<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Fri, 27 Jun 2025 11:33:55 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/special" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[ఎక్కువ మంది ధనవంతులు ఉండే సిటీ ఇదే]]></title>
            <link>https://telugu.asianetnews.com/special/richest-city-in-the-world-unveiling-the-city-with-over-3-lakh-millionaires/articleshow-6oi4tr7</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/special/richest-city-in-the-world-unveiling-the-city-with-over-3-lakh-millionaires/articleshow-6oi4tr7</guid>
            <pubDate>Fri, 27 Jun 2025 11:33:47 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ఈ నగరంలో ప్రతి 24 మందిలో ఒకరు కోటీశ్వరుడు. అంతేకాదు, ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static-gi.asianetnews.com/images/01j5w7vcjyh0g0ybyrcy3fh7sm/New-York-is-the-richest-city-of-world-1724303389278.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;భారతదేశంలో అత్యంత ధనవంతుడైన వ్యక్తి ఎవరో మీకు తెలిసిందే, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి పేరు కూడా మీరు వినే ఉంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల నగరం ఏదో మీకు తెలుసా? ఈ ధనవంతుల నగరంలో చాలా మంది సాధారణ ప్రజల కంటే ఎక్కువ ధనవంతులుగా పరిగణించబడుతున్నారు. ఇక్కడ ప్రతి 24 మందిలో ఒకరు కోటీశ్వరుడు. అంతేకాదు, ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది. మీ ఊహ సరైనదే, ఈ స్వప్న నగరం న్యూయార్క్ తప్ప మరొకటి కాదు. హెన్లీ &amp;amp; పార్టనర్స్ విడుదల చేసిన ధనవంతుల నగరాల జాబితా ప్రకారం - న్యూయార్క్&zwnj;లో దాదాపు 349,500 మంది కోటీశ్వరులు నివసిస్తున్నారు. 2012 మరియు 2022 మధ్య కరోనా మహమ్మారి కారణంగా కొంతమంది ధనవంతులు నగరం నుండి వెళ్లిపోయినప్పటికీ, ఇక్కడ నివసిస్తున్న ధనవంతుల సంఖ్య 40% పెరిగిందని నివేదిక పేర్కొంది.&lt;/p&gt; &lt;p&gt;&lt;img&gt;&lt;/p&gt; &lt;p&gt;న్యూయార్క్ జనాభా దాదాపు 82 లక్షలు. 744 మంది వ్యక్తుల వద్ద 100 మిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు ఉన్నాయని నివేదిక పేర్కొంది. హెన్లీ &amp;amp; పార్టనర్స్ ప్రపంచంలోని 10 అత్యంత ధనవంతుల నగరాల జాబితాను విడుదల చేసింది. హెన్లీ &amp;amp; పార్టనర్స్ అత్యంత సంపన్నమైన, గొప్ప వారసత్వం, భౌగోళిక స్థానం, పరిశ్రమలు, ప్రపంచ స్థాయిలో ప్రభావాన్ని చూపే స్థానిక అభివృద్ధి మరియు ఇక్కడ నివసిస్తున్న కోటీశ్వరుల సంఖ్య ఆధారంగా నగరాలను అంచనా వేసింది. ఈ విషయంలో న్యూయార్క్ మొదటి స్థానంలో ఉంది.&lt;/p&gt; &lt;p&gt;&lt;img&gt;&lt;/p&gt; &lt;p&gt;ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల నగరాల జాబితాలో అమెరికా ఆర్థిక కేంద్రం మొదటి స్థానంలో ఉండగా, మాన్&zwnj;హట్టన్&zwnj;లోని ఫిఫ్త్ అవెన్యూలో నివాస అపార్ట్&zwnj;మెంట్ల ధరలు అత్యధికంగా ఉన్నాయి. న్యూయార్క్ నగరం ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీలు - నాస్డాక్ మరియు NYSEకి కూడా నిలయం. ఉత్తర కాలిఫోర్నియా, టోక్యో, సింగపూర్, లండన్, లాస్ ఏంజిల్స్, పారిస్, సిడ్నీ, హాంగ్ కాంగ్ మరియు చివరగా బీజింగ్, న్యూయార్క్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category><![CDATA[special]]></category>
            <dc:creator>Health Desk Asianet News Telugu</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/special/richest-city-in-the-world-unveiling-the-city-with-over-3-lakh-millionaires/articleshow-6oi4tr7"/>
        </item>
        <item>
            <title><![CDATA[ట్రైల్ రూమ్ లో కెమేరాలు ఉన్నాయేమో తెలుసుకునేదెలా..?]]></title>
