 54 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెసు 44 స్థానాలను గెలుచుకుంది. శివసేనతో కాంగ్రెసు, ఎన్సీపీ కలిస్తే 154 మంది సభ్యులు అవుతారు. అది జరిగితే బిజెపి మైనారిటీలో పడిపోతుంది. అయితే, 24 మంది శివసేన ఎమ్మెల్యేలు తమ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారని బిజెపి అంటోంది.&amp;nbsp;  అయితే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పడే ప్రమాదం ఉందని బిజెపి హెచ్చరించింది. దీంతో శివసేన, బిజెపి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పడే అవకాశం ఉందని బిజెపి నేత సుధీర్ ముగంటివార్ చేసిన ప్రకటనపై శివసేన తీవ్రంగా మండిపడింది. రాష్ట్రపతి మీ పాకెట్లో ఉన్నాడా అని శివసేన మండిపడింది. శాసనసభ కాల పరిమితి &amp;nbsp;ఈ నెల 8వ తేదీతో ముగుస్తుంది. </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dqywnrng897fpc3wamm49fmd/fight-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>ఇసుక చుట్టే చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాజకీయాలు</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/weekend-review-ap-politics-around-the-sand-shortage-issue-q0agz4</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/weekend-review-ap-politics-around-the-sand-shortage-issue-q0agz4</guid>
            <pubDate>Fri, 01 Nov 2019 17:22:00 +0530</pubDate>
            <description>అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ ఈవారం ఇసుక కొరత అంశంపైనే చక్కర్లు కొట్టాయి. ఇసుకకొరతను రాజకీయ అస్త్రంగా చేసుకున్నాయి విపక్షాలు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిరసనలకు దిగింది.&amp;nbsp;  చంద్రబాబు నాయుడు తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఒక్కరోజు నిరహార దీక్షకు సైతం దిగారు. ఇసుక కొరతపై ప్రభుత్వ తీరును తప్పుబడుతూ నారా లోకేష్ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.&amp;nbsp;  తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనలకు దిగడంతో అటు భవన నిర్మాణ కార్మికులు సైతం ఆందోళనబాట పట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఇసుక కొరతను నివారించాలంటూ పలు రకాలుగా నిరసనలు తెలిపారు.&amp;nbsp;  ఇక చంద్రబాబు నాయుడు అయితే ఇసుకకొరత అంశంపై సమరశంఖారావం పూరించారు. ఇసుక కొరత వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డ బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధిత కటుంబాలకు ఆర్థికంగా సహాయం ప్రకటించారు చంద్రబాబు నాయుడు.&amp;nbsp;  మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇసుక కొరత అంశాన్ని ఎజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహరచన చేశారు. నవంబర్ 3న విశాఖపట్నం వేదికగా జనసేన లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.&amp;nbsp;  అంతవరకు పలు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో జనసైనికులు జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిరసనలకు దిగారు. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఆందోళన చేపట్టారు.&amp;nbsp;  ఇదిఇలా ఉంటే బీజేపీ సైతం వైసీపీ ప్రభుత్వంపై చురకలు అంటించింది. గాంధీ సంకల్పయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టిన బీజేపీ నేతలు అవకాశం చిక్కినప్పుడుల్లా ఇసుక కొరతను భూతద్దంలో చూపిస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. &amp;nbsp;  లక్షలాదిమంది కార్మికులను రోడ్డుపాలు చేసిన ఇసుక సమస్యపై బీజేపీ మొదటినుండి రాజీలేని పోరాటంచేస్తూ గవర్నర్,సీఎం దృష్టికి తెచ్చి భిక్షాటనతో ప్రజాపక్షాన నిలిచాని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అంతేకాదు నవంబర్ 4న బీజేపీ ఆధ్వర్యంలో ఇసుక సత్యాగ్రహం చేపట్టనున్నట్లు ప్రకటించింది.&amp;nbsp;  అటు వామపక్ష పార్టీలు సైతం ఇసుకకొరత అంశంపై పోరాటాన్ని ఉధృతం చేశాయి. అర్థనగ్నంగా నిరసన ప్రదర్శనలకు దిగారు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి భిక్షాటన చేశాయి. ఇసుక కొరతపై సీఎం జగన్ కు లేఖాస్త్రాలు సంధించాయి వామపక్షాలు.&amp;nbsp;  ఇసుక కొరతపై విపక్షాలన్నీ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దిగిరావాల్సి వచ్చింది. ఐదు నెలలుగా విపక్షాల ఒత్తిడికి తలొగ్గని సీఎం జగన్ ఇసుకకొరత అంశంలో ఒక మెట్టుదిగారు.