<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Mon, 10 Aug 2026 10:04:25 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/national" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[FCRA Amendment Bill 2026: ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లు లో ఏముంది? పార్లమెంట్ లో ఎందుకు దీనిపై రగడ?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/fcra-amendment-bill-2026-explained-why-foreign-funding-rules-brought-ruckus-in-parliament-0dh7ph5</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/fcra-amendment-bill-2026-explained-why-foreign-funding-rules-brought-ruckus-in-parliament-0dh7ph5</guid>
            <pubDate>Mon, 10 Aug 2026 10:04:23 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;FCRA Amendment Bill 2026: విదేశీ నిధుల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లు 2026 పై పార్లమెంట్&zwnj;లో చర్చ నడుస్తోంది. ఆస్తుల స్వాధీనం, కొత్త నిబంధనలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక మార్పుల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kzmyy7fwfawv8dn8drc0t69v,imgname-fcra-amendment-bill-2026-1786336189947.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;FCRA Amendment Bill 2026: విదేశీ నిధుల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లు 2026 పై పార్లమెంట్&zwnj;లో చర్చ నడుస్తోంది. ఆస్తుల స్వాధీనం, కొత్త నిబంధనలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక మార్పుల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచీకరణ పెరిగిన ఈ రోజుల్లో ఒక దేశం నుంచి మరో దేశానికి సమాచారం, సాంకేతికత, ఆస్తులతో పాటు ఆర్థిక వనరులు సులభంగా మారుతున్నాయి. విద్య, వైద్యం, విపత్తు సహాయం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలలో పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు (NGOలు) విదేశీ విరాళాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. భారత్&zwnj;లో కూడా అనేక సంస్థలు ఈ విదేశీ నిధులతో సామాజిక అభివృద్ధి పనులు చేపడుతున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;అయితే, విదేశాల నుంచి వచ్చే డబ్బు ఏ పనులకు ఖర్చు అవుతోంది? దానివల్ల దేశ భద్రతకు, ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఏమైనా ప్రమాదం ఉందా? అని చూడటం ప్రభుత్వాల బాధ్యత. అందుకే ఈ విదేశీ నిధులను క్రమబద్ధీకరించడానికి మన దేశంలో 'ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్' (FCRA) అమల్లో ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్&zwnj;లో ' ఎఫ్&zwnj;సీఆర్ఏ సవరణ బిల్లు 2026' ప్రవేశపెట్టడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ, రగడ జరుగుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఎఫ్&zwnj;సీఆర్ఏ అనేది భారత్&zwnj;లోని వ్యక్తులు, సంస్థలు, ఎన్జీవోలు, ట్రస్టులు విదేశాల నుంచి విరాళాలు లేదా నిధులు స్వీకరించడాన్ని నియంత్రించే ఒక కేంద్ర చట్టం. దీనిని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. ఈ చట్టం ఎవరెవరు విదేశీ నిధులు తీసుకోవచ్చు, ఏ నిబంధనలు పాటించాలి, ఆ డబ్బును ఎలా ఖర్చు చేయాలో స్పష్టంగా చెబుతుంది.&lt;/p&gt;&lt;p&gt;&bull; పారదర్శకత: విదేశీ విరాళాలు పొందే ప్రతి సంస్థ ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి. నిర్దేశిత బ్యాంకు ఖాతా ద్వారానే డబ్బులు తీసుకోవాలి.&lt;/p&gt;&lt;p&gt;&bull; జవాబుదారీతనం: ప్రతి ఏటా వార్షిక ఆడిట్ రిపోర్టులను ఆన్&zwnj;లైన్&zwnj;లో సమర్పించాలి. ఎంత డబ్బు వచ్చింది, ఎవరు ఇచ్చారు, దేనికి ఖర్చు చేశారో పూర్తి వివరాలు వెల్లడించాలి.&lt;/p&gt;&lt;p&gt;&bull; సార్వభౌమాధికార రక్షణ: దేశ భద్రతకు, ప్రజాస్వామ్య ప్రక్రియలకు భంగం కలిగించేలా విదేశీ నిధులు వాడకుండా నిరోధించడం.&lt;/p&gt;&lt;p&gt;&bull; పరిమితులు: రాజకీయనాయకులు, ఎన్నికల అభ్యర్థులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, పత్రికా సంపాదకులు విదేశీ నిధులు తీసుకోకూడదు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఎఫ్&zwnj;సీఆర్ఏ చట్టం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. గత ఐదు దశాబ్దాలుగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇందులో అనేక సవరణలు చేశారు.&lt;/p&gt;&lt;p&gt;&bull; 1976: దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు తొలిసారిగా ఎఫ్&zwnj;సీఆర్ఏ చట్టాన్ని తీసుకువచ్చారు.&lt;/p&gt;&lt;p&gt;&bull; 1984: విదేశీ నిధులు పొందే ఎన్జీవోలకు హోం మంత్రిత్వ శాఖ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు.&lt;/p&gt;&lt;p&gt;&bull; 2010: పాత చట్టం స్థానంలో కొత్త 2010 చట్టం వచ్చింది. రిజిస్ట్రేషన్ గడువును 5 ఏళ్లకు పరిమితం చేశారు.&lt;/p&gt;&lt;p&gt;&bull; 2020: నిర్వాహకులకు ఆధార్ తప్పనిసరి చేశారు. విదేశీ నిధులు కేవలం ఢిల్లీలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఖాతాలోనే జమ కావాలని నిబంధన తెచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ ఖర్చుల పరిమితిని 50% నుండి 20%కి తగ్గించారు.&lt;/p&gt;&lt;p&gt;&bull; 2022: విదేశాల్లో ఉండే బంధువుల నుండి వచ్చే నిధుల పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 10 లక్షలకు పెంచారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రస్తుతం పార్లమెంట్ ముందుకు వచ్చిన ఎఫ్&zwnj;సీఆర్ఏ సవరణ బిల్లు 2026, అమలులోకి వచ్చిన ఎఫ్&zwnj;సీఆర్ఏ నిబంధనలు 2026 లో కొన్ని కీలక మార్పులు ప్రతిపాదించారు..&lt;/p&gt;&lt;p&gt;&bull; డెసిగ్నేటెడ్ అథారిటీ ఏర్పాటు: ఏదైనా ఎన్జీవో రిజిస్ట్రేషన్ రద్దయినా లేదా గడువు ముగిసినా, విదేశీ నిధులతో కూడబెట్టిన ఆస్తులను రక్షించడానికి ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేస్తారు.&lt;/p&gt;&lt;p&gt;&bull; ఆస్తుల తాత్కాలిక స్వాధీనం: రిజిస్ట్రేషన్ రద్దయినప్పుడు ఆస్తులు తాత్కాలికంగా ప్రభుత్వం వద్ద ఉంటాయి. ఆ సంస్థ మళ్లీ రిజిస్ట్రేషన్ పునరుద్ధరించుకుంటే ఆస్తులన్నీ వెనక్కి ఇచ్చేస్తారు. నిర్ణీత సమయంలో పునరుద్ధరణ జరగకపోతేనే అవి శాశ్వతంగా ప్రభుత్వానికి చెందుతాయి.&lt;/p&gt;&lt;p&gt;&bull; ఆరాధనా స్థలాల పరిరక్షణ: ప్రభుత్వం ఆస్తులను స్వాధీనం చేసుకున్నా, ప్రార్థనా మందిరాలు లేదా ఆరాధనా స్థలాల మతపరమైన స్వభావాన్ని మార్చకూడదని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు.&lt;/p&gt;&lt;p&gt;&bull; శిక్షల కాలపరిమితి తగ్గింపు: ఎఫ్&zwnj;సీఆర్ఏ నిబంధనల ఉల్లంఘనకు ఇచ్చే గరిష్ఠ జైలు శిక్షను 5 సంవత్సరాల నుండి 1 సంవత్సరానికి తగ్గించారు.&lt;/p&gt;&lt;p&gt;&bull; కనీస నిధుల వినియోగం: నమోదు పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకునే ఎన్జీవోలు గత రెండేళ్లలో కనీసం రూ. 10 లక్షల విదేశీ నిధులను ఉపయోగించి ఉండాలి.&lt;/p&gt;&lt;p&gt;&bull; కేంద్ర అనుమతి తప్పనిసరి: రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఏజెన్సీలు ఎఫ్&zwnj;సీఆర్ఏ కింద దర్యాప్తు ప్రారంభించే ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ కొత్త సవరణలపై పార్లమెంట్&zwnj;లో ప్రతిపక్షాలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;&bull; ఆస్తుల స్వాధీనంపై భయం: ఎన్జీవోల రిజిస్ట్రేషన్ రద్దయితే వాటి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై వివాదం నడుస్తోంది.&lt;/p&gt;&lt;p&gt;&bull; రాష్ట్రాల హక్కులు: దర్యాప్తుకు కేంద్రం అనుమతి తప్పనిసరి చేయడం వల్ల రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;&bull; కఠిన నిబంధనలు: కనీసం రూ. 10 లక్షలు ఖర్చు చేయాలనే నిబంధన చిన్న ఎన్జీవోలకు ఇబ్బందిగా మారుతుందని భావిస్తున్నారు.&lt;/p&gt;&lt;p&gt;అయితే, ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. గత దశాబ్ద కాలంలో దాదాపు 20,000 రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయని, వేల కోట్ల విలువైన ఆస్తులు వృథాగా పడి ఉన్నాయని తెలిపింది. వాటి నిర్వహణ కోసమే స్పష్టమైన విధానం తెస్తున్నామని వివరించింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/fcra-amendment-bill-2026-explained-why-foreign-funding-rules-brought-ruckus-in-parliament-0dh7ph5"/>
        </item>
        <item>
            <title><![CDATA[PM Modi:  మోదీ రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతారో తెలుసా? షాక్ అవ్వాల్సిందే]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/pm-modi-daily-routine-narendra-modi-reveals-he-sleeps-only-3-hours-a-day-and-falls-asleep-in-8-seconds-5xmvd6e</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/pm-modi-daily-routine-narendra-modi-reveals-he-sleeps-only-3-hours-a-day-and-falls-asleep-in-8-seconds-5xmvd6e</guid>
            <pubDate>Wed, 05 Aug 2026 19:39:41 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రోజువారీ దినచర్య, పని తీరు, సమయ నిర్వహణ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎన్డీయే తరఫున కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన వ్యక్తిగత అలవాట్లను పంచుకున్నారు.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kz91b2svhhg05ee64rt54czx,imgname-pm-modi--8--1785936055099.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రోజువారీ దినచర్య, పని తీరు, సమయ నిర్వహణ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎన్డీయే తరఫున కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన వ్యక్తిగత అలవాట్లను పంచుకున్నారు.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పార్లమెంట్ సమావేశాలకు ముందు జరిగిన అల్పాహార సమావేశంలో కొత్త రాజ్యసభ సభ్యులు ప్రధాని వ్యక్తిగత దినచర్య గురించి ప్రశ్నించారు. దీనికి స్పందించిన మోదీ, తాను రోజుకు సుమారు మూడు గంటలు మాత్రమే నిద్రపోతానని చెప్పారు. అంతేకాకుండా మంచంపై పడుకున్న తర్వాత ఎనిమిది సెకన్లలోపే నిద్రపోతానని తెలిపారు. రోజువారీ పనులను సమర్థంగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం వల్ల తక్కువ విశ్రాంతితోనూ చురుకుగా పనిచేయగలుగుతున్నానని ఆయన వివ&zwnj;రించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కొత్తగా రాజ్యసభకు వచ్చిన సభ్యులకు సభా కార్యకలాపాలపై ప్రధాని పలు సూచనలు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలని, సభకు వంద శాతం హాజరు ఉండేలా ప్రయత్నించాలని సూచించారు. ప్రజల విశ్వాసంతో వచ్చిన ప్రతినిధులుగా ప్రతి చర్చలో బాధ్యతాయుతంగా పాల్గొనాలని చెప్పారు. సభలో ప్రవర్తన, చర్చల సమయంలో సంయమనం పాటించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని గుర్తు చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమే అయినప్పటికీ, మంచి ఆలోచనలు ఎవరి నుంచి వచ్చినా స్వీకరించాలని ప్రధాని సూచించారు. సొంత పార్టీ సభ్యుల నుంచే కాకుండా ప్రతిపక్ష ఎంపీల నుంచి కూడా ఉపయోగకరమైన విషయాలు నేర్చుకోవాలని చెప్పారు. ప్రజా ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా ఉండాలని, రాజకీయ విభేదాల కంటే దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జీవితంలో విజయాలు సాధించాలంటే గతం లేదా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకుండా వర్తమానంలో జీవించడం ఎంతో ముఖ్యమని మోదీ పేర్కొన్నారు. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో పనిచేయడం ప్రతి ఒక్కరికీ అవసరం అని సూచించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;విదేశీ పర్యటనల సందర్భంగా కూడా సమయ నిర్వహణకు తాను ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తానని ప్రధాని తెలిపారు. విమానం ఎక్కిన వెంటనే తాను వెళ్లే దేశానికి అనుగుణంగా గడియారంలోని సమయాన్ని మార్చుకుంటానని చెప్పారు. దీంతో కొత్త దేశంలో సమయ వ్యత్యాసం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే అధిగమించవచ్చని వివరించారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/pm-modi-daily-routine-narendra-modi-reveals-he-sleeps-only-3-hours-a-day-and-falls-asleep-in-8-seconds-5xmvd6e"/>