            <link>https://telugu.asianetnews.com/special/how-to-find-hidden-camera-in-trail-room-ram/articleshow-3ply2b6</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/special/how-to-find-hidden-camera-in-trail-room-ram/articleshow-3ply2b6</guid>
            <pubDate>Fri, 27 Jun 2025 11:32:41 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;హిడెన్ కెమేరాలు ఉంటాయేమో.. అందులో తమను క్యాప్చర్ చేస్తారేమో అని భయపడతారు. అయితే.. ట్రైల్ రూమ్ లో కెమేరాలు ఉన్నాయో లేదో ఈజీగా కనిపెట్టేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం...&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static-gi.asianetnews.com/images/01g4s3cr4xam93v9fwzsadfr4j/cusersragupathi-rddocumentsmy-documentsmy-picsfex8tymveay6ocp-jpg--1-.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;మనం అందరూ షాపింగ్ కోసం షాపింగ్ మాల్స్ కి వెళ్తూనే ఉంటాం. అయితే... ఒక డ్రెస్ కొనేటప్పుడు మనం &amp;nbsp;అది మనకు సూట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తాం. అందుకే.. ట్రైల్ రూమ్ కి వెళ్లి మరీ.. అన్నీ ట్రై చేసి.. నచ్చినవి సెలక్ట్ చేసుకుంటాం. అయితే... &amp;nbsp;చాలా మంది అమ్మాయిలకు ట్రైల్ రూమ్ లో &amp;nbsp;డ్రెస్ ట్రై చేయాలంటే భయపడతారు. హిడెన్ కెమేరాలు ఉంటాయేమో.. అందులో తమను క్యాప్చర్ చేస్తారేమో అని భయపడతారు. అయితే.. ట్రైల్ రూమ్ లో కెమేరాలు ఉన్నాయో లేదో ఈజీగా కనిపెట్టేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం...&lt;/p&gt; &lt;p&gt;మీ స్మార్ట్ ఫోన్ లో కెమేరా డిటెక్టర్ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ సహాయంతో కెమేరాలు ఉణ్నాయో లేదో ఈజీగా కనిపెట్టేయవచ్చు. ఈ &amp;nbsp;యాప్ లు మీ ఫోన్ సెన్సార్ లను ఉపయోగించి... &amp;nbsp;హిడెన్ కెమేరాలను ఈజీగా కనిపెట్టేస్తాయి. గూగుల్ ప్లే, యాప్ స్టోర్ లో.. మంచి రేటింగ్ ఉన్న కెమేరా డిటెక్టర్ యాప్స్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.&lt;/p&gt; &lt;p&gt; కెమెరా గుర్తింపు కోసం రాడార్ లేదా ఇన్&zwnj;ఫ్రారెడ్ డిటెక్టర్&zwnj;ని ఉపయోగించండి. ఈ పరికరాలు లెన్స్ ద్వారా వచ్చే రాడార్ లేదా ఇన్&zwnj;ఫ్రారెడ్ సిగ్నల్&zwnj;లను గుర్తించడంలో సహాయపడతాయి. ట్రయల్ గదిని జాగ్రత్తగా పరిశీలించండి. పైన ఉన్న గోడలు, టైల్స్ లేదా లైటింగ్ ఫిట్టింగ్&zwnj;లు వంటి కెమెరాలను దాచగల ప్రదేశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఒక ప్రాంతంలో మెరిసే లేదా వింత కాంతి ప్రతిబింబం ఉంటే, అది అక్కడ కెమెరా ఉండవచ్చని సంకేతం కావచ్చు.&lt;/p&gt; &lt;p&gt; ట్రయల్ రూమ్&zwnj;లో ఏవైనా చిన్న లెన్స్&zwnj;లు లేదా గ్లాస్ ఉన్నాయా అని తనిఖీ చేయండి. కెమెరా లెన్స్&zwnj;లు తరచుగా చిన్నవిగా , మెరిసేవిగా ఉంటాయి. వాటిపై కాంతి ప్రకాశించినప్పుడు ప్రకాశించవచ్చు. ఫ్లాష్&zwnj;లైట్ సహాయంతో చీకటి , దాచిన ప్రాంతాలను తనిఖీ చేయండి. లెన్స్ ఉంటే, అది కాంతిని ప్రతిబింబిస్తుంది.&lt;/p&gt; &lt;p&gt;హిడెన్ కెమేరా కోసం , రేడియో సిగ్నల్&zwnj;లు లేదా ఎలక్ట్రానిక్ సిగ్నల్&zwnj;లను తీయగల ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించండి. కెమెరా రేడియో సిగ్నల్&zwnj;ని ప్రసారం చేస్తుంటే, ఈ పరికరం దానిని తీయగలదు. కొన్నిసార్లు కెమెరా లోపల కదులుతున్న ఎలక్ట్రానిక్ భాగాలు స్వల్ప శబ్దాలు లేదా బీప్&zwnj;లకు కారణం కావచ్చు. ఈ శబ్దాలను జాగ్రత్తగా వినండి.&lt;/p&gt; &lt;p&gt;మీరు ట్రయల్ రూమ్&zwnj;లో &amp;nbsp;హిడెన్ కెమేరాను కనిపెడితే.. &amp;nbsp;వెంటనే దానిని మేనేజ్&zwnj;మెంట్ లేదా చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలకు తెలియజేయాలి. మీ హక్కులు , భద్రత గురించి ఎల్లప్పుడూ తెలుసుకోండి. మీరు ఏదైనా పరిస్థితిలో అసౌకర్యంగా భావిస్తే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వెంటనే చర్య తీసుకోండి. &amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category><![CDATA[special]]></category>
