<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Sat, 04 Jul 2026 09:04:27 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/national" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[8 ఉద్యోగాలు వచ్చింది ఒక్కరే మిగతావాళ్లు ఎందుకు రాలేదో తెలుసా? MP Forest Guard Jobs Shocking Incident]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/why-only-1-candidate-attended-mp-forest-guard-jobs-videoshow-1gofug3</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/why-only-1-candidate-attended-mp-forest-guard-jobs-videoshow-1gofug3</guid>
            <pubDate>Wed, 01 Jul 2026 12:46:52 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xak4pv2" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ఈ రోజుల్లో ఒక చిన్న ఉద్యోగం పడితే చాలు.. వేలల్లో, లక్షల్లో అప్లికేషన్లు వస్తాయి. ఒక్క పోస్టు కోసం వందల మంది కొట్టుకునే రోజులివి. కానీ, మీకో విషయం తెలుసా? ఒక ప్రభుత్వ శాఖ ఏకంగా 8 ఉద్యోగాలను ప్రకటిస్తే.. ఆ ఉద్యోగం కోసం కేవలం ఒక్కరంటే ఒక్కరే వచ్చారు. మిగతా వాళ్లంతా ఎందుకు రాలేదో తెలుసా?&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/why-only-1-candidate-attended-mp-forest-guard-jobs-videoshow-1gofug3"/>
        </item>
        <item>
            <title><![CDATA[8th Pay Commission: జీతాలు ఎంత పెరగబోతున్నాయి? 8వ వేతన సంఘం వేసిన ఫస్ట్ స్టెప్ ఇదే !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/8th-pay-commission-update-ministries-asked-to-submit-salary-details-salary-hike-process-begins-2a7of42</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/8th-pay-commission-update-ministries-asked-to-submit-salary-details-salary-hike-process-begins-2a7of42</guid>
            <pubDate>Tue, 30 Jun 2026 17:27:01 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;8th Pay Commission: 8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, భత్యాల వివరాలను ఆన్&zwnj;లైన్ పోర్టల్&zwnj;లో అప్&zwnj;లోడ్ చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఆ వివరాలు మీకోసం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kmn3dfs12k7yk0ry358pq5f3,imgname-8th-pay-commission-1774529724193.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;8th Pay Commission: 8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, భత్యాల వివరాలను ఆన్&zwnj;లైన్ పోర్టల్&zwnj;లో అప్&zwnj;లోడ్ చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఆ వివరాలు మీకోసం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, భత్యాల పెంపుదలపై సిఫార్సులు చేయడానికి 8వ వేతన సంఘం (8th Pay Commission) తన పనిని వేగవంతం చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, వివిధ రకాల అలవెన్సుల కోసం ఎంత ఖర్చు చేస్తోందో పూర్తిగా తెలుసుకోవాలని కమిషన్ భావిస్తోంది. ఇందుకోసం అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు తమ పరిధిలోని ఉద్యోగుల జీతభత్యాల పూర్తి వివరాలను కమిషన్ అధికారిక ఆన్&zwnj;లైన్ డేటా పోర్టల్&zwnj;లో అప్&zwnj;లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ సమాచారాన్ని ఆన్&zwnj;లైన్ పోర్టల్&zwnj;లో అప్&zwnj;లోడ్ చేయడానికి 8వ వేతన సంఘం జూన్ 30ని చివరి తేదీగా నిర్ణయించింది. అయితే, డేట్ ను పొడిగించే అవకాశం వుంది. ఈ ప్రక్రియలో వందలాది ప్రభుత్వ కార్యాలయాలు, భారీ మొత్తంలో ఆర్థిక గణాంకాలను అప్&zwnj;లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని శాఖలు నిర్ణీత గడువులోగా ఈ వివరాలను అందించగలవా లేదా అనేది చూడాలి. ఒకవేళ అవసరమైతే, ఈ డెడ్&zwnj;లైన్&zwnj;ను పొడిగించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని కమిషన్ పేర్కొంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమ వివరాలను కేవలం అధికారిక ఆన్&zwnj;లైన్ డేటా పోర్టల్&zwnj;లో మాత్రమే అప్&zwnj;లోడ్ చేయాలని వేతన సంఘం స్పష్టం చేసింది. ఎలాంటి ఆఫ్&zwnj;లైన్ సమాచారాన్ని అంగీకరించబోరు. అంటే, శాఖలు ఫిజికల్ ఫైళ్లు, ఎక్సెల్ షీట్లు, ప్రింటెడ్ పత్రాలు లేదా ఈమెయిల్ ద్వారా ఎలాంటి డేటాను పంపడానికి వీలు లేదు. కేవలం ఆన్&zwnj;లైన్ పోర్టల్&zwnj;లో అప్&zwnj;లోడ్ చేసిన డేటాను మాత్రమే కమిషన్ చెల్లుబాటు అయ్యేదిగా గుర్తిస్తుంది. ఒక కేంద్రీకృత డిజిటల్ డేటాబేస్&zwnj;ను రూపొందించడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం. దీనివల్ల కమిషన్ తన సిఫార్సులను సిద్ధం చేసేటప్పుడు గణాంకాలను సులభంగా విశ్లేషించవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గత మూడు పూర్తి ఆర్థిక సంవత్సరాల ఖర్చుల వివరాలను అందించాలని మంత్రిత్వ శాఖలు, విభాగాలను కమిషన్ కోరింది. ఇందులో ఆర్థిక సంవత్సరాలు 2022-23, 2023-24, 2024-25 ల గణాంకాలు ఉంటాయి. పే మ్యాట్రిక్స్ లెవెల్-1 నుండి లెవెల్-18 వరకు ఉన్న ఉద్యోగుల జీతాలు, వివిధ అలవెన్సులపై ఎంత ఖర్చు చేశారో డేటాలో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కమిషన్ కేవలం బేసిక్ పే వివరాలను మాత్రమే కాకుండా, వివిధ విభాగాల్లో జరిగిన ఖర్చుల పూర్తి వివరాలను కూడా అడిగింది. ఇందులో బేసిక్ పే, వర్తించే చోట మిలిటరీ సర్వీస్ పే, డీఏ, హౌస్ రెంట్ అలవెన్స్ , ట్రాన్స్&zwnj;పోర్ట్ అలవెన్స్, రిస్క్ అండ్ హార్డ్&zwnj;షిప్ అలవెన్స్, రైల్వే ఉద్యోగుల కోసం రన్నింగ్ స్టాఫ్ అలవెన్స్, నాన్-ప్రాక్టీసింగ్ అలవెన్స్, ఉద్యోగులకు ఇచ్చే ఇతర అన్ని అలవెన్సుల వివరాలు ఉండాలి. ఇవే కాకుండా, ప్రతి ఆర్థిక సంవత్సరంలో అలవెన్సులపై చేసిన మొత్తం ఖర్చు సమాచారాన్ని కూడా విడిగా ఇవ్వాల్సి ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ డేటా సేకరణ అనేది 8వ వేతన సంఘం సిఫార్సుల దిశగా వేసిన మొదటి పెద్ద అడుగుగా భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం వివిధ శ్రేణుల ఉద్యోగుల జీతాలు, భత్యాల కోసం ఎంత ఖర్చు చేస్తోందో విశ్లేషించిన తర్వాత, భవిష్యత్తులో వేతన సవరణ వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక ప్రభావాన్ని కమిషన్ అంచనా వేస్తుంది. ఈ ఆధారంగానే కమిషన్ సవరించిన జీతాల స్కేల్, వివిధ అలవెన్సులు, ప్రభుత్వంపై పడే మొత్తం ఆర్థిక భారం, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తన రిపోర్టులను, సిఫార్సులను సిద్ధం చేస్తుంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/8th-pay-commission-update-ministries-asked-to-submit-salary-details-salary-hike-process-begins-2a7of42"/>
        </item>
        <item>
            <title><![CDATA[Forbidden Places: ఇండియాలోనే ఉన్నా భారతీయులకు నో ఎంట్రీ.. విదేశీయులకు మాత్రం పర్మిషన్.. ఆ 5 రహస్య ప్రాంతాల మిస్టరీ ఏంటి?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/forbidden-indian-places-inside-india-but-no-entry-for-indians-5-mysterious-places-only-for-foreigners-2mpd79c</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/forbidden-indian-places-inside-india-but-no-entry-for-indians-5-mysterious-places-only-for-foreigners-2mpd79c</guid>
            <pubDate>Tue, 30 Jun 2026 09:09:02 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Forbidden Indian Places: భారతదేశంలోని 5 ప్రాంతాల్లోకి భారతీయులకు ప్రవేశం లేదు, కానీ విదేశీయులకు మాత్రం అనుమతి ఉంది. మన దేశం.. మన భూమి.. కానీ భారతీయులకు అక్కడ పర్మిషన్ ఎందుకు లేదు? ఆ షాకింగ్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwb9gxt184d9ex97dey5nbsq,imgname-forbidden-indian-places-1782790518593.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Forbidden Indian Places: భారతదేశంలోని 5 ప్రాంతాల్లోకి భారతీయులకు ప్రవేశం లేదు, కానీ విదేశీయులకు మాత్రం అనుమతి ఉంది. మన దేశం.. మన భూమి.. కానీ భారతీయులకు అక్కడ పర్మిషన్ ఎందుకు లేదు? ఆ షాకింగ్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మన దేశం, మన భూమి.. ఇండియాలో ఎక్కడికైనా వెళ్లే హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది అని మనం అనుకుంటాం. కానీ భారత దేశ పటంలో కొన్ని రెడ్ లైన్ ఏరియాలు ఉన్నాయి. అక్కడికి భారతీయులు వెళ్లడం పూర్తిగా నిషేధం. విచిత్రం ఏంటంటే, అదే ప్రాంతాలకు విదేశీ పర్యాటకులు ప్రభుత్వ అనుమతితో హ్యాపీగా తిరుగుతారు, ఫోటోలు కూడా తీసుకుంటారు. వినడానికి చాలా షాకింగ్&zwnj;గా ఉన్నా ఇది అక్షరాలా నిజం. భద్రత, ఆదివాసీల రక్షణ, సున్నితమైన సరిహద్దుల కారణంగా ఈ 5 ప్రాంతాలో భారతీయులకు ఎంట్రీ లేదు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;దీని వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి.&lt;/p&gt;&lt;p&gt;&bull; మొదటిది, జాతీయ భద్రత: చైనా, పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న ప్రాంతాలు చాలా సున్నితమైనవి.&lt;/p&gt;&lt;p&gt;&bull; రెండవది, ఆదివాసీల రక్షణ చట్టం: &quot;అండమాన్ ఆదివాసీల రక్షణ నిబంధనలు 1956&quot; ప్రకారం.. కొన్ని తెగలకు చెందిన వారితో బయటి ప్రపంచానికి ఎలాంటి సంబంధాలు ఉండకూడదు. ఎందుకంటే బయటి నుంచి వచ్చే వైరస్&zwnj;లు, వ్యాధుల వల్ల వారి జాతి మొత్తం అంతరించిపోయే ప్రమాదం ఉంది.&lt;/p&gt;&lt;p&gt;&bull; మూడవది, పర్యావరణ పరిరక్షణ: కొన్ని దీవులలో యాక్టివ్ అగ్నిపర్వతాలు, అరుదైన జంతువులు ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా వస్తే అవి నాశనమవుతాయి.&lt;/p&gt;&lt;p&gt;విదేశీయులకు RAP (Restricted Area Permit) లేదా PAP (Protected Area Permit) ద్వారా నియంత్రిత ప్రవేశం కల్పిస్తారు. కానీ సాధారణ భారతీయ పర్యాటకులకు మాత్రం ఇది పూర్తిగా క్లోజ్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా జీవించే సెంటినెలీస్ అనే ఆదివాసీ తెగ వారు ఉంటారు. బయటి ప్రపంచానికి చెందిన మనుషులు ఎవరు కనిపించినా సరే.. వీరు బాణాలతో దాడి చేస్తారు. 2018 లో జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ మిషనరీ ఇక్కడికి వెళ్లడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. అందుకే భారత ప్రభుత్వం ఈ ద్వీపానికి 5 నాటికల్ మైళ్ల దూరం వరకు వెళ్లకుండా నిషేధం విధించింది. విదేశీ పరిశోధకులు కూడా కేవలం దూరం నుండి డ్రోన్ల ద్వారా మాత్రమే ఫోటోలు తీయగలరు. భారతీయులకు మాత్రం ఇది పూర్తిగా నో ఎంట్రీ జోన్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారతదేశంలో ఉన్న ఏకైక యాక్టివ్ అగ్నిపర్వతం ఇక్కడే ఉంది. శాస్త్రవేత్తలు, విదేశీ పరిశోధకులు ప్రత్యేక అనుమతి తీసుకుని ఇక్కడ ల్యాండ్ అవ్వచ్చు. కానీ సాధారణ భారతీయ పర్యాటకులు ఈ ద్వీపంలో అడుగు పెట్టడం నిషేధించారు. కేవలం బోట్ ద్వారా దూరం నుండి మాత్రమే ఈ అగ్నిపర్వతాన్ని చూడాలి. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా లావా, ప్రమాదకరమైన గ్యాస్ వల్ల ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;లడఖ్&zwnj;లోని ఈ భాగంలో టిబెటన్ అడవి గాడిదలు కియాంగ్, అలాగే మంచు చిరుతలు జీవిస్తాయి. చైనా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉండటం వల్ల ఇది ఇన్నర్ లైన్ పర్మిట్ ఏరియాగా ఉంది. విదేశీయులు ప్రభుత్వ గైడ్లు, ఐఎల్పీ పర్మిట్&zwnj;తో నిర్ణీత రూట్లలో ఇక్కడికి వెళ్లవచ్చు. కానీ భారతీయులకు ఈ కోర్ జోన్&zwnj;లోకి వెళ్లడానికి పర్మిషన్ లేదు. మనకు కేవలం బఫర్ జోన్ వరకు మాత్రమే అనుమతి ఇస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సిక్కింలోని ప్రసిద్ధ గురుదోంగ్మార్ లేక్ వరకు భారతీయులు వెళ్లవచ్చు. కానీ ఈ సరస్సు ఒడ్డును ఆనుకుని చైనా సరిహద్దు వైపు ఉండే కొన్ని పర్వత ప్రాంతాలు ప్రొటెక్టెడ్ ఏరియా పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతంలోకి భారతీయులు కెమెరాలు, మొబైల్ ఫోన్లు తీసుకుని వెళ్లడం పూర్తిగా నిషేధం. కానీ విదేశీ పర్యాటకులు పీఏపీ పర్మిట్ తీసుకుని, గైడ్&zwnj;తో కలిసి ఒక నిర్దిష్ట పాయింట్ వరకు వెళ్లవచ్చు. సరిహద్దుల భద్రత దృష్ట్యా అక్కడి ఫోటోలు తీయడం రిస్క్ కాబట్టి భారతీయులకు ఈ ఆంక్షలు ఉన్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అండమాన్&zwnj;లోని మరొక ఆదివాసీ తెగ అయిన జరువాల కోసం 1028 చదరపు కిలోమీటర్ల అడవిని రిజర్వ్ గా ప్రకటించారు. అండమాన్ ట్రంక్ రోడ్డు నుండి అడవి లోపలికి భారతీయులు ప్రవేశించడం చట్టప్రకారం నేరం. విదేశీ డాక్యుమెంటరీ టీమ్&zwnj;లు ప్రభుత్వ అనుమతి తీసుకుని దూరం నుండి షూట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ సాధారణ భారతీయ పౌరులు అక్కడ అడుగుపెట్టి దొరికిపోతే జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ ప్రాంతాలకు నేరుగా వెళ్లడం నిషేధించబడినప్పటికీ, వాటిని చూడటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. నార్త్ సెంటినెల్ ఐలాండ్&zwnj;ను 5 నాటికల్ మైళ్ల దూరం నుండి బోట్ ద్వారా చూడొచ్చు. బారెన్ ఐలాండ్&zwnj;ను కూడా దూరం నుండే వీక్షించవచ్చు. చాంగ్ థాంగ్ బఫర్ జోన్&zwnj;లో క్యాంపింగ్ చేసుకోవచ్చు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/forbidden-indian-places-inside-india-but-no-entry-for-indians-5-mysterious-places-only-for-foreigners-2mpd79c"/>