        </item>
        <item>
            <title><![CDATA[తమిళనాడు బడ్జెట్ విజయ్ ఆసక్తికర కేటాయింపులు | Tamil Nadu CM Vijay Mega Budget 2026]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/vijay-s-2026-budget-key-allocations-for-tamil-nadu-videoshow-65rmfpu</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/vijay-s-2026-budget-key-allocations-for-tamil-nadu-videoshow-65rmfpu</guid>
            <pubDate>Fri, 07 Aug 2026 01:42:09 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xavjlby" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/vijay-s-2026-budget-key-allocations-for-tamil-nadu-videoshow-65rmfpu"/>
        </item>
        <item>
            <title><![CDATA[LPG Price Hike : మళ్లీ పెరగనున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు? అసలు కారణం ఇదే]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/lpg-price-hike-lpg-gas-cylinder-price-may-increase-by-rs-18-soon-centre-proposes-new-charge-for-gas-reserves-7lh7bao</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/lpg-price-hike-lpg-gas-cylinder-price-may-increase-by-rs-18-soon-centre-proposes-new-charge-for-gas-reserves-7lh7bao</guid>
            <pubDate>Thu, 06 Aug 2026 12:01:19 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;LPG Price Hike : భారత్&zwnj;లో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.18 వరకు పెరిగే అవకాశం ఉంది. గ్యాస్ స్ట్రాటజిక్ రిజర్వుల నిధి కోసం పన్ను వసూలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీని ప్రభావంతో ఇప్పుడు వంటింటి నిత్యావసరాల ఆర్థిక భారం మరింత పెరగనుంది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kvqrqp8ayy915vghrp99wbpe,imgname-lpg-gas-main-1782135380234.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;LPG Price Hike : భారత్&zwnj;లో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.18 వరకు పెరిగే అవకాశం ఉంది. గ్యాస్ స్ట్రాటజిక్ రిజర్వుల నిధి కోసం పన్ను వసూలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీని ప్రభావంతో ఇప్పుడు వంటింటి నిత్యావసరాల ఆర్థిక భారం మరింత పెరగనుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;దేశంలో వంట గ్యాస్ ఉపయోగిస్తున్న సామాన్య ప్రజలకు త్వరలోనే మరో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై ఎల్పీజీ సిలిండర్ ధరల రూపంలో అదనపు భారం పడనుంది. అయితే ఈసారి అంతర్జాతీయ యుద్ధాల కారణంతో కాకుండా, ప్రభుత్వం కొత్తగా విధించబోయే పన్ను లేదా లేవీ వల్ల ఈ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పలు రిపోర్టుల ప్రకారం, దేశంలో ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఎల్పీజీ, సహజ వాయువు (LNG/PNG) స్ట్రాటజిక్ నిల్వలను పెంచాలని చూస్తోంది. ఇరాన్ సంక్షోభం సమయంలో భారత్ గ్యాస్, ఆయిల్ సరఫరా సమస్యలను ఎదుర్కొంది. దీని నుంచి పాఠాలు నేర్చుకున్న ప్రభుత్వం, అత్యవసర సమయాల కోసం ఇంధన నిల్వలను పెంచేందుకు సిద్ధమైంది. ఈ వ్యూహాత్మక నిల్వల మౌలిక సదుపాయాల కోసం సుమారు 42 బిలియన్ డాలర్లు (రూ. 3.6 లక్షల కోట్లు) ఖర్చవుతుందని అంచనా. ఈ నిధిని వినియోగదారుల నుంచి టాక్స్ రూపంలో సేకరించాలని భావిస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రభుత్వం విధించబోయే ఈ రుసుము వల్ల 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర సుమారు రూ.18 వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రతి కేజీ ఎల్పీజీపై రూ.1.29 చొప్పున ఛార్జ్ విధించాలని ప్రతిపాదన ఉంది. దీని ద్వారా ఏటా 460 మిలియన్ డాలర్లు వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పైప్&zwnj;లైన్ ద్వారా వచ్చే పీఎన్&zwnj;జీ గ్యాస్&zwnj;పై కూడా ప్రతి స్టాండర్డ్ క్యూబిక్ మీటర్&zwnj;కు రూ.1.43 వసూలు చేసే అవకాశం ఉంది. ఈ లేవీ వల్ల మొత్తంగా గ్యాస్ వినియోగదారుల బిల్లులో 2 శాతం వరకు పెరుగుదల ఉండవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత్ తన చమురు అవసరాలలో 90 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ 5.33 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇది కేవలం 9.5 రోజుల వినియోగానికి మాత్రమే సరిపోతుంది. రిఫైనరీలు, పోర్టులలో ఉన్న స్టాక్ కలిపితే మొత్తం 74 రోజుల బఫర్ స్టాక్ ఉంది. ఎల్పీజీ విషయానికి వస్తే 45 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. రాబోయే 10 ఏళ్లలో చమురు నిల్వలను మరో 28 మిలియన్ టన్నులు, ఎల్ఎన్&zwnj;జీ నిల్వలను 9 మిలియన్ టన్నులు, ఎల్పీజీ నిల్వలను 4 మిలియన్ టన్నులకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ధరల పెంపుతో పాటు, ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు మరొక కీలక నిబంధన విధించింది. ఆగస్టు 16 నాటికి బయోమెట్రిక్ ఆధార్ ఇ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు గృహ వినియోగ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను నిలిపివేస్తారని సమాచారం. తుది గడువులోగా ప్రక్రియ పూర్తి చేయకపోతే, ఇ-కేవైసీ పూర్తయ్యే వరకు 14.2 కేజీల సిలిండర్ గృహ ధరలలో లభించదు. ఇండియన్ ఆయిల్, హెచ్&zwnj;పీ, భారత్ గ్యాస్ వంటి అన్ని కంపెనీల వినియోగదారులకు ఇది వర్తిస్తుంది. సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ చర్య అని ప్రభుత్వం చెబుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గ్యాస్ వినియోగదారులు ఇ-కేవైసీని పూర్తి చేయడానికి మూడు సులువైన మార్గాలు ఉన్నాయి..&lt;/p&gt;&lt;p&gt;1. ఆన్&zwnj;లైన్ ద్వారా: గ్యాస్ కంపెనీల అధికారిక యాప్, ఆధార్ ఫేస్ ఆర్&zwnj;డీ యాప్ ఉపయోగించి స్వయంగా పూర్తి చేయవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;2. గ్యాస్ ఏజెన్సీ వద్ద: మీ ప్రాంతంలోని సంబంధిత గ్యాస్ పంపిణీ ఏజెన్సీకి నేరుగా వెళ్లి బయోమెట్రిక్ ఇవ్వవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;3. డెలివరీ బాయ్ ద్వారా: ఇంటికి గ్యాస్ సిలిండర్ తీసికొని వచ్చే డెలివరీ ఏజెంట్ల వద్ద ఉండే పరికరం ద్వారా కూడా ఇ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/lpg-price-hike-lpg-gas-cylinder-price-may-increase-by-rs-18-soon-centre-proposes-new-charge-for-gas-reserves-7lh7bao"/>
        </item>
        <item>
            <title><![CDATA[పాముకాటుతో చ‌నిపోయాడ‌ని గంగా న‌దిలో వ‌దిలేశారు.. క‌ట్ చేస్తే, 8 ఏళ్ల త‌ర్వాత ఊహించ‌ని ట్విస్ట్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/viral-news-boy-declared-dead-after-snake-bite-returns-home-after-8-years-bihar-viral-mystery-explained-8loazkf</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/viral-news-boy-declared-dead-after-snake-bite-returns-home-after-8-years-bihar-viral-mystery-explained-8loazkf</guid>
            <pubDate>Sun, 09 Aug 2026 17:28:51 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Viral News: బీహార్&zwnj;లో జరిగిన ఒక విచిత్ర ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాముకాటుతో చనిపోయాడని భావించి గంగానదిలో వదిలేసిన బాలుడు.. ఎనిమిదేళ్ల తర్వాత సన్యాసి వేషంలో తిరిగి తన గ్రామానికి వ&zwnj;చ్చిన సంఘ&zwnj;ట&zwnj;న అంద&zwnj;రినీ ఆశ్చ&zwnj;ర్యానికి గురి చేసింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kzjzngtx0e11wddapqr6d9g6,imgname-viral-news--2--1786269844317.