<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Sat, 14 Mar 2026 10:29:49 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/success-story" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[చదివేది ఏడో తరగతి... చేస్తున్నది ఐటీ ఉద్యోగం]]></title>
            <link>https://telugu.asianetnews.com/success-story/hyderabad-12-year-old-sarath-emerges-as-data-scientist-in-tech-company-q067wj</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/success-story/hyderabad-12-year-old-sarath-emerges-as-data-scientist-in-tech-company-q067wj</guid>
            <pubDate>Wed, 30 Oct 2019 18:36:44 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;సాఫ్ట్ వేర్ ఉద్యోగులైన తల్లిదండ్రులు ఇద్దరూ రోజూ ల్యాప్ టాప్స్ లో పని చేయడాన్ని చిన్నారి గమనిస్తూ ఉండేవాడు. దీంతో.. ఏడేళ్ల వయసులోనే అతడికి కోడింగ్, జావా ఇతర సాఫ్ట్ &amp;nbsp;వేర్ కోర్సులపై ఆసక్తి పెరిగింది. కుమారుడి ఆసక్తిని గమనించిన అతని తల్లిదండ్రులు కూడా బాలుడిని ప్రోత్సహించారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01drdfnpnh1jkneq2zdkpbks56,imgname-sarath.gif" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ఆ బాలుడు చదివేది ఏడో తరగతి... కానీ అతని మేధోశక్తి మాత్రం అపారం. చిన్న వయసులోనే ఎంతో ప్రతిభ సాధించిన బాలుడు... ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని వయసు ఇప్పుడు కేవలం 12ఏళ్లు కావడం విశేషం.&lt;/p&gt; &lt;p&gt;బాలుడి పూర్తి వివరాల్లోకి వెళితే.... గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పి. రాజ్ కుమార్, ప్రియ దంపతులు క్యాప్ జెమినీలో ఉద్యోగం చేస్తూ మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలో నివసిస్తున్నారు. వారి కుమారుడు శరత్(12) స్థానిక శ్రీచైతన్య పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.&lt;/p&gt; &lt;p&gt;సాఫ్ట్ వేర్ ఉద్యోగులైన తల్లిదండ్రులు ఇద్దరూ రోజూ ల్యాప్ టాప్స్ లో పని చేయడాన్ని చిన్నారి గమనిస్తూ ఉండేవాడు. దీంతో.. ఏడేళ్ల వయసులోనే అతడికి కోడింగ్, జావా ఇతర సాఫ్ట్ &amp;nbsp;వేర్ కోర్సులపై ఆసక్తి పెరిగింది. కుమారుడి ఆసక్తిని గమనించిన అతని తల్లిదండ్రులు కూడా బాలుడిని ప్రోత్సహించారు.&lt;/p&gt; &lt;p&gt;వారి ప్రోత్సాహంతో పలు సాఫ్ట్ వేర్ కోర్సులను నేర్చుకున్నాడు. తన కొడుకు ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు... పలు కంపెనీల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు చేశారు. కాగా... ఇటీవల &amp;nbsp;మోంటైగ్నే సంస్థలో నెలకు రూ.25 వేల గౌరవ వేతనంతో శరత్&zwnj;కు డేటా సైంటిస్ట్&zwnj;గా ఉద్యోగం దక్కింది. దాంతో పాటుగా కొన్ని రోజులు ఉద్యోగం, కొన్ని రోజులు చదువుకునేందుకు అవకాశం కల్పించేందుకు అంగీకరించారు. మూడు రోజులు పాఠశాలకు... మరో మూడు &amp;nbsp;రోజులు ఉద్యోగానికి వెళ్తుండటం విశేషం.&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;AlsoRead&amp;nbsp;ఇన్నోవా కారు యజమానికి ఝలక్.. రూ.76వేలు జరిమానా&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;12 ఏళ్ల వయసులో ఏడో తరగతి చదువుతూ డేటా సైంటిస్ట్&zwnj;గా ఉద్యోగం దక్కించుకున్న శరత్&zwnj;ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. శరత్&zwnj; తల్లిదండ్రులు మంగళవారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా శరత్&zwnj;కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>success-story</category>
            <dc:creator>telugu team</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/success-story/hyderabad-12-year-old-sarath-emerges-as-data-scientist-in-tech-company-q067wj"/>
        </item>
        <item>