        </item>
        <item>
            <title><![CDATA[మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/pm-modi-s-speech-earns-high-praise-from-japan-pm-videoshow-4yiapc4</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/pm-modi-s-speech-earns-high-praise-from-japan-pm-videoshow-4yiapc4</guid>
            <pubDate>Thu, 02 Jul 2026 19:00:01 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xakge2a" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/pm-modi-s-speech-earns-high-praise-from-japan-pm-videoshow-4yiapc4"/>
        </item>
        <item>
            <title><![CDATA[Japan PM India Visit: భార‌త్‌కు జ‌పాన్ ప్ర‌ధాని.. మోదీతో భేటీతో దేశంలో ఊహించ‌ని మార్పులు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/japan-pm-india-visit-how-sanaye-takaichis-india-tour-will-benefit-jobs-investment-and-strategic-growth-62d4k8h</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/japan-pm-india-visit-how-sanaye-takaichis-india-tour-will-benefit-jobs-investment-and-strategic-growth-62d4k8h</guid>
            <pubDate>Tue, 30 Jun 2026 16:02:53 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Japan PM India Visit: జపాన్ ప్రధాని సనాయే తకైచీ జూలై 1 నుంచి మూడు రోజుల పాటు భారత పర్యటన చేపట్టనున్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమెకు ఇదే తొలి భారత్ పర్యటన కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwc11e1nr89sz6wbn5rqj8r7,imgname-japan-pm-india-visit-1782815176757.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Japan PM India Visit: జపాన్ ప్రధాని సనాయే తకైచీ జూలై 1 నుంచి మూడు రోజుల పాటు భారత పర్యటన చేపట్టనున్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమెకు ఇదే తొలి భారత్ పర్యటన కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఇంధన భద్రత వంటి అనేక కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ భేటీ దౌత్యపరంగానే కాకుండా భారత ప్రజలకు కూడా అనేక ప్రయోజనాలు తీసుకురావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. జపాన్ ఇప్పటికే భారత్&zwnj;లో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుల్లో ఒకటి. ఈ పర్యటనలో కొత్త పెట్టుబడులపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, తయారీ, లాజిస్టిక్స్ రంగాల్లో జపాన్ కంపెనీలు తమ కార్యకలాపాలను మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పరిశ్రమలు వస్తే వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు రానున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానిక పరిశ్రమలకు కూడా ఊతం లభించే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ సమావేశంలో నైపుణ్యం కలిగిన భారతీయులను జపాన్&zwnj;కు పంపే అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. జపాన్&zwnj;లో వృద్ధాప్య జనాభా పెరుగుతుండటంతో అక్కడ నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భారత యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇరు దేశాలు ప్రణాళికలు రూపొందించే అవకాశముంది. ఇది అమల్లోకి వస్తే ఇంజినీరింగ్, హెల్త్&zwnj;కేర్, నిర్మాణ రంగం, ఐటీ, తయారీ రంగాల్లో పనిచేసే భారతీయులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించవచ్చు. విదేశీ ఉపాధి ద్వారా కుటుంబాల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారత్ ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ దిశగా జపాన్&zwnj;కు ఉన్న సాంకేతిక నైపుణ్యం భారత్&zwnj;కు ఉపయోగపడే అవకాశం ఉంది. చిప్ తయారీ, బ్యాటరీ టెక్నాలజీ, కీలక ఖనిజాల సరఫరా, అధునాతన పరిశ్రమల అభివృద్ధిలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తే భారత తయారీ రంగానికి పెద్ద ఊతం లభిస్తుంది. దీంతో భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పెరగడంతో పాటు దిగుమతులపై ఆధారపడే పరిస్థితి కూడా తగ్గే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ముంబై&ndash;అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. జపాన్ సాంకేతిక సహకారంతో కొనసాగుతున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయితే భారత రైల్వే వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. అదే సమయంలో లిక్విడ్ నేచుర&zwnj;ల్ గ్యాస్&zwnj; (LNG), స్వచ్ఛ ఇంధనం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సహకారాన్ని పెంచడంపై కూడా చర్చలు జరగనున్నాయి. భవిష్యత్తులో ఇంధన భద్రత బలపడితే పరిశ్రమలకు స్థిరమైన సరఫరా లభించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక, సముద్ర కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్, జపాన్ సహకారం మరింత కీలకంగా మారింది. ఈ సమావేశంలో సముద్ర భద్రత, రక్షణ సాంకేతికత, సైబర్ భద్రత, ఉమ్మడి రక్షణ ఉత్పత్తులు వంటి అంశాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య సంబంధాలకే పరిమితం కాదు. ప్రాంతీయ శాంతి, భద్రత, సరఫరా చైన్&zwnj; రక్షణలో కూడా కీలక పాత్ర పోషించగలదు. క్వాడ్ భాగస్వామ్య దేశాల దృష్టి కూడా ఈ సమావేశంపైనే ఉండటంతో, ఇందులో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఆసియా-పసిఫిక్ ప్రాంత రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశముంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జపాన్ ప్రధాని పర్యటనతో భారత్&zwnj;కు విదేశీ పెట్టుబడులు పెరగడం, యువతకు ఉద్యోగ అవకాశాలు విస్తరించడం, ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడం, బుల్లెట్ ట్రైన్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగవంతం కావడం, ఇంధన భద్రత బలోపేతం కావడం వంటి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. అలాగే ప్రపంచ పటంలో భారత్ స్థానాన్ని మరింత బలపరిచే సమావేశంగా కూడా ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/japan-pm-india-visit-how-sanaye-takaichis-india-tour-will-benefit-jobs-investment-and-strategic-growth-62d4k8h"/>
        </item>
        <item>
            <title><![CDATA[ఇక పెట్రోల్ బండ్లకు కాలం చెల్లినట్లే.. కొత్త పెట్రోల్ బైక్‌ల‌కు నో రిజిస్ట్రేషన్, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/delhi-ev-policy-no-registration-for-new-petrol-bikes-from-2028-ev-buyers-to-get-big-subsidies-ana8qx9</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/delhi-ev-policy-no-registration-for-new-petrol-bikes-from-2028-ev-buyers-to-get-big-subsidies-ana8qx9</guid>
            <pubDate>Tue, 30 Jun 2026 18:47:00 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Delhi EV Policy: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వం EV Policy 2.0కు ఆమోదం తెలిపింది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwc96vmkh55sne41v6s7qncz,imgname-delhi-ev-policy-2.0-1782823743123.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Delhi EV Policy: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వం EV Policy 2.0కు ఆమోదం తెలిపింది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కొత్త ఈవీ పాలసీ ప్రకారం 2028 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కొత్త పెట్రోల్ బైక్&zwnj;లు, స్కూటర్ల రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిపివేయనున్నారు. అదే విధంగా 2027 జనవరి 1 నుంచి పెట్రోల్, సీఎన్&zwnj;జీ ఆటోరిక్షాలకు కూడా కొత్త రిజిస్ట్రేషన్లు ఉండవు. ఆ తేదీల తర్వాత కొత్తగా కేవలం ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకే అనుమతి ఉంటుంది. అయితే ఇప్పటికే రోడ్డుపై ఉన్న పెట్రోల్, డీజిల్ వాహనాలను కొనసాగించి వినియోగించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నిబంధనలు కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకే వర్తిస్తాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆకర్షణీయమైన సబ్సిడీలను ప్రకటించింది. తొలి ఏడాది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేస్తే రూ.30,000 ప్రోత్సాహకం. రెండో ఏడాది రూ.20,000, మూడో ఏడాది రూ.10,000 సబ్సిడీ అందిస్తారు. ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు తొలి ఏడాది రూ.50,000, రెండో ఏడాది రూ.40,000, మూడో ఏడాది రూ.30,000 వరకు రాయితీ లభిస్తుంది. అలాగే రూ.30 లక్షల లోపు ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు జీవితకాల రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులను పూర్తిగా మినహాయించారు. అయితే హైబ్రిడ్ వాహనాలకు ఎలాంటి సబ్సిడీ ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈవీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వం రూ.15 వేల కోట్ల బడ్జెట్&zwnj;ను కేటాయించింది. రూ.7 వేల కోట్లను ఈవీ కొనుగోలుదారులకు సబ్సిడీలుగా అందించనుంది. రూ.8 వేల కోట్లతో ఢిల్లీ అంతటా సుమారు 30 వేల కొత్త చార్జింగ్ పాయింట్లు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేయనుంది. అదనంగా, బీఎస్-4 లేదా అంతకంటే పాత వాహనాలను స్క్రాప్ చేసి ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి రూ.1 లక్ష వరకు స్క్రాపేజ్ ప్రోత్సాహకం కూడా ఇవ్వనున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కొత్త ఈవీ పాలసీ ప్రభావం స్టాక్ మార్కెట్&zwnj;లో కూడా స్పష్టంగా కనిపించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల షేర్లకు భారీగా కొనుగోళ్లు వచ్చాయి. ఏథర్ ఎనర్జీ షేరు ఒక దశలో 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి కూడా లాభాలతో ముగిసింది. గత కొన్ని నెలలుగా ఈ కంపెనీ షేరు విలువ గణనీయంగా పెరిగినట్లు మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ షేర్లు కూడా రోజులో దాదాపు 11 శాతం వరకు ఎగిశాయి. చివరకు బలమైన లాభాలతో ట్రేడింగ్&zwnj;ను ముగించాయి. మరోవైపు సంప్రదాయ పెట్రోల్ బైక్&zwnj;ల తయారీ సంస్థలపై ఈ నిర్ణయం ప్రభావం చూపింది. ముఖ్యంగా రాయల్ ఎన్&zwnj;ఫీల్డ్ మాతృసంస్థ ఐషర్ మోటార్స్ షేరు రోజంతా ఒత్తిడిలో ట్రేడై నష్టాలతో ముగిసింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఢిల్లీలో నమోదవుతున్న వాయు కాలుష్యంలో సుమారు 23 శాతం వాహనాల నుంచి వెలువడే ఉద్గారాల వల్లే ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచాలని నిర్ణయించింది. 2020లో ప్రవేశపెట్టిన తొలి ఈవీ పాలసీకి కొనసాగింపుగా ఇప్పుడు తీసుకొచ్చిన EV Policy 2.0 ద్వారా సబ్సిడీలు, పన్ను మినహాయింపులు, చార్జింగ్ మౌలిక వసతులు, స్క్రాపేజ్ ప్రోత్సాహకాలు వంటి చర్యలతో ఢిల్లీని 2030 నాటికి దేశంలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల నగరంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/delhi-ev-policy-no-registration-for-new-petrol-bikes-from-2028-ev-buyers-to-get-big-subsidies-ana8qx9"/>