&amp;nbsp;  ఒకవైపు చంద్రబాబు నాయుడు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడం మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా లాంగ్ మార్చ్, నవంబర్ 4న బీజేపీ ఇసుకసత్యాగ్రం కు పిలుపునివ్వడంతో జగన్ అప్రమత్తమయ్యారు. వారికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో జగన్ ఇసుక వారోత్సవాలకు పిలుపు ఇచ్చారు.&amp;nbsp;  వారం రోజులపాటు ఇసుకపైనే పనిచేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల తర్వాత ఇసుక కొరత అనే పదం వినకూడదంటూ అధికారులకు స్పష్టం చేశారు. మెుత్తం ఇసుక కొరత కేంద్రంగా ఏపీ రాజకీయాలు నడిచాయి.&amp;nbsp;  ఈ వార్తలు కూడా చదవండి  పొత్తు పొడుపు: ఇసుక సాక్షిగా పవన్ కల్యాణ్ తో చంద్రబాబు దోస్తీ   వంశీ దెబ్బ: చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా చేసిన జగన్ వ్యూహం   అది ప్రజల హక్కు దాని పై మీ బోడిపెత్తనం ఏంటి: జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపాటు   చంద్రబాబు-పవన్ ల వ్యూహానికి జగన్ చెక్ : నేరుగా రంగంలోకి సీఎం, ఇక సమరమే   క్వారీ కోసమే సామాన్యులపై కేసులు...: వైసిపి ఎమ్మెల్యేపై కాల్వ శ్రీనివాసులు ఆరోపణ   మంత్రి పదవికి రాజీనామా చేస్తా: అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు    </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01d6fe9czcryxnjbm6mneh7349/pawan-babu-jagan_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>పొత్తు పొడుపు: ఇసుక సాక్షిగా పవన్ కల్యాణ్ తో చంద్రబాబు దోస్తీ</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/former-cm-chandrababu-naidu-to-support-pawan-kalyan-long-march-may-alliance-between-tdp-janasena-q0ag5a</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/former-cm-chandrababu-naidu-to-support-pawan-kalyan-long-march-may-alliance-between-tdp-janasena-q0ag5a</guid>
            <pubDate>Fri, 01 Nov 2019 17:04:00 +0530</pubDate>
            <description>అమరావతి: రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అంటే ఇద్దరు మనుషుల మధ్య చిచ్చు పెడతానన్నది ఒక సామెత. ఆ సామెతను ఇసుకకు అన్వయిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలనుకుంటే ఏపీ రాజకీయాలను చూడాల్సిందే. &amp;nbsp;  ఇసుక ఇసుక నువ్వేమి చేస్తావంటే అధికార విపక్షాల మధ్య చిచ్చు పెట్టగలను, రాజకీయాలకు కేంద్రంగా ఉండగలను, అవసరమైతే పాత బంధాలను కూడా కలపగలను అని చెప్పిందట. ఇసుకేంటి మాట్లాడటం ఏంటి అనుకుంటున్నారా...?  గత వారం రోజులుగా ఏపీని కుదుపుకుదిపేస్తున్న ఇసుక అంశం మామూలుగా లేదు. ఈ ఇసుక కొరత అంశాన్నే టాపిక్ గా తీసుకుని విపక్షాలు లాభం పొందేందుకు ప్రయత్నిస్తే కొన్ని పార్టీలు పాత బంధుత్వానికి ప్రయత్నిస్తున్నాయి.&amp;nbsp;  రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవంబర్ 3న విశాఖపట్నం వేదికగా లాంగ్ మార్చ్ కు పిలుపు ఇచ్చారు. ఇసుక కొరత అనేది రాష్ట్ర సమస్య అని అందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు.&amp;nbsp;  2014లో ఏ పార్టీలకు అయితే పవన్ కళ్యాణ్ మద్దతు పలికారో ఆ పార్టీలకు ముందుగా ఫోన్ చేశారు. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడులకు స్వయంగా ఫోన్ చేసి లాంగ్ మార్చ్ లో పాల్గొనాల్సిందిగా కోరారు.&amp;nbsp;  పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు బీజేపీ హ్యాండ్ ఇచ్చింది. ఏపీలో ఇసుక కొరతపై ఉద్యమాన్ని మెుదలుపెట్టిందే బీజేపీ అని అలాంటిది తాము ఎందుకు జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాలని నిలదీసింది. జనసేనతో వేదిక పంచుకోలేమని తేల్చి చెప్పేసింది.&amp;nbsp;    ఇకపోతే మరో పాతమిత్రపార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రం పవన్ లాంగ్ మార్చ్ కు మద్దతు పలికింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ లో టీడీపీ నాయకులు పాల్గొంటారని స్పష్టం చేశారు.&amp;nbsp;  లాంగ్ మార్చ్ కు మద్దతుతోనే ఆగిపోలేదు....భవిష్యత్ లో ప్రభుత్వంపై పోరాటానికి జనసేన పార్టీ ఎలాంటి పోరాటానికి పిలుపు ఇచ్చినా తాను ఆహ్వానిస్తామని తమ పార్టీ మద్దతు తప్పకుండా ఉంటుందని ప్రకటించేశారు.&amp;nbsp;  పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు మద్దతు పలకడంతోపాటు భవిష్యత్ కార్యక్రమాలకు కూడా అండగా ఉంటామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడంతో మళ్లీ జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు చిగురిస్తోందని ప్రచారం జరుగుతుంది.