            <title><![CDATA[Success Story : తెలుగులోనే సివిల్ సర్వీస్ ఎగ్జామ్.. ఇది కదా మాతృభాషపై మమకారం, ఇతడిది కదా అసలైన సక్సెస్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/success-story-telugu-medium-student-cracks-upsc-with-all-india-rank-463-5tm3cvr</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/success-story-telugu-medium-student-cracks-upsc-with-all-india-rank-463-5tm3cvr</guid>
            <pubDate>Sat, 14 Mar 2026 10:20:41 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Success Story : తెలుగు యువతకు స్పూర్తినిచ్చే ఓ సివిల్స్ ర్యాంకర్ స్టోరీ ఇది. ఇంగ్లీష్ వస్తేతప్ప సివిల్స్ సాధించడం అసాధ్యమనే అపోహను పటాపంచలు చేస్తూ తెలుగులోనే ఎగ్జామ్ రాసి ఆలిండియా ర్యాంకు సాధించాడు మన తెలుగబ్బాయి.&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kknamncygpe9ptb8h49y1t06,imgname-sowrotu-ramu-2-1773463557534.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Success Story : తెలుగు యువతకు స్పూర్తినిచ్చే ఓ సివిల్స్ ర్యాంకర్ స్టోరీ ఇది. ఇంగ్లీష్ వస్తేతప్ప సివిల్స్ సాధించడం అసాధ్యమనే అపోహను పటాపంచలు చేస్తూ తెలుగులోనే ఎగ్జామ్ రాసి ఆలిండియా ర్యాంకు సాధించాడు మన తెలుగబ్బాయి.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Success Story : ''కృషి ఉంటే మనుషులు రుషులవుతారు... మహా పురుషులవుతారు'', ''పట్టుదలతో ప్రయత్నిస్తే ఈ ప్రపంచమే కాళ్లకిందకు వచ్చేస్తుంది&quot;... ఇలాంటి మాటలు మోటివేషన్ కోసమే... నిజజీవితంలో ఆచరణసాధ్యం కావు అనుకుంటుంటారు నేటితరం యువతీయువకులు. కానీ దృఢ సంకల్పం ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని... అనుకున్నది సాధించనవచ్చని నిరూపించాడు ఓ తెలుగు కుర్రాడు. దేశంలో అత్యంత కఠినమైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ర్యాంకు సాధించడమే గొప్ప విషయం... అలాంటిది మాతృభాష తెలుగులో రాసి ర్యాంకు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇలా తనకు మాతృభాషపై ఉన్న మమకారాన్ని చాటుకుంటూనే కలను సాకారం చేసుకున్న తెలుగు బిడ్డ సక్సెస్ స్టోరీ ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆంధ్ర ప్రదేశ్ లోని బాగా వెనకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర... అందులో ఇంకా వెనకబడిన ప్రాంతం శ్రీకాకుళం. అలాంటి జిల్లానుండి దేశంలోనే అత్యంత కఠినమైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఆల్ ఇండియా ర్యాంకు సాధించాడు సారోతు రాము. ఇటీవల వెలువడిన UPSC 2025 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఫలితాల్లో రాము ఆలిండియా 463 ర్యాంకు సాధించాడు.&lt;/p&gt;&lt;p&gt;అయితే తెలుగు రాష్ట్రాల నుండి మరికొందరు యువతీయువకులు కూడా సివిల్స్ ర్యాంకు సాధించారు... తమ IAS, IPS కలను నెరవేర్చుకున్నారు. కొందరు రాము కంటే మెరుగైన ర్యాంకు సాధించారు. కానీ వీళ్ళలో ఎవ్వరూ చేయని సాయసం రాము చేశాడు... అందరూ ఇంగ్లీష్ లో ఈ పరీక్ష రాస్తే రాము ఒక్కడే తెలుగులో రాశాడు. అందుకే ఇతడు ప్రత్యేకంగా నిలిచాడు... తెలుగు మీడియం చదివే పేద విద్యార్థులకు స్పూర్తిగా నిలిచాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;శ్రీకాకుళం సివిల్స్ ర్యాంకర్ రాముది చిన్నప్పటి నుండి కష్టాలతో నిండిన జీవితమే. అతడిది సాధారణ వ్యవసాయ కుటుంబం... చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు... తల్లి లక్ష్మి కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించింది. తల్లి కష్టాన్ని చూస్తూ పెరిగిన రాము జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో చదివేవాడు. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తెలుగు మీడియంలోనే... అదీ ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది.&lt;/p&gt;&lt;p&gt;ఇంటర్మీడియట్ కూడా మంచి మార్కులతో పూర్తిచేసుకున్న రాము వరంగల్ ఎన్ఐటీ (NIT) లో సీటు సాధించాడు. ఇక్కడే అతడి జీవితం మలుపు తిరిగింది... సివిల్స్ వైపు అడుగులు పడ్డాయి. ఇంజనీరింగ్ చేస్తూనే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ పై దృష్టి పెట్టాడు. అయితే ఆర్థిక ఇబ్బందులతో ఏడాదిపాటు ఫోర్డ్ కంపెనీలో పనిచేయాల్సి వచ్చింది. ఉద్యోగం చేస్తూనే ప్రిపరేషన్ కూడా సాగించాలని భావించాడు... కానీ అని సాధ్యం కాలేదు. దీంతో 2021 లో మంచి శాలరీతో కూడిన ఉద్యోగాన్ని మానేసి పూర్తిగా యూపిఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రాము చిన్నప్పటినుండి చదువుకున్నది తెలుగు మీడియం... కానీ సివిల్ సర్వీసెస్ పరీక్ష అందరూ ఇంగ్లీష్ లో రాస్తారు. అందరిలా తానెందుకు రాయాలి... తనకు పట్టున్న తెలుగులో రాస్తే ఏమవుతుంది...? అనే ఆలోచన తట్టింది. అందుకే బాగా కష్టమైనా తెలుగులోని సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు... ఎక్కువగా స్టడీ మెటీరియల్స్ అందుబాటులో లేకున్నా సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకునేవాడు. ఈ క్రమంలో ఫెయిల్యూర్స్ ఎదురైనా వెనకడుగు వేయలేదు.&lt;/p&gt;&lt;p&gt;రాము 2021 లో సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించి 3 సార్లు పరీక్ష రాసి విఫలమయ్యాడు. మొదటిసారి ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయాడు... కానీ రెండు, మూడోసారి మెయిన్స్ వరకు వెళ్లాడు. ఇక తాజాగా నాలుగో ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్ తెలుగులోనే రాసి క్లియర్ చేశాడు... ఇంటర్వ్యూలో కూడా ప్రతిభ చాటి సక్సెస్ అయ్యాడు. ఇటీవల వెలువడిన యూపిఎస్సి సివిల్ సర్వీస్ రిజల్ట్స్ లో ఆలిండియా ర్యాంకు సాధించి ఎట్టకేలకు కలను సాకారం చేసుకున్నాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కష్టపడితే ఎంతటి లక్ష్యాన్ని అయినా చేధించవచ్చని రాము నిరూపించాడు. చాలామంది తెలుగు మీడియంలో చదివి ఏం సాధించలేమని నిరుత్సాహపడుతుంటారు... అలాంటివారికి రాము విజయమే స్పూర్తి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఇంగ్లీష్ లో రాయడమే అనుకూలంగా ఉంటుంది... తెలుగులో ఇబ్బందులు ఉంటాయి... కానీ గట్టిగా అనుకుంటే ర్యాంకు సాధించడం అసాధ్యమేమీ కాదంటున్నాడు రాము. తెలగు సాహిత్యం (Telugu Literature) ఆప్షనల్ గా ఎంచుకున్నానని... ఇతర సబ్జెక్ట్స్ పై కూడా తెలుగులోనే పట్టుసాధించి విజయం అందుకున్నానని రాము సగర్వంగా చెబుతున్నాడు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>success-story</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/success-story-telugu-medium-student-cracks-upsc-with-all-india-rank-463-5tm3cvr"/>
        </item>
        <item>
            <title><![CDATA[Success Story : మూడుసార్లు ఫెయిల్.. శత్రువుల వల్లే నాలుగోసారి సివిల్స్ ర్యాంక్ : ఓ తెలుగు ఐఏఎస్ సక్సెస్ స్టోరీ]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/ias-krishnateja-success-story-how-failures-and-critics-made-him-an-ias-officer-gk0cfx4</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/ias-krishnateja-success-story-how-failures-and-critics-made-him-an-ias-officer-gk0cfx4</guid>