        </item>
        <item>
            <title><![CDATA[Arunachal Pradesh floods: భారీ వరదల తర్వాత మారిపోయిన అరుణాచల్ ప్రదేశ్ రూపురేఖలు| Asianet News Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/arunachal-pradesh-floods-the-state-s-altered-landscape-videoshow-b57t3u0</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/arunachal-pradesh-floods-the-state-s-altered-landscape-videoshow-b57t3u0</guid>
            <pubDate>Mon, 29 Jun 2026 20:00:01 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xajqndq" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/arunachal-pradesh-floods-the-state-s-altered-landscape-videoshow-b57t3u0"/>
        </item>
        <item>
            <title><![CDATA[Monsoon Travel 2026: లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే.. ఇండియాలోని టాప్ 6 మన్సూన్ వాటర్ ఫాల్స్ ఇవే !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/life/best-waterfalls-in-india-to-visit-during-monsoon-season-2026-jog-falls-to-dudhsagar-waterfall-bzpgs3i</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/life/best-waterfalls-in-india-to-visit-during-monsoon-season-2026-jog-falls-to-dudhsagar-waterfall-bzpgs3i</guid>
            <pubDate>Mon, 29 Jun 2026 15:00:52 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Monsoon Travel 2026: వర్షాకాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారి కోసం భారతదేశంలో చాలానే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వీటిలోని 6 అద్భుతమైన జలపాతాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kw9ame8mh0szq6ww2s3qhfeq,imgname-waterfalls--1782724573460.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Monsoon Travel 2026: వర్షాకాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారి కోసం భారతదేశంలో చాలానే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వీటిలోని 6 అద్భుతమైన జలపాతాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వర్షాకాలం అంటే కేవలం బురద, ట్రాఫిక్ జామ్&zwnj;లు మాత్రమే కాదు. వర్షాకాలం అనేది ప్రకృతి తనను తాను రీసెట్ చేసుకునే సమయం. ఆ రీసెట్ బటనే జలపాతాలు. భారతదేశం అంతటా ఎన్నో అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి. కానీ కొన్ని జలపాతాలు మాత్రం వర్షాకాలంలోనే వాటి అసలైన రూపాన్ని చూపిస్తాయి.&lt;/p&gt;&lt;p&gt;వర్షాకాలంలో జలపాతాలను చూడటంలో ఉండే కిక్కే వేరు. వర్షాలు పడగానే కొండలు, అడవులు పచ్చటి తివాచీ పరిచినట్లు అవుతాయి. ఎండిపోయిన పాయలు కూడా ఒక్కసారిగా జీవం పోసుకుంటాయి. ఉవ్వెత్తున ఎగసిపడే నీళ్లు, చల్లటి గాలి, మట్టి వాసన.. సిటీ లైఫ్ లో ఉండే అలసటను ఒక్క నిమిషంలో మాయం చేస్తాయి. ఇండియాలో వర్షాకాలంలో మిస్ అవ్వకూడని ఆ 6 బెస్ట్ జలపాతాల లిస్ట్ గమనిస్తే..&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;ఎక్కడ ఉంది: &lt;/strong&gt;కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;స్పెషాలిటీ:&lt;/strong&gt; చాలకుడి నది నీరు దాదాపు 80 అడుగుల ఎత్తు నుండి ఉధృతంగా కిందకు పడుతుంది. చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది. మన అందరికీ నచ్చిన సూపర్ హిట్ సినిమా &quot;బాహుబలి&quot; షూటింగ్ ఇక్కడే జరిగింది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;వర్షాకాలంలోనే ఎందుకు వెళ్ళాలి: &lt;/strong&gt;జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఈ జలపాతం అసలైన అందాలను చూడవచ్చు. నీటి వేగం ఎంత ఎక్కువగా ఉంటుందంటే, దాని ముందు నిలబడటం కూడా కష్టమే. నీటి తుంపర్లు వచ్చి మిమ్మల్ని తడిపేస్తాయి.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఎలా వెళ్ళాలి:&lt;/strong&gt; కొచ్చి ఎయిర్&zwnj;పోర్ట్ నుండి ఇది 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కార్ రెంట్ కు తీసుకుని ఈజీగా వెళ్ళవచ్చు. దీనికి దగ్గరలోనే ఉండే వజాచల్ జలపాతాన్ని కూడా మీరు చూసేయొచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;ఎక్కడ ఉంది:&lt;/strong&gt; గోవా-కర్ణాటక బోర్డర్&zwnj;లో, భగవాన్ మహావీర్ శాంచ్యురీ లోపల ఉంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;స్పెషాలిటీ:&lt;/strong&gt; 310 మీటర్ల ఎత్తు నుండి నాలుగు ధారలుగా నీరు కిందకు పడుతుంది. కొండపై నుండి పాల నది ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;వర్షాకాలంలోనే ఎందుకు వెళ్ళాలి: &lt;/strong&gt;వర్షాకాలంలో మాండవి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఆ సమయంలో దూద్ సాగర్ రూపం భయంకరంగా, అంతే అందంగా ఉంటుంది. రైలులో వెళ్లేటప్పుడు ఈ జలపాతం మీదుగానే రైలు వెళ్తుంది, ఆ ఎక్స్ పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఎలా వెళ్ళాలి:&lt;/strong&gt; పనాజీ నుండి జీప్ సఫారీ బుక్ చేసుకోవచ్చు. ట్రెక్కింగ్ చేస్తూ కూడా వెళ్ళవచ్చు. కానీ వర్షాకాలంలో ట్రెక్కింగ్ రిస్క్ కాబట్టి, గైడ్&zwnj;ను తీసుకెళ్లడం మంచిది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;ఎక్కడ ఉంది:&lt;/strong&gt; మేఘాలయలోని చిరపుంజీలో ఉంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;స్పెషాలిటీ:&lt;/strong&gt; ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ప్లంచ్ వాటర్ ఫాల్. 340 మీటర్ల ఎత్తు నుండి నిరంతరాయంగా నీరు కిందికి పడుతూ అక్కడ ఒక బ్లూయిష్ గ్రీన్ కలర్ గుండాన్ని ఏర్పాటు చేస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;వర్షాకాలంలోనే ఎందుకు వెళ్ళాలి:&lt;/strong&gt; చిరపుంజీ అంటే ప్రపంచంలోనే అత్యధికంగా వర్షం పడే ప్రాంతం. వర్షాకాలంలో ఇక్కడ మేఘాలు, పొగమంచు, నీరు అన్నీ ఒకటే అయిపోతాయి. ఒక్కోసారి జలపాతం కనిపించదు, కేవలం దాని గర్జన మాత్రమే వినిపిస్తుంది. అదో రకమైన ఫీలింగ్ ఇస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఎలా వెళ్ళాలి:&lt;/strong&gt; షిల్లాంగ్ నుండి ఇది 54 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదయాన్నే బయలుదేరితే ఒక రోజులోనే చూసి వచ్చేయొచ్చు. వ్యూ పాయింట్ నుండి చూడటమే బెస్ట్ ఆప్షన్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;ఎక్కడ ఉంది:&lt;/strong&gt; కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఉంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;స్పెషాలిటీ:&lt;/strong&gt; శరావతి నది నీరు 830 అడుగుల ఎత్తు నుండి రాజా, రాణి, రోరర్, రాకెట్ అనే నాలుగు ధారలుగా విడిపోయి కిందకు దూకుతుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;వర్షాకాలంలోనే ఎందుకు వెళ్ళాలి:&lt;/strong&gt; వర్షాకాలం కాకుండా మిగతా రోజుల్లో జోగ్ జలపాతాన్ని చూడటం వేస్ట్. అక్టోబర్, నవంబర్ వచ్చేసరికి నీరు తగ్గిపోయి జలపాతం ఎండిపోతుంది. వర్షాకాలంలో మాత్రం ప్రతి ధారా పూర్తి వేగంతో ప్రవహిస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఎలా వెళ్ళాలి:&lt;/strong&gt; బెంగళూరు నుండి ఇది సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షిమోగా మీదుగా వెళ్ళాలి. వ్యూ పాయింట్&zwnj;కి వెళ్లే దారి కొంచెం బాలేకపోయినా, అక్కడ కనిపించే వ్యూ మాత్రం అద్భుతంగా ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;ఎక్కడ ఉంది:&lt;/strong&gt; మహారాష్ట్రలోని పుణె జిల్లాలో, భీమశంకర్ వైల్డ్&zwnj;లైఫ్ శాంచ్యురీ లోపల ఉంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;స్పెషాలిటీ:&lt;/strong&gt; సహ్యాద్రి పర్వతాల గుండా ప్రవహించే ఈ జలపాతం దట్టమైన అడవులతో కప్పబడి ఉంటుంది. ప్రసిద్ధ భీమశంకర్ జ్యోతిర్లింగ ఆలయం కూడా దీనికి దగ్గరలోనే ఉంది. ఇక్కడ ప్రకృతి, భక్తి రెండూ కలిసి కనిపిస్తాయి.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;వర్షాకాలంలోనే ఎందుకు వెళ్ళాలి:&lt;/strong&gt; జూలై, ఆగస్టు నెలల్లో ఇక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఎటు చూసినా పచ్చదనమే. జలపాతం నీరు గుడి పక్కనుంచే ప్రవహిస్తుంది. ప్రశాంతతను కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఎలా వెళ్ళాలి:&lt;/strong&gt; పుణె నుండి ఇది సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కార్ లేదా బైక్ పై వెళ్ళవచ్చు. టెంపుల్ విజిట్, వాటర్ ఫాల్ రెండూ ఒకే ట్రిప్&zwnj;లో కవర్ చేయవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;ఎక్కడ ఉంది: &lt;/strong&gt;ఛత్తీస్&zwnj;గఢ్&zwnj;లోని బస్తర్ జిల్లాలో, ఇంద్రావతి నదిపై ఉంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;స్పెషాలిటీ: &lt;/strong&gt;ఇది 100 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు ఉంటుంది. గుర్రపు నాడా ఆకారంలో వంగి నీరు కిందకు పడుతుంది. వర్షాకాలంలో నది మొత్తం జలపాతంగా మారిపోతుంది. రాత్రి వేళల్లో చంద్రుని వెలుతురులో ఇక్కడ మూన్ రెయిన్&zwnj;బో అంటే చంద్ర ఇంద్రధనస్సు కనిపిస్తుంది. అద్భుతంగా ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;వర్షాకాలంలోనే ఎందుకు వెళ్ళాలి:&lt;/strong&gt; వర్షాకాలంలో ఇంద్రావతి నదిలో నీరు ఎంతలా పెరుగుతుందంటే, జలపాతం గర్జన 5 కిలోమీటర్ల దూరం వరకు వినబడుతుంది. బోట్ తీసుకుని జలపాతం దగ్గరకు వెళ్లవచ్చు. నీటి తుంపర్లతో శరీరం మొత్తం తడిసి ముద్దవుతుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఎలా వెళ్ళాలి: &lt;/strong&gt;జగదల్&zwnj;పూర్ నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాయ్&zwnj;పూర్ లేదా విశాఖపట్నం నుండి ట్రైన్ ద్వారా జగదల్&zwnj;పూర్ చేరుకోవచ్చు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/life/best-waterfalls-in-india-to-visit-during-monsoon-season-2026-jog-falls-to-dudhsagar-waterfall-bzpgs3i"/>
        </item>
        <item>
            <title><![CDATA[Droupadi Murmu: గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము స్పీచ్| Asianet Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/president-murmu-addresses-first-tribal-university-convocation-videoshow-dgnqhl8</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/president-murmu-addresses-first-tribal-university-convocation-videoshow-dgnqhl8</guid>