&amp;nbsp;  ఇసుక కొరత సాక్షిగా జనసేన, టీడీపీల మధ్య పొత్తు పొడుస్తోందని ప్రచారం. ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తప్ప వేరొకరు మద్దతుగా నిలిచే ప్రసక్తే లేదు.&amp;nbsp;  ఏపీలో జగన్ ను ధీటుగా ఎదుర్కొనాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం కాదని భావించిన చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుకోసం ప్రయత్నించారు. కేంద్రంతో విబేధించి తప్పుచేశామని ఒప్పుకున్నప్పటికీ బీజేపీ మాత్రం కరుణించడం లేదు.&amp;nbsp;  చంద్రబాబు నాయుడు కేసుల కోసం భయపడుతున్నాడని అందువల్ల బీజేపీతో పొత్తుకోసం వెంపర్లాడుతున్నారని బీజేపీ జాతీయ నేతలు విమర్శించారు. టీడీపీతో పొత్తుపెట్టుకోవడానికి ఏముందని టీడీపీ ఓడిపోయిన పార్టీ అంటూ సెటైర్లు వేసింది.&amp;nbsp;  అక్కడితో ఆగిపోలేదు. చంద్రబాబు నాయుడు టీడీపీని బీజేపీలో విలీనం చేస్తామంటే తాము సహకరిస్తామంటూ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు పొలిటికల్ సెటైర్లు వేశారు. పొత్తుకు అయితే డోర్లు క్లోజ్ అయిపోయాయని విలీనానికి అయితే తెరిచే ఉన్నాయన్నారు.&amp;nbsp;    ఇక బీజేపీ తెగేసి పొత్తు ఉండదని చెప్పడంతో చంద్రబాబుకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ జనసేన. జనసేన పార్టీకి ఏపీలో ఓటు బ్యాంకు ఉండటంతో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి పోటీ చేసినా గౌరవప్రదమైన సీట్లన్నా దక్కించుకోవచ్చుననే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది.&amp;nbsp;  ఇప్పటికే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు నమోదు అయ్యాయి. దాంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు టీడీపీ నేతలు. దాంతో వారంతా జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీలోకి లేదా రాష్ట్రంలో ఉన్నా వైసీపీలోకి చేరాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.&amp;nbsp;    ఈ పరిణామాల నేపథ్యంలో జనసేనతో పొత్తు తెలుగుదేశం పార్టీకి ఒక సపోర్ట్ గా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే ప్రస్తుత లాంగ్ మార్చ్ కి భవిష్యత్ కార్యక్రమాలకు టీడీపీ మద్దతు ఉంటుందని ముందుగానే పొత్తుకు చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పొలిటికల్ సర్కిల్ లో వార్తలు గుప్పుమంటున్నాయి.&amp;nbsp; &amp;nbsp;  ఈ వార్తలు కూడా చదవండి  వంశీ దెబ్బ: చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా చేసిన జగన్ వ్యూహం   ఇసుక చుట్టే చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాజకీయాలు   పవన్ కు చంద్రబాబు గుడ్ న్యూస్: నీతోనే ఉంటామన్న మాజీ సీఎం  </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/09c7b675-dac3-4b38-bcfd-e8fa3fe03ff0/image_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>వంశీ దెబ్బ: చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా చేసిన జగన్ వ్యూహం</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/weekend-review-vallbhaneni-vamsi-effect-tension-situation-in-tdp-q0af3k</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/weekend-review-vallbhaneni-vamsi-effect-tension-situation-in-tdp-q0af3k</guid>
            <pubDate>Fri, 01 Nov 2019 16:41:00 +0530</pubDate>
            <description>అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాలన్నీ ఈ వారం రోజులు టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చుట్టూనే తిరిగాయి. వల్లభనేని వంశీ మోహన్ నిర్ణయంపై రాజకీయ పార్టీలన్నీ ఆసక్తిగా గమనించాయి.&amp;nbsp;  గత వారం అంతా వల్లభనేని వంశీ రాజీనామాపైనే చర్చ జరిగితే వైసీపీలో చేరతారా...చేరితే చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఏంటి...జగన్ పెట్టే కండీషన్స్ ఏంటి అసలు వంశీ దారెటు అనే అంశాలపైనే ఈ వారం రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.&amp;nbsp;  వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే అంశంపైనే చర్చ జరిగింది. వల్లభనేని వంశీ బాటలోనే మరికొందరు ఎమ్మెల్యే పయనిస్తారని ప్రచారం జరగడంతో వంశీ విషయంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయంపైనే చర్చ జరిగింది.