            <pubDate>Mon, 12 Jan 2026 10:30:21 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Success Story : మన మిత్రులే కాదు శత్రువులు కూడా కొన్నిసార్లు మంచి చేస్తారని యువ తెలుగు ఐఏఎస్ కృష్ణతేజ సక్సెస్ స్టోరీ చెబుతోంది. ఆయన శత్రువుల వల్లే సివిల్స్ ర్యాంకు సాధించారట.. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ker871vseh1cgz0y2rjbexf5,imgname-krishnateja-2-1768192968569.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Success Story : మన మిత్రులే కాదు శత్రువులు కూడా కొన్నిసార్లు మంచి చేస్తారని యువ తెలుగు ఐఏఎస్ కృష్ణతేజ సక్సెస్ స్టోరీ చెబుతోంది. ఆయన శత్రువుల వల్లే సివిల్స్ ర్యాంకు సాధించారట.. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Success Story : సాధారణంగా ఎవరైనా జీవితంలో సక్సెస్ అయ్యారంటే అందుకు తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులే కారణమని చెబుతారు. కానీ శత్రువులు కూడా ఒక్కోసారి మన విజయానికి కారణం అవుతారని ఓ తెలుగు యువ ఐఏఎస్ నిరూపించారు. ఓ యువకుడు చదువులో టాపర్ అయినా, 24 గంటలు కష్టపడినా సివిల్స్ ర్యాంకు సాధించకపోయాడు... వరుస ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. దీంతో ఐఏఎస్ ఆశయాన్ని వదిలేసిన సమయంలో శత్రువులు తనకు మేలు చేశారని... మరోసారి సివిల్స్ ఎగ్జామ్ రాసి ర్యాంకు సాధించేలా చేశారని స్వయంగా ఆ ఐఏఎస్ తెలిపారు. ఇప్పుడతడు తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన హీరో, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓఎస్డి (ఆఫిసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) గా పనిచేస్తున్నారు. అతడే కృష్ణతేజ ఐఏఎస్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ చిన్నప్పటి నుండి చదువులో చాలా చురుకు. అతడు టెన్త్, ఇంటర్, ఇంజనీరింగ్ అన్నింట్లోనూ టాపర్... దీంతో తాను ఈజీగా సివిల్స్ ర్యాంక్ సాధించగలనని భావించాడు. ఇలా దేశంలోనే అత్యున్నత సర్వీస్ ఐఏఎస్ సాధించి కలెక్టర్ కావాలని కలగనే కృష్ణతేజకు ఆరంభంలో వరుస ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. ఓ దశలో ఇక సివిల్స్ ప్రిపరేషన్ ఆపేసి ఐటీ ఉద్యోగానికి సిద్దమయ్యారు... ఈ సమయంలోనే తన శత్రువుల వల్ల తన ఆలోచన మారిందని... తిరిగి సివిల్స్ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ అయ్యానని అతడు తెలిపారు.&lt;/p&gt;&lt;p&gt;తనకు చిన్నప్పటి నుండి చదువులో అనేక సక్సెలు ఇచ్చిన దేవుడు సివిల్స్ లో మాత్రం మూడు ఫెయిల్యూర్స్ ఇచ్చారని కృష్ణతేజ తెలిపారు. ఐఏఎస్ కావాలని కలగానే తాను ఎంతో కసితో సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేవాడినని... 24 గంటలు చదివినా 3 సార్లు ఫెయిల్ అయ్యానని తెలిపారు. దీంతో కాన్ఫిడెంట్ పూర్తిగా తగ్గి తన తప్పులేంటో తెలుసుకునేందుకు నెల రోజులు తనలో తానే చెక్ చేసుకున్నాడట... కానీ ఏ తప్పులూ దొరకలేవు. మరో నెలరోజులు సివిల్స్ ఎందుకు సాధించలేకపోతున్నానో తెలపాలని ఫ్రెండ్స్ ని ఆరాతీశానని... వాళ్లు కూడా తన ఫెయిల్యూర్ కారణం చెప్పలేకపోయారని కృష్ణతేజ వెల్లడించారు.&lt;/p&gt;&lt;p&gt;చివరకు తాను సివిల్స్ సాధించడం అసాధ్యమని భావించి ఓ ప్రైవేట్ కంపెనీలో ఐటీ ఉద్యోగం కోసం సిద్దమయ్యానని... ఇదే సమయంలో కొందరు శత్రువులు తనకు చాలా మేలు చేశారని కృష్ణతేజ తెలిపారు. సివిల్స్ ప్రిపరేషన్ వదిలేశానని తెలిసి వెక్కిరించడానికి వచ్చిన ముగ్గురు శత్రువులు తనలోని నెగెటివ్స్ తెలిపారని... వాటిని సరిచేసుకుని మరోసారి ప్రయత్నించి ఐఏఎస్ సాధించానని ఆసక్తికరమైన తన సక్సెస్ స్టోరీని వివరించారు కృష్ణతేజ ఐఏఎస్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సివిల్స్ వదిలి ఐటీ జాబ్ కు సిద్దమైన కృష్ణతేజకు ముగ్గురు శత్రువులు కళ్ళు తెరిపించారు. అతడిని వెక్కిరించడానికి వచ్చినవాళ్లు మంచి చేశారు... వాళ్ల వల్లే తన నెగెటివ్స్ ఏంటో తెలిశాయని కృష్ణతేజ పేర్కొన్నారు. వాళ్ళు చెప్పిన మూడు నెగెటివ్స్ ఇవే.&lt;/p&gt;&lt;p&gt;1. సివిల్ సర్వీసెస్ లో మొత్తం 2000 మార్కులు రాతపరీక్ష ఉంటుంది. వ్యాసరూప ప్రశ్నలకు చక్కగా జవాబు రాయడమే కాదు పేపర్ చూడగానే అట్రాక్ట్ కావాలంటే చక్కటి హ్యాండ్ రైటింగ్ అవసరం. అయితే చేతిరాత బాగుండకపోవడంవల్లే మార్కులు తగ్గుతున్నాయని.... అందువల్లే సివిల్స్ సాధించడం అసాధ్యమని ఓ శత్రువు కృష్ణతేజకు తెలిపాడు.&lt;/p&gt;&lt;p&gt;2. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో వ్యాసరూపకంగానే జవాబులు రాయాల్సి ఉంటుంది. కానీ ఇంజనీరింగ్ లో అలవాటైన విధంగా పాయింట్ల రూపంలో జవాబులు రాస్తే మార్కులు తక్కువగా వస్తాయి. ఇదే తప్పు కృష్ణతేజ చేసేవాడట... అందువల్లే మార్కులు తగ్గుతున్నాయని... ఒక విషయాన్ని మంచి కథలాగా వివరిస్తే మంచిమార్కులు వస్తాయని మరో శత్రువు చెప్పాడు.&lt;/p&gt;&lt;p&gt;3. మరో శత్రువు ఇంటర్వ్యూలో ఎందుకు మార్కులు తగ్గుతున్నాడో తెలిపాడట. 'ఏం మాట్లాడినా సూటిగా మాట్లాడతావు... కానీ సివిల్స్ ఇంటర్వ్యూలో డిప్లమాటిక్ గా మాట్లాడితేనే మార్కులు వస్తాయి' అని చెప్పాడట. అందుకే సివిల్స్ ఇంటర్వ్యూలో మార్కులు తగ్గి ర్యాంకు రావడం లేదని చెప్పాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తనను ద్వేషించే శత్రువులు వెక్కింరించడానికి వచ్చి చాలా మేలు చేశారని కృష్ణతేజ చెబుతున్నారు. అందుకే ఎప్పుడైన మన పాజిటివ్స్ గురించి తెలుసుకోవాలంటే కుటుంబసభ్యులు. స్నేహితులను సంప్రదించాలని... నెగెటివ్స్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం శత్రువులను అడగాలని చెబుతున్నారు. తన శత్రువులు సూచించిన నెగెటివ్స్ ను అధిగమించడంవల్లే ఐఏఎస్ కాగలిగానని కృష్ణతేజ తెలిపారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;2009 నుండి సివిల్స్ కు ప్రిపేర్ అవుతూ మూడుసార్లు ఫెయిల్ అయ్యాడు కృష్ణతేజ... 2014 లో నాలుగో ప్రయత్నంలో ఆల్ ఇండియా 66వ ర్యాంకు సాధించాడు. 2015 లో శిక్షణ పూర్తిచేసుకున్న ఇతడికి కేరళ క్యాడర్ లభించింది... ఈ రాష్ట్రంల్లో వివిధ హోదాల్లో పనిచేసిన కృష్ణతేజ గతేడాది 2&zwnj;023 లో త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే అతడు మానవత్వంలో చేసిన ఓ గొప్పపని అతడికి దేశస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది.&lt;/p&gt;&lt;p&gt;కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన దాదాపు 609 మంది చిన్నారులను అక్కున చేర్చుకున్న కృష్ణతేజ దాతల సాయంతో చదువుకునే ఏర్పాటుచేశారు. ఇలా కలెక్టర్ కృష్ణతేజ సహకారంతో అనాధ పిల్లలు హాయిగా చదువుకుంటున్నారు. నిస్వార్థంతో చేసిన సేవలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. వందలాదిమంది అనాధ పిల్లలు చదువుకునే ఏర్పాటుచేసిన కృష్ణతేజ జాతీయ బాలల రక్షణ కమీషన్ పురస్కారానికి ఎంపికయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా కృష్ణతేజ పేరు మారుమోగింది... దీంతో అతడు పవన్ కల్యాణ్ దృష్టిలో పడ్డారు... అతడిని తన ఓఎస్డిగా నియమించుకున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>success-story</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/ias-krishnateja-success-story-how-failures-and-critics-made-him-an-ias-officer-gk0cfx4"/>
        </item>
        <item>
            <title><![CDATA[సెక్యూరిటీ గార్డుగా మొదలై.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ! ఇన్స్పైరింగ్ స్టోరీ]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/from-security-guard-to-software-engineer-zoho-employee-abdul-alim-inspires-all-hegwyzr</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/from-security-guard-to-software-engineer-zoho-employee-abdul-alim-inspires-all-hegwyzr</guid>