            <dc:creator>ramya Sridhar</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/special/how-to-find-hidden-camera-in-trail-room-ram/articleshow-3ply2b6"/>
        </item>
        <item>
            <title><![CDATA[మొన్న కేరళలో, నేడు విజయవాడలో : కొండ చరియలు ఎందుకిలా విరిగిపడుతున్నాయి? కారణాలేంటి? ]]></title>
            <link>https://telugu.asianetnews.com/special/what-are-landslides-causes-effects-and-prevention-methods-akp/articleshow-10v5get</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/special/what-are-landslides-causes-effects-and-prevention-methods-akp/articleshow-10v5get</guid>
            <pubDate>Fri, 27 Jun 2025 11:31:51 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;కొండ చరియలు విరిగిపడి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిందనే వార్తలు ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా విజయవాడలో ఇలాగే కొండచరియలు విరిగిపడి ప్రాణనష్టం జరిగింది. అసలు ఇలాంటి ప్రకృతి వైపరిత్యాలకు కారణమేంటో తెలుసా?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static-gi.asianetnews.com/images/01j41phx0e7mqf6yzn7cdekp82/Wayanad4-1722339095566.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;మొన్న వయనాడ్, నిన్న ఉత్తరాఖండ్, నేడు విజయవాడ... &amp;nbsp;ప్రాంతాలు వేరే కానీ ప్రమాదం మాత్రం ఒక్కటే.. కొండ చరియలు విరిగిపడటం. ఈ ప్రాంతాల్లోనే కాదు ప్రతి వర్షాకాలం ఏదో ఒకచోట కొండచరియలు విరిగిపడి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్లు తరచూ వింటుంటాం. దీంతో కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ జీవించే పరిస్థితి ఏర్పడింది. తాజాగా విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటంతో ప్రాణాపాయం సంభవించింది. ఇటీవల కాలంలో కొండచరియలు విరిగపడుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటనలు భారత ప్రజలను మరీముఖ్యంగా కొండప్రాంతాల ప్రజలను కలవరపెడుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;అసలు కొండ చరియలు ఎందుకు విరిగిపడతాయి..? వందలు, వేల సంవత్సరాలుగా ప్రజలు కొండ ప్రాంతాల్లో జీవిస్తున్నారు... మరి ఎప్పుడూలేనిది ఇప్పుడీ ప్రకృతి వైపరీత్యం సంబవించడానికి కారణమేంటి..? ఇది సహజ ప్రమాదమా... మన చర్యల వల్ల జరుగుతున్న ప్రమాదమా? వర్షాకాలంలోనే ఈ ఈ ప్రమాదం ఎందుకు జరుగుతుంది? తదితర వివరాలు తెలుసుకుందాం. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;కొండ చరియలు విరిగిపడటం అంటే ఏమిటి ?&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;అడవులు, కొండలు, గుట్టలు, సముద్రాలు, నదులు... ఇవన్నీ ప్రకృతి మానవుడికి ప్రసాదించిన గొప్ప ఆస్తులు. కానీ మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేసుకుంటూ వెళుతున్నాడు. దీంతో మనిషిని కాపాడాల్సిన ప్రకృతి ప్రాణాలు తీస్తోంది. ప్రక&zwnj;ృతి విపత్తులు పెను ప్రమాదాలను సృష్టిస్తున్నాయి. ఇలాంటి ప్రకృతి విపత్తుల్లో ఇటీవల తరచూ వినిపిస్తున్నది కొండచరియలు విరిగిపడటం. మొన్న వయనాడ్ లో మారణహోమం సృష్టించిన కొండచరియలు ఇప్పుడు విజయవాడలో కొందరి ప్రాణాలను బలితీసుకుంది. &amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;కొండలపై వుండే రాళ్లు, మట్టిపెళ్లలు... హిమాలయా వంటి శీతల ప్రదేశాల్లో కొండలపైని మంచు కిందకు జారిపడటమే కొండ చరియలు విరిగిపడటం. ఇది వర్షాకాలంలో ఎక్కువగా సంభవిస్తుంది. వివిధ కారణాలతో కొండపైని రాళ్లు, మట్టి వదులుగా మారి వర్షం పడగానే ఆ వరదనీటితో కలిసి ఒక్కసారిగా కిందకు జారిపడతాయి. ఒక్కోసారి ఈ మట్టి, వరదనీరు కలిసి ఆ ప్రాంతంలోని నివాస &amp;nbsp;ప్రాంతాలను తుడిచిపెట్టేస్తాయి... దీంతో తీవ్ర ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతుంది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;కొండప్రాంతాలు ఎక్కువగా వుండే హిమాలయాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి రాష్ట్రాల్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో మానవ చర్యల కారణంగా అక్కడా ఇక్కడని లేదు... కొండ ప్రాంతాలున్న ప్రతిచోట ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలా వయనాడు, విజయవాడలో ప్రమాదాలు కూడా కొండచరియలు విరిగిపడి ప్రాణాపాయం సంభవించింది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;కొండచరియలు విరిగిపడటానికి కారణం :&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;కొండ చరియలు విరిగిపడటానికి ప్రకృతి మార్పులే కారణం. అయితే ఇందులో కొన్ని సహజంగా జరిగితే చాలావరకు మానవ చర్యల వల్ల జరుగుతాయి. &amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;సహజ కారణాలు : కొండప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో అక్కడ మట్టి కిందకు కొట్టుకుపోతుంది. దీంతో కొండ వాలుప్రాంతాల్లోని మిగతా మట్టి వదులుగా మారిపోతుంది. ఇలా చాలాకాలం ఈ ప్రక్రియ జరిగి ఒక్కసారిగా మట్టి, రాళ్లు కిందరు జారిపడతాయి.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;కొన్ని సందర్భాల్లో కొండవాలు ప్రాంతాల్లో రాళ్లు చాలా వదులుగా అమరివుంటాయి. దీంతో వర్షం పడగానే ఆ వరదనీటి దాటికి ఈ రాళ్లు కొండపైనుండి కింద పడతాయి. భూకంపం వల్ల కూడా కొండ చరియలు విరిగి పడతాయి. మరికొన్ని ప్రకృతి సహజ చర్యల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;మానవ కారణాలు :&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;మనిషి తన జీవితాన్ని మరింత సుఖమయం చేసుకునేందుకు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. అందులో ప్రధానంగా చెట్లను నరికివేసి ఆవాసాలను ఏర్పాటుచేసుకుంటున్నారు. అలాగే గనులు, క్వారీల పేరిట నేలను ఇష్టం వచ్చినట్లు తవ్వేస్తున్నారు. ఇలా కొండ ప్రాంతాల్లో చెట్లను నరికివేయడంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. అలాగే నేలలో లోతుగా తవ్వకాలు జరపడం కూడా ఇందుకు కారణమవుతోంది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;కొండచరియలు విరిగిపడటంవల్ల జరుగుతున్న నష్టాలు :&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;కొండ చరియలు విరిగిపడటం మూలంగా &amp;nbsp;ఇటీవల కాలంలో చాలా ప్రాణనష్టం జరుగుతోంది. కొండప్రాంతాల్లోని నివాసాలను ఒక్కసారిగా బురదమట్టి పడటంతో మనుషులు, ఇతర జంతుజాలం అందులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. భారీగా ఆస్తినష్టం కూడా జరుగుతుంది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;ఇక ఈ కొండచరియలు విరిగిపడి పంటలు కూడా నాశనం అవుతున్నాయి. ముఖ్యంగా కొండప్రాంతాల్లో సాగుచేసే కాఫీ &amp;nbsp;తోటలకు అధిక నష్టం జరుగుతుంది. ఇతర పంటలకు కూడా నష్టం జరిగి రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;ఘాట్ రోడ్లలో తరచూ కొండచరియలు విరిగిపడి రవాణా స్తంబిస్తూ వుంటుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయి తీవ్ర నష్టం జరుగుతుంది. బండరాళ్లు పడటంవల్ల రోడ్డు కూడా దెబ్బతింటుంది.&amp;nbsp; &amp;nbsp; కొన్నిసార్లు కొండచరియలు విరిగిపడి నీటి ప్రవాహాలకు అడ్డుతుంటాయి. దీంతో ఒక్కసారిగా నీరు దారిమళ్లి మానవ ఆవాసాలు, పంటపొలాలపై విరుచుకుపడుతుంటుంది. దీనివల్ల కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంటుంది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;నివారణ చర్యలు :&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ప్రకృతిని నాశనం చేయకుండా వుంటే చాలు... అనేక ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ముఖ్యంగా కొండప్రాంతాల్లో చెట్లను నరకకుండా వుండాలి. అలాగే కొత్తగా చెట్లను పెంచాలి. దీనివల్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. &amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;కొండప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్మాణాలకు ఆ ప్రాంతం అనువుగా వుంటుందో లేదో తెలుసుకోవాలి. సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలి.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;కొండలు, గుట్టలపైన సహజ నీటి ప్రవాహాలకు ఆటంకం కలిగించే చర్యలు చేపట్టరాదు. నీటి ప్రవాహాలను ఆటంకం కలిగిస్తే అవి ప్రమాదాలకు దారి తీయవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category><![CDATA[special]]></category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/special/what-are-landslides-causes-effects-and-prevention-methods-akp/articleshow-10v5get"/>
        </item>
        <item>
            <title><![CDATA[మొన్న కేరళలో, నేడు విజయవాడలో : కొండ చరియలు ఎందుకిలా విరిగిపడుతున్నాయి? కారణాలేంటి? ]]></title>
            <link>https://telugu.asianetnews.com/special/what-are-landslides-causes-effects-and-prevention-methods-akp/articleshow-vwqqzcz</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/special/what-are-landslides-causes-effects-and-prevention-methods-akp/articleshow-vwqqzcz</guid>
            <pubDate>Fri, 27 Jun 2025 11:31:07 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;కొండ చరియలు విరిగిపడి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిందనే వార్తలు ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా విజయవాడలో ఇలాగే కొండచరియలు విరిగిపడి ప్రాణనష్టం జరిగింది. అసలు ఇలాంటి ప్రకృతి వైపరిత్యాలకు కారణమేంటో తెలుసా?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static-gi.asianetnews.com/images/01j41phx0e7mqf6yzn7cdekp82/Wayanad4-1722339095566.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;మొన్న వయనాడ్, నిన్న ఉత్తరాఖండ్, నేడు విజయవాడ... &amp;nbsp;ప్రాంతాలు వేరే కానీ ప్రమాదం మాత్రం ఒక్కటే.. కొండ చరియలు విరిగిపడటం. ఈ ప్రాంతాల్లోనే కాదు ప్రతి వర్షాకాలం ఏదో ఒకచోట కొండచరియలు విరిగిపడి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్లు తరచూ వింటుంటాం. దీంతో కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ జీవించే పరిస్థితి ఏర్పడింది. తాజాగా విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటంతో ప్రాణాపాయం సంభవించింది. ఇటీవల కాలంలో కొండచరియలు విరిగపడుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటనలు భారత ప్రజలను మరీముఖ్యంగా కొండప్రాంతాల ప్రజలను కలవరపెడుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;అసలు కొండ చరియలు ఎందుకు విరిగిపడతాయి..? వందలు, వేల సంవత్సరాలుగా ప్రజలు కొండ ప్రాంతాల్లో జీవిస్తున్నారు... మరి ఎప్పుడూలేనిది ఇప్పుడీ ప్రకృతి వైపరీత్యం సంబవించడానికి కారణమేంటి..? ఇది సహజ ప్రమాదమా... మన చర్యల వల్ల జరుగుతున్న ప్రమాదమా? వర్షాకాలంలోనే ఈ ఈ ప్రమాదం ఎందుకు జరుగుతుంది? తదితర వివరాలు తెలుసుకుందాం. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;కొండ చరియలు విరిగిపడటం అంటే ఏమిటి ?&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;అడవులు, కొండలు, గుట్టలు, సముద్రాలు, నదులు... ఇవన్నీ ప్రకృతి మానవుడికి ప్రసాదించిన గొప్ప ఆస్తులు. కానీ మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేసుకుంటూ వెళుతున్నాడు. దీంతో మనిషిని కాపాడాల్సిన ప్రకృతి ప్రాణాలు తీస్తోంది. ప్రక&zwnj;ృతి విపత్తులు పెను ప్రమాదాలను సృష్టిస్తున్నాయి. ఇలాంటి ప్రకృతి విపత్తుల్లో ఇటీవల తరచూ వినిపిస్తున్నది కొండచరియలు విరిగిపడటం. మొన్న వయనాడ్ లో మారణహోమం సృష్టించిన కొండచరియలు ఇప్పుడు విజయవాడలో కొందరి