&amp;nbsp;  ఒకవేళ వల్లభనేని వంశీమోహన్ వైసీపీలో చేరితే సీఎం జగన్ ఎలాంటి కండీషన్లు పెడతారు, గన్నవరం నియోజకవర్గంలో అనుసరించే వ్యూహం ఏంటి అనే అంశంపై పొలిటికల్ సర్కిల్ లో రసవత్తర చర్చ జరిగింది. &amp;nbsp;    వంశీమోహన్ రాజీనామాతో తెలుగుదేశం పార్టీలో కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకోబోమని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడంతో ఊపిరిపీల్చుకున్న చంద్రబాబు జగన్ తాజా వ్యూహంతో చిక్కుల్లో పడ్డారు.&amp;nbsp;  టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరితే తమ సభ్యుల సంఖ్య తగ్గితే తనకు ప్రతిపక్ష హోదా పోతుందనే టెన్షన్ లో పడ్డారు చంద్రబాబు నాయుడు. &amp;nbsp;  మెుదట వంశీని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు చంద్రబాబు నాయుడు. తాను అండగా ఉంటానని కేసులకు భయపడవద్దని భరోసా ఇచ్చినప్పటికీ వంశీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు.&amp;nbsp;  దాంతో దూతను పంపించారు చంద్రబాబు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలను వంశీ వద్దకు పంపించి పార్టీలో ఉండేలా ఒత్తిడి తెచ్చే &amp;nbsp;ప్రయత్నం చేసినప్పటికీ అవి ఫలించలేదు. బుజ్జగింపులు బెడిసికొట్టడంతో దూతలుగా వెళ్లిన ఎంపీ నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలు నిట్టూర్చాల్సి వచ్చింది.&amp;nbsp;    వంశీ వైసీపీలో చేరే అంశం కన్ఫమ్ కావడంతో చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. వంశీతోనే మెుదలై వంశీతోనే ఈ వలసల ప్రక్రియ ఆగిపోవాలని నిర్థారించుకున్నారు. అసంతృప్తిగా ఉన్న నేతల జాబితాను తయారు చేశారు.&amp;nbsp;  వారితో బుజ్జగింపుల పర్వానికి దిగారు చంద్రబాబు అండ్ టీం. వైయస్ జగన్ 151 సీట్లతో అఖండ విజయాన్ని సాధించి అధికారంలోకి రావడంతో టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై చర్చ మెుదలుపెట్టారు. &amp;nbsp;  రాయలసీమ ప్రాంతంతోపాటు ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించడంతో చంద్రబాబు అప్రమత్తమై వారిని బుజ్జగించే పనిలో పడ్డారు.&amp;nbsp;  అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉండాలంటే ఖచ్చితంగా 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ప్రస్తుతానికి అసెంబ్లీలో టీడీపీకి 23 మంది సభ్యులు ఉన్నారు. వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ సంఖ్య కాస్త 22కు పడిపోయింది.&amp;nbsp; &amp;nbsp;&amp;nbsp; మరో ఐదుగురు ఎమ్మెల్యేలు గనుక పార్టీకి గుడ్ బై చెప్తే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోల్పోతుంది టీడీపీ. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆరా తీసినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు ఎవరూ వైసీపీలో చేరకుండా ఉండేందుకు వ్యూహాన్ని రచించారు చంద్రబాబు.&amp;nbsp;  నియోజకవర్గాల వారీగా సమీక్షలు అంటూ మరోవైపు ఇసుక కొరతపై పోరాటం అంటూ రాజకీయాల్లో టాపిక్ డైవర్ట్ చేశారు. దాంతో వలసల అంశం కాస్త మరుగున పడిపోయే పరిస్థితి వచ్చింది. మెుత్తానికి వల్లభనేని వంశీ ఎపిసోడ్ చంద్రబాబు నాయుడుకు కంటిమీద కునుకులేకుండా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.&amp;nbsp;  ఇకపోతే ప్రస్తుతానికి వంశీ మినహా మిగిలిన అసంతృప్త ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉన్నప్పటికీ భవిష్యత్ లో చంద్రబాబుకు వారి నుంచి ముప్పు పొంచే ఉందని తెలుస్తోంది. ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా పదవి పోతుంది. ఇప్పటికే వైసీపీలో చేరేందుకు నలుగురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారట.    ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్ లో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై పొలిటికల్ పంచ్ లు పడ్డాయి. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏ రాజకీయం అయితే చేసి జగన్ ను దెబ్బతీయాలని చూశారో అదే పరిస్థితి జగన్ తీసుకురాకపోయినప్పటికీ ఒక్క వంశీతోనే చుక్కలు చూపించారంటూ ప్రచారం జరుగుతుంది.&amp;nbsp;  ఈ వార్తలు కూడా చదవండి  పొత్తు పొడుపు: ఇసుక సాక్షిగా పవన్ కల్యాణ్ తో చంద్రబాబు దోస్తీ   ఇసుక చుట్టే చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాజకీయాలు   వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ : వంశీ బాటలోనే మరో టీడీపీ ఎమ్మెల్యే   వల్లభనేని వంశీ మారినా క్యాడర్ చంద్రబాబు వెంటే   ఏటూ తేల్చుకోలేని స్థితిలో వల్లభనేని వంశీ: కేశినేని నాని  </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01drgxvt8p1pmyc9spracye91t/chandrababu-vallabhaneni-vamsi-jpeg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>చంద్రబాబు వ్యూహానికి దెబ్బ: హుజూర్ నగర్ లో కూకట్ పల్లి రిపీట్</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/kukatpally-story-has-repeated-in-huzurnagar-for-the-telugu-desam-q017ds</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/kukatpally-story-has-repeated-in-huzurnagar-for-the-telugu-desam-q017ds</guid>