            <pubDate>Fri, 10 Oct 2025 22:19:42 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Inspiring stories : జోహోలో సెక్యూరిటీ గార్డ్&zwnj;గా చేరిన అబ్దుల్ అలీం, డిగ్రీ లేకుండానే స్వయంగా స్కిల్స్ పెంచుకుని అదే కంపెనీలో సాఫ్ట్&zwnj;వేర్ ఇంజనీర్&zwnj;గా మారాడు. గార్డుగా మొదలై.. సాఫ్ట్&zwnj;వేర్ ఇంజనీర్&zwnj;గా సాగిన అలీం ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01k77g2dpg4qc5znzxta32ghs6,imgname-abdul-alim-3-1760114587344.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Inspiring stories : జోహోలో సెక్యూరిటీ గార్డ్&zwnj;గా చేరిన అబ్దుల్ అలీం, డిగ్రీ లేకుండానే స్వయంగా స్కిల్స్ పెంచుకుని అదే కంపెనీలో సాఫ్ట్&zwnj;వేర్ ఇంజనీర్&zwnj;గా మారాడు. గార్డుగా మొదలై.. సాఫ్ట్&zwnj;వేర్ ఇంజనీర్&zwnj;గా సాగిన అలీం ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Inspiring Story : జీవితంలో అవకాశాలు ఎప్పుడు, ఎక్కడ వస్తాయో ఎవరికీ తెలియదు. కానీ వాటిని గుర్తించి పట్టుకోవడమే విజయానికి దారి చూపుతుంది. తమిళనాడుకు చెందిన అబ్దుల్ అలీం అలాంటి అరుదైన ఉదాహరణగా నిలిచాడు... ఒకప్పుడు జోహో కంపెనీలో సెక్యూరిటీ గార్డ్&zwnj;గా డ్యూటీ చేసిన ఈ యువకుడు, తన కృషి, నేర్చుకోవాలనే పట్టుదలతో అదే కంపెనీలో సాఫ్ట్&zwnj;వేర్ ఇంజనీర్&zwnj;గా మారి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఎంతో మంది యువతకు స్ఫూర్తి నిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ప్రయాణం లింక్డిన్&zwnj;లో వైరల్&zwnj; అయింది. లక్షల మందికి ప్రేరణగా మారింది !&lt;/p&gt;&lt;p&gt;అబ్దుల్ అలీం జీవితంలో ఎదురైన కష్టాలను అధిగమించి, డిగ్రీ లేకుండానే జోహో కంపెనీలో సాఫ్ట్&zwnj;వేర్ డెవలప్&zwnj;మెంట్ ఇంజనీర్&zwnj;గా మారాడు. 2013లో కేవలం వెయ్యి రూపాయలతో ఇంటిని విడిచి వెళ్లిన అలీం, ఆ డబ్బులో రూ.800 ట్రైన్ టికెట్&zwnj;కు ఖర్చు చేశాడు. మిగిలిన కొద్దిపాటి మనీతో ఉద్యోగం లేకుండా, రెండు నెలలపాటు వీధుల్లో గడిపాడు. ఈ క్రమంలోనే అతనికి జోహో ఆఫీస్&zwnj;లో సెక్యూరిటీ గార్డ్&zwnj;గా ఉద్యోగం దొరికింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జోహోలో సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్న సమయంలో, ఒక సీనియర్ ఉద్యోగి అయిన షిబు అలెక్సిస్ అతన్ని గమనించాడు. ఒకసారి అతనితో మాట్లాడుతున్న సమయంలో &ldquo;నీ కళ్లలో ఏదో స్పెషల్&zwnj;గా కనిపిస్తోంది అలీం&rdquo; అని అన్నాడు. ఆ సమయంలోనే అతని చదువు గురించి కూడా ఆరా తీశాడు. అయితే, తాను పదో తరగతి వరకే చదువుకున్నాననీ, అయితే కొద్దిగా HTML మాత్రమే తెలుసని అలీం చెప్పాడు. &amp;nbsp;నేర్చుకోవాలనే అతని తపన చూసిన షిబు అలెక్సిస్.. అలీంకు మెంటార్&zwnj;గా మారాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఎనిమిది నెలలపాటు, పగటిపూట సెక్యూరిటీ ఉద్యోగం చేస్తూ, రాత్రివేళ షిబు దగ్గర ప్రోగ్రామింగ్ నేర్చుకునేవాడు అలీం. HTML, బేసిక్ కోడింగ్&zwnj;తో ప్రారంభించి.. ప్రావీణ్యం సంపాదించాడు. సొంతంగా ఒక యాప్&zwnj; రూపొందించాడు. ఆ యాప్&zwnj; యూజర్ ఇన్&zwnj;పుట్&zwnj;ని విజువలైజ్ చేసే విధంగా ఉండేది. షిబు అలెక్సిస్ ఆ యాప్&zwnj;ని కంపెనీ మేనేజర్&zwnj;కి చూపించాడు. అతని ప్రతిభ చూసి మేనేజర్ వెంటనే ఇంటర్వ్యూ అవకాశం ఇచ్చాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇంటర్వ్యూ ముందు అలీం తనకు కాలేజ్ డిగ్రీ లేదని చెప్పగా, జోహో మేనేజర్ స్పందిస్తూ, &ldquo;జోహోలో డిగ్రీ అవసరం లేదు, ఇక్కడ నీ నైపుణ్యమే ముఖ్యం&rdquo; అని అన్నారు. దీంతో అలీం ఇంటర్వ్యూ కు వెళ్లాడు. అక్కడ పాస్ అయి డెవలపర్&zwnj;గా జోహోలో చేరాడు. అప్పటి నుండి ఇప్పటివరకు ఎనిమిదేళ్లుగా అదే కంపెనీలో సాఫ్ట్&zwnj;వేర్ డెవలప్&zwnj;మెంట్ ఇంజనీర్&zwnj;గా కొనసాగుతున్నాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తన లింక్డిన్ పోస్ట్&zwnj;లో అలీం తన ప్రయాణం గురించి రాసుకొచ్చాడు. తన పోస్టులో &ldquo;షిబు అలెక్సిస్&zwnj;కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వం నా జీవితాన్ని మార్చింది. అలాగే నాకు అవకాశం ఇచ్చిన జోహో కంపెనీకి ధన్యవాదాలు. నేర్చుకోవడం ఎప్పటికీ ఆలస్యం కాదు.. ఎప్పుడైనా దానిని మొదలుపెట్టవచ్చు&rdquo; అని పేర్కొన్నాడు. ఇప్పుడు అతని పోస్టు వైరల్ గా మారింది.