ప్రాణాలను బలితీసుకుంది. &amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;కొండలపై వుండే రాళ్లు, మట్టిపెళ్లలు... హిమాలయా వంటి శీతల ప్రదేశాల్లో కొండలపైని మంచు కిందకు జారిపడటమే కొండ చరియలు విరిగిపడటం. ఇది వర్షాకాలంలో ఎక్కువగా సంభవిస్తుంది. వివిధ కారణాలతో కొండపైని రాళ్లు, మట్టి వదులుగా మారి వర్షం పడగానే ఆ వరదనీటితో కలిసి ఒక్కసారిగా కిందకు జారిపడతాయి. ఒక్కోసారి ఈ మట్టి, వరదనీరు కలిసి ఆ ప్రాంతంలోని నివాస &amp;nbsp;ప్రాంతాలను తుడిచిపెట్టేస్తాయి... దీంతో తీవ్ర ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతుంది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;కొండప్రాంతాలు ఎక్కువగా వుండే హిమాలయాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి రాష్ట్రాల్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో మానవ చర్యల కారణంగా అక్కడా ఇక్కడని లేదు... కొండ ప్రాంతాలున్న ప్రతిచోట ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలా వయనాడు, విజయవాడలో ప్రమాదాలు కూడా కొండచరియలు విరిగిపడి ప్రాణాపాయం సంభవించింది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;కొండచరియలు విరిగిపడటానికి కారణం :&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;కొండ చరియలు విరిగిపడటానికి ప్రకృతి మార్పులే కారణం. అయితే ఇందులో కొన్ని సహజంగా జరిగితే చాలావరకు మానవ చర్యల వల్ల జరుగుతాయి. &amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;సహజ కారణాలు : కొండప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో అక్కడ మట్టి కిందకు కొట్టుకుపోతుంది. దీంతో కొండ వాలుప్రాంతాల్లోని మిగతా మట్టి వదులుగా మారిపోతుంది. ఇలా చాలాకాలం ఈ ప్రక్రియ జరిగి ఒక్కసారిగా మట్టి, రాళ్లు కిందరు జారిపడతాయి.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;కొన్ని సందర్భాల్లో కొండవాలు ప్రాంతాల్లో రాళ్లు చాలా వదులుగా అమరివుంటాయి. దీంతో వర్షం పడగానే ఆ వరదనీటి దాటికి ఈ రాళ్లు కొండపైనుండి కింద పడతాయి. భూకంపం వల్ల కూడా కొండ చరియలు విరిగి పడతాయి. మరికొన్ని ప్రకృతి సహజ చర్యల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;మానవ కారణాలు :&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;మనిషి తన జీవితాన్ని మరింత సుఖమయం చేసుకునేందుకు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. అందులో ప్రధానంగా చెట్లను నరికివేసి ఆవాసాలను ఏర్పాటుచేసుకుంటున్నారు. అలాగే గనులు, క్వారీల పేరిట నేలను ఇష్టం వచ్చినట్లు తవ్వేస్తున్నారు. ఇలా కొండ ప్రాంతాల్లో చెట్లను నరికివేయడంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. అలాగే నేలలో లోతుగా తవ్వకాలు జరపడం కూడా ఇందుకు కారణమవుతోంది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;కొండచరియలు విరిగిపడటంవల్ల జరుగుతున్న నష్టాలు :&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;కొండ చరియలు విరిగిపడటం మూలంగా &amp;nbsp;ఇటీవల కాలంలో చాలా ప్రాణనష్టం జరుగుతోంది. కొండప్రాంతాల్లోని నివాసాలను ఒక్కసారిగా బురదమట్టి పడటంతో మనుషులు, ఇతర జంతుజాలం అందులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. భారీగా ఆస్తినష్టం కూడా జరుగుతుంది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;ఇక ఈ కొండచరియలు విరిగిపడి పంటలు కూడా నాశనం అవుతున్నాయి. ముఖ్యంగా కొండప్రాంతాల్లో సాగుచేసే కాఫీ &amp;nbsp;తోటలకు అధిక నష్టం జరుగుతుంది. ఇతర పంటలకు కూడా నష్టం జరిగి రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్నారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;ఘాట్ రోడ్లలో తరచూ కొండచరియలు విరిగిపడి రవాణా స్తంబిస్తూ వుంటుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయి తీవ్ర నష్టం జరుగుతుంది. బండరాళ్లు పడటంవల్ల రోడ్డు కూడా దెబ్బతింటుంది.