            <pubDate>Sun, 27 Oct 2019 17:16:00 +0530</pubDate>
            <description>హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి సంబంధించి హుజూర్ నగర్ లో కూకట్ పల్లి రిపీట్ అయింది. హుజూర్ నగర్ లో తమ అభ్యర్థిని నిలబెట్టి తమ బలాన్ని తిరిగి పొందాలని చేసిన ప్రయత్నంపై చావు దెబ్బ పడింది. హుజూర్ నగర్ లో కూడా కూకట్ పల్లిలో మాదిరిగానే పెద్ద యెత్తున సీమాంధ్రులు, కమ్మ సామాజిక వర్గం ప్రజలు ఉన్నారు. దాన్ని పునాదిని చేసుకుని తమ బలాన్ని నిరూపించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు.&amp;nbsp;  తెలుగుదేశం పార్టీ 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుని 17 సీట్లకు పోటీ చేసింది. అయితే రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఆ సమయంలో కూకట్ పల్లిలో తాము తప్పకుండా గెలుస్తామని టీడీపీ నాయకులు భావించారు. కూకట్ పల్లిలో ఆంధ్ర సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గం ప్రజలు భారీ సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆ సీటును గెలుచుకోవడానికి ఎన్టీఆర్ మనవరాలు, హరికృష్ణ కూతురు సుహాసినిని రంగంలోకి దింపారు.&amp;nbsp;  Also ReadL&amp;nbsp;Weekend political review: కేసీఆర్ కు ఆర్టీసీ సెగ, హుజూర్ నగర్ ఊరట  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నందమూరి హీరో బాలకృష్ణ కూకట్ పల్లిలో పెద్ద యెత్తున ప్రచారం నిర్వహించారు. కానీ ఫలితం దక్కలేదు. ఆ సీటును టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు గెలుచుకున్నారు. దాంతో లోకసభ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేయలేదు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన తర్వాత తొలిసారి ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది.&amp;nbsp;  అయితే, ఆశ్చర్యకరంగా టీడీపీ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గంలోని 50 వేల మంది ఆంధ్ర సెటిలర్ల ఓట్లను, 11 వేల మంది కమ్మ సామాజిక వర్గం ఓటర్లను దృష్టిలో పెట్టుకుని పోటీకి దిగింది. అది కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన చావా కిరణ్మయిని అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఆ రెండు వర్గాల నుంచి తమకు తగినన్ని ఓట్లు వస్తాయని టీడీపీ నాయకులు భావించారు. అయితే, చావా కిరణ్మయికి కేవలం 1,827 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో ఆమె డిపాజిట్ కూడా కోల్పోయారు.&amp;nbsp;  హుజూర్ నగర్ లో భారీ ఓట్లను సాధించడం ద్వారా తెలంగాణలోని క్యాడర్ లో విశ్వాసం పాదుకొలి తెలంగాణలో పార్టీని పునరుద్ధరించవచ్చునని చంద్రబాబు భావించారు. కానీ, దానిపై హుజూర్ నగర్ ఫలితం తిరుగులేని దెబ్బ వేసింది. తద్వారా తెలంగాణలో పార్టీ తన పూర్వ వైభవాన్ని కోల్పోయిందని అర్థమవుతోంది.&amp;nbsp;  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నా తెలంగాణలో బలంగా ఉండేది. బీసీలు తెలుగుదేశం వెనక తిరుగులేని శక్తిగా నిలుస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పై దృష్టి పెట్టి తెలంగాణను విస్మరించారు. టీడీపీ నాయకులు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరుతూ వచ్చారు. దాంతో తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదనే మాట వినిపిస్తోంది.&amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/01cwc8se9rx0seqgr061qqw9xf/nandamuri-suhasini_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>చంద్రబాబుకు భారీ షాక్: జగన్ షరతులకు బ్రేక్, టీడీపీ ఎమ్మెల్యేల ప్లాన్</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/tdp-mlas-are-planning-to-form-a-separate-group-and-defect-to-avoid-disqualification-q015za</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/tdp-mlas-are-planning-to-form-a-separate-group-and-defect-to-avoid-disqualification-q015za</guid>