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Viral News: బీహార్&zwnj;లో జరిగిన ఒక విచిత్ర ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాముకాటుతో చనిపోయాడని భావించి గంగానదిలో వదిలేసిన బాలుడు.. ఎనిమిదేళ్ల తర్వాత సన్యాసి వేషంలో తిరిగి తన గ్రామానికి వ&zwnj;చ్చిన సంఘ&zwnj;ట&zwnj;న అంద&zwnj;రినీ ఆశ్చ&zwnj;ర్యానికి గురి చేసింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బీహార్&zwnj;లోని బేగుసరాయ్ జిల్లా మనోపూర్ ముషహరి గ్రామానికి చెందిన రాహుల్ అనే 12 ఏళ్ల బాలుడు ఎనిమిదేళ్ల క్రితం పాముకాటుకు గురయ్యాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొదట అతడిని ఓ మంత్రగాడి వద్దకు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో తర్వాత వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే రాహుల్ చనిపోయాడని వైద్యుడు చెప్పడంతో కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని గంగానదిలో నిమజ్జనం చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇటీవల ఒక యువ సన్యాసి చేతిలో సారంగి పట్టుకుని గ్రామానికి వచ్చాడు. తానే ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడని భావించిన రాహుల్&zwnj;నని చెప్పడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. అతడు నేరుగా తన తల్లిని గుర్తించడమే కాకుండా తండ్రి, అన్న, బాబాయి, అత్త పేర్లను కూడా చెప్పాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. చిన్నప్పుడే శరీరంపై ఏర్పడిన గాయం గుర్తును కూడా గ్రామస్థులు గుర్తించి, ఇతడే రాహుల్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆ యువకుడు చెప్పిన కథ మరింత ఆసక్తికరంగా ఉంది. గంగలో తనను వదిలేసినప్పుడు తాను పూర్తిగా చనిపోలేదని, ఇంకా శ్వాస తీసుకుంటున్నానని తెలిపాడు. నదిలో కొట్టుకుపోతూ మొకామా ఘాట్&zwnj;కు చేరుకున్నానని, అక్కడ ఉన్న ఓ సాధువు తనను రక్షించి గోరఖ్&zwnj;పూర్&zwnj;కు తీసుకెళ్లాడని చెప్పాడు. అక్కడే ఆధ్యాత్మిక విద్య నేర్పించి, ఎన్నేళ్ల పాటు సన్యాస జీవితం గడిపించిన తర్వాత తన గురువు &quot;నీ తల్లి దగ్గరకు వెళ్లి భిక్ష అడుగు&quot; అని పంపించాడని వివరించాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రాహుల్&zwnj; గ్రామంలో కొద్దిసేపు గడిపిన తర్వాత తిరిగి గోరఖ్&zwnj;పూర్ వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు అతడికి మొబైల్ ఫోన్ కూడా కొనిచ్చారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఫోన్ చేసి, తన గురువుకు చికిత్స, పెంపకం కోసం ఖర్చైన డబ్బుగా రూ.2 లక్షలు ఇవ్వాలని, అప్పుడే శాశ్వతంగా ఇంటికి వస్తానని చెప్పాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పేద కూలీ కుటుంబం కావడంతో అంత పెద్ద మొత్తాన్ని వెంటనే సమకూర్చలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఘటనపై హేతువాద సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిజంగా ఇతడే రాహుల్ కాదా అన్నది నిర్ధారించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసులు విచారణ చేపట్టాలని కోరుతున్నాయి. పుట్టిన ధ్రువపత్రాలు, పాత రికార్డులు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు పరిశీలించడంతో పాటు అవసరమైతే DNA పరీక్ష కూడా నిర్వహించాలని సూచిస్తున్నాయి. శాస్త్రీయ ఆధారాలతో నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటన బీహార్&zwnj;లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/viral-news-boy-declared-dead-after-snake-bite-returns-home-after-8-years-bihar-viral-mystery-explained-8loazkf"/>
        </item>
        <item>
            <title><![CDATA[వెనకా, ముందు ఎస్కార్ట్ రైళ్లు.. మధ్యలో రాష్ట్రపతి కోసం ప్రత్యేక రైలు. ఇదొక న‌డిచే రాజ‌భ‌వ‌నం]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/president-train-why-does-the-president-travel-with-escort-trains-security-luxury-coach-interesting-facts-blsk122</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/president-train-why-does-the-president-travel-with-escort-trains-security-luxury-coach-interesting-facts-blsk122</guid>
            <pubDate>Thu, 06 Aug 2026 18:11:42 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;President Train: సాధార&zwnj;ణంగా రాష్ట్ర&zwnj;ప&zwnj;తి విమానంలో లేదా ఎస్కార్ట్ వాహ&zwnj;నంలో ప్ర&zwnj;యణిస్తారు. అయితే తాజాగా భార&zwnj;త రాష్ట్ర&zwnj;ప&zwnj;తి ద్రౌప&zwnj;ది ముర్ము రైలులో ప్ర&zwnj;యాణించారు. 170 కిలోమీట&zwnj;ర్ల ఈ ప్ర&zwnj;యాణం ఇప్పుడు దేశం దృష్టిని ఆక&zwnj;ర్షిస్తోంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kzbf490d5h03hawywat60e1b,imgname-untitled-design--7--1786017621005.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;President Train: సాధార&zwnj;ణంగా రాష్ట్ర&zwnj;ప&zwnj;తి విమానంలో లేదా ఎస్కార్ట్ వాహ&zwnj;నంలో ప్ర&zwnj;యణిస్తారు. అయితే తాజాగా భార&zwnj;త రాష్ట్ర&zwnj;ప&zwnj;తి ద్రౌప&zwnj;ది ముర్ము రైలులో ప్ర&zwnj;యాణించారు. 170 కిలోమీట&zwnj;ర్ల ఈ ప్ర&zwnj;యాణం ఇప్పుడు దేశం దృష్టిని ఆక&zwnj;ర్షిస్తోంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ద్రౌపది ముర్ము మూడు రోజుల ఒడిశా పర్యటనలో భాగంగా మొదట హెలికాప్టర్&zwnj;లో వెళ్లాలని ప్రణాళిక రూపొందించారు. అయితే వర్ష సూచనలు ఉండటంతో చివరి నిమిషంలో ఆ ప్రణాళికను మార్చి 'ప్రెసిడెంట్ స్పెషల్' రైలులో ప్రయాణించేలా నిర్ణయం తీసుకున్నారు. భువనేశ్వర్ నుంచి బెర్హంపూర్ వరకు సుమారు 170 కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల్లో పూర్తి చేశారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ ప్రత్యేక రైలులో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ఎయిర్ కండీషన్డ్ బెడ్&zwnj;రూమ్&zwnj;లు, ప్రత్యేక లివింగ్, డైనింగ్ హాల్, వంటగది వంటి అన్ని వసతులు ఇందులో ఉన్నాయి. ఈ ప్రయాణంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, గవర్నర్ హరి బాబు కంభంపాటి కూడా రాష్ట్రపతితో కలిసి ప్రయాణించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రాష్ట్రపతి రైలు ప్రయాణంలో అత్యంత ఆసక్తికరమైన విషయం భద్రతా ఏర్పాట్లు. రాష్ట్రపతి ప్రయాణించే ప్రత్యేక రైలుకు ముందు ఒక రైలు, వెనుక మరో రైలు నడిపిస్తారు. దీనివల్ల ట్రాక్ పూర్తిగా సురక్షితంగా ఉందో లేదో నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి ప్రయాణిస్తున్న సమయంలో అదే ట్రాక్&zwnj;పై మరో రైలుకు అనుమతి ఉండదు. ప్రయాణం పూర్తయ్యే వరకు మొత్తం మార్గాన్ని పూర్తిగా భద్రతా వలయంలో ఉంచుతారు. దీంతో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణం సాగుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రాష్ట్రపతి పర్యటన కోసం భువనేశ్వర్, బెర్హంపూర్ రైల్వే స్టేషన్లలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బాంబు నిర్వీర్య దళాలు, స్నిఫర్ డాగ్ బృందాలు, సామాన్లకు ప్రత్యేక స్కానింగ్ వంటి చర్యలు చేపట్టారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP), కేంద్ర భద్రతా బలగాల కమాండోలు రాష్ట్రపతి భద్రతను పర్యవేక్షించారు.&lt;/p&gt;&lt;p&gt;రాష్ట్రపతి ఎక్కే ప్లాట్&zwnj;ఫామ్ నుంచి ప్రత్యేక కోచ్ వరకు ఎర్ర తివాచీ (రెడ్ కార్పెట్) ఏర్పాటు చేశారు. అలాగే భువనేశ్వర్, బెర్హంపూర్ స్టేషన్లలో ఒక్కో చోట సుమారు 450 మంది పోలీసు సిబ్బందితో 15 ప్లాటూన్లను మోహరించారు. రాష్ట్రపతి పర్యటించిన ప్రాంతాలను తాత్కాలికంగా 'నో-ఫ్లయింగ్ జోన్'గా కూడా ప్రకటించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తరచూ రైలులోనే పర్యటించేవారు. ఆయన కోసం ప్రత్యేకంగా 'ప్రెసిడెన్షియల్ సలూన్' అనే రైల్వే కోచ్ ఉండేది. ప్రస్తుతం ఆ చారిత్రక కోచ్&zwnj;ను ఢిల్లీలోని నేషనల్ రైల్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా గతంలో 2025లో ఢిల్లీ నుంచి వృందావన్ వరకు మహారాజా ఎక్స్&zwnj;ప్రెస్లో ప్రయాణించి బాంకే బిహారీ ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో 18 కోచ్&zwnj;లలో 12 కోచ్&zwnj;లను రాష్ట్రపతి బృందం కోసం ప్రత్యేకంగా కేటాయించారు.&lt;/p&gt;&lt;h2&gt;చారిత్రక రైల్వే మార్గంలో రాష్ట్రపతి ప్రయాణం&lt;/h2&gt;&lt;p&gt;ఈసారి రాష్ట్రపతి ప్రయాణించిన భువనేశ్వర్&ndash;బెర్హంపూర్ రైల్వే మార్గంలోని సుమారు 100 కిలోమీటర్ల ట్రాక్ బ్రిటిష్ కాలం నాటిది. ఇది 1896 మార్చి 1న ప్రారంభమైన ఒడిశాలోని అత్యంత పురాతన రైల్వే మార్గాల్లో ఒకటి. ఈ మార్గం ప్రపంచ ప్రఖ్యాత చిల్కా సరస్సు మీదుగా వెళ్తుంది. ప్రకృతి అందాలతో నిండిన ఈ మార్గం ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;ఒడిశా ప్రముఖ కవి, స్వాతంత్ర సమరయోధుడు ఉత్కళమణి గోపబంధు దాస్ కూడా బ్రిటిష్ పాలనలో జైలుకు తరలిస్తుండగా ఇదే మార్గంలో ప్రయాణించి, చిల్కా సరస్సు అందాలను వర్ణిస్తూ ఒక ప్రసిద్ధ కవిత రాశారు. ఈ కారణంగా ఈ రైల్వే మార్గానికి చారిత్రక ప్రాధాన్యంతో పాటు సాంస్కృతిక విలువ కూడా ఉంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/president-train-why-does-the-president-travel-with-escort-trains-security-luxury-coach-interesting-facts-blsk122"/>
        </item>
        <item>
            <title><![CDATA[OYO Rules: పెళ్లికాని కపుల్స్ ఓయో రూమ్‌లో గ‌డ‌ప‌డం నేరమా.? చ‌ట్టం ఏం చెబుతోంది.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/oyo-rules-for-unmarried-couples-in-india-is-staying-together-in-an-oyo-room-legal-bn898fl</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/oyo-rules-for-unmarried-couples-in-india-is-staying-together-in-an-oyo-room-legal-bn898fl</guid>
            <pubDate>Thu, 06 Aug 2026 10:31:59 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;OYO Rules: ప్ర&zwnj;స్తుతం చాలా మంది యువ జంటలు కొంత సమయం ప్రశాంతంగా గడిపేందుకు OYO లేదా ఇతర హోటళ్లలో గదులు బుక్ చేసుకుంటున్నారు. అయితే, పెళ్లి కాకపోతే రూమ్ ఇస్తారా?, పోలీసులు ఇబ్బంది పెడతారా? ఈ విషయంలో భారత చట్టం ఏమి చెబుతుందంటే.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kz94zx689b20pm9cwe99sv20,imgname-oyo-rules-1785939883208.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;OYO Rules: ప్ర&zwnj;స్తుతం చాలా మంది యువ జంటలు కొంత సమయం ప్రశాంతంగా గడిపేందుకు OYO లేదా ఇతర హోటళ్లలో గదులు బుక్ చేసుకుంటున్నారు. అయితే, పెళ్లి కాకపోతే రూమ్ ఇస్తారా?, పోలీసులు ఇబ్బంది పెడతారా? ఈ విషయంలో భారత చట్టం ఏమి చెబుతుందంటే.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారతదేశంలో ఇద్దరూ చట్టబద్ధమైన వయస్సు కలిగిన వ్యక్తులు అయితే, వారు పరస్పర అంగీకారంతో హోటల్&zwnj;లో ఒకే గదిలో ఉండడాన్ని చట్టం నిషేధించదు. సాధారణంగా పురుషుడు 21 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, మహిళ 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉంటే, వారు తమ ఇష్టప్రకారం కలిసి ఉండవచ్చు. కాబట్టి, కేవలం పెళ్లి కాలేదనే కారణంతో హోటల్ గది బుక్ చేసుకోవడాన్ని చట్టం తప్పుగా పరిగణించదు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;చాలా సందర్భాల్లో అదే నగరానికి చెందిన గుర్తింపు కార్డు (Local ID) చూపిస్తే హోటల్ రూమ్ ఇవ్వడానికి నిరాకరిస్తారని భావిస్తారు. అయితే చట్టపరంగా లోకల్ ఐడీ ఉండటం మాత్రమే రూమ్ నిరాకరించడానికి కారణం కాదు. అయితే, ప్రతి హోటల్&zwnj;కు తమ సొంత నిబంధనలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం OYOతో పాటు పలు ప్రముఖ హోటళ్లు కూడా లోకల్ ఐడీని అంగీకరిస్తున్నాయి. అందుకే రూమ్ బుక్ చేసే ముందు &quot;Couples Allowed&quot;, &quot;Local ID Accepted&quot; వంటి వివరాలను ఒకసారి పరిశీలించడం మంచిది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ విషయంలో చాలా మందికి భయం ఉంటుంది. కానీ, ఇద్దరు మేజ&zwnj;ర్లు తమ అంగీకారంతో హోటల్&zwnj;లో ఉంటే, కేవలం ఆ కారణంతో పోలీసులు వారిని అరెస్ట్ చేయడం లేదా వేధించడం చట్టబద్ధం కాదు. అయితే, ఆ గదిలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయనే అనుమానం ఉంటే మాత్రమే పోలీసులు విచారణ చేయవచ్చు. సాధారణ పరిస్థితుల్లో ఎలాంటి కారణం లేకుండా జోక్యం చేసుకునే అధికారం వారికి ఉండదు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హోటల్&zwnj;లో చెక్-ఇన్ చేసే సమయంలో తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును సమర్పించాలి. హోటల్ నిబంధనలను పాటించడం కూడా అవసరం. రూమ్ బుక్ చేసే ముందు ఆ హోటల్&zwnj;లో జంటలకు అనుమతి ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాలి. అలాగే ఆన్&zwnj;లైన్&zwnj;లో బుకింగ్ చేసే సమయంలో హోటల్ పాలసీని పూర్తిగా చదవడం మంచిది. దీంతో తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత చట్టాల ప్రకారం ఇద్దరు పెద్దవారు పరస్పర అంగీకారంతో కలిసి హోటల్&zwnj;లో ఉండటం నేరం కాదు. అయితే, ప్రతి హోటల్&zwnj;కు తమ సొంత వ్యాపార నిబంధనలు అమలు చేసే హక్కు ఉంటుంది. అందువల్ల హోటల్ పాలసీలను గౌరవించడం, సరైన గుర్తింపు పత్రాలు వెంట ఉంచుకోవడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఈ నియమాలను పాటిస్తే OYO లేదా ఇతర హోటళ్లలో ఎలాంటి అనవసర సమస్యలు లేకుండా బస చేయవచ్చు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/oyo-rules-for-unmarried-couples-in-india-is-staying-together-in-an-oyo-room-legal-bn898fl"/>