            <pubDate>Tue, 30 Jun 2026 18:26:42 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://www.youtube.com/embed/u1RKNBSU_kk" medium="video" height="350" width="560"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/president-murmu-addresses-first-tribal-university-convocation-videoshow-dgnqhl8"/>
        </item>
        <item>
            <title><![CDATA[India-Japan Investments : భారత్‌లో జపాన్ పెట్టుబడులు.. వందలు వేలు కాదు ఏకంగా రూ.5 లక్షల కోట్లా..!]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/india-and-japan-target-10-trillion-yen-investment-in-tech-and-energy-articleshow-f6umfys</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/india-and-japan-target-10-trillion-yen-investment-in-tech-and-energy-articleshow-f6umfys</guid>
            <pubDate>Thu, 02 Jul 2026 17:17:44 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ఇండియాలో భారీ పెట్టబడులు పెట్టేందుకు జపాన్ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఇరుదేశాల ప్రధానుల భేటిలో కీలక చర్చలు జరిగాయి. అనంతరం మీడియాలో మాట్లాడిన ఇరు దేశాధినేతలు పెట్టుబడుల గురించి ప్రకటించారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-external,imgname-image-675b5d78-6d89-42db-be75-9f79f19a0a6c.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;భారత్, జపాన్ దేశాలు తమ వాణిజ్య, వ్యూహాత్మక బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా, రాబోయే పదేళ్లలో జపాన్ నుంచి భారత్&zwnj;కు 10 ట్రిలియన్ యెన్ల పెట్టుబడులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంతేకాదు సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం వంటి కీలక రంగాల్లో సహకారం కోసం రెండు దేశాలు కలిసి ఒక జాయింట్ రోడ్&zwnj;మ్యాప్&zwnj;ను కూడా ప్రకటించాయి.&lt;/p&gt;&lt;p&gt;గురువారం న్యూఢిల్లీలో 16వ ఇండియా-జపాన్ వార్షిక సదస్సు జరిగింది. ఈ సదస్సు తర్వాత జపాన్ ప్రధాని సనాయె తకైచితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మీడియా సమావేశంలో మాట్లాడారు. జపాన్ తొలి మహిళా ప్రధాని తకైచీకి స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు&hellip; ఆమెన తన లిటిల్ సిస్టర్ గా పేర్కొన్నారు. భారత్-జపాన్&zwnj; బంధం రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాదని&hellip; ప్రపంచ శాంతికి మూలస్తంభంగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;h2&gt;భారత్-జపాన్ వాణిజ్య ఒప్పందాలు..&lt;/h2&gt;&lt;p&gt;&quot;ఇండియా-జపాన్ ఇన్వెస్ట్&zwnj;మెంట్ పార్ట్&zwnj;నర్&zwnj;షిప్ రోజురోజుకీ బలపడుతోంది. గత ఏడాదిలోనే సుమారు 120 కొత్త బిజినెస్ ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 10 బిలియన్ డాలర్లకు పైగా జపాన్ పెట్టుబడులు భారత్&zwnj;కు రానున్నాయి,&quot; అని ప్రధాని మోదీ చెప్పారు. ఆర్థిక సంస్థల మధ్య జరిగిన ఒప్పందాలు పెట్టుబడుల ప్రవాహాన్ని మరింత సులభతరం చేస్తాయని ఆయన అన్నారు.&lt;/p&gt;&lt;p&gt;&quot;మా లక్ష్యం స్పష్టంగా ఉంది. రాబోయే 10 ఏళ్లలో జపాన్ నుంచి భారత్&zwnj;కు 10 ట్రిలియన్ యెన్ల పెట్టుబడులు తీసుకురావాలి. అలాగే భారత్&zwnj;లోని జపనీస్ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయాలి. భారత్&zwnj;లో నిరంతరం జరుగుతున్న సంస్కరణల వల్ల వ్యాపారం చేయడం సులభతరమైంది. ఈ అవకాశాన్ని జపాన్ కంపెనీలు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు'' అని మోదీ పిలుపునిచ్చారు.&lt;/p&gt;&lt;h2&gt;ఆర్థిక, ఇంధన భద్రత కోసం ఉమ్మడి రోడ్&zwnj;మ్యాప్&lt;/h2&gt;&lt;p&gt;ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో ఇంధన భద్రత, ఆర్థిక భద్రత కోసం భారత్, జపాన్ కలిసి ఒక ఉమ్మడి రోడ్&zwnj;మ్యాప్&zwnj;ను సిద్ధం చేశాయని ప్రధాని మోదీ తెలిపారు.&quot;ప్రత్యేక రోడ్&zwnj;మ్యాప్ ద్వారా సెమీకండక్టర్లు, క్వాంటం, అడ్వాన్స్&zwnj;డ్ మెటీరియల్స్ వంటి వ్యూహాత్మక రంగాల్లో సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తాం&quot; అని మోదీ స్పష్టం చేశారు. &quot;ఇంధన భద్రత రంగంలో కూడా ఈరోజు మేము చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నాం&quot; అని ఆయన అన్నారు.&lt;/p&gt;&lt;p&gt;&quot;బ్యాటరీ, గ్రీన్ హైడ్రోజన్, అణుశక్తి రంగాల్లో మా సహకారం ప్రపంచ స్వచ్ఛ ఇంధన భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతుంది. ఆర్థిక భద్రతను ఉమ్మడి భద్రతగా, ఇంధన పరివర్తనను ఉమ్మడి అవకాశంగా భారత్, జపాన్ చూస్తున్నాయి. ఆ దిశగా కలిసి పనిచేస్తాం&quot; అని ప్రధాని పేర్కొన్నారు.&lt;/p&gt;&lt;h2&gt;ఉమ్మడి లక్ష్యాలపై జపాన్ ప్రధాని కామెంట్స్&lt;/h2&gt;&lt;p&gt;ఈ ద్వైపాక్షిక సమావేశం తర్వాత జపాన్ ప్రధాని సనాయె తకైచి మాట్లాడుతూ.. తాము అనేక అంశాలపై చర్చించామన్నారు. ముఖ్యంగా ఆర్థిక భద్రత, ఇంధన భద్రత రంగాల్లో సహకారం తమ చర్చల్లో కేంద్రంగా ఉందని ఆమె తెలిపారు.&lt;/p&gt;&lt;p&gt;&quot;ఆర్థిక ఆయుధీకరణ (economic weaponization), నాన్-మార్కెట్ పద్ధతులు వంటి సవాళ్లను రెండు దేశాలు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి కీలకమైన ఖనిజాల సరఫరా వ్యవస్థలలో మనం తక్షణమే పటిష్టతను నిర్మించుకోవాలి. మిడిల్ ఈస్ట్ పరిస్థితుల వల్ల ప్రభావితమైన ఇంధన భద్రత విషయంలో, ఈ ప్రాంతమంతటికీ ఇంధన భద్రత కల్పించే బాధ్యత జపాన్, భారత్&zwnj;లపై ఉంది'' అని తకైచి అన్నారు. ఆర్థిక భద్రత సహకారం కోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేసేలా ఒక జాయింట్ స్టేట్&zwnj;మెంట్&zwnj;ను విడుదల చేసినట్లు ఆమె తెలిపారు.&lt;/p&gt;&lt;h3&gt;సహకారంతో ఆర్థిక వృద్ధి&lt;/h3&gt;&lt;p&gt;పెట్టుబడులు, ఆవిష్కరణల ద్వారా భారత్, జపాన్ ఆర్థిక వృద్ధిని సాధించడమే తమ సహకార లక్ష్యమని జపాన్ ప్రధాని తకైచి అన్నారు. &quot;17 వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా జపాన్ సరఫరా సామర్థ్యాన్ని, సాంకేతిక సామర్థ్యాలను పెంచడానికి నేను కట్టుబడి ఉన్నాను. ప్రధాని మోదీ 'వికసిత భారత్'ను ప్రారంభించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనేది జాతీయ లక్ష్యం. ఆయన భారత వృద్ధిని బలంగా ముందుకు నడిపిస్తున్నారు. ఈ విధంగా భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడం ద్వారా మన దేశాలను బలంగా, సంపన్నంగా మార్చాలనే ఉమ్మడి లక్ష్యాన్ని మేము పంచుకుంటున్నాం&quot; అని తకైచి చెప్పారు.&lt;/p&gt;&lt;p&gt;&quot;ఈ పర్యటన సందర్భంగా భారత, జపాన్ కంపెనీల మధ్య సుమారు 120 సహకార పత్రాలు ప్రకటించబడ్డాయి. ఇందులో 2 ట్రిలియన్ యెన్ల స్థాయి పెట్టుబడులు కూడా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసికట్టుగా భారత్, జపాన్&zwnj;లకు ఉజ్వల భవిష్యత్తును నిర్మించాలన్నది మా ఆకాంక్ష&quot; అని తకైచి అన్నారు.&lt;/p&gt;&lt;h2&gt;ఉన్నత స్థాయి ప్రతినిధుల చర్చలు&lt;/h2&gt;&lt;p&gt;అంతకుముందు, ఇరు దేశాల నేతలు మొదట ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రతినిధి స్థాయి చర్చలకు నాయకత్వం వహించారు. భారత ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.&lt;/p&gt;&lt;p&gt;ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు తకైచి జూలై 1 నుంచి 3 వరకు భారత పర్యటనలో ఉన్నారు. ఇవాాళ ఉదయం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో తకైచికి ఘన స్వాగతం లభించింది.&lt;/p&gt;&lt;p&gt;గతంలో 2025 ఆగస్టులో టోక్యోలో జరిగిన 15వ వార్షిక సదస్సు కోసం ప్రధాని మోదీ జపాన్&zwnj;ను సందర్శించారు. ఈ వార్షిక సదస్సు ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించే కీలక మార్గంగా నిలుస్తోంది. &amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/india-and-japan-target-10-trillion-yen-investment-in-tech-and-energy-articleshow-f6umfys"/>
        </item>
        <item>
            <title><![CDATA[జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/pm-modi-s-grand-welcome-for-japan-s-prime-minister-videoshow-f87pqut</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/pm-modi-s-grand-welcome-for-japan-s-prime-minister-videoshow-f87pqut</guid>
            <pubDate>Thu, 02 Jul 2026 19:00:01 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://geo.dailymotion.com/player/x1tbu.html?video=xakge3a" medium="video" height="768" width="1024"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/pm-modi-s-grand-welcome-for-japan-s-prime-minister-videoshow-f87pqut"/>
        </item>
        <item>
            <title><![CDATA[Sia Goyal Case: కేతన్ అగర్వాల్ హత్య జరిగిన స్పాట్ ఇదే సుమారు 400 అడుగుల ఎత్తు నుంచి | Asianet Telugu]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/sia-goyal-case-the-scene-of-ketan-agarwal-s-400-ft-fall-videoshow-klzu2gq</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/sia-goyal-case-the-scene-of-ketan-agarwal-s-400-ft-fall-videoshow-klzu2gq</guid>
            <pubDate>Sun, 28 Jun 2026 18:23:31 +0530</pubDate>
            <description><![CDATA[]]></description>
            <media:content url="https://www.youtube.com/embed/ROav-ge1zBA" medium="video" height="350" width="560"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Galam Venkata Rao</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/sia-goyal-case-the-scene-of-ketan-agarwal-s-400-ft-fall-videoshow-klzu2gq"/>
        </item>
        <item>
            <title><![CDATA[National News: కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. రూ. 14,115 కోట్ల ప్రాజెక్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్]]></title>
            <link>https://telugu.asianetnews.com/national/national-news-cabinet-approves-14115-crore-road-projects-delhi-tunnel-kanpur-kabrai-highway-get-green-signal-articleshow-kom4gww</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/national/national-news-cabinet-approves-14115-crore-road-projects-delhi-tunnel-kanpur-kabrai-highway-get-green-signal-articleshow-kom4gww</guid>