            <pubDate>Sun, 27 Oct 2019 16:46:00 +0530</pubDate>
            <description>అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం శాసనసభ్యుడు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన తన నిర్ణయాన్ని ఆదివారం అమలులో పెట్టారు.&amp;nbsp;  టీడీపీ, వైసీపీ నేతలను పార్టీలోకి తీసుకుని వచ్చే బాధ్యతను బిజెపి నాయకత్వం రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి అప్పగించింది. దాంతో ఆయన టీడీపీ నేతలను కలవడం ప్రారంభించారు. ఆయనతో టీజీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం భేటీ అయ్యారు. అయితే, మంత్రులు కోడాలి నాని, పేర్ని నాని కలిసి వంశీని జగన్ వద్దకు తీసుకుని వెళ్లారు.&amp;nbsp;  Also Read:&amp;nbsp;టీడీపీకి వల్లభనేని వంశీ రాజీనామా: రాజకీయాలకు గుడ్‌బై  వంశీకి జిల్లా అధ్యక్ష పదవిని, ఎమ్మెల్సీ పదవిని వైఎస్ జగన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించారు. తర్వాతి కాలంలో ఆయన వైసీపీ గూటికి చేరవచ్చు. ఆయన ప్రత్యర్థి యార్లగడ్డ వెంకటరావు నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదరువుతోంది. ఈ స్థితిలో యార్లగడ్డ వెంకటరావుకు జగన్ భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం సద్దుమణిగే వరకు వంశీ రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు.&amp;nbsp;  ఆ విషయాన్ని అలా ఉంచితే, చంద్రబాబుకు మాత్రం భారీ ముప్పు తప్పదని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం (టీడీఎల్పీ) నిలువునా చీలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమ పార్టీలో చేరాలనుకుంటే పదవులకు రాజీనామా చేసి రావాలని వైఎస్ జగన్ టీడీపీ ఎమ్మెల్యేలకు షరతు పెట్టారు. అలా చేయకుండా పార్టీ మారితే అనర్హత వేటు వేయాలని ఆయన స్పీకర్ సీతారాంకు సూచించారు. తద్వారా టీడీపీ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరకుండా అడ్డుకట్ట వేయగలిగారు.&amp;nbsp;  Also Read:&amp;nbsp;చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఎసరు: జగన్ కి టచ్ లో 10మంది టీడీపీ ఎమ్మెల్యేలు.  దాదాపు పది మంది తెలుగుదేశం నాయకులు పార్టీ మారాలని చూస్తున్నట్లు సమాచారం. వారిలో నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ పెట్టిన షరతును అధిగమించడానికే కాకుండా అనర్హత వేటు పడకుండా చూసుకోవడానికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా టీడీఎల్పీని చీల్చి ప్రత్యేకమైన గ్రూపుగా శాసనసభలో గుర్తింపు పొందాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.&amp;nbsp;  మరో నాలుగున్నర ఏళ్ల పాటు తమ నాయకులను, క్యాడర్ ను కాపాడుకోవడం ప్రస్తుత స్థితిలో చంద్రబాబుకు కనాకష్టంగా ఉంది. వారిని కాపాడుకోవడానికి చంద్రబాబు బిజెపికి దగ్గర కావాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, చంద్రబాబు వ్యూహానికి బిజెపి రాష్ట్ర నేతలు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబుకు బిజెపి తలుపులు మూసుకున్నాయని, ఆయన కోసం తలుపులు తెరిచే ప్రసక్తి లేదని చెబుతున్నారు. దీంతో టీడీపీ నేతలు పార్టీలో కొనసాగడం అంత సులభం కాదని అంటున్నారు. &amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dq6xatecdsxeng6dyajsq9k5/chandrababu-jagan-jpg_760x400.jpg"/>
        </item>
        <item>
            <title>క్రైమ్ రౌండప్: ఐసిసి అధినేత బాగ్ధాదీ హతం.. ప్రసాదంలో విషం పెట్టి 8 మంది హతం.. మరిన్ని</title>
            <link>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q00u20</link>
            <guid>https://telugu.asianetnews.com/weekend-special/this-week-crime-roundup-q00u20</guid>
            <pubDate>Sun, 27 Oct 2019 12:28:00 +0530</pubDate>
            <description>అమెరికాతో పాటు ప్రపంచదేశాల్లో రక్తపుటేరులు పారిస్తున్న మోస్ట్ వాంటేడ్ టెర్రరిస్ట్, ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బాగ్ధాదీని అమెరికా సైన్యం హతమార్చింది. అలాగే డబ్బు కోసం బంధువులు, సన్నిహితులను టార్గెట్ చేసి 8 మందికి విషం పెట్టి చంపిన సీరియల్ కిల్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఇలాంటి నేర వార్తలు మీకోసం.  లాడెన్‌ను చంపినట్లే : అమెరికా సీక్రెట్ ఆపరేషన్.. ఐసిస్ అధినేత బాగ్ధాదీ హతం  ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ హతమైనట్లుగా తెలుస్తోంది. శనివారం సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా ఉగ్రవాదులు హతమయ్యారని..