&amp;nbsp; &amp;nbsp; కొన్నిసార్లు కొండచరియలు విరిగిపడి నీటి ప్రవాహాలకు అడ్డుతుంటాయి. దీంతో ఒక్కసారిగా నీరు దారిమళ్లి మానవ ఆవాసాలు, పంటపొలాలపై విరుచుకుపడుతుంటుంది. దీనివల్ల కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంటుంది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;నివారణ చర్యలు :&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;p&gt;ప్రకృతిని నాశనం చేయకుండా వుంటే చాలు... అనేక ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ముఖ్యంగా కొండప్రాంతాల్లో చెట్లను నరకకుండా వుండాలి. అలాగే కొత్తగా చెట్లను పెంచాలి. దీనివల్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. &amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;కొండప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్మాణాలకు ఆ ప్రాంతం అనువుగా వుంటుందో లేదో తెలుసుకోవాలి. సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలి.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;కొండలు, గుట్టలపైన సహజ నీటి ప్రవాహాలకు ఆటంకం కలిగించే చర్యలు చేపట్టరాదు. నీటి ప్రవాహాలను ఆటంకం కలిగిస్తే అవి ప్రమాదాలకు దారి తీయవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category><![CDATA[special]]></category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/special/what-are-landslides-causes-effects-and-prevention-methods-akp/articleshow-vwqqzcz"/>
        </item>
        <item>
            <title><![CDATA[హైటెక్ సీఎం అంటే ఆమాత్రం వుంటుంది... సరికొత్త టెక్నాలజీతో ఏపీ కేబినెట్ మీటింగ్]]></title>
            <link>https://telugu.asianetnews.com/special/ap-cm-chandrababu-naidu-leads-hi-tech-cabinet-meeting-with-new-e-cabinet-app-akp/articleshow-uy551n2</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/special/ap-cm-chandrababu-naidu-leads-hi-tech-cabinet-meeting-with-new-e-cabinet-app-akp/articleshow-uy551n2</guid>
            <pubDate>Fri, 27 Jun 2025 11:30:27 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇవాళ జరిగిన మంత్రిమండలి సమావేశం హైటెక్ పద్దతిలో జరిగింది. చంద్రబాబుతో సహా మంత్రులంతా టెక్నాలజీని ఉపయోగించి కీలక అంశాలపై చర్చించారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static-gi.asianetnews.com/images/01j6cp14yya4np5h2my3r1ypny/whatsapp-image-2024-08-28-at-6-04-00-pm-jpg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Andhra Pradesh e Cabinet Meeting : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హైటెక్ సీఎంగా పేరుంది. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు... ప్రజలకు కూడా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు. ఆయన ఎంతటి టెక్ ప్రియుడో అంతటి పర్యావరణ ప్రేమికుడు కూడా. తాజాగా అటు టెక్నాలజీ వినియోగం... ఇటు పర్యావరణాన్ని కాపాడుతూ సరికొత్తగా మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించారు.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇవాళ కేబినెట్ సమావేశానికి సరికొత్త ఏర్పాట్లు చేసారు అధికారులు. పర్యావరణ హితంగా పేపర్ లెస్ కేబినెట్ నిర్వహించారు.ఇందుకోసం సీఎంతో పాటు మంత్రులు ఐపాడ్ లు ఉపయోగించారు. నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIC) సహకారంతో అభివృద్ది చేసిన ఈ-కేబినెట్ యాప్ ను ఈ సమావేశంలో ఉపయోగించారు.