            <pubDate>Wed, 01 Jul 2026 17:53:53 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;National News: దేశంలో రహదారి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) సమావేశంలో మొత్తం రూ.14,115 కోట్ల విలువైన ప్రాజెక్టుల&zwnj;కు ఆమెదం ల&zwnj;భించింది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01e8sffw3c97dfpnd3xrh457gq,imgname-modid-jpg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;h2&gt;ఢిల్లీలో 8.1 కిలోమీటర్ల ఆరు లేన్ల టన్నెల్&lt;/h2&gt;&lt;p&gt;కేంద్ర కేబినెట్ రూ.6,969.67 కోట్ల వ్యయంతో 8.1 కిలోమీటర్ల పొడవైన ఆరు లేన్ల టన్నెల్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ టన్నెల్ ద్వారకా ఎక్స్&zwnj;ప్రెస్&zwnj;వేలోని శివమూర్తి ఇంటర్&zwnj;చేంజ్&zwnj;ను వసంత్ కుంజ్&zwnj;లోని నెల్సన్ మండేలా మార్గ్&zwnj;తో అనుసంధానం చేస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;ఈ ప్రాజెక్టు పూర్తయితే గురుగ్రామ్, ద్వారకా, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, పశ్చిమ ఢిల్లీ నుంచి దక్షిణ ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. అలాగే భవిష్యత్తులో నిర్మించనున్న ఎయిమ్స్-మహిపాల్&zwnj;పూర్ ఎలివేటెడ్ కారిడార్ ద్వారా బరాపుల్లా ఎలివేటెడ్ రోడ్డుకు అనుసంధానం కల్పించనున్నారు. దీంతో తూర్పు ఢిల్లీ, నోయిడా, గాజియాబాద్ ప్రాంతాలకు కూడా మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది.&lt;/p&gt;&lt;h2&gt;పర్యావరణానికి నష్టం లేకుండా టన్నెల్ నిర్మాణం&lt;/h2&gt;&lt;p&gt;ఈ టన్నెల్ సదర్న్ రిడ్జ్ అడవి ప్రాంతం కిందుగా వెళ్తుంది. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక టన్నెల్ బోరింగ్ మెషీన్ల (TBM) సహాయంతో నిర్మాణం చేపడతారు. ఈ ప్రాజెక్టులో 3.14 కిలోమీటర్ల భూగర్భ టన్నెల్, ఎలివేటెడ్ రోడ్లు, అప్రోచ్ ర్యాంపులు, సాధారణ రహదారులు నిర్మించనున్నారు. అదనంగా 1.8 కిలోమీటర్ల ఎలివేటెడ్ రోడ్డు, మహిపాల్&zwnj;పూర్ వైపు కొత్త ఫ్లైఓవర్, మహిపాల్&zwnj;పూర్-ఛత్తర్&zwnj;పూర్ జంక్షన్ వద్ద ఎలివేటెడ్ యూ-టర్న్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్మాణం ద్వారా సుమారు 7.54 లక్షల ప్రత్యక్ష ఉద్యోగ దినాలు, 9.8 లక్షల పరోక్ష ఉద్యోగ దినాలు సృష్టి అవుతాయని అంచనా.&lt;/p&gt;&lt;h2&gt;ఉత్తరప్రదేశ్&zwnj;లో కాన్పూర్-కబ్రాయ్ గ్రీన్&zwnj;ఫీల్డ్ హైవే&lt;/h2&gt;&lt;p&gt;మరో కీలక నిర్ణయంగా రూ.7,145.14 కోట్ల వ్యయంతో 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్-కబ్రాయ్ గ్రీన్&zwnj;ఫీల్డ్ హైవే నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నాలుగు లేన్ల రహదారిని భవిష్యత్తులో ఆరు లేన్లుగా విస్తరించేలా నిర్మిస్తారు. ఇది భోపాల్-కాన్పూర్ ఆర్థిక కారిడార్లో కీలక భాగంగా ఉండనుంది. ఈ ప్రాజెక్టును జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) అమలు చేయనుంది. ఈ హైవేపై గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కాన్పూర్ నుంచి కబ్రాయ్ చేరుకోవడానికి సుమారు మూడున్నర గంటలు పడుతుండగా, కొత్త హైవే పూర్తయితే కేవలం గంటన్నరలోనే చేరుకోవచ్చు.&lt;/p&gt;&lt;h2&gt;వ్యాపారం, పరిశ్రమలు, ఉపాధికి భారీ ఊతం&lt;/h2&gt;&lt;p&gt;ఈ హైవే వల్ల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా మరింత వేగవంతం కానుంది. ముఖ్యంగా ఖనిజ సంపద అధికంగా ఉన్న కబ్రాయ్ మైనింగ్ ప్రాంతం నుంచి ఖనిజాలు, నిర్మాణ సామగ్రి, వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువుల రవాణా సులభమవుతుంది. ఈ మార్గం ఎన్&zwnj;హెచ్-34, ఎన్&zwnj;హెచ్-35, బుందేల్&zwnj;ఖండ్ ఎక్స్&zwnj;ప్రెస్&zwnj;వే, కాన్పూర్ రింగ్ రోడ్ సహా పలు ప్రధాన రహదారులతో అనుసంధానం అవుతుంది. అలాగే 16 ఆర్థిక కేంద్రాలు, 9 సామాజిక కేంద్రాలు, 10 లాజిస్టిక్స్ హబ్&zwnj;లు, పారిశ్రామిక ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా సుమారు 1.2 కోట్ల ఉద్యోగ దినాలు సృష్టి అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2028-29 నాటికి ఈ మార్గంలో రోజుకు సగటున 18 వేలకుపైగా వాహనాలు ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/national/national-news-cabinet-approves-14115-crore-road-projects-delhi-tunnel-kanpur-kabrai-highway-get-green-signal-articleshow-kom4gww"/>
        </item>
        <item>
            <title><![CDATA[WhatsApp : ఇక వాట్సాప్ ఫ్రీ కాదు.. నెలకు రూ.79 చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/technology/is-whatsapp-no-longer-free-meta-launches-whatsapp-plus-in-india-at-rs-79-for-month-whatsapp-plus-subscription-msz0nap</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/technology/is-whatsapp-no-longer-free-meta-launches-whatsapp-plus-in-india-at-rs-79-for-month-whatsapp-plus-subscription-msz0nap</guid>
            <pubDate>Mon, 29 Jun 2026 13:12:42 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;WhatsApp Plus Subscription: భారత్&zwnj;లో వాట్సాప్ ప్లస్ పేరిట పెయిడ్ సబ్&zwnj;స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసింది. నెలకు రూ.79 చెల్లించాలి. మరి సాధారణ యూజర్ల పరిస్థితి ఏంటి? ఇక వాట్సాప్ ఫ్రీ కాదా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kw94wtdkvjnf5vsxns3zeyjv,imgname-whatsapp-1782718556594.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;WhatsApp Plus Subscription: భారత్&zwnj;లో వాట్సాప్ ప్లస్ పేరిట పెయిడ్ సబ్&zwnj;స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసింది. నెలకు రూ.79 చెల్లించాలి. మరి సాధారణ యూజర్ల పరిస్థితి ఏంటి? ఇక వాట్సాప్ ఫ్రీ కాదా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;స్మార్ట్&zwnj;ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్&zwnj;లో వాట్సాప్ ఒక భాగమైపోయింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సాప్ లేకపోతే గడవదు. అయితే ఇప్పటివరకు ఫ్రీగా వాడుకున్న ఈ యాప్&zwnj;కు ఇకపై డబ్బులు కట్టాల్సిన రోజులు వచ్చేశాయి. అవును, వాట్సాప్ హిస్టరీలోనే మొదటిసారిగా ఒక పెయిడ్ సబ్&zwnj;స్క్రిప్షన్ ప్లాన్&zwnj;ను ఇండియాలో లాంచ్ చేశారు.&lt;/p&gt;&lt;p&gt;దీని పేరు వాట్సాప్ ప్లస్ (WhatsApp Plus). ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఇద్దరికీ ఈ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. దీని కోసం యూజర్లు నెలకు రూ.79 చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొత్తగా సబ్&zwnj;స్క్రిప్షన్ తీసుకునే వారికి మొదటి నెల ట్రయల్ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నెలకు రూ.79 కట్టాలి అనగానే సామాన్య యూజర్లు కంగారు పడుతున్నారు. అయితే ఇక్కడో గుడ్&zwnj;న్యూస్ ఉంది. ఈ ప్లాన్ రావడం వల్ల రెగ్యులర్ యూజర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాట్సాప్ పూర్తిగా పెయిడ్ యాప్&zwnj;గా మారడం లేదు.&lt;/p&gt;&lt;p&gt;మెసేజింగ్&zwnj;, వాయిస్ అండ్ వీడియో కాలింగ్, స్టేటస్ అప్&zwnj;డేట్స్, ఎండ్ టు ఎండ్ ఎన్&zwnj;క్రిప్షన్ లాంటి మెయిన్ ఫీచర్లు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగానే అందుబాటులో ఉంటాయి. వాటి కోసం మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. కేవలం అదనపు ఫీచర్లు కావాలనుకునే వారు మాత్రమే ఈ వాట్సాప్ ప్లస్ సబ్&zwnj;స్క్రిప్షన్ తీసుకోవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అసలు రూ.79 పెడితే వాట్సాప్ ప్లస్&zwnj;లో ఏం ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఇది యాప్ పనితీరును మార్చేసే ప్లాన్ కాదు, కేవలం లుక్ అండ్ ఫీల్&zwnj;ను మార్చుకునే కస్టమైజేషన్ ప్యాక్ మాత్రమే. ఇందులో భాగంగా యూజర్లకు 18 కొత్త కలర్ థీమ్స్ లభిస్తాయి. వీటితో యాప్ స్టైల్&zwnj;ను మార్చుకోవచ్చు. అలాగే 14 కొత్త యాప్ ఐకాన్ డిజైన్లు అందుబాటులోకి వస్తాయి. ఇవి కాకుండా నార్మల్ యూజర్లకు దొరకని కొన్ని ఎక్స్&zwnj;క్లూజివ్ రింగ్&zwnj;టోన్లు, కొత్త స్టిక్కర్ ప్యాక్&zwnj;లు ఇస్తున్నారు. వీటన్నింటితో పాటు ఒక సూపర్ అప్&zwnj;డేట్ ఏంటంటే.. చాట్ లిస్ట్&zwnj;లో ఇప్పటివరకు కేవలం 3 చాట్స్&zwnj; మాత్రమే పిన్ చేసుకునే వీలుండేది, కానీ వాట్సాప్ ప్లస్ యూజర్లు ఏకంగా 20 చాట్స్ వరకు ఒకేసారి పిన్ చేసి పెట్టుకోవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మీకు కూడా ఈ ఫీచర్లు కావాలనిపిస్తే సింపుల్&zwnj;గా సబ్&zwnj;స్క్రిప్షన్ తీసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఇక్కడ చూడండి..&lt;/p&gt;&lt;p&gt;&bull; ముందుగా మీ ఫోన్ లో WhatsApp యాప్&zwnj;ను ఓపెన్ చేసి, ఆ తర్వాత సెట్టింగ్స్&zwnj; వెళ్లండి.&lt;/p&gt;&lt;p&gt;&bull; అక్కడ మీకు 'Subscriptions' అనే కొత్త ఆప్షన్ క&zwnj;నిపిస్తుంది, దానిపై క్లిక్ చేయాలి.&lt;/p&gt;&lt;p&gt;&bull; అందులో 'WhatsApp Plus' ఆప్షన్ కనిపిస్తే దానిపై ట్యాప్ చేయాలి.&lt;/p&gt;&lt;p&gt;&bull; తర్వాత కంటిన్యూ క్లిక్ చేసి, గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ద్వారా పేమెంట్ పూర్తి చేయాలి.&lt;/p&gt;&lt;p&gt;&bull; పేమెంట్ సక్సెస్ అయిన వెంటనే మీకు ఒక కన్ఫర్మేషన్ నోటిఫికేషన్ వస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం అందరికీ ఒకేసారి రావడం లేదు. మీ ఫోన్ సెట్టింగ్స్&zwnj;లో సబ్&zwnj;స్క్రిప్షన్ ఆప్షన్ కనిపించకపోతే, కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నార్మల్ యూసేజ్ కోసం చూసేవారికి ఈ ఫీచర్లు అంతగా నచ్చకపోవచ్చు. కేవలం బేసిక్ మెసేజ్ లు చేసుకునే వారికి రూ.79 పెట్టడం వేస్ట్ అనిపించవచ్చు. కానీ, వాట్సాప్ పేరెంట్ కంపెనీ మెటా ప్లాన్ వేరేలా ఉంది. వాట్సాప్&zwnj;కు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ఇండియా. ఇక్కడ కోట్ల మంది యూజర్లు ఉన్నారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;అందులో కేవలం కొద్ది శాతం మంది ఈ రూ.79 ప్లాన్ తీసుకున్నా, మెటా కంపెనీకి ప్రతి నెలా భారీగా ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్లు చిన్నవిగా అనిపించినా, భవిష్యత్తులో వాట్సాప్&zwnj;లో ఒక పెద్ద ప్రీమియం ఎకోసిస్టమ్&zwnj;ను క్రియేట్ చేయడానికి ఇదొక మొదటి అడుగు అని టెక్ నిపుణులు భావిస్తున్నారు. యూజర్లు డబ్బులు కట్టడానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నారో టెస్ట్ చేయడానికి మెటా ఈ ప్లాన్ తీసుకొచ్చిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/technology/is-whatsapp-no-longer-free-meta-launches-whatsapp-plus-in-india-at-rs-79-for-month-whatsapp-plus-subscription-msz0nap"/>
        </item>
        <item>
            <title><![CDATA[8th Pay Commission: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జీతాలు 50% పెరిగే ఛాన్స్ !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/8th-pay-commission-how-change-in-family-unit-count-could-hike-minimum-salary-by-over-50-percent-higher-salaries-oec2p67</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/8th-pay-commission-how-change-in-family-unit-count-could-hike-minimum-salary-by-over-50-percent-higher-salaries-oec2p67</guid>