వీరిలో ఇస్లామిక్ స్టేట్ అధినేత కూడా బాగ్థాదీ ఉన్నట్లు తెలుస్తోంది.  అయితే బాగ్ధాదీని మట్టుబెట్టేందుకే అమెరికా సైన్యం ఈ రహస్య ఆపరేషన్ నిర్వహించాయని తెలుస్తోంది. అనుకున్న లక్ష్యం నేరవేరినట్లుగా సైనిక ఉన్నతాధికారులు వైట్ హౌస్‌కు సమాచారం అందించారని ‘‘ న్యూస్ వీక్’’ పత్రిక కథనాన్ని ప్రచురించింది.  అబు బకర్‌ను అంతం చేసేందుకు అత్యున్నత స్థాయిలో పథకరచన చేశారని.. ఈ ఆపరేషన్‌కు ట్రంప్ సైతం ఆమోదముద్ర వేసినట్లుగా కథనంలో పేర్కొంది. దీనికి బలాన్ని చేకూరుస్తూ ‘‘ ఇప్పుడే ఒక పెద్ద సంఘటన’’ జరిగిందంటూ ట్రంప్ ట్వీట్ చేయడం పలు అనుమానాలను కలిగిస్తోంది.  వాయువ్య సిరియాలో ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. అక్కడ పదుల సంఖ్యలో ఉగ్రవాదుల మృతదేహాలు పడివుండటం.. గుర్తు పెట్టేందుకు వీలు లేకపోవడంతో బాగ్ధాదీ మృతదేహాన్ని గుర్తించాలంటే డీఎన్ఏ, బయోమెట్రిక్ పరీక్షలు నిర్వహించాల్సి వుంది. దాడులు జరుగుతున్న సమయంలో అబు బకర్ ఆత్మాహుతి దాడికి యత్నించాడని సైన్యం తెలిపింది.&amp;nbsp;  డబ్బున్న వారే టార్గెట్: ప్రసాదంలో విషం 8 మంది హతం  కేరళలోని కోజికోడ్‌లో ఆస్తి కోసం సొంత కుటుంబసభ్యులనే ఆ ఇంటి కోడలు హతమార్చిన సంఘటన మరచిపోకముందే అచ్చం అదే తరహా ఘటన ఏపీలో జరిగింది. కాకపోతే ఇక్కడ కుటుంబసభ్యులకు బదులు బయటివారిని డబ్బు కోసం హతమార్చాడో కిరాతకుడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు హనుమాన్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించడానికి అడ్డదారిని ఎంచుకున్నాడు. తన బంధువులు, పరిచయస్తుల్లో బాగా డబ్బున్న వారిని ఎంచుకుని పూజల పేరిట మాయ చేశాడు.  పూజ చేయించి నాణేం ఒకటి దగ్గర ఉంచుకుంటే అపర కుబేరులు అవుతారని చెప్పేవాడు. తీరా పూజలు చేయించుకున్నప్పటికీ ఫలితం రాని వ్యక్తులు నిలదీస్తే పెద్ద పూజ చేయించానని చెప్పి విషం కలిపిన ప్రసాదం ఇచ్చి హతమార్చేవాడు. ఇతని నిజస్వరూపం ఈ నెల 16న ఓ పీఈటీ హత్యతో వెలుగులోకి వచ్చింది. ఏలూరుకే చెందిన పీఈటీ నాగరాజు ఈ నెల 16న వట్లూరులోని మేరీమాత ఆలయం వద్ద స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.  అక్కడ చికిత్స తీసుకుంటూ కొద్దిసేపటికే అతను మరణించాడు. గుండెపోటుతోనే నాగరాజు మరణించాడని కుటుంబసభ్యులు తొలుత భావించారు. ఐతే ఆయన ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తీసుకెళ్లిన రూ.2 లక్షల నగదు, ఒంటిపై గల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా నాగరాజుతో చివరిగా ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు బండారం బయటపడింది.  ముందు నాగరాజు మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ వ్యక్తి చెప్పినప్పటికీ.. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు నిజం చెప్పాడు. అతనికి ప్రసాదంలో విషం కలిపి ఇచ్చి అనంతరం ఒంటిపై వున్న బంగారు ఆభరణాలు, డబ్బును తాను తీసుకున్నట్లు అంగీకరించాడు. పోలీసులు మరింత లోతుగా విచారించగా ఆ వ్యక్తి గతంలో ఇదే తరహాలో ప్రసాదంలో విషం కలిపిచ్చి 8 మందిని చంపినట్లుగా తేలింది.  ఏలూరులో ముగ్గురు , కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదుగురిని ఇలాగే హతమార్చినట్లు నిందితుడు చెప్పాడు. తానిచ్చిన ప్రసాదాన్ని తిన్న వెంటనే వారు మరణించేవారని.. అయితే మృతుల కుటుంబసభ్యులు మాత్రం హార్ట్ అటాక్‌తో చనిపోయినట్లు భావంచేవారని ఆ వ్యక్తి వెల్లడించాడు.&amp;nbsp;  భర్తతో గొడవ కొడుకుకి యాసిడ్ తాగించి చంపిన కన్నతల్లి  కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నబిడ్డను ఓ కన్నతల్లే మాతృత్వాన్ని మరిచి హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాలకు చెందిన శివరాణిని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం బెక్కరకు చెందిన పోతుల శివరెడ్డికి ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఐదేళ్ల కుమారుడు యశ్వంత్ రెడ్డి ఉన్నాడు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ప్రతిరోజూ గొడవలు జరుగుతుండటంతో ఆమె కుమారుడిని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది.  పని నిమిత్తం తల్లీదండ్రులు హైదరాబాద్‌కు వెళ్లడంతో శివరాణి గత ఎనిమిది నెలలుగా వర్కాలలోనే ఉంటుంది. ఈ క్రమంలో వారికున్న ఐదెకరాల పొలాన్ని శివరాణి పేరిట రాయించారు తల్లీదండ్రులు. అయితే ఆ భూమిని విక్రయించి తనకు డబ్బులు ఇవ్వాల్సిందిగా శివరెడ్డి.. భార్యను తిరిగి వేధించడం మొదలుపెట్టాడు. దీపావళి పండుగకు రావాల్సిందిగా శివరాణికి భర్త ఫోన్ చేసి పిలవగా.. తాను రానని తేల్చి చెప్పింది.  