        </item>
        <item>
            <title><![CDATA[పెళ్లి కూతురికి 8 గ్రాముల బంగారం, పుట్టిన బిడ్డ‌కు గోల్డ్ రింగ్, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/tamil-nadu-budget-2026-8-gram-gold-for-brides-gold-ring-for-newborns-free-laptops-major-welfare-schemes-geri7mx</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/tamil-nadu-budget-2026-8-gram-gold-for-brides-gold-ring-for-newborns-free-laptops-major-welfare-schemes-geri7mx</guid>
            <pubDate>Wed, 05 Aug 2026 22:01:37 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Tamil Nadu Budget 2026: తమిళనాడులో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్&zwnj;ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులో వరాల జల్లు కురిపించారు&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kz97k9sstgp02zb2y5pdgf1b,imgname-budget-1785942615865.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Tamil Nadu Budget 2026: తమిళనాడులో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్&zwnj;ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులో వరాల జల్లు కురిపించారు&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వం 'అన్నన్ సీర్ తిట్టమ్' పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి పెళ్లికూతురికి 8 గ్రాముల బంగారు నాణెంతో పాటు ఒక పట్టు చీరను ప్రభుత్వం అందించనుంది. మహిళల ఆర్థిక భద్రతను పెంచడం, వివాహ సమయంలో కుటుంబాలపై పడే భారం తగ్గించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమం అమలు కోసం బడ్జెట్&zwnj;లో రూ.812 కోట్లను కేటాయించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బడ్జెట్&zwnj;లో మరో ఆకర్షణీయమైన నిర్ణయంగా 'థాయ్ మమ్మన్ తంగ మోధిర తిట్టం' పథకాన్ని ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే ప్రతి శిశువుకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇవ్వనున్నారు. తల్లి, శిశు సంక్షేమాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచడమే ఈ పథకం ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం అమలుకు రూ.560 కోట్ల నిధులను కేటాయించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;విద్యారంగానికి కూడా ఈ బడ్జెట్&zwnj;లో పెద్దపీట వేశారు. 'వెట్రి ల్యాప్&zwnj;టాప్ స్కీమ్' కింద అర్హులైన విద్యార్థులకు ఉచితంగా ల్యాప్&zwnj;టాప్&zwnj;లు అందించేందుకు రూ.2,000 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సైకిళ్లు, హెల్మెట్లు, వాటర్ బాటిళ్లు అందించే ప్రత్యేక పథకాన్ని కూడా కొనసాగించనున్నారు.&lt;/p&gt;&lt;p&gt;అంతేకాకుండా 2031 నాటికి ఐదు లక్షల మంది యువతకు కృత్రిమ మేథ (AI) రంగంలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులతో పాటు అధ్యాపకులకు కూడా ఈ శిక్షణ అందించనున్నారు. ఉద్యోగ అవకాశాలను పెంచే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రూ.300 కోట్లు కేటాయించగా, ఉన్నత విద్యకు రూ.8,393 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో కొత్తగా ఐదు ఐటీఐలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ రంగానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. రైతుల సంక్షేమం కోసం రూ.14,984 కోట్లు, విద్యుత్ సబ్సిడీ కోసం రూ.7,432 కోట్లు మంజూరు చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.38,000 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు. వృద్ధుల కోసం తొలి దశలో 12 జిల్లాల్లో ఆధునిక వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భీమా పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బడ్జెట్&zwnj;ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ మాట్లాడుతూ, 2036 నాటికి తమిళనాడును 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. పారదర్శక పాలన, విద్య, సాంకేతికత, పారిశ్రామిక అభివృద్ధి, సంక్షేమ పథకాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తామని తెలిపారు.&lt;/p&gt;&lt;p&gt;అలాగే తూతుకుడి, తిరునెల్వేలి ప్రాంతాలను స్పేస్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్&zwnj;మెంట్ జోన్&zwnj;గా అభివృద్ధి చేయడం, దేశంలోనే తొలి AI &amp;amp; ఇన్నోవేషన్ సిటీని ఏర్పాటు చేయడం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కుటుంబ పెద్ద మహిళకు నెలకు రూ.2,500, ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి వంటి పథకాలపై ఈ బడ్జెట్&zwnj;లో ఎలాంటి ప్రకటన లేకపోవడం గమనార్హం.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/tamil-nadu-budget-2026-8-gram-gold-for-brides-gold-ring-for-newborns-free-laptops-major-welfare-schemes-geri7mx"/>
        </item>
        <item>
            <title><![CDATA[గుజరాత్‌లో వింత ఘటన అలల్లా ఎగసి పడుతున్న బావి నీళ్లు | Virparada village | Gujarat mysterious well]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/gujarat-s-mysterious-well-water-surges-in-virparada-videoshow-gg1pvsm</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/gujarat-s-mysterious-well-water-surges-in-virparada-videoshow-gg1pvsm</guid>
            <pubDate>Sat, 08 Aug 2026 02:30:18 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://www.youtube.com/embed/gkTOckJkmXM" medium="video" height="350" width="560"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/gujarat-s-mysterious-well-water-surges-in-virparada-videoshow-gg1pvsm"/>
        </item>
        <item>
            <title><![CDATA[Plastic Currency: భారత మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయి.. పాత కరెన్సీ నోట్ల సంగతేంటి?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/india-to-introduce-plastic-banknotes-rbi-timeline-details-check-features-and-rollout-timeline-hfrw7mm</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/india-to-introduce-plastic-banknotes-rbi-timeline-details-check-features-and-rollout-timeline-hfrw7mm</guid>
            <pubDate>Wed, 05 Aug 2026 23:50:33 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Plastic Currency Notes: భారత్&zwnj;లో ప్లాస్టిక్ నోట్ల చలామణిపై ఆర్&zwnj;బీఐ కీలక అప్&zwnj;డేట్ ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ₹10, ₹20 ప్లాస్టిక్ నోట్లు రానున్నాయి. మరి పాత నోట్ల సంగతేంటి? పాత నోట్లు చెల్లకుండా పోతాయా?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kz9jabec87ghx4bgrkkmzd2f,imgname-plastic-currency-notes-1785953856972.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Plastic Currency Notes: భారత్&zwnj;లో ప్లాస్టిక్ నోట్ల చలామణిపై ఆర్&zwnj;బీఐ కీలక అప్&zwnj;డేట్ ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ₹10, ₹20 ప్లాస్టిక్ నోట్లు రానున్నాయి. మరి పాత నోట్ల సంగతేంటి? పాత నోట్లు చెల్లకుండా పోతాయా?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత కరెన్సీ వ్యవస్థలో మరో ఒక పెద్ద మార్పు రాబోతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్&zwnj;బీఐ) దేశంలో ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. చాలా ఏళ్లుగా సాగుతున్న ఈ చర్చకు ఇప్పుడు ఆర్&zwnj;బీఐ ఒక స్పష్టమైన రూపునిచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే, వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ప్లాస్టిక్ నోట్లను ప్రజల్లోకి తెచ్చేందుకు ఆర్&zwnj;బీఐ ప్లాన్ చేస్తోంది.&lt;/p&gt;&lt;p&gt;ఆగస్టు 5న జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం అనంతరం ఆర్&zwnj;బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మన దేశంలో కరెన్సీ నిర్వహణ ఖర్చులను తగ్గించడం, నోట్ల ఏజ్ ను పెంచడమే లక్ష్యంగా ఈ ప్లాస్టిక్ నోట్లను పరిచయం చేస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆర్&zwnj;బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయితే ఏప్రిల్ 2027 నుంచి ప్లాస్టిక్ నోట్లు చలామణిలోకి వస్తాయి. అయితే ఇది పూర్తి స్థాయి మార్పు కాదు, ప్రారంభంలో పరిమిత సంఖ్యలోనే నోట్లను విడుదల చేస్తారు. మన దేశంలోని విభిన్న వాతావరణ పరిస్థితులు, తేమ, ప్రజల వాడకాన్ని తట్టుకోగలవో లేదో పరిశీలించడానికే ఈ ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ ప్రయోగం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్&zwnj;బీఐ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అందులో భాగంగా 100 కోట్ల ₹10 నోట్లు, అలాగే 100 కోట్ల ₹20 నోట్లు.. మొత్తంగా 200 కోట్ల పాలిమర్ నోట్లను ముద్రించేందుకు అనుమతి లభించింది. మన దేశంలో ఇంత పెద్ద స్థాయిలో ప్లాస్టిక్ కరెన్సీ ట్రయల్స్ జరగడం ఇదే తొలిసారి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రస్తుతం మనం వాడుతున్న కాగితం నోట్లు కాటన్ ఆధారిత మెటీరియల్&zwnj;తో తయారవుతాయి. కానీ ఈ ప్లాస్టిక్ నోట్లను బైయాక్సియల్లీ ఓరియంటెడ్ పాలీప్రొపీలీన్ అనే ప్రత్యేక పాలిమర్ సబ్&zwnj;స్ట్రేట్&zwnj;తో తయారు చేస్తారు. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి..&lt;/p&gt;&lt;p&gt;&bull; ఎక్కువ కాలం మన్నిక: సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు 2.5 నుంచి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి.&lt;/p&gt;&lt;p&gt;&bull; పాడైపోవు: ఇవి నీటిలో తడిచినా, నలిగినా, మురికి అంటినా లేదా చిరిగిపోయినా ఏమీ కావు.&lt;/p&gt;&lt;p&gt;&bull; తక్కువ ఖర్చు: నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటం వల్ల ప్రతీ ఏటా కొత్త నోట్లను ప్రింట్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. దీనివల్ల ప్రింటింగ్, రవాణా ఖర్చులు బాగా ఆదా అవుతాయి.&lt;/p&gt;&lt;p&gt;&bull; నకిలీ నోట్లకు చెక్: ప్లాస్టిక్ నోట్లలో అడ్వాన్స్&zwnj;డ్ సెక్యూరిటీ ఫీచర్లు తెస్తారు. సీ-త్రూ విండోస్, హోలోగ్రామ్స్, చూపు లేని వారి కోసం ప్రత్యేక మార్కింగ్స్ వంటివి చేర్చవచ్చు. దీనివల్ల నకిలీ నోట్లను తయారు చేయడం అసాధ్యం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆర్&zwnj;బీఐ పైలట్ ప్రాజెక్ట్ కోసం కేవలం ₹10, ₹20 నోట్లను మాత్రమే ఎంచుకుంది. ఎందుకంటే రోజువారీ లావాదేవీల్లో అత్యధికంగా వాడేది, వేగంగా చేతులు మారేది ఈ చిన్న నోట్లే. అందుకే ఇవి త్వరగా చిరిగిపోవడం, మురికిగా మారడం జరుగుతుంటుంది.&lt;/p&gt;&lt;p&gt;ఈ సమస్యను పరిష్కరించడానికే 100 కోట్ల ₹10 పాలిమర్ నోట్లు, 100 కోట్ల ₹20 పాలిమర్ నోట్లను ముద్రించి మార్కెట్లోకి తెస్తున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే ఈ పాలిమర్ పేపర్ సబ్&zwnj;స్ట్రేట్ కోసం గ్లోబల్ టెండర్లను కూడా ఆహ్వానించింది. నోట్లను బ్యాంకింగ్ యంత్రాలు సులభంగా లెక్కించేలా రూపకల్పన చేస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ వార్త వినగానే చాలామందికి వచ్చే అనుమానం.. పాత నోట్లు ఏమవుతాయి అని.. అయితే ఆర్&zwnj;బీఐ దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కాగితపు నోట్లను తక్షణమే రద్దు చేసే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది.&lt;/p&gt;&lt;p&gt;ప్లాస్టిక్ నోట్లు, పాత కాగితపు నోట్లు రెండూ కూడా ఒకేసారి మార్కెట్లో చెలామణిలో ఉంటాయి. కాబట్టి ప్రజలు తమ దగ్గరున్న పాత నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం అస్సలు లేదు. పాత నోట్లు ఎప్పటిలాగే చెల్లుబాటవుతాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్, సింగపూర్ వంటి 60కి పైగా దేశాల్లో ఇప్పటికే ప్లాస్టిక్ కరెన్సీ విజయవంతంగా అమల్లో ఉంది. ఇప్పుడు ఆ జాబితాలోకి భారత్ కూడా చేరబోతోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/india-to-introduce-plastic-banknotes-rbi-timeline-details-check-features-and-rollout-timeline-hfrw7mm"/>
        </item>
        <item>
            <title><![CDATA[అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/udhayanidhi-stalin-released-within-hours-of-arrest-videoshow-n3isv5v</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/udhayanidhi-stalin-released-within-hours-of-arrest-videoshow-n3isv5v</guid>
            <pubDate>Wed, 05 Aug 2026 01:36:33 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xauw4dq" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/udhayanidhi-stalin-released-within-hours-of-arrest-videoshow-n3isv5v"/>
        </item>
        <item>
            <title><![CDATA[Kalki bhagwan: ఈ ఫొటోలో ఉంది ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.? ఇంత‌కీ వీళ్లు ఏమై పోయారు.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/kalki-bhagwan-who-is-vijay-kumar-naidu-rise-controversies-it-raids-and-where-is-he-now-rym0gac</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/kalki-bhagwan-who-is-vijay-kumar-naidu-rise-controversies-it-raids-and-where-is-he-now-rym0gac</guid>
            <pubDate>Sat, 08 Aug 2026 18:28:24 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Kalki bhagwan: కల్కి భగవాన్ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు బాగా వినిపించింది. ఆధ్యాత్మిక గురువుగా పరిచయమైన విజయ్ కుమార్ త&zwnj;ర్వాత 'కల్కి భగవాన్', 'అమ్మ భగవాన్' పేర్లతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kzgp1g3vx0nwtvarh0h4ycc5,imgname-kalki-bhagwan-1786192642171.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Kalki bhagwan: కల్కి భగవాన్ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు బాగా వినిపించింది. ఆధ్యాత్మిక గురువుగా పరిచయమైన విజయ్ కుమార్ త&zwnj;ర్వాత 'కల్కి భగవాన్', 'అమ్మ భగవాన్' పేర్లతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కల్కి భగవాన్ అసలు పేరు విజయ్ కుమార్ నాయుడు. 1949లో తమిళనాడులో జన్మించిన ఆయన చెన్నైలో చదువుకున్నారు. డీజీ వైష్ణవ్ కాలేజీలో గణితాన్ని అభ్యసించిన తర్వాత కొంతకాలం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో క్లర్క్&zwnj;గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మిక, ప్రత్యామ్నాయ విద్య వైపు అడుగులు వేశారు. 1980ల మధ్యలో ఆంధ్రప్రదేశ్&zwnj;లో 'జీవాశ్రమం' పేరుతో ఒక రెసిడెన్షియల్ స్కూల్&zwnj;ను ప్రారంభించారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, ఆత్మపరిశీలనపై దృష్టి పెట్టే విధంగా ఈ సంస్థను తీర్చిదిద్దినట్లు తెలిపారు. అనంతరం ఈ ప్రాజెక్ట్ ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కూడా కేంద్రంగా మారింది. 1980ల చివర్లో విజయ్ కుమార్ తనను విష్ణువు కల్కి అవతారంగా భావించే ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన భార్య పద్మావతి 'అమ్మ భగవాన్' పేరుతో అనుచరులకు పరిచయమయ్యారు. ఈ దంపతుల చుట్టూ ఏర్పడిన ఆధ్యాత్మిక ఉద్యమం తరువాత 'వన్&zwnj;నెస్' పేరుతో అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;విజయ్ కుమార్ నాయుడు బోధనల్లో ప్రధానంగా ధ్యానం, ఆత్మపరిశీలన, అంతర్గత మార్పు, మానసిక ప్రశాంతత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయన అనుచరులు తమలోని 'వేర్పాటు భావన' తగ్గి, అంతర్గతంగా మార్పు రావాలని ఈ బోధనల ఉద్దేశంగా వివరించేవారు. ఈ ఆధ్యాత్మిక ఉద్యమానికి వరదయ్యపాళెం ప్రధాన కేంద్రంగా మారింది. అక్కడ నిర్మించిన భారీ వన్&zwnj;నెస్ టెంపుల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెల్లటి పాలరాతి నిర్మాణంతో ఉన్న ఈ ఆలయం 2008లో ప్రారంభమైంది. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అనేక మంది ఈ కేంద్రానికి వచ్చేవారు.&lt;/p&gt;&lt;p&gt;కాలక్రమంలో కల్కి భగవాన్&zwnj;కు భారీగా అభిమానులు, అనుచరులు ఏర్పడ్డారు. ఆయన కార్యక్రమాలకు విదేశాల్లోనూ ప్రచారం లభించింది. ప్రముఖులు ఆశ్రమాన్ని సందర్శించడం, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సంస్థకు మరింత గుర్తింపు వచ్చింది. అయితే సంస్థ ఎదుగుదలతో పాటు వివాదాలు కూడా మొదలయ్యాయి. భూముల కొనుగోళ్లు, విరాళాలు, ఆర్థిక లావాదేవీలపై అప్పట్లో పలు ఆరోపణలు వచ్చాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కల్కి భగవాన్ చుట్టూ ఉన్న వివాదాల్లో 2019లో జరిగిన ఆదాయపు పన్ను శాఖ సోదాలు అత్యంత కీలకమైన ఘటనగా నిలిచాయి. 2019 అక్టోబర్&zwnj;లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో కల్కి భగవాన్&zwnj;తో సంబంధం ఉన్న ఆశ్రమాలు, కార్యాలయాలు, కంపెనీలకు సంబంధించిన 40కిపైగా ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు ఐటీ శాఖ తెలిపింది.&lt;/p&gt;&lt;p&gt;ఈ సోదాల్లో రూ.500 కోట్లకు పైగా లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించినట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. అందులో సుమారు రూ.409 కోట్ల నగదు రసీదులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సోదాల్లో రూ.43.9 కోట్ల నగదు, సుమారు రూ.18 కోట్ల విలువైన అమెరికా కరెన్సీతో పాటు బంగారం, వజ్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అప్పటి అధికారిక ప్రకటనల ఆధారంగా వార్తా సంస్థలు నివేదించాయి. మరో రిపోర్ట్&zwnj; ప్రకారం సుమారు 88 కిలోల బంగారు ఆభరణాలు, 1,271 క్యారెట్ల వజ్రాలు కూడా గుర్తించినట్లు ఐటీ శాఖ పేర్కొంది. మొత్తం గుర్తించిన లెక్కల్లో చూపని ఆదాయం రూ.500 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;2019 సోదాల తర్వాత కల్కి భగవాన్, ఆయన భార్య ప్రజల్లో కనిపించడం చాలా వరకు తగ్గిపోయింది. ఆ సమయంలో తాము దేశం విడిచి పారిపోలేదని, తాము క్షేమంగానే ఉన్నామని విజయ్ కుమార్ నాయుడు వీడియో సందేశం ద్వారా స్పష్టం చేసినట్లు అప్ప&zwnj;ట్లో వార్తల్లో వ&zwnj;చ్చాయి. అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడ నివసిస్తున్నారు, రోజువారీగా ఏం చేస్తున్నారు అనే విషయంపై ఎలాంటి స&zwnj;మాచారం లేదు.&lt;/p&gt;&lt;p&gt;కల్కి భగవాన్&zwnj;కు సంబంధించిన ఆధ్యాత్మిక సంస్థల నిర్వహణలో ఆయన కుమారుడు ఎన్&zwnj;కేవీ కృష్ణ, కోడలు ప్రీతా కృష్ణ కీలక పాత్ర పోషించడం ప్రారంభించారు. 2017లో సంస్థను వారి ఆధ్వర్యానికి అప్పగించినట్లు తెలుస్తోంది. అనంతరం 'ఏకం', 'O&amp;amp;O Academy' వంటి కొత్త పేర్లతో కొన&zwnj;సాగించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కల్కి భగవాన్ ప్రయాణాన్ని చూస్తే ఒక సాధారణ ఎల్&zwnj;ఐసీ ఉద్యోగి నుంచి భారీ ఆధ్యాత్మిక ఉద్యమానికి నాయకుడిగా ఎదిగిన వ్యక్తి కథ కనిపిస్తుంది. జీవాశ్రమం నుంచి ప్రారంభమైన ప్రయాణం ఆ తర్వాత వన్&zwnj;నెస్ ఉద్యమంగా విస్తరించింది. ధ్యానం, ఆధ్యాత్మిక శిక్షణ, అంతర్గత చైతన్యం వంటి అంశాలతో దేశ, విదేశాల్లో అనుచరులను సంపాదించారు. అయితే భారీగా ఎదిగిన సంస్థకు ఆర్థిక వ్యవహారాలు, భూములు, ఆస్తులు, సంస్థల నిర్మాణం వంటి అంశాలు కూడా కీలకంగా మారాయి. 2019 ఐటీ సోదాలు ఈ అంశాలపై దేశవ్యాప్తంగా దృష్టిని మళ్లించాయి. అదే సమయంలో సంస్థ నాయకత్వం క్రమంగా విజయ్ కుమార్ నుంచి ఆయన కుమారుడు, కోడలి వైపు మారింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/kalki-bhagwan-who-is-vijay-kumar-naidu-rise-controversies-it-raids-and-where-is-he-now-rym0gac"/>
        </item>
        <item>
            <title><![CDATA[డాలర్లు వస్తాయి కానీ... అమెరికాలో అందరి బతుకూ ఇదే! | US vs India Minimum Wage | Asianet News Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/us-vs-india-minimum-wage-the-unseen-struggle-videoshow-somc7t3</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/us-vs-india-minimum-wage-the-unseen-struggle-videoshow-somc7t3</guid>
            <pubDate>Fri, 07 Aug 2026 17:50:31 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xavqsp2" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/us-vs-india-minimum-wage-the-unseen-struggle-videoshow-somc7t3"/>
        </item>
        <item>