            <pubDate>Wed, 01 Jul 2026 08:49:21 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;8th Pay Commission: 8వ వేతన సంఘంలో ఫ్యామిలీ యూనిట్ లెక్కింపు 3 నుండి 4.6 కి పెరిగితే ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం భారీగా పెరుగుతుంది. దీంతో శాలరీలు 50% పైగా పెరిగే అవకాశం ఉంది. ఆ వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwdtt4xkhx51kcg2ckgdh77w,imgname-8th-pay-commission-1782875755443.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;8th Pay Commission: 8వ వేతన సంఘంలో ఫ్యామిలీ యూనిట్ లెక్కింపు 3 నుండి 4.6 కి పెరిగితే ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం భారీగా పెరుగుతుంది. దీంతో శాలరీలు 50% పైగా పెరిగే అవకాశం ఉంది. ఆ వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం సిఫార్సులపై ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు అందరూ కేవలం ఫిట్&zwnj;మెంట్ ఫ్యాక్టర్ గురించే మాట్లాడుకున్నారు. కానీ, ఇప్పుడు జీతాల సవరణను శాసించే మరో ముఖ్యమైన విషయం తెరపైకి వచ్చింది. అదే ఫ్యామిలీ యూనిట్.&lt;/p&gt;&lt;p&gt;కనీస వేతనాన్ని నిర్ణయించడానికి ఈ ఫ్యామిలీ యూనిట్ లెక్కింపు చాలా కీలకం. ఈ లెక్కింపులో మార్పులు వస్తే ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 8వ వేతన సంఘానికి సంబంధించిన అప్&zwnj;డేట్లను క్రమంగా పంచుకునే ఒక ఎక్స్ ఖాతా దీనిపై ఆసక్తికరమైన లెక్కలను వెల్లడించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;7వ వేతన సంఘం కనీస వేతనాన్ని లెక్కించే సమయంలో ఫ్యామిలీ యూనిట్&zwnj;ను 3.0 గా తీసుకుంది. దానికి బదులుగా 4.6 గా తీసుకుని ఉంటే, కనీస ప్రాథమిక వేతనం రూ. 18,000 కు బదులుగా ఏకంగా రూ. 27,600 గా ఉండేది. ఈ లెక్కన చూసుకుంటే ఫిట్&zwnj;మెంట్ ఫ్యాక్టర్ 3.94 గా మారేది. 7వ వేతన సంఘం అమలు చేసిన 2.57 తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఈ మార్పు గనుక జరిగి ఉంటే ఉద్యోగుల జీతాలు 50 శాతం కంటే ఎక్కువగా పెరిగి ఉండేవని ఆ పోస్ట్&zwnj;లో పేర్కొన్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;7వ వేతన సంఘం కాలంలో ఫ్యామిలీ యూనిట్&zwnj;ను ప్రభుత్వ ఉద్యోగి (1.0), జీవిత భాగస్వామి (0.8), ఇద్దరు పిల్లలు (ఒక్కొక్కరు 0.6 చొప్పున 1.2) మొత్తంగా 3.0 గా లెక్కించారు. అయితే, ఇందులో ఉద్యోగిపై ఆధారపడి జీవించే వృద్ధాప్య తల్లిదండ్రులను లెక్కలోకి తీసుకోలేదు. ప్రస్తుత రోజుల్లో కుటుంబ బాధ్యతలు, ఖర్చులు పెరిగాయి కాబట్టి, 8వ వేతన సంఘం ఈ ఫ్యామిలీ యూనిట్&zwnj;ను 4.6 నుండి 5.0 కి పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ స్టాఫ్ సైడ్ కూడా తమ మెమోరాండంలో ఈ ఫ్యామిలీ యూనిట్ కౌంట్&zwnj;ను పెంచాలని అధికారికంగా డిమాండ్ చేసింది. దీనివల్ల నేటి తరం ఉద్యోగుల గృహ బాధ్యతలకు సరైన న్యాయం జరుగుతుందని వారు వాదిస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ విషయంపై బ్యాంక్&zwnj;బజార్ సీఈఓ అధిల్ శెట్టి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ జీవన వ్యయాన్ని అంచనా వేయడానికి వేతన సంఘం ఉపయోగించే ముఖ్యమైన సూత్రాలలో ఫ్యామిలీ యూనిట్ ఒకటి అని ఆయన ఒక మీడియా ఛానెల్ తో అన్నారు.&lt;/p&gt;&lt;p&gt;&quot;ఒకవేళ ఉద్యోగ సంఘాలు కోరినట్లుగా 8వ వేతన సంఘం ఈ ఫ్యామిలీ యూనిట్&zwnj;ను పెంచితే, కనీస జీవన వ్యయ అంచనా కూడా పెరుగుతుంది. ఇది నేరుగా కనీస ప్రాథమిక వేతనంపై ప్రభావం చూపుతుంది. మన వేతన వ్యవస్థ అంతా ఈ కనీస వేతనం ఆధారంగానే నిర్మితమైంది కాబట్టి, ఇందులో ఎలాంటి మార్పు వచ్చినా అది అన్ని స్థాయిల ఉద్యోగుల జీతాలను పెంచుతుంది&quot; అని ఆయన అన్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గడిచిన కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులపై కుటుంబ బాధ్యతలు బాగా పెరిగాయి. పెరుగుతున్న వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, నిత్యావసరాల ధరల వల్ల భార్యాపిల్లలతో పాటు వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఉదాహరణకు, 7వ వేతన సంఘం నాటి పద్ధతినే వాడుతూ ఫ్యామిలీ యూనిట్&zwnj;ను 4.6 గా తీసుకుంటే, కనీస వేతనం రూ. 18,000 నుండి రూ. 27,600 కి చేరుకుంటుందని అంచనా.&lt;/p&gt;&lt;p&gt;అయితే, ఈ ఫ్యామిలీ యూనిట్ మార్పుపై 8వ వేతన సంఘం ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఒకవేళ ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం, అది దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల జీతాలలో ఊహించని మార్పులకు కారణం అవుతుంది. జీతాల మ్యాట్రిక్స్ మొత్తం ఈ బేంచ్&zwnj;మార్క్&zwnj;తో ముడిపడి ఉండటం వల్ల, ఉద్యోగుల అకౌంట్లలోకి భారీగా డబ్బులు చేరడం ఖాయం.&lt;/p&gt;&lt;p&gt;One interesting observation from the 7th CPC methodology: if the family unit had been 4.6 instead of 3.0 by including dependent parents, the minimum basic pay could have been around ₹27,600 instead of ₹18,000.The 8th CPC has an opportunity to better reflect today's family&hellip; pic.twitter.com/NanEqnYDD3&lt;/p&gt;&lt;p&gt;&mdash; 8th pay commission (@8thpaycommision) June 27, 2026&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/8th-pay-commission-how-change-in-family-unit-count-could-hike-minimum-salary-by-over-50-percent-higher-salaries-oec2p67"/>
        </item>
        <item>
            <title><![CDATA[India Vs China: చైనాకు చుక్కలు చూపించే సత్తా ఉన్న ఏకైక దేశం.. భారత్ పవర్ పై అమెరికా మైండ్ బ్లోయింగ్ స్టేట్‌మెంట్ !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/us-says-india-is-the-only-country-capable-of-challenging-china-in-tech-workforce-dominance-p2ykwbb</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/us-says-india-is-the-only-country-capable-of-challenging-china-in-tech-workforce-dominance-p2ykwbb</guid>
            <pubDate>Tue, 30 Jun 2026 18:48:01 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;India Vs China : చైనాకు చుక్కలు చూపించే సత్తా ఉన్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలెంట్, టెక్నాలజీ, సప్లై చైన్ రంగాల్లో చైనాకు గట్టి పోటీ ఇచ్చే సత్తా కేవలం భారత్&zwnj;కే ఉందని అమెరికా అధికారి జాకబ్ హెల్బర్గ్ అన్నారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwca616fpav26ncy4d5p7wvd,imgname-us-says-india-only-country-that-can-challenge-china-in-tech-workforce-1782824764622.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;India Vs China : చైనాకు చుక్కలు చూపించే సత్తా ఉన్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలెంట్, టెక్నాలజీ, సప్లై చైన్ రంగాల్లో చైనాకు గట్టి పోటీ ఇచ్చే సత్తా కేవలం భారత్&zwnj;కే ఉందని అమెరికా అధికారి జాకబ్ హెల్బర్గ్ అన్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎదుగుతున్న తీరు, దేశ సాంకేతిక సామర్థ్యం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. తాజాగా అమెరికా చేసిన ఒక పెద్ద ప్రకటన బీజింగ్ నుంచి వాషింగ్టన్ వరకు రచ్చలేపుతోంది. చైనాకు అడ్డుగా కొండలా నిలబడగలిగే సత్తా, ఆ దేశాన్ని నిలువరించే కెపాసిటీ కేవలం భారత్&zwnj;కు మాత్రమే ఉందని అమెరికా ఓపెన్&zwnj;గా ఒప్పేసుకుంది. అమెరికాకు అకస్మాత్తుగా భారత్ పవర్ ఎందుకు గుర్తొచ్చింది? చైనా పాలక వర్గాల్లో ఈ వ్యాఖ్యలు ఎలాంటి కలకలం రేపాయి? నిజంగానే భారత్ ప్రపంచ శక్తిగా మారుతోందా?&lt;/p&gt;&lt;p&gt;వాషింగ్టన్&zwnj;లో జరిగిన 9వ యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్&zwnj;నర్&zwnj;షిప్ ఫోరమ్ లీడర్&zwnj;షిప్ సమ్మిట్&zwnj;లో అమెరికా విదేశాంగ శాఖ ఆర్థిక వృద్ధి, ఇంధన, పర్యావరణ వ్యవహారాల అండర్ సెక్రటరీ జాకబ్ హెల్బర్గ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్&zwnj;కార్డ్ చీఫ్ గవర్నమెంట్ అఫైర్స్ అండ్ పాలసీ ఆఫీసర్ టకర్ ఫుట్&zwnj;తో జరిగిన సంభాషణలో భారత్ ఇంజనీరింగ్ పవర్, టాలెంట్&zwnj;ను జాకబ్ హెల్బర్గ్ ప్రశంసించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జాకబ్ హెల్బర్గ్ మాట్లాడుతూ, వర్క్&zwnj;ఫోర్స్, టెక్నాలజీ, గ్లోబల్ సప్లై చైన్ రంగాల్లో చైనాకు నిజమైన సవాలు విసిరే సత్తా ఉన్న ఒకే ఒక్క దేశం భారత్ అని స్పష్టం చేశారు. ముఖ్యంగా వర్క్&zwnj;ఫోర్స్, టాలెంట్ పూల్ విషయంలో చైనాతో ఢీకొట్టే ఏకైక దేశం ఇండియానేనని ఆయన అన్నారు. సురక్షితమైన, నమ్మకమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్&zwnj;ను నిర్మించడంలో భారత్ పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. చైనాపై ప్రపంచ దేశాల ఆధారపడటాన్ని తగ్గించే వ్యూహంలో భారత్, అమెరికాకు అత్యంత ముఖ్యమైన, నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని తెలిపారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రస్తుతం ఉన్న గ్లోబల్ సప్లై చైన్ స్ట్రక్చర్ ఎక్కువ కాలం నిలబడదని హెల్బర్గ్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ప్రపంచ సప్లై చైన్&zwnj;లోని ఒక పెద్ద భాగం కేవలం కొన్ని నిర్దిష్ట ప్రాంతాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఇలాంటి వ్యవస్థ వల్ల భవిష్యత్తులో సప్లై నిలిచిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. అందుకే సప్లై చైన్&zwnj;ను వేర్వేరు దేశాలకు, వివిధ ప్రాంతాలకు విస్తరించి వైవిధ్యభరితంగా మార్చడం ప్రస్తుతం రావాల్సిన తక్షణ అవసరం అని ఆయన పేర్కొన్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత్ ఎప్పుడూ అమెరికాకు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఉందని జాకబ్ హెల్బర్గ్ గుర్తుచేశారు. ప్యాక్స్ డిక్లరేషన్&zwnj;పై మొదట సంతకం చేసిన దేశాల్లో భారత్ కూడా ఒకటని ఆయన చెప్పారు. ఏఐ, టెక్నాలజీకి సంబంధించిన అంతర్జాతీయ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ఫిబ్రవరిలో భారత్&zwnj;లో జరిగిన 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో తాను కూడా పాల్గొన్నానని హెల్బర్గ్ చెప్పారు. ఆ సమయంలో రెండు దేశాలు ఏఐ రంగంలో సహకారాన్ని పెంచుకోవడానికి అంగీకరించి, ఒక జాయింట్ స్టేట్&zwnj;మెంట్&zwnj;ను కూడా విడుదల చేశాయని గుర్తుచేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత్ ఎందుకు ఇంత ప్రత్యేకం అనే విషయానికి జాకబ్ హెల్బర్గ్ కొన్ని బలమైన కారణాలను లెక్కగట్టారు. భారత్, అమెరికా దేశాల విలువలు ఒకేలా ఉంటాయని ఆయన అన్నారు. అలాగే ఇంజనీరింగ్ వర్క్&zwnj;ఫోర్స్, టాలెంట్ పూల్ లోతు విషయంలో చైనాకు గట్టి పోటీ ఇచ్చే ఏకైక దేశం ఇండియానేనని స్పష్టం చేశారు. భారత్&zwnj;లో బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ, భారీ సంఖ్యలో ఇంజనీర్లు, ఖనిజాల రిఫైనింగ్ సామర్థ్యం, వేగంగా దూసుకుపోతున్న టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఉన్నాయని కొనియాడారు. ఈ అద్భుతమైన ఫీచర్ల వల్లే గ్లోబల్ టెక్నాలజీ, సప్లై చైన్&zwnj;లో భారత్ ఒక అనివార్యమైన పార్ట్నర్&zwnj;గా మారిందని చెప్పారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా తన మిత్రదేశాల మధ్య టెక్నాలజీ అభివృద్ధిని జీరో సమ్ పోటీగా చూడటం లేదని హెల్బర్గ్ స్పష్టం చేశారు. టెక్నాలజీ రంగంలో ఇతర కంపెనీల విజయాల వల్ల అమెరికాకు ఎలాంటి ముప్పు లేదని, ఎందుకంటే టెక్నాలజీ ఇండస్ట్రీ అనేది కాలంతో పాటు నిరంతరం పెరుగుతూనే ఉంటుందని చెప్పారు. భారత్&zwnj;లోని ఖనిజాల రిఫైనింగ్ ఇండస్ట్రీని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రారంభ దశలో ఉన్న టెక్నాలజీ ఎకోసిస్టమ్&zwnj;ను ప్రస్తావిస్తూ.. దేశం టెక్నాలజీ అప్లికేషన్ లేయర్&zwnj;లో పెద్ద ఎత్తున సహకారం అందిస్తోందని చెప్పారు. భవిష్యత్తులో కొత్త టెక్నాలజీని భారీ స్థాయిలో విస్తరించడానికి ఈ అప్లికేషన్ లేయర్ చాలా అవసరం అని జాకబ్ హెల్బర్గ్ అన్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/us-says-india-is-the-only-country-capable-of-challenging-china-in-tech-workforce-dominance-p2ykwbb"/>
        </item>
        <item>
            <title><![CDATA[IRCTC Tourism : ఒక్కసారైనా ఈ రైళ్లలో జర్నీ చేయాల్సిందే.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీల లిస్ట్ ఇదిగో !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/irctc-tourism-packages-best-indian-railway-journeys-from-bharat-gaurav-to-maharajas-express-you-must-experience-qfqadow</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/irctc-tourism-packages-best-indian-railway-journeys-from-bharat-gaurav-to-maharajas-express-you-must-experience-qfqadow</guid>