దీంతో అతను తన బిడ్డను తనకు అప్పగించాల్సిందిగా గొడవకు దిగాడు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శివరాణి.. అవసరమైతే కొడుకునైనా చంపుకుంటా గానీ నీకు మాత్రం ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కుమారుడు యశ్వంత్‌కి మరుగుదొడ్లను శుభ్రం చేసే యాసిడ్ తాగించి నిద్రపుచ్చింది. శనివారం ఉదయం నిద్రలేచి చూసే సరికి కుమారుడు మరణించడాన్ని చూసి తట్టుకోలేక భయంతో ఆమె సైతం యాసిడ్ తాగి 100కు సమాచారం ఇచ్చింది.  వెంటనే వర్కాలలోని ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు శివరాణిని ఆసుపత్రికి తరలించి అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలకు అన్యాయంగా అభం శుభం తెలియని చిన్నారి మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.&amp;nbsp;  పండగపూట హైదరాబాద్‌లో చెడ్డీగ్యాంగ్ కలకలం.. హయత్‌నగర్‌లో చోరీలు   దీపావళీ పండుగపూట హైదరాబాద్‌లో చెడ్డీగ్యాంగ్ రెచ్చిపోతోంది. హయత్‌నగర్ సమీపంలోని కుంట్లూరు ప్రాంతంలో చెడ్డీగ్యాంగ్ సంచారం అలజడి రేపుతోంది. మూడు రోజుల సమయంలో రెండు దొంగతనాలు చేయడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.  ప్రజల సమాచారంతో రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు చెడ్డీగ్యాంగ్‌ను పట్టుకునేందుకు వేట ముమ్మరం చేశారు. కుంట్లూరులోని ఓ వీధిలో సంచరిస్తున్న చెడ్డీగ్యాంగ్‌ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో ఆ దృశ్యాల సాయంతో ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు గుర్తించారు. వీరి కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన రాచకొండ పోలీస్ కమీషనరేట్ వీలైనంత త్వరగా చెడ్డీగ్యాంగ్‌ను పట్టుకునేందుకు గాలిస్తోంది.&amp;nbsp;  యువతిని అత్యాచారం చేసి హత్య కేసులో మానవ మృగాడు, సైకో కిల్లర్‌ సైనేడ్‌ మోహన్‌ కుమార్‌ (56)కు మరణ శిక్ష ఖరారయింది. &amp;nbsp;మంగళూరులోని ఆరో అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. మహిళపై అత్యాచారం కేసులో అతనిపై నేరారోపణలు రుజువయ్యాయి.&amp;nbsp;  మహిళలే టార్గెట్...గర్భనిరోదక మాత్ర పేరిట సైనెడ్ ఇచ్చి.... నాలుగోసారి మరణ శిక్ష  విచారణ పూర్తి కావడంతో బుధవారం న్యాయమూర్తి జస్టిస్‌ సయిదున్నిసా గురువారం శిక్ష ఖరారు చేస్తానని తెలిపారు. గురువారం తీర్పు వెలువరిస్తూ మోహన్‌కు మరణ శిక్షను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాష్ట్ర హైకోర్టు ఈ తీర్పును ధృవీకరించిన తరువాత మరణ శిక్ష అమలు చేయాలని తెలిపారు. హైకోర్టు మరణ శిక్షను ధృవీకరిస్తే ఇతర నేరాల్లో కోర్టులు అతనికి విధించిన శిక్షలను కూడా ఇందులోనే కలిపేయాలని ఆదేశించారు. మొత్తం 17 కేసులకు గాను నాలుగింటిలో అతనికి మరణ శిక్ష ఖరారు అయింది.&amp;nbsp;  సుమారు పదేళ్ల కిందట... దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలూకా బాళెపుణి అంగనవాడిలో సహయకురాలిగా పని చేస్తున్న యువతిని పరిచయం చేసుకుని, ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చి మెజెస్టిక్‌ వద్ద లాడ్జిలో దిగారు. మరుసటి రోజుకు ఆమెకు గర్భనిరోధక మాత్రలంటూ సైనేడ్‌ఇచ్చాడు. ఆమె నగలు, డబ్బుతో పరారయ్యా డు. సైనైడ్‌ మింగిన యువతి కొంతసేపటికే మరణించింది. మరో కేసులో అతన్ని పట్టుకుని విచారిస్తుండగా నేరం బయటపడింది.&amp;nbsp;  అతనికి మహిళలకు మాయమాటలు చెప్పి లోబరుచుకోవడం, డబ్బుదస్కంతో ఉడాయించడం నైజం. వెళ్తూ వెళ్తూ సైనైడ్‌తో మట్టుబెట్టడంలో ఆరితేరాడు. సుమారు 20 మంది అమాయ మహిళలను ఇలా హత్య చేసినట్లు ఇతనిపై ఆరోపణలున్నాయి. 1980 నుంచి 2003 వరకు మంగళూరు ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేశాడు. ఆ సమయంలో నిస్సహాయ మహిళలను గుర్తించి వారితో పరిచయం పెంచుకుని అఘాయిత్యాలకు పాల్పడుతూ వచ్చాడు. &amp;nbsp;  కేరళ, మంగళూరు తదితర ప్రాంతాల్లో సైనైడ్‌ను ఉపయోగించి తన హత్యా పరంపరపను కొనసాగించాడు. పలువురు మహిళల హత్య కేసుల్లో ఇతనికి 2013లో కూడా మంగళూరు కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం, బెదిరించడం వంటి కేసుల్లోనూ మోహన్‌ నిందితుడు. 2007లో బెంగళూరులో ఒక సంగీత ఉపాధ్యాయన్ని నమ్మించి ఇలాగే హత్య చేశాడు.&amp;nbsp; &amp;nbsp; </description>
            <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dr5zz69ghs5qgcbd5qj6m0je/crime-jpg_760x400.jpg"/>
        </item>
    </channel>
</rss>