&lt;/p&gt; &lt;p&gt;అయితే ఈ-కేబినెట్ యాప్ తో కూడిన ఐపాడ్ లను మంత్రులకు ముందుగానే అందజేసారు అధికారులు. అంతేకాదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఆండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్, ఎన్ఐసి బృందం మంత్రులకు ఈ యాప్ వినియోగం గురించి వివరించారు. నిన్న(మంగళవారం) మధ్యాహ్నమే ఒక్కో మంత్రికి, ఆయన &amp;nbsp;పర్సనల్ సెక్రటరీలు, ఓఎస్డిలకు ఈ-కేబినెట్ యాప్ సాంకేతిక అంశాలు, వినియోగం, ప్రయోజనాలపై శిక్షణ ఇచ్చారు. తద్వారా కేబినెట్ భేటీ సమయంలో మంత్రులు యాప్&zwnj;ను సులభంగా ఉపయోగించేలా చూసారు. ఇవాళ కేబినెట్ సమావేశం ప్రారంభంకాగానే మంత్రులకు ఈ ఐపాడ్&zwnj;లు, ఈ-కేబినెట్ యాప్ వినియోగంపై అధికారులు డెమో ఇచ్చారు.&lt;/p&gt; &lt;p&gt;&lt;img&gt;&lt;/p&gt; &lt;p&gt;గతంలో 2014-2019 మధ్య కూడా చంద్రబాబు ప్రభుత్వం పేపర్&zwnj;లెస్ కేబినెట్ నిర్వహించింది. అయితే ఆ సమయంలో వేరే యాప్ ఉపయోగించేవారు. ఇక వైసిపి అధికారంలోకి వచ్చాక ఈ కేబినెట్ సమావేశాల నిర్వహణ ఆగిపోయింది. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పేపర్ లెస్ కేబినెట్ సమావేశాలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు.దీంతో పూర్తి ఫీచర్లు, ఎండ్ టు ఎండ్ వర్క్ ఫ్లోతో కూడిన సమగ్ర యాప్ డిల్లీలోని ఎన్ఐసి సాంకేతిక సహకారంతో అభివృద్ధి చేసారు. &amp;nbsp;ఈ కేబినెట్ యాప్ ద్వారా ఇవాళ కేబినెట్ సమావేశం జరిగింది.&amp;nbsp;&lt;/p&gt; &lt;p&gt;&lt;strong&gt;ఈ-కేబినెట్ యాప్ ఉపయోగాలు :&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt; &lt;ul&gt;  &lt;li&gt;పేపర్&zwnj;లెస్ కాన్సెప్ట్&zwnj;తో కేబినెట్ సమావేశం నిర్వహణ ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. &amp;nbsp;&lt;/li&gt;  &lt;li&gt;కేబినెట్ సమావేశంలో టాప్ &amp;amp; గో విధానంలో ఈ యాప్ ను సులభంగా వినియోగించుకోవచ్చు.&lt;/li&gt;  &lt;li&gt;కేబినెట్ పత్రాలు, చర్చలకు సంబంధించిన వివరాలు సురక్షితంగా, రియల్ టైం యాక్సెస్ కలిగివుంటాయి.&lt;/li&gt;  &lt;li&gt;ఈ యాప్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా కేబినెట్ మీటింగ్ కు సంబంధిత సమాచారాన్ని పొందవచ్చు&amp;nbsp;&lt;/li&gt;  &lt;li&gt;&amp;nbsp;రికార్డుల డిజిటైజేషన్ జరుగుతుంది, గత సమావేశాల సమాచారం ఈజీగా పొందవచ్చు.&amp;nbsp;&lt;/li&gt;  &lt;li&gt;కేబినెట్ నిర్ణయాల అమలు స్థితిని సమర్థవంతంగా పర్యవేక్షించడానికి, అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.&lt;/li&gt;  &lt;li&gt;&amp;nbsp;ఈ-కేబినెట్ యాప్&zwnj;లో ఎన్&zwnj;క్రిప్షన్, యాక్సెస్ కంట్రోల్స్, ఆడిట్ ట్రెయిల్స్ వంటి పటిష్టమైన భద్రతా లక్షణాలు ఉన్నాయి, ఇవి అనధికార యాక్సెస్ ను నిలువరించి సున్నితమైన సమాచారాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.&amp;nbsp;&lt;/li&gt;  &lt;li&gt;వర్చువల్ కేబినెట్ సమావేశాలను నిర్వహించడానికి, ఈ-ఆఫీసుతో సమగ్రపరచడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా విశ్లేషణ వినియోగించడానికి అదనపు ఫీచర్లను ఈ-కేబినెట్ యాప్ కలిగివుంది.&amp;nbsp;&lt;/li&gt; &lt;/ul&gt; &lt;p&gt;&lt;img&gt;&lt;/p&gt; &lt;p&gt;ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ-కేబినెట్ యాప్ ను ప్రశంసించడమే కాదు మంత్రులందరు తాజా సాంకేతికతను ఉపయోగించాలని ఆదేశించారు. సాంకేతికత వినియోగం ద్వారా నిర్ణయాలు సమర్థవంతంగా, త్వరగా తీసుకోవడం సాధ్యమవుతుందని... ఇది సుపరిపాలనకు దారితీస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఐటీకి సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రియల్ టైం గవర్నెన్స్ కోసం కొత్త యాప్&zwnj;లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మొబైల్, సిసిటివి కెమెరాలు, డ్రోన్లు, ఫైబర్&zwnj;నెట్ వంటి అన్ని సాంకేతికతలను అనుసంధానం చేయడం, వాటిని వివిధ నిర్ణయాల కోసం ఉపయోగించేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category><![CDATA[special]]></category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/special/ap-cm-chandrababu-naidu-leads-hi-tech-cabinet-meeting-with-new-e-cabinet-app-akp/articleshow-uy551n2"/>
        </item>
    </channel>
</rss>