            <title><![CDATA[Meta: ఎట్ట‌కేల‌కు మోదీ వీడియో తొల‌గింపుపై స్పందించిన మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్.. ఏమ‌న్నారంటే?]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/meta-ceo-mark-zuckerberg-apologises-over-pm-modi-video-removal-admits-deepfake-csam-content-lapses-articleshow-ti52ep4</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/meta-ceo-mark-zuckerberg-apologises-over-pm-modi-video-removal-admits-deepfake-csam-content-lapses-articleshow-ti52ep4</guid>
            <pubDate>Wed, 05 Aug 2026 17:45:11 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Meta: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోను తొలగించిన ఘటనపై మెటా సంస్థ వెనక్కి తగ్గింది. ఈ వ్యవహారంపై మెటా సీఈఓ మార్క్ జుకర్&zwnj;బర్గ్ విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు తెలిపారు. అలాగే ప&zwnj;లు లోపాల&zwnj;పై కీల&zwnj;క ప్ర&zwnj;క&zwnj;ట&zwnj;న చేశారు.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kz86jrhefgzar55wdracf900,imgname-meta-mark-zuckerberg-pm-modi-video-facebook-safe-harbour-parliament-panel-ultimatum-india-1785907995179.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;h2&gt;పార్లమెంటరీ కమిటీ ఆదేశాల తర్వాత మెటా స్పందన&lt;/h2&gt;&lt;p&gt;జులై 23న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోను మెటా ప్లాట్&zwnj;ఫామ్ నుంచి తొలగించడంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ ఘటనపై పార్లమెంటరీ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ తీవ్రంగా స్పందించింది. వీడియో తొలగింపున&zwnj;కు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ ఘటనపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మెటాకు మూడు రోజుల గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మెటా స్పందిస్తూ జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేసింది.&lt;/p&gt;&lt;h2&gt;డీప్&zwnj;ఫేక్, CSAM కంటెంట్&zwnj;పై అంగీకారం&lt;/h2&gt;&lt;p&gt;ప్రకటనలో మార్క్ జుకర్&zwnj;బర్గ్ తమ ప్లాట్&zwnj;ఫామ్&zwnj;లో డీప్&zwnj;ఫేక్ కంటెంట్, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ వ్యాప్తిని అరికట్టడంలో కొన్ని లోపాలు ఉన్నాయని అంగీకరించారు. అలాగే కొన్ని రకాల కంటెంట్&zwnj;కు అధిక ప్రాధాన్యం కల్పించే ప్రక్రియలో నిర్వహణపరమైన తప్పిదాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ప్లాట్&zwnj;ఫామ్ భద్రత, విశ్వసనీయతను మరింత మెరుగుపరిచేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, హానికర కంటెంట్&zwnj;ను నియంత్రించేందుకు సాంకేతిక వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.&lt;/p&gt;&lt;h2&gt;భవిష్యత్తులో మరింత కట్టుదిట్టమైన చర్యలు&lt;/h2&gt;&lt;p&gt;భారత్&zwnj;లో మెటా కార్యకలాపాలపై వస్తున్న విమర్శల నేపథ్యంలో సంస్థ తన విధానాలను సమీక్షిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కంటెంట్ పర్యవేక్షణ వ్యవస్థను మరింత పకడ్బందీగా రూపొందిస్తామని మార్క్ జుకర్&zwnj;బర్గ్ హామీ ఇచ్చారు. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా మరోసారి సోషల్ మీడియా ప్లాట్&zwnj;ఫామ్&zwnj;ల బాధ్యతపై చర్చకు దారితీసింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/meta-ceo-mark-zuckerberg-apologises-over-pm-modi-video-removal-admits-deepfake-csam-content-lapses-articleshow-ti52ep4"/>
        </item>
        <item>
            <title><![CDATA[Tamil Nadu Budget : ఫ్రీగా బంగారం, పట్టుచీర, సైకిళ్లు.. మనం కూడా ఇక్కడే పుడితే బావుండు అనిపించేలా స్కీమ్స్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/tamil-nadu-budget-2026-free-gold-silk-sarees-bicycles-cows-goats-and-1-lakh-solar-subsidy-announced-vx3yrvf</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/tamil-nadu-budget-2026-free-gold-silk-sarees-bicycles-cows-goats-and-1-lakh-solar-subsidy-announced-vx3yrvf</guid>
            <pubDate>Wed, 05 Aug 2026 14:04:55 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ఫ్రీగా బంగారం, పట్టుచీర, సైకిళ్లు, మేకలు, ఆవులు&hellip; లక్ష రూపాయల సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్&hellip; ఇలా తమిళ ప్రజలపై విజయ్ సర్కార్ వరాలజల్లు కురిపించింది. బడ్జెట్ 2026-27 లో ప్రకటించిన పథకాలు ఇవే..&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kz8gh7v6nc42ctb85qwmq27a,imgname-schemes-1785918431078.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ఫ్రీగా బంగారం, పట్టుచీర, సైకిళ్లు, మేకలు, ఆవులు&hellip; లక్ష రూపాయల సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్&hellip; ఇలా తమిళ ప్రజలపై విజయ్ సర్కార్ వరాలజల్లు కురిపించింది. బడ్జెట్ 2026-27 లో ప్రకటించిన పథకాలు ఇవే..&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Tamil Nadu Budget Highlights : తమిళనాడులో ఇటీవల అధికారాన్ని చేపట్టిన TVK (తమిళగ వెట్రి కజగం) ప్రభుత్వం మొదటిసారి రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ముఖ్యమంత్రి విజయ్ ఈ బడ్జెట్ లో పెద్దపీట వేశారని అర్థమవుతోంది. అసెంబ్లీలో 2026&ndash;27 సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్&zwnj;ను ఆర్థిక మంత్రి మరియ విల్సన్ ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్ ప్రసంగంలో కీలక పథకాల ప్రస్తావన ఉంది... వీటికి భారీగా నిధులు కేటాయించారు. మరి విజయ్ సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏఏ పథకాలను అమలుచేయనుందో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి సందర్భంగా వచ్చేనెల (సెప్టెంబర్) 15న చిన్నారులకు బంగారాన్ని అందించే పథకాన్ని ప్రారంభించనున్నట్లు విజయ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ప్రభుత్వమే మేనమామ పాత్ర పోషిస్తూ పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరం అందిస్తుందని ఆర్థిక మంత్రి మరియ విల్సన్ తెలిపారు. ఇందుకోసం బడ్జెట్ లో రూ.560 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కుటుంబ బంధాలను బలోపేతం చేసేందుకే ఈ పథకం అని ఆయన అన్నారు.&lt;/p&gt;&lt;p&gt;తమిళనాడులో నివసిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు 1 గ్రాము బంగారు ఉంగరం ఇస్తారు. జూన్ 22, 2026 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలు ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడతారని ఆర్థిక మంత్రి తెలిపారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తమిళనాడు బడ్జెట్ లో విద్యాశాఖకు కూడా భారీగా నిధులు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 'సూపర్ క్లీన్ - సూపర్ క్యాంపస్' పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా పాఠశాల ప్రాంగణాలను ఎల్లప్పుడూ శుభ్రంగా, సురక్షితంగా ఉంచుతారు. మొదటి దశ అమలు కోసం ప్రభుత్వం రూ.139 కోట్లు కేటాయించింది.&lt;/p&gt;&lt;p&gt;ఇక విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రకటించింది. హెల్మెట్, వాటర్ బాటిల్&zwnj;తో కూడిన సైకిళ్లను విద్యార్థులకు అందించనున్నారు.. ఈ పథకం కోసం రూ.277 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్య నాణ్యతను పెంచేందుకు పాఠ్యప్రణాళిక సంస్కరణల కోసం రూ.25 కోట్లు, పబ్లిక్ లైబ్రరీలను డిజిటల్ లైబ్రరీలుగా మార్చేందుకు రూ.10 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తమిళనాడు బడ్జెట్&zwnj;లో మహిళల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు రెండు కీలక పథకాలను ప్రకటించింది. ఉచితంగా పాలు ఇచ్చే ఆవులు, మేకలు అందించే ఈ పథకాల కోసం మొత్తం రూ.167 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి మరియా విల్సన్ తెలిపారు.&lt;/p&gt;&lt;p&gt;గ్రామీణ మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పాడి ఆవుల పంపిణీ పథకానికి రూ.57 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం అర్హులైన 10,000 మంది మహిళలకు ఉచితంగా పాడి ఆవులను అందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. దీనివల్ల పాల ఉత్పత్తి పెరగడంతో పాటు, మహిళలకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.&lt;/p&gt;&lt;p&gt;ఇక మేకల పంపిణీ కోసం కొత్త పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం రూ.110 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద వితంతువులు, నిరాశ్రయులైన మహిళలు, ట్రాన్స్&zwnj;జెండర్లు, దివ్యాంగులకు 100 శాతం సబ్సిడీతో ఒక్కొక్కరికి 5 మేకలను ఉచితంగా అందిస్తారు. ఇది వారి జీవనోపాధికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పెళ్లి చేసుకోబోయే యువతులకు 8 గ్రాముల బంగారం, మంచి క్వాలిటీ పట్టుచీర ఇచ్చే పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల హామీగా ఇచ్చిన ఈ పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన నిధులు, విధివిధానాలను బడ్జెట్&zwnj;లో చేర్చారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలపై పెళ్లి ఖర్చుల భారాన్ని తగ్గించడం, మహిళలకు సామాజిక భద్రతను బలోపేతం చేయడమే ఈ పథకం ఉద్దేశమని ఆర్థికమంత్రి తెలిపారు.&lt;/p&gt;&lt;p&gt;కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్న వధువులు ఈ పథకానికి ప్రధాన లబ్ధిదారులుగా ఉండే అవకాశం ఉంది. అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు, దరఖాస్తు ప్రక్రియ వంటి వివరాలను అధికారిక జీవోలో స్పష్టం చేయనున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇంటి కరెంట్ ఖర్చులను తగ్గించడంతో పాటు, పునరుత్పాదక ఇంధన వాడకాన్ని ప్రోత్సహించేందుకు తమిళనాడు ప్రభుత్వం బడ్జెట్ లో ఓ కీలక ప్రకటన చేసింది. ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేందుకు అర్హులైన కుటుంబాలకు రూ.1 లక్ష వరకు సబ్సిడీ అందించనున్నట్లు తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి ఈ ఆర్థిక సహాయం ఉంటుందని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ పథకాన్ని వేగంగా అమలు చేసేందుకు ప్రభుత్వం తొలి దశలో రూ.50 కోట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా దీన్ని అమలు చేయాలని యోచిస్తోంది. ఇంట్లోనే సోలార్ విద్యుత్&zwnj;ను ఉత్పత్తి చేసుకోవడం వల్ల నెలవారీ కరెంట్ బిల్లుల భారం తగ్గుతుందని, ముఖ్యంగా వేసవిలో పెరిగే కరెంట్ వాడకాన్ని తట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.&lt;/p&gt;&lt;p&gt;ఈ పథకం కింద ఇంట్లో వాడిన కరెంట్ పోగా మిగిలిన విద్యుత్&zwnj;ను గ్రిడ్&zwnj;కు అమ్మే 'నెట్ మీటరింగ్' సౌకర్యం కూడా కల్పిస్తారు. దీనివల్ల కరెంట్ బిల్లులో రాయితీతో పాటు కొంతమందికి అదనపు ఆదాయం కూడా వస్తుంది. దీంతో బొగ్గు వాడకం తగ్గి, పర్యావరణానికి మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/tamil-nadu-budget-2026-free-gold-silk-sarees-bicycles-cows-goats-and-1-lakh-solar-subsidy-announced-vx3yrvf"/>