            <pubDate>Thu, 02 Jul 2026 12:49:10 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;IRCTC Tourism Packages: రైల్లో రాచభోగాలు.. తక్కువ బడ్జెట్ నుండి లగ్జరీ టూర్ల వరకు ఐఆర్&zwnj;సీటీసీ అదిరిపోయే ఆఫర్స్ తో క్రేజీ టూరిజం ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. విదేశాలు వేస్ట్ అనేలా.. మన ఇండియాలోనే ఉన్న ఈ టాప్ 5 రైల్వే జర్నీల గురించి తెలుసా?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwgts4hrjxf7wsdgtg9m2f2t,imgname-irctc--1782976385591.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;IRCTC Tourism Packages: రైల్లో రాచభోగాలు.. తక్కువ బడ్జెట్ నుండి లగ్జరీ టూర్ల వరకు ఐఆర్&zwnj;సీటీసీ అదిరిపోయే ఆఫర్స్ తో క్రేజీ టూరిజం ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. విదేశాలు వేస్ట్ అనేలా.. మన ఇండియాలోనే ఉన్న ఈ టాప్ 5 రైల్వే జర్నీల గురించి తెలుసా?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారతదేశాన్ని సరికొత్తగా, మునుపెన్నడూ చూడని విధంగా ఎక్స్&zwnj;ప్లోర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఐఆర్&zwnj;సీటీసీ (IRCTC) టూరిజం మీకోసం అదిరిపోయే ఆఫర్లను తీసుకువచ్చింది. తక్కువ ధరలోనే ఆన్&zwnj;లైన్ ప్యాకేజీ బుకింగ్స్ అందిస్తూ, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఇండియన్ రైల్వేస్ అద్భుతమైన ప్రయాణ అనుభూతులను మీకు అందిస్తోంది.&lt;/p&gt;&lt;p&gt;సేఫ్ అండ్ కంఫర్టబుల్ జర్నీతో పాటు, లైఫ్&zwnj;టైమ్ గుర్తుండిపోయే మెమొరీస్ అందించేలా ఈ ప్యాకేజీలను డిజైన్ చేశారు. ఇండియాలోని ఫేమస్ సిటీస్, ఆధ్యాత్మిక ప్రాంతాలు, ప్రకృతి అందాలను తక్కువ ధరలోనే చుట్టేయడానికి ఇదో సూపర్ ఛాన్స్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక కట్టడాలు, పండుగలు, వివిధ ప్రాంతాల వంటకాలను ప్రతిబింబించేలా ఐఆర్&zwnj;సీటీసీ ప్రత్యేకంగా 'భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను' ప్రారంభించింది. ఈ రైలు కోచ్&zwnj;లను &quot;ప్రైడ్ ఆఫ్ ఇండియా - భారత్ గౌరవ్&quot; థీమ్&zwnj;తో అద్భుతంగా డిజైన్ చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో స్లీపర్ క్లాస్&zwnj;తో పాటు ఏసీ కోచ్&zwnj;లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అందరి బడ్జెట్&zwnj;కు ఇది సెట్ అవుతుంది.&lt;/p&gt;&lt;p&gt;ఈ ప్యాకేజీ తీసుకుంటే రైలు ప్రయాణంతో పాటు బస్సుల్లో లోకల్ టూర్స్, హోటల్ వసతి, టూర్ గైడ్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఇంకా వేడివేడిగా లోకల్ వంటకాలను అందించే ప్యాంట్రీ కార్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మన దేశాన్ని చుట్టేయడానికి దీనికంటే బెస్ట్ ఆప్షన్ లేదని చెప్పవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రాజభవనాన్ని తలపించే రైల్లో, రాయల్ లుక్&zwnj;తో ప్రయాణించాలనుకుంటే 'మహారాజాస్ ఎక్స్&zwnj;ప్రెస్' పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ లగ్జరీ రైల్లో ప్రయాణికులకు వరల్డ్ క్లాస్ సర్వీసెస్, అద్భుతమైన లొకేషన్స్ చూసే అవకాశం లభిస్తుంది. దేశంలోని విభిన్న ప్రాంతాలను కవర్ చేస్తూ ఇందులో నాలుగు రకాల స్పెషల్ రూట్లు ఉన్నాయి. వైల్డ్&zwnj;లైఫ్ సెంచరీల నుండి వైబ్రెంట్ సిటీస్ వరకు అన్నింటినీ ఇందులో చూడొచ్చు.&lt;/p&gt;&lt;p&gt;ఈ రైల్లోని ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లలో తాజా లోకల్ ఐటమ్స్&zwnj;తో చేసిన రుచికరమైన ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ఏసీతో కూడిన లగ్జరీ క్యాబిన్లు, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే స్టాఫ్, లైవ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ వంటి ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారతదేశంలో బౌద్ధ పర్యాటకాన్ని ప్రమోట్ చేయడానికి ఐఆర్&zwnj;సీటీసీ ఈ స్పెషల్ ట్రైన్&zwnj;ను నడుపుతోంది. ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలనుకునే వారికి, గౌతమ బుద్ధుని జీవిత విశేషాలను తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ టూర్ ప్యాకేజీలో బౌద్ధమతానికి సంబంధించిన ప్రముఖ పుణ్యక్షేత్రాలు, కట్టడాలను సందర్శించవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;ఈ రైలు గయ, రాజ్&zwnj;గిర్, నలంద, వారణాసి, సార్నాథ్, లుంబిని (నేపాల్), కుశీనగర్, శ్రావస్తి, ఆగ్రా వంటి ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తుంది. ప్రాచీన భారతదేశ వైభవాన్ని, బౌద్ధమత చరిత్రను క్లోజ్&zwnj;గా చూడాలనుకునే పర్యాటకులు, ఆధ్యాత్మిక అన్వేషకులు ఐఆర్&zwnj;సీటీసీ బుద్ధిస్ట్ సర్క్యూట్ రైలును ఎంచుకోవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సౌత్ ఇండియా అందాలను లగ్జరీగా, స్టైలిష్&zwnj;గా చూడాలనుకుంటే 'గోల్డెన్ చారియట్' రైలు ప్రయాణం ది బెస్ట్ అని చెప్పొచ్చు. బెంగుళూరులో సాంప్రదాయ సంగీతం, నృత్య ప్రదర్శనలతో ఈ ప్రయాణం గ్రాండ్&zwnj;గా స్టార్ట్ అవుతుంది. కొచ్చిన్, మైసూర్ వంటి నగరాలతో పాటు హంపి, మహాబలిపురం లాంటి అద్భుతమైన చారిత్రక ప్రదేశాలను ఈ టూర్ ద్వారా సందర్శించవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;ఈ రైల్లో రుచి, నలపాక అనే రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవి వరల్డ్ క్లాస్ వంటకాలతో పాటు ఇండియన్ స్పెషల్స్ అందిస్తాయి. అలాగే మదిర బార్&zwnj;లో బెస్ట్ వైన్స్, స్పిరిట్స్ దొరుకుతాయి. ప్రయాణంలో అలసట పోగొట్టుకోవడానికి ఆరోగ్య పేరుతో స్పా అండ్ ఫిట్నెస్ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ సాంప్రదాయ ఆయుర్వేద స్పా థెరపీలు అందుబాటులో ఉంటాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారతీయ పల్లెలు, పచ్చని పొలాలు, కొండ కోనలు, పురాతన దేవాలయాల మధ్య గుండా సాగే టాయ్ ట్రైన్ ప్రయాణం ఒక అద్భుతమైన ఫీలింగ్ ఇస్తుంది. కిటికీ పక్కన కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదించడం నిజంగా ఒక విభిన్నమైన అనుభూతి. ఉత్తరాన ఉన్న హిమాలయాల నుండి దక్షిణాన ఉన్న నీలగిరి కొండల వరకు దేశంలో ఎన్నో ఫేమస్ టాయ్ ట్రైన్ రూట్లు ఉన్నాయి.&lt;/p&gt;&lt;p&gt;మన దేశంలో తప్పక విజిట్ చేయాల్సిన ముఖ్యమైన టాయ్ ట్రైన్ జర్నీలు ఇవే:&lt;/p&gt;&lt;p&gt;&bull; డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, పశ్చిమ బెంగాల్&lt;/p&gt;&lt;p&gt;&bull; కల్కా-షిమ్లా రైల్వే, హిమాచల్ ప్రదేశ్&lt;/p&gt;&lt;p&gt;&bull; నీలగిరి మౌంటైన్ రైల్వే, తమిళనాడు&lt;/p&gt;&lt;p&gt;&bull; మాథెరన్ హిల్ రైల్వే, మహారాష్ట్ర&lt;/p&gt;&lt;p&gt;&bull; కాంగ్రా వ్యాలీ రైల్వే, హిమాచల్ ప్రదేశ్&lt;/p&gt;&lt;p&gt;భారతదేశపు అద్భుతమైన సంస్కృతిని, ప్రకృతిని దగ్గరగా చూడటానికి ఈ టాయ్ ట్రైన్ ప్రయాణాలను అస్సలు మిస్ అవ్వకండి. తాజా ప్యాకేజీలు, ధరలు, ఆఫర్ల పూర్తి వివరాల కోసం ఐఆర్&zwnj;సీటీసీ అధికారిక వెబ్&zwnj;సైట్ www.irctctourism.com ను సంప్రదించండి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/irctc-tourism-packages-best-indian-railway-journeys-from-bharat-gaurav-to-maharajas-express-you-must-experience-qfqadow"/>
        </item>
        <item>
            <title><![CDATA[Ghost Village Mystery: ఒక్క రాత్రిలో మాయమైన గ్రామం.. ఘోస్ట్ విలేజ్ కుల్ధారా మిస్టరీ ఇదే !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/kuldhara-village-mystery-the-shocking-story-of-rajasthan-s-overnight-deserted-ghost-village-mystery-explored-qz5ds2p</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/kuldhara-village-mystery-the-shocking-story-of-rajasthan-s-overnight-deserted-ghost-village-mystery-explored-qz5ds2p</guid>
            <pubDate>Tue, 30 Jun 2026 09:47:30 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Ghost Village : ఒక్క రాత్రిలో మాయమైన 1500 మంది.. 180 ఏళ్లుగా ఆ గ్రామాన్ని వెంటాడుతున్న ఘోర శాపం.. రాజస్థాన్&zwnj;లోని కుల్ధారా గ్రామంలో ఏం జరిగింది? 1825లో ఒక్క రాత్రిలో 84 గ్రామాల ప్రజలు ఎందుకు మాయమయ్యారు? 180 ఏళ్ల ఆ మిస్టరీ వెనుక ఉన్న అసలు కథ ఏంటి?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwbbq9c02bt16j176rxshz02,imgname-kuldhara-ghost-village-1782792824189.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Ghost Village : ఒక్క రాత్రిలో మాయమైన 1500 మంది.. 180 ఏళ్లుగా ఆ గ్రామాన్ని వెంటాడుతున్న ఘోర శాపం.. రాజస్థాన్&zwnj;లోని కుల్ధారా గ్రామంలో ఏం జరిగింది? 1825లో ఒక్క రాత్రిలో 84 గ్రామాల ప్రజలు ఎందుకు మాయమయ్యారు? 180 ఏళ్ల ఆ మిస్టరీ వెనుక ఉన్న అసలు కథ ఏంటి?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రాజస్థాన్&zwnj;లోని థార్ ఎడారి నడిబొడ్డున ఒక నిర్జీవమైన గ్రామం కనిపిస్తుంది. అదే కుల్ధారా. 1825వ సంవత్సరంలో ఒకే ఒక్క రాత్రిలో 84 గ్రామాలకు చెందిన దాదాపు 1500 మంది ప్రజలు ఇక్కడి నుంచి మాయమైపోయారు. ఇళ్లు, గుడులు, బావులు అన్నీ అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. కానీ వెళ్తూ వెళ్తూ, &quot;ఈ మట్టిపై ఇక ఎవరు కూడా ఇళ్లు కట్టుకుని బతకలేరు&quot; అని ఒక ఘోరమైన శాపం పెట్టారు. ఆ శాపం వల్లనే 180 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు అక్కడ ఒక్క రాత్రి కూడా ఎవరూ గడపలేకపోయారు. ఇక్కడి గైడ్&zwnj;లు సైతం సాయంత్రం కాగానే పారిపోతారు. పర్యాటకులకు పగటిపూట కూడా ఇక్కడ ఏదో తెలియని భయంకరమైన ఫీలింగ్ కలుగుతుంది.&lt;/p&gt;&lt;p&gt;రాజస్థాన్&zwnj;లోని కుల్ధారా గ్రామం జైసల్మేర్ నగరానికి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. టాక్సీలో వెళ్తే 30 నిమిషాలు పడుతుంది. కానీ సాయంత్రం 6 గంటల తర్వాత ఇక్కడి ప్రభుత్వ గేట్లు మూసివేస్తారు. ఎందుకంటే, రాత్రి కాగానే అక్కడ మాయమైన వారంతా తిరిగి వస్తారని స్థానికుల నమ్మకం. పాడుబడ్డ ఇళ్ల మధ్య నుంచి ఏడుపులు, కాళ్ల శబ్దాలు, వింత నీడలు కనిపిస్తాయని చెబుతారు. 180 ఏళ్లుగా ఈ గ్రామం ఎందుకు ఖాళీగా ఉందో మీకు తెలుసా?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. 1825వ సంవత్సరంలో జైసల్మేర్ రాజ్యానికి దీవాన్&zwnj;గా సలీం సింగ్ అనే వ్యక్తి ఉండేవాడు. అతడు అత్యంత క్రూరుడు, విలాసవంతుడు, అధికార పిశాచి. కుల్ధారా గ్రామంలో పాలివాల్ బ్రాహ్మణులు నివసించేవారు. వీరు 1291లో ఈ గ్రామాన్ని నిర్మించుకున్నారు. ఎడారి ప్రాంతంలో కూడా వ్యవసాయం, వ్యాపారాలు చేస్తూ దీనిని ఒక బంగారు గ్రామంగా మార్చుకున్నారు. నీటి సంరక్షణ కోసం వారు వాడిన టెక్నాలజీ వల్ల థార్ ఎడారిలో కూడా పంటలు పండేవి.&lt;/p&gt;&lt;p&gt;అయితే, ఈ దీవాన్ సలీం సింగ్ కన్ను ఆ గ్రామ పెద్ద కూతురిపై పడింది. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమెను పెళ్లి చేసుకుంటానని, ఒకవేళ అమ్మాయిని ఇవ్వకపోతే గ్రామంపై పన్నును 3 రెట్లు పెంచుతానని, బలవంతంగా ఎత్తుకెళ్తానని బెదిరించాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;దీంతో తమ గౌరవాన్ని, కూతురి ఇజ్జత్&zwnj;ను కాపాడుకోవడానికి 84 పాలివాల్ గ్రామాల పెద్దలు రాత్రికి రాత్రే పంచాయితీ పెట్టారు. దీవాన్ చేతిలో అవమానపడటం కంటే గ్రామాన్ని వదిలి వెళ్లడమే ఏకైక మార్గమని నిర్ణయించుకున్నారు. 1825 నాటి ఒక అమావాస్య రాత్రి, కుల్ధారాతో పాటు చుట్టుపక్కల ఉన్న 84 గ్రామాల ప్రజలు తమ ఆవులు, గిన్నెలు, సామాన్లతో సహా రాత్రికి రాత్రే మాయమైపోయారు. వారు ఎక్కడికి వెళ్లారు అనేది నేటికీ ఎవరికీ తెలియదు. కానీ వెళ్లే ముందు వారు ఆ భూమిని శపించారు. ఉదయాన్నే సలీం సింగ్ తన సైన్యంతో వచ్చి చూసేసరికి అక్కడ ఒక్క మనిషి కూడా లేరు. అంతా శ్మశానంలా మారిపోయింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రభుత్వం, స్థానికుల ప్రకారం దీనికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి.. రాత్రి పూట మహిళల ఏడుపులు, గాజుల చప్పుడు, కాళ్ల ముద్రలు కనిపిస్తాయని స్థానికులు చెబుతారు. పగటిపూట వచ్చే కొందరు పర్యాటకులు కూడా ఇక్కడకు రాగానే తల తిరగడం, అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది. ఢిల్లీకి చెందిన &lsquo;పారానార్మల్ సొసైటీ&rsquo; ఒక రాత్రి ఇక్కడ పరిశోధన చేయగా, వారి ఈఎంఎఫ్ మీటర్లలో వింత రీడింగ్స్ వచ్చాయి. కెమెరాల్లో తెల్లటి ఆకారాలు రికార్డ్ అయ్యాయి. టీమ్ సభ్యుల శరీరాలపై గీతలు పడ్డాయి. దాంతో వారు తెల్లవారుజామున 4 గంటలకే అక్కడి నుంచి పారిపోయారు.