&lt;/p&gt;&lt;p&gt;అబ్దుల్ అలీం కథ, కేవలం ఒక ఉద్యోగ ప్రయాణం మాత్రమే కాదు.. కష్టసమయంలో కూడా నేర్చుకోవాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించిన ఉదాహరణగా నిలిచింది. నిజంగా అతని కథ ఎంతో మందికి ప్రేరణను ఇస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;చెన్నై కేంద్రంగా ఉన్న జోహో కార్పొరేషన్ 1996లో శ్రీధర్ వేంబు స్థాపించారు. సీఆర్ఎం, ఇమెయిల్, ఫైనాన్స్, వర్క్&zwnj;ప్లేస్ సొల్యూషన్స్ వంటి క్లౌడ్&zwnj; ఆధారిత బిజినెస్ టూల్స్&zwnj;ను ప్రపంచవ్యాప్తంగా అందిస్తోంది. స్వదేశీ టెక్ సంస్థగా పేరుగాంచిన జోహో, ఇటీవలి కాలంలో దేశీయ టెక్ అభివృద్ధి కోసం ప్రభుత్వ మంత్రుల మద్దతును పొందడం విశేషం.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>success-story</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/from-security-guard-to-software-engineer-zoho-employee-abdul-alim-inspires-all-hegwyzr"/>
        </item>
        <item>
            <title><![CDATA[అతి చిన్నవయసులోనే జడ్జిగా.. 21ఏళ్ల మయాంక్ రికార్డ్]]></title>
            <link>https://telugu.asianetnews.com/success-story/21-year-old-from-jaipur-set-to-become-india-s-youngest-judge-q1eeba</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/success-story/21-year-old-from-jaipur-set-to-become-india-s-youngest-judge-q1eeba</guid>
            <pubDate>Sat, 23 Nov 2019 06:48:46 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ఎల్&zwnj;ఎల్&zwnj;బీ ఫైనల్&zwnj; ఇయర్&zwnj;లోనే జడ్జిగా ఎంపికై చరిత్ర పుటల్లో నిలిచాడు. జ్యుడిషియల్&zwnj; సర్వీసెస్&zwnj; పరీక్ష రాసేందుకు కనీస వయస్సును 23 సంవత్సరాల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తూ రాజస్తాన్&zwnj; హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో మయాంక్&zwnj;కు ఈ అవకాశం లభించింది.&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01dt6qtd9vqefn6bz0n6vae51v,imgname-mayank-jpg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ఆ కుర్రాడికి నిండా 21ఏళ్లు లేవు. కానీ అప్పుడే జడ్జి స్థాయికి ఎదిగాడు. మన దేశంలో అతి చిన్న వయసులోనే ఆ రికార్డు సాధించిన ఏకైక కుర్రాడుగా జైపూర్ కి చెందిన మయాంక్ అగర్వాల్ చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ కి చెందిన మయాంక్ ప్రతాప్ సింగ్ సాధించిన అరుదైన ఘనత చూసి అందరూ షాకౌతున్నారు. దేశవ్యాప్తంగా అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;img&gt;&lt;/p&gt; &lt;p&gt;ఎల్&zwnj;ఎల్&zwnj;బీ ఫైనల్&zwnj; ఇయర్&zwnj;లోనే జడ్జిగా ఎంపికై చరిత్ర పుటల్లో నిలిచాడు. జ్యుడిషియల్&zwnj; సర్వీసెస్&zwnj; పరీక్ష రాసేందుకు కనీస వయస్సును 23 సంవత్సరాల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తూ రాజస్తాన్&zwnj; హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో మయాంక్&zwnj;కు ఈ అవకాశం లభించింది. ఈ క్రమంలో రాజస్తాన్&zwnj; జుడిషియల్&zwnj; సర్వీస్&zwnj;- &amp;nbsp;2018 పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన మయాంక్&zwnj; తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు.&lt;/p&gt; &lt;p&gt;&ldquo;సమాజంలో న్యాయమూర్తుల కోసం కేటాయించిన ప్రాముఖ్యత మరియు గౌరవం ద్వారా నేను ఎప్పుడో న్యాయ సేవల వైపు ఆకర్షితుడయ్యాను. ఈ సంవత్సరం రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి ఐదేళ్ల ఎల్&zwnj;ఎల్&zwnj;బి కోర్సు పూర్తిచేశాను అని మయాంక్ తెలిపారు.&lt;/p&gt; &lt;p&gt;&lt;img&gt;&lt;/p&gt; &lt;p&gt;ఈ విజయంతో తాను&amp;nbsp;సంతోషంగా ఉన్నానని..తన కుటుంబసభ్యులకు,&amp;nbsp;ఉపాధ్యాయులకు,&amp;nbsp;శ్రేయోభిలాషులందరికీ తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. మొదటి ప్రయత్నంలోనే తాను ఈ పరీక్షలో ఉత్తీర్ణుడవడంలో వారి కృషి ఎనలేనిదని మయాంక్ అన్నారు. జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్ష హాజరు కావడానికి అసలు వయస్సు 23 సంవత్సరాలు, అయితే దీనిని ఈ ఏడాది రాజస్థాన్ హైకోర్టు 21 సంవత్సరాలకు తగ్గించింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఇది సహాయపడుతుందని మయాంక్ వివరించారు. &amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>success-story</category>
            <dc:creator>telugu team</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/success-story/21-year-old-from-jaipur-set-to-become-india-s-youngest-judge-q1eeba"/>
        </item>
        <item>
            <title><![CDATA[IPL Auction 2020: పానీపూరీ అమ్మేవాడు, కోటీశ్వరుడయ్యాడు]]></title>
            <link>https://telugu.asianetnews.com/success-story/ipl-auction-2020-yashasvi-jaiswal-from-street-vendor-to-crorepati-cricketer-q2skeo</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/success-story/ipl-auction-2020-yashasvi-jaiswal-from-street-vendor-to-crorepati-cricketer-q2skeo</guid>
            <pubDate>Fri, 20 Dec 2019 09:00:24 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;పానీపూరీ అమ్ముతూ జీవనం సాగించే యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఐపిఎల్ తో బూరెల బుట్టలో పడ్డాడు. రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ.2.40 కోట్లకు ఐపిఎల్ యాక్షన్ లో కొనుగోలు చేసింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01dwf4879y91kp89ttgpa9gdgt,imgname-freepressjournal-import-2018-07-dhpdzr2w4aavfuj-jpg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;కోల్ కతా: పూట గడవడమే కష్టంగా ఉన్న స్థితి నుంచి ఐపిఎల్ కారణంగా ఓ యువ క్రికెటర్ కోటీశ్వరుడయ్యాడు. రెండేళ్ల క్రితం వరకు ముంబై వీధుల్లో జీవనభృతి కోసం అతను ఒకప్పుడు పానీ పూరీ అమ్మేవాడు. అతడిలోని ప్రతిభను గుర్తించి, అతని దుర్భర స్థితిని గమనించి కోచ్ జ్వాలా సింగ్ ఆదుకోవడంతో అతను క్రికెట్ మీద దృష్టి పెట్టాడు. దాంతో ఇప్పుడు అతన్ని రాజస్థాన్ రాయల్స్ రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది.&lt;/p&gt; &lt;p&gt;అతనెవరో కాదు, ఉత్తరప్రదేశ్ కు చెందిన యశస్వి జైస్వాల్. ఈ 17 ఏళ్ల ముంబై క్రికెటర్ దేశవాళీ క్రికెట్ లో అత్యంత వేగంగా ముందుకు దూసుకొచ్చాడు. పరిమిత 50 ఓవర్ల మ్యాచులో డబుల్ సెంచరీ చేసి, ఆ ఘనతను సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. దాంతో అతని పేరు వెలుగులోకి వచ్చింది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;strong&gt;ఐపిఎల్ కు హైదరాబాద్ కుర్రాడు: ఎవరీ సందీప్?&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో జైస్వాల్ ఆ ఘనతను సాధించాడు. అతని బేస్ ప్రైస్ రూ.20 లక్షలు కాగా, రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసింది. క్రికెటర్ కావాలనే లక్ష్యంతో ముంబై చేరుకున్న యశస్వి ఆజాద్ మైదానంలోని ముంబై యునైటెడ్ క్లబ్ టెంట్ లో మూడేళ్లు గడిపాడు. పానీపురి అమ్మి జీవనం సాగించేవాడు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;రంజీ ట్రోఫీ క్రికెట్ లో కీలకమైన ఆటగాడిగా ఎదిగిన యశస్వి ప్రస్తుతం అండర్ 19 జట్టులో కొనసాగుతున్నాడు. ఐపిఎల్ అతన్ని కోటీశ్వరుడిని చేసింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>success-story</category>
            <dc:creator>telugu team</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/success-story/ipl-auction-2020-yashasvi-jaiswal-from-street-vendor-to-crorepati-cricketer-q2skeo"/>
        </item>
    </channel>
</rss>