        </item>
        <item>
            <title><![CDATA[మాజీ ముఖ్యమంత్రి కారుపై దాడి.. చెప్పులు, రాళ్లు విసిరిన నిరసనకారులు. అసలేం జరిగిందంటే?]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/mamata-banerjee-convoy-attacked-protesters-hurl-stones-shoes-amid-custodial-death-row-articleshow-x6h8x9l</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/mamata-banerjee-convoy-attacked-protesters-hurl-stones-shoes-amid-custodial-death-row-articleshow-x6h8x9l</guid>
            <pubDate>Sun, 09 Aug 2026 20:38:13 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Mamata Banerjee: పశ్చిమ బెంగాల్&zwnj;లో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాన్వాయ్&zwnj;పై నిరసనకారులు దాడికి దిగిన ఘటన కలకలం రేపింది. రాళ్లు, చెప్పులు విసరడంతో పాటు ఆమె కాన్వాయ్&zwnj;లోని కార్లపై బురద చల్లారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kzk4zyp79n70jm7pd2ywar0j,imgname-mamata-banerjee-attack-pic-1786275429063.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;h2&gt;బిర్జు కియోట్ మృతి తర్వాత మొదలైన వివాదం&lt;/h2&gt;&lt;p&gt;ఈ ఘటనకు మూల కారణం టీఎంసీ కార్యకర్త బిర్జు కియోట్ మరణం. అవినీతి, వసూళ్ల కేసులో అరెస్టైన ఆయన పోలీసు కస్టడీలో ఉండగానే అస్వస్థతకు గురయ్యారని, ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే బిర్జు కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులు తీవ్రంగా హింసించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని కలిసేందుకు మమతా బెనర్జీ హలీషహర్&zwnj;కు వెళ్లారు.&lt;/p&gt;&lt;h2&gt;కాన్వాయ్&zwnj;ను అడ్డుకుని రాళ్లు, చెప్పులు విసిరిన నిరసనకారులు&lt;/h2&gt;&lt;p&gt;మమతా బెనర్జీ కాన్వాయ్ హలీషహర్ చేరుకోగానే నిరసనకారులు వాహనాలను చుట్టుముట్టారు. కాన్వాయ్&zwnj;పై రాళ్లు, నీటి బాటిళ్లు, చెప్పులు విసిరారు. కొన్ని వాహనాలపై బురద కూడా చల్లారు. అంతేకాకుండా మమతాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.&lt;/p&gt;&lt;h2&gt;పోలీసుల తీరుపై మమతా ఆరోపణలు.. బీజేపీ ఖండన&lt;/h2&gt;&lt;p&gt;ఘటన అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ, తన కారుపై పెద్ద రాళ్లు విసిరారని, కారు అద్దాలు తెరిచి ఉంటే తీవ్ర గాయాలు అయ్యేవని అన్నారు. పోలీసులు తమ ముందే దాడి జరిగినా అడ్డుకోలేదని, బీజేపీకి రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు.&lt;/p&gt;&lt;p&gt;మరోవైపు టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఇది ముందస్తుగా పన్నిన హత్యాయత్నమని ఆరోపించారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ఈ ఆరోపణలను ఖండించారు. రాళ్లు, చెప్పులు విసరడం వంటి ఘటనలకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను బీజేపీ ఎప్పుడూ సమర్థించదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.&lt;/p&gt;&lt;h2&gt;కస్టడీ మరణంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతున్న కుటుంబం&lt;/h2&gt;&lt;p&gt;బిర్జు కియోట్ మృతి గుండెపోటుతో జరిగిందని పోలీసులు చెబుతున్నప్పటికీ, కుటుంబ సభ్యులు మాత్రం కస్టడీలో హింస వల్లే మరణించాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు టీఎంసీ పోలీసులపై చర్యలు కోరుతుండగా, మరోవైపు బీజేపీ పారదర్శక విచారణ జరగాలని కోరుతోంది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని పెంచుతోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/mamata-banerjee-convoy-attacked-protesters-hurl-stones-shoes-amid-custodial-death-row-articleshow-x6h8x9l"/>
        </item>
        <item>
            <title><![CDATA[కిసాన్ క్రెడిట్ కార్డు: కేంద్రం గుడ్ న్యూస్.. ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ.2 లక్షలు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/kisan-credit-card-update-get-rs-2-lakh-collateral-free-loan-kcc-limit-hiked-up-to-rs-5-lakh-xycupz4</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/kisan-credit-card-update-get-rs-2-lakh-collateral-free-loan-kcc-limit-hiked-up-to-rs-5-lakh-xycupz4</guid>
            <pubDate>Thu, 06 Aug 2026 12:53:50 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Kisan Credit Card Update: రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) ద్వారా కేంద్రం రూ. 5 లక్షల వరకు రుణం అందిస్తోంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 2 లక్షల లోన్ పొందవచ్చు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kzaymd3qrfc3kj795tvhg6wm,imgname-kisan-credit-card--1786000323700.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Kisan Credit Card Update: రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) ద్వారా కేంద్రం రూ. 5 లక్షల వరకు రుణం అందిస్తోంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 2 లక్షల లోన్ పొందవచ్చు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రైతులకు గుడ్ న్యూస్. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిన వారి ఆదాయాన్ని భారీగా పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు తక్కువ వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు అందించి, వారిని ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగా నుంచి కాపాడటానికి 'కిసాన్ క్రెడిట్ కార్డు' (KCC) పరిధిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరింత విస్తరించింది. ఇకపై కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ. 5 లక్షల వరకు రుణాలు పొందవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్&zwnj;వెన్షన్ స్కీమ్ కింద కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకటన ప్రకారం ఈ పెంపు అమలులోకి వచ్చింది. ఈ డబ్బును పంట పెట్టుబడులు, విత్తనాలు, ఎరువుల కొనుగోలుకే కాకుండా, పంట కోత తర్వాతి ఖర్చులకు, గిడ్డంగులకు కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా కేవలం పంటలు పండించే రైతులే కాకుండా పాడి పరిశ్రమ, పశుపోషణ, మత్స్య పరిశ్రమలైన చేపలు/రొయ్యల పెంపకం, మేకలు, పందుల పెంపకం దారులు కూడా ఈ కేసీసీ రుణాలను పొందవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;చిన్న, సన్నకారు రైతులకు ఊరటనిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొక ప్రధాన వెసులుబాటు కల్పించింది. జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం, ఎలాంటి ఆస్తుల పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణ పరిమితిని రూ. 1.60 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచారు. అంటే రైతులు తమ పొలం కాగితాలు లేదా స్థిరాస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టాల్సిన పనిలేకుండానే రూ. 2 లక్షల వరకు స్వల్పకాలిక రుణం నేరుగా పొందవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సాధారణంగా కేసీసీ కింద ఇచ్చే వ్యవసాయ రుణాలపై ఏడాదికి 7 శాతం వడ్డీ ఉంటుంది. అయితే రైతులు తీసుకున్న రుణాన్ని సరైన సమయానికి చెల్లిస్తే, కేంద్ర ప్రభుత్వం మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్&zwnj;వెన్షన్ స్కీమ్ కింద 3 శాతం అదనపు వడ్డీ రాయితీని ప్రోత్సాహకంగా ఇస్తుంది. దీనివల్ల టైమ్&zwnj;కి అప్పు తీర్చే రైతులకు పడే అసలు వడ్డీ కేవలం 4 శాతం మాత్రమే. కరవు కాటకాలు లేదా ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టం జరిగితే, ఆర్బీఐ నిబంధనల ప్రకారం రుణ గడువును 5 ఏళ్ల వరకు పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సొంత భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులు, భాగస్వామ్య రైతులు, స్వయం సహాయక సంఘాలు కూడా దీనికి అర్హులు.&lt;/p&gt;&lt;p&gt;&bull; అప్లికేషన్ ప్రాసెస్: సమీపంలోని వాణిజ్య, ప్రాంతీయ గ్రామీణ లేదా సహకార బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా 'జన్ సమర్థ్ పోర్టల్' (Jan Samarth Portal), 'కిసాన్ రిన్ పోర్టల్' (Kisan Rin Portal) ద్వారా ఆన్&zwnj;లైన్&zwnj;లో కూడా అప్లై చేయవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;&bull; కావాల్సిన పత్రాలు: ఆధార్ కార్డు, పాన్ కార్డు, పట్టాదారు పాస్ బుక్, బ్యాంక్ పాస్ బుక్ సమర్పించాలి. పశుపోషణ, మత్స్య పరిశ్రమల వారైతే సంబంధిత స్థల వివరాలు, లైసెన్సులు లేదా ఆధారాలు ఇస్తే సరిపోతుంది.&lt;/p&gt;&lt;p&gt;ప్రస్తుతం దేశంలో 457 బ్యాంకులు కేసీసీ సేవలు అందిస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 7.72 కోట్ల మంది రైతులు యాక్టివ్ కేసీసీ కార్డులతో రూ.10 లక్షల కోట్లకు పైగా రుణ సౌకర్యం పొందారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/kisan-credit-card-update-get-rs-2-lakh-collateral-free-loan-kcc-limit-hiked-up-to-rs-5-lakh-xycupz4"/>
        </item>
        <item>
            <title><![CDATA[డ్రగ్స్ రహిత సమాజం కోసం మోదీ మాస్టర్ ప్లాన్ | Nasha Mukt Yuva for Viksit Bharat Explained]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/modi-s-master-plan-for-a-nasha-mukt-bharat-videoshow-yogrbai</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/modi-s-master-plan-for-a-nasha-mukt-bharat-videoshow-yogrbai</guid>
            <pubDate>Thu, 06 Aug 2026 16:22:02 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xavduoq" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/modi-s-master-plan-for-a-nasha-mukt-bharat-videoshow-yogrbai"/>
        </item>
        <item>
            <title><![CDATA[Indian Railways: ట్రైన్‌లో లగేజ్ పోతే రైల్వేనే డబ్బులిస్తుందా? ఈ షాకింగ్ రూల్ మీకు తెలుసా !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/lost-bag-in-train-know-indian-railways-compensation-rules-and-how-to-claim-stolen-luggage-refund-rules-explained-zgw9yoa</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/lost-bag-in-train-know-indian-railways-compensation-rules-and-how-to-claim-stolen-luggage-refund-rules-explained-zgw9yoa</guid>