&lt;/p&gt;&lt;p&gt;ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కుల్ధారాను హెరిటేజ్ సైట్&zwnj;గా ప్రకటించింది. కానీ సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరినీ అనుమతించదు. గేట్లకు తాళాలు వేస్తారు, అక్కడ గార్డులు కూడా ఉండరు. 2013లో కొందరు వ్యక్తులు ఇక్కడ ఉండటానికి ప్రయత్నించగా, వరుస ప్రమాదాలు, అనారోగ్యాలు ఎదురయ్యాయి. కేవలం ఒక్క వారంలోనే వారు అక్కడి నుంచి పారిపోయారు. నేటికీ కుల్ధారాలో కొత్తగా ఒక్క ఇటుక కూడా పడలేదు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కుల్ధారా మిస్టరీపై ప్రధానంగా మూడు థియరీలు ప్రచారంలో ఉన్నాయి..&lt;/p&gt;&lt;p&gt;&bull; థియరీ 1 : 1825లో అక్కడ భారీ భూకంపం రావడం వల్ల బావుల్లో నీరు అడుగంటిపోయిందని, వ్యవసాయం సాధ్యం కాక వారు వెళ్లిపోయారని కొందరు అంటారు. కానీ ఒక్క రాత్రిలోనే 84 గ్రామాల ప్రజలు సామాన్లతో సహా ఎలా ఖాళీ చేస్తారు? భూకంపం వస్తే కనీసం కొన్ని వస్తువులైనా మిగిలిపోవాలి కదా అనే ప్రశ్నలు ఉన్నాయి.&lt;/p&gt;&lt;p&gt;&bull; థియరీ 2 : సలీం సింగ్ వేధింపులు, కరవు వల్ల నీరు లేక పాలివాల్ బ్రాహ్మణులు రాత్రికి రాత్రే పక్క రాష్ట్రాలకు వలస వెళ్లారు. సలీం సింగ్ మళ్లీ అక్కడెవరినీ కూర్చోబెట్టకుండా ఉండటానికి శాపం అనే పుకారును వ్యాప్తి చేశారు.&lt;/p&gt;&lt;p&gt;&bull; థియరీ 3 : 1500 మంది ప్రజల బాధ, ఏడుపు, కోపం వంటి నెగెటివ్ ఎనర్జీ ఆ మట్టిలో ఉండిపోయిందని, అందుకే రాత్రి వేళల్లో అక్కడ వింత వింతలు జరుగుతాయని స్థానికులు నమ్ముతారు. సైన్స్ దీనిని అంగీకరించకపోయినా, స్థానికుల నమ్మకం ఇదే.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మీరు ఒకవేళ కుల్ధారా వెళ్లాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది జైసల్మేర్ నుండి 18 కిమీ దూరంలో సామ్ డెజర్ట్ వెళ్లే దారిలో ఉంటుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. టికెట్ ధర ఒకరికి ₹50, కార్ పార్కింగ్ ₹200, గైడ్ ఫీజు ₹300 ఉంటుంది. సాయంత్రం 5 గంటల తర్వాత లోపలికి వెళ్లకపోవడమే మంచిది, ఎందుకంటే వెలుతురు తగ్గి భయంకరంగా మారుతుంది. పిల్లలు, గుండె బలహీనంగా ఉన్నవారు వెళ్లకపోవడం ఉత్తమం. శిథిలావస్థలో ఉన్న ఇళ్ల పైకి ఎక్కకూడదు. అక్కడి వస్తువులను దేనినీ ఇంటికి తీసుకురాకూడదు, శాపం తగులుతుందని నమ్ముతారు. అక్టోబర్ నుండి మార్చి మధ్య కాలం ఇక్కడకు వెళ్లడానికి బెస్ట్ టైమ్. మధ్యాహ్నం 4 గంటలకు వెళ్లి, సన్&zwnj;సెట్ చూసి 5:30 కల్లా బయటకు వచ్చేయాలి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/kuldhara-village-mystery-the-shocking-story-of-rajasthan-s-overnight-deserted-ghost-village-mystery-explored-qz5ds2p"/>
        </item>
        <item>
            <title><![CDATA[IRCTC Char Dham Yatra: కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల దర్శనంతో ఐఆర్‌సీటీసీ చార్ ధామ్ యాత్ర క్రేజీ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవే !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/irctc-char-dham-yatra-tour-package-visit-kedarnath-and-badrinath-with-complete-itinerary-price-and-booking-details-rm5on81</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/irctc-char-dham-yatra-tour-package-visit-kedarnath-and-badrinath-with-complete-itinerary-price-and-booking-details-rm5on81</guid>
            <pubDate>Sat, 04 Jul 2026 09:04:26 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;IRCTC Char Dham Yatra: ఐఆర్&zwnj;సీటీసీ అదిరిపోయే చార్ ధామ్ యాత్ర ప్యాకేజీని అందిస్తోంది. ఈ సూపర్ ప్యాకేజీ యమునోత్రి, గంగోత్రి, కేదార్&zwnj;నాథ్, బద్రీనాథ్ వంటి క్షేత్రాలను కూడా సందర్శించవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwnk0mbqp68bppsydnjz23n7,imgname-irctc-char-dham-yatra-1783136014710.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;IRCTC Char Dham Yatra: ఐఆర్&zwnj;సీటీసీ అదిరిపోయే చార్ ధామ్ యాత్ర ప్యాకేజీని అందిస్తోంది. ఈ సూపర్ ప్యాకేజీ యమునోత్రి, గంగోత్రి, కేదార్&zwnj;నాథ్, బద్రీనాథ్ వంటి క్షేత్రాలను కూడా సందర్శించవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలను సందర్శించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్&zwnj;లోని దేవభూమిలో ఉన్న చార్ ధామ్ క్షేత్రాలను దర్శించుకోవడం జీవిత కాల స్వప్నంగా భావిస్తారు. భక్తుల కలలను నిజం చేస్తూ, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) టూరిజం ఒక అద్భుతమైన చార్ ధామ్ యాత్ర ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. చాలా తక్కువ బడ్జెట్&zwnj;లోనే, ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేసుకునేలా ఐఆర్&zwnj;సీటీసీ ఈ టూర్&zwnj;ను ప్లాన్ చేసింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ప్యాకేజీలో హిమాలయాల్లోని నాలుగు అత్యంత పవిత్రమైన క్షేత్రాలను దర్శించుకోవచ్చు. హిందూ సాంప్రదాయం ప్రకారం, చార్ ధామ్ యాత్రను క్లాక్&zwnj;వైజ్ అంటే ప్రదక్షిణ దిశలో పూర్తి చేయాల్సి ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;&bull; యమునోత్రి: హిమాలయాల్లో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం నుంచే చార్ ధామ్ యాత్ర అధికారికంగా ప్రారంభమవుతుంది. ఇక్కడి యమునోత్రి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.&lt;/p&gt;&lt;p&gt;&bull; గంగోత్రి: గంగా దేవి కొలువైన ఈ క్షేత్రం ఉత్తర భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఆధ్యాత్మికతతో పాటు ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి.&lt;/p&gt;&lt;p&gt;&bull; కేదార్&zwnj;నాథ్: గార్వాల్ హిమాలయాల్లో శివుడు కొలువైన పరమ పవిత్ర క్షేత్రం. ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన కొండల మధ్య ఉండే ఈ ఆలయాన్ని ఐఆర్&zwnj;సీటీసీ ప్యాకేజీలో ప్రత్యేకంగా సందర్శించవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;&bull; బద్రీనాథ్: ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన ఈ ఆలయంలో మహావిష్ణువు కోలువై ఉన్నారు. గార్వాల్ కొండల్లో ఉన్న ఈ క్షేత్ర దర్శనంతో యాత్ర ముగుస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఐఆర్&zwnj;సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీ ఢిల్లీ లేదా హరిద్వార్ వంటి ప్రధాన ప్రాంతాల నుండి ప్రారంభమవుతుంది. ఈ టూర్ మొత్తం 11 నుండి 12 రోజుల పాటు సాగుతుంది. ఇందులో బడ్జెట్ కు అనుగుణంగా విధిధ రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్రయాణం పూర్తిగా రోడ్డు మార్గం ద్వారానే సాగుతుంది. కొండ ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా ఏసీ లేదా నాన్ ఏసీ వాహనాల్లో గ్రూప్ టూర్&zwnj;గా ప్రయాణికులను తీసుకెళ్తారు. బడ్జెట్ నుండి లగ్జరీ వరకు కస్టమర్ల ఛాయిస్ ప్రకారం హోటల్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఆల్ ఇన్&zwnj;క్లూసివ్ ప్యాకేజీలో భక్తుల సౌకర్యం కోసం ఐఆర్&zwnj;సీటీసీ అన్ని ఏర్పాట్లను చూసుకుంటుంది. ప్యాకేజీలో భాగంగా లభించే ముఖ్యమైన సేవలు ఇవే..&lt;/p&gt;&lt;p&gt;&bull; ట్విన్ లేదా ట్రిపుల్ షేరింగ్ పద్ధతిలో హోటల్ వసతి.&lt;/p&gt;&lt;p&gt;&bull; యాత్ర మొత్తం స్వచ్ఛమైన శాకాహార భోజనం.&lt;/p&gt;&lt;p&gt;&bull; స్థానిక ప్రాంతాల సందర్శన, ట్రాన్స్&zwnj;ఫర్ ఫెసిలిటీ.&lt;/p&gt;&lt;p&gt;&bull; ప్రయాణికుల రక్షణ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్.&lt;/p&gt;&lt;p&gt;&bull; యాత్రలో సహాయం చేయడానికి ప్రత్యేక టూర్ ఎస్కార్ట్స్ / గైడ్లు.&lt;/p&gt;&lt;p&gt;&bull; ట్రాన్స్&zwnj;పరెంట్ ట్రాన్సాక్షన్స్, 24/7 కస్టమర్ సర్వీస్ సపోర్ట్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు కొన్ని రూల్స్ కచ్చితంగా పాటించాలి. మీరు ఐఆర్&zwnj;సీటీసీ ద్వారా బుక్ చేసుకున్నప్పటికీ, ఉత్తరాఖండ్ టూరిజం అధికారిక పోర్టల్&zwnj;లో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. చార్ ధామ్ యాత్ర సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మధ్యలో ప్రారంభమై, శీతాకాలం కంటే ముందే ముగుస్తుంది. ప్రస్తుతం ఇప్పటికే స్టార్ అయింది.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;ఈ టూర్ చాలా కష్టమైన కొండ ప్రాంతాల్లో, ఎక్కువ ఎత్తులో సాగుతుంది. అందుకే 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లలను ఈ యాత్రకు తీసుకురావద్దని ఐఆర్&zwnj;సీటీసీ సూచిస్తోంది. అలాగే, కేదార్&zwnj;నాథ్ వెళ్లడానికి హెలికాప్టర్ సర్వీస్ కావాలనుకుంటే, దాన్ని ప్యాకేజీ కాకుండా విడిగా బుక్ చేసుకుని సొంతంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;చార్ ధామ్ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఐఆర్&zwnj;సీటీసీ టూరిజం అత్యంత నమ్మకమైన పార్ట్&zwnj;నర్&zwnj;గా నిలుస్తుంది. మీరు కూడా ఈ పవిత్ర యాత్రను ప్లాన్ చేయాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఐఆర్&zwnj;సీటీసీ టూరిజం అధికారిక వెబ్&zwnj;సైట్ www.irctctourism.com లేదా వారి అఫీషియల్ మొబైల్ యాప్&zwnj;ని విజిట్ చేయవచ్చు. అక్కడ మీ బడ్జెట్&zwnj;కు సరిపోయే ప్యాకేజీని సెలెక్ట్ చేసుకుని ఈజీగా బుకింగ్ పూర్తి చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీతో కలిసి హిమాలయాల అందాల మధ్య ఆధ్యాత్మిక యాత్రను చేయాలనుకుంటే ఇప్పటికే మొదలైన చార్ ధామ్ యాత్ర సీట్లను రిజర్వ్ చేసుకోండి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/irctc-char-dham-yatra-tour-package-visit-kedarnath-and-badrinath-with-complete-itinerary-price-and-booking-details-rm5on81"/>
        </item>
        <item>
            <title><![CDATA[Petrol Price Cut : ఇంటికి దగ్గర్లో ఈ పెట్రోల్ బంక్ ఉందంటే మీరు లక్కీ.. భారీ తగ్గింపు ధరకు పెట్రోల్, డీజిల్ పొందవచ్చు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/nayara-energy-petrol-price-cut-across-7000-outlets-in-india-xoqsesc</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/nayara-energy-petrol-price-cut-across-7000-outlets-in-india-xoqsesc</guid>
            <pubDate>Wed, 01 Jul 2026 16:06:39 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;పెట్రోల్ ధరలు మండిపోతున్నాయని బాధపడుతున్నారా? అయితే మీకు ఓ శుభవార్త. ఓ ప్రముఖ ఇంధన కంపెనీ దేశవ్యాప్తంగా తన బంకుల్లో లీటర్ పెట్రోల్&zwnj;పై ఏకంగా 5 రూపాయలు తగ్గించింది. ఇంతకూ ఆ &amp;nbsp;బంక్ ఏదో తెలుసా?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kweke5km4qk836jebbs3506k,imgname-nayara-1782901577331.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;పెట్రోల్ ధరలు మండిపోతున్నాయని బాధపడుతున్నారా? అయితే మీకు ఓ శుభవార్త. ఓ ప్రముఖ ఇంధన కంపెనీ దేశవ్యాప్తంగా తన బంకుల్లో లీటర్ పెట్రోల్&zwnj;పై ఏకంగా 5 రూపాయలు తగ్గించింది. ఇంతకూ ఆ &amp;nbsp;బంక్ ఏదో తెలుసా?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇంధన ధరలు ప్రజల జీవితాలను శాసిస్తాయి.. పెట్రోల్, డీజిల్ ధరల్లో చిన్న మార్పు వచ్చినా సామాన్యుడి నెల బడ్జెట్&zwnj; పూర్తిగా తారుమారు అవుతుంది. వీటి ధరలు పెరిగితే నేరుగా వాహనదారులపై భారం పడుతుంది&hellip; అలాగే నిత్యావసరాలు, ఇతర వస్తువుల రవాణా ఖర్చులు పెరిగి ధరలు పెరుగుతాయి. ఇలా యావత్ దేశం ఎఫెక్ట్ అవుతుంది.&lt;/p&gt;&lt;p&gt;ఇటీవల మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్కబడి