            <pubDate>Wed, 05 Aug 2026 12:09:12 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Indian Railways: మీ బ్యాగ్ ట్రైన్&zwnj;లో పోయిందా? కంగారు పడకండి.. రాజధాని ఎక్స్&zwnj;ప్రెస్&zwnj;లో ప్రయాణికురాలి బ్యాగ్ చోరీ అయిన కేసులో రైల్వే శాఖను రూ.80 వేల పరిహారం చెల్లించాలని ఆదేశాలు ఇస్తూ వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు ఇచ్చింది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kz8a738gwebfa2znh37ty7rd,imgname-indian-railways-1785911807248.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Indian Railways: మీ బ్యాగ్ ట్రైన్&zwnj;లో పోయిందా? కంగారు పడకండి.. రాజధాని ఎక్స్&zwnj;ప్రెస్&zwnj;లో ప్రయాణికురాలి బ్యాగ్ చోరీ అయిన కేసులో రైల్వే శాఖను రూ.80 వేల పరిహారం చెల్లించాలని ఆదేశాలు ఇస్తూ వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు ఇచ్చింది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ట్రైన్ జర్నీలో మీ సామాన్లు జాగ్రత్త అని బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ, రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మీ సామాన్లు చోరీకి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారు? సరిగ్గా ఇలాంటి ఒక సంఘటనే రాజధాని ఎక్స్&zwnj;ప్రెస్&zwnj;లో జరిగింది. 2021 డిసెంబర్ 14న ఒక మహిళ తన భర్త, పిల్లవాడితో కలిసి రాజధాని ఎక్స్&zwnj;ప్రెస్ (ట్రెయిన్ నంబర్ 12423) 3AC కోచ్&zwnj;లో ప్రయాణిస్తోంది. రైలు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ (ముగల్ సరాయ్) రైల్వే స్టేషన్&zwnj;కు చేరుకున్న సమయంలో, ఆ మహిళ తన హ్యాండ్ బ్యాగ్ కనిపించకుండా పోయినట్లు గుర్తించింది. ఆ బ్యాగ్&zwnj;లో సుమారు 15 గ్రాముల బంగారు మంగళసూత్రం, రూ.5,000 నగదు, ఎస్&zwnj;బీఐ పాస్&zwnj;బుక్ ఉన్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బ్యాగ్ పోయిందని తెలిసిన వెంటనే ప్రయాణికులు కోచ్ అటెండెంట్ కోసం వెతికారు. అయితే ఆ సమయంలో అటెండెంట్ తన విధి నిర్వహణలో లేడు. దీంతో బాధితురాలి భర్త వెంటనే రైలులో ఉన్న ఆర్&zwnj;పీఎఫ్ ఎస్కాట్, టీటీఈ లను కలిసి విషయాన్ని తెలియజేశారు. డిసెంబర్ 16, 2021న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్&zwnj;కు చేరుకున్న తర్వాత బాధితులు అక్కడ జీరో ఎఫ్&zwnj;ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును జీఆర్&zwnj;పీ కాన్పూర్ సెంట్రల్&zwnj;కు బదిలీ చేశారు. ఎఫ్&zwnj;ఐఆర్ నమోదు చేసినా, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పోయిన సామాన్లు మాత్రం దొరకలేదు. దాంతో విసిగిపోయిన బాధితులు రైల్వే సేవా లోపంపై పఠాన్&zwnj;కోట్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్&zwnj;ను ఆశ్రయించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ కేసు విచారణ సమయంలో రైల్వే శాఖ విచిత్రమైన వాదనలను వినిపించింది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ మాస్టర్&zwnj;కు దొంగతనం గురించి సమాచారం ఇవ్వలేదని రైల్వే పేర్కొంది. అలాగే, బుక్ చేయని లగేజ్ చోరీకి గురైతే సుప్రీంకోర్టు పాత తీర్పుల ప్రకారం రైల్వేకు ఎలాంటి సంబంధం ఉండదని వాదించింది. అయితే, ప్రయాణ సమయంలోనే ఆర్&zwnj;పీఎఫ్ ఎస్కాట్&zwnj;కు ప్రయాణికులు సమాచారం ఇచ్చారని రైల్వే సొంత రికార్డుల్లోనే నమోదై ఉందని వినియోగదారుల కమిషన్ గుర్తించింది. దీని ద్వారా రైల్వే వాదన తప్పు అని నిరూపితమైంది. బాధితులు ప్రయాణం ముగియగానే జీరో ఎఫ్&zwnj;ఐఆర్ నమోదు చేసి, చోరీకి గురైన బంగారు మంగళసూత్రం కొనుగోలు రసీదులను కూడా సాక్ష్యంగా సమర్పించారని కోర్టు తెలిపింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఘటన జరిగిన సమయంలో కోచ్ అటెండెంట్ తన సీటులో లేడని ప్రయాణికులు చేసిన ఆరోపణలను కమిషన్ తీవ్రంగా పరిగణించింది. కోచ్ అటెండెంట్ విధుల్లోనే ఉన్నాడని నిరూపించడానికి రైల్వే ఎలాంటి డ్యూటీ రోస్టర్ లేదా రికార్డులను కోర్టు ముందు ఉంచలేకపోయింది. సెక్యూరిటీ విషయంలో రైల్వే తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, అవసరమైన ఆధారాలు చూపించడంలో విఫలమైందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఉత్తర రైల్వే సేవా లోపానికి పాల్పడిందని పఠాన్&zwnj;కోట్ జిల్లా వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రైల్వే శాఖ నిర్లక్ష్యానికి గాను బాధితులకు రూ.70,000 పరిహారంగా చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. దీంతో పాటు మానసిక వేదన, వేధింపులకు గురిచేసినందుకు మరో రూ.10,000 చెల్లించాలని చెప్పింది. కేసు నమోదైన తేదీ నుంచి ఈ మొత్తాన్ని చెల్లించే వరకు ఏడాదికి 6 శాతం చొప్పున వడ్డీ కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒకవేళ తీర్పు ప్రతి వచ్చిన నెల రోజుల్లోగా ఈ డబ్బులు చెల్లించకపోతే, మొత్తం సొమ్ముపై 12 శాతం వార్షిక వడ్డీ అమలవుతుందని కమిషన్ కఠిన ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా బుక్ చేయని లగేజ్ పోతే రైల్వే పరిహారం ఇవ్వదు. కానీ రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం, రక్షణ లోపం నిరూపితమైతే మాత్రం ప్రయాణికులకు నష్టపరిహారం లభిస్తుందని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/lost-bag-in-train-know-indian-railways-compensation-rules-and-how-to-claim-stolen-luggage-refund-rules-explained-zgw9yoa"/>
        </item>
        <item>
            <title><![CDATA[PM Modi: కేవ‌లం ప్ర‌శ్నించ‌డ‌మే కాదు.. దేశ యువ‌త‌కు ప్ర‌ధాని మోదీ సూచన]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/pm-modi-to-youth-dont-just-question-find-solutions-for-indias-future-articleshow-zyofirk</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/pm-modi-to-youth-dont-just-question-find-solutions-for-indias-future-articleshow-zyofirk</guid>
            <pubDate>Sat, 08 Aug 2026 15:43:57 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;PM Modi: దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువత కీలక పాత్ర పోషించాలని ప్ర&zwnj;ధాని మోదీ అన్నారు. ఢిల్లీలోని ఐఐటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మోదీ.. పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kzg2n5v3tqhh91gw76rnz9dw,imgname-pm-modi-speech-at-iit-delhi-1786172315491.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;h2&gt;మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా నేర్చుకుంటూ ఉండాలి&lt;/h2&gt;&lt;p&gt;విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అడుగుపెట్టే ప్రపంచం వేగంగా మారుతోందని మోదీ అన్నారు. సాంకేతిక రంగంతో పాటు దాదాపు అన్ని రంగాల్లో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ముఖ్యంగా కృత్రిమ మేథ&zwnj;స్సు, ఆధునిక సాంకేతికత వంటి అంశాలు భవిష్యత్తును మరింతగా ప్రభావితం చేయనున్నాయని సూచించారు. రాబోయే రెండు, మూడు దశాబ్దాల్లో ప్రపంచం ఎలా మారుతుందో ఇప్పుడే క&zwnj;చ్చితంగా చెప్పడం సాధ్యం కాదని అన్నారు. అందుకే విద్యార్థులు ఒకసారి చదువు పూర్తయిందని భావించకుండా జీవితాంతం కొత్త విషయాలను నేర్చుకోవాలని సూచించారు. ఎప్పుడూ ఆసక్తిని కొనసాగిస్తూ, కొత్త విషయాలను తెలుసుకునే అలవాటు ఉన్నవారే మారుతున్న పరిస్థితుల్లో ముందుకు వెళ్లగలరని చెప్పారు.&lt;/p&gt;&lt;h2&gt;సమస్యను చూసి భయపడకుండా పరిష్కారం వెతకాలి&lt;/h2&gt;&lt;p&gt;జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఒక సవాలుగా మాత్రమే చూడకూడదని ప్రధాని సూచించారు. సమస్యల వెనుక కొత్త అవకాశాలు కూడా దాగి ఉంటాయని చెప్పారు. పెద్ద సమస్య ఎదురైనప్పుడు దానిని చూసి ఆందోళన చెందకుండా, దాన్ని చిన్న చిన్న అంశాలుగా విభజించి పరిష్కరించేందుకు ప్రయత్నించాలని విద్యార్థులకు సూచించారు. కేవలం సమస్యను గుర్తించడం లేదా దానిపై ప్రశ్నలు లేవనెత్తడం సరిపోదని మోదీ అన్నారు. దానికి ఆచరణ సాధ్యమైన పరిష్కారం కనుగొనే ఆలోచనా విధానాన్ని యువత అలవర్చుకోవాలని సూచించారు. సవాళ్లను అవకాశాలుగా మార్చే సామర్థ్యమే భవిష్యత్తులో విజయాన్ని అందిస్తుందని చెప్పారు.&lt;/p&gt;&lt;h2&gt;దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలి&lt;/h2&gt;&lt;p&gt;ప్రతి తరానికి దేశం పట్ల కొన్ని బాధ్యతలు ఉంటాయని మోదీ పేర్కొన్నారు. యువత తమ వ్యక్తిగత భవిష్యత్తుతో పాటు దేశ ప్రగతి గురించి కూడా ఆలోచించాలని పిలుపునిచ్చారు. భారత్&zwnj;ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రయాణంలో యువత ప్రత్యక్ష భాగస్వాములుగా మారాల్సిన అవసరం ఉందన్నారు.&lt;/p&gt;&lt;p&gt;రాబోయే 30 నుంచి 35 ఏళ్ల కాలంలో యువత తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని ప్రధాని చెప్పారు. తాము ఎంచుకునే విద్య, ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర రంగాల ద్వారా దేశానికి ఏ విధంగా ఉపయోగపడగలమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. దేశ ప్రయోజనాలకు తమ ప్రతిభను ఎలా ఉపయోగించాలనే ప్రశ్నను యువత తమకు తామే వేసుకోవాలని అన్నారు.&lt;/p&gt;&lt;h2&gt;మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాలి&lt;/h2&gt;&lt;p&gt;స్నాతకోత్సవంలో ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులకు మోదీ స్వర్ణ పతకాలను అందజేశారు. దీన్&zwnj;దయాల్&zwnj; శర్మ స్వర్ణ పతకం, డైరెక్టర్&zwnj; స్వర్ణ పతకం వంటి పురస్కారాలను విద్యార్థులకు ప్రదానం చేశారు. అయితే అవార్డులు అందుకున్న వారిలో మహిళల సంఖ్య తక్కువగా ఉండటాన్ని మోదీ ప్రస్తావించారు. మరింత మంది మహిళా విద్యార్థులు కూడా ఇలాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.&lt;/p&gt;&lt;h2&gt;&lsquo;పరం ప్రజ్ఞ&rsquo; సూపర్&zwnj; కంప్యూటింగ్ కేంద్రం ప్రారంభం&lt;/h2&gt;&lt;p&gt;ఐఐటీ దిల్లీ సోనిపత్&zwnj; క్యాంపస్&zwnj;లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత సూపర్&zwnj; కంప్యూటింగ్ కేంద్రం &lsquo;పరం ప్రజ్ఞ&rsquo;ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిశోధనలు, కృత్రిమ మేథ&zwnj;స్సు ఆధారిత ప్రాజెక్టులకు ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం సిద్ధం కాకుండా దేశానికి ఉపయోగపడే ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయాలని మోదీ సందేశం ఇచ్చారు. మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ, దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని యువతకు పిలుపునిచ్చారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/pm-modi-to-youth-dont-just-question-find-solutions-for-indias-future-articleshow-zyofirk"/>
        </item>
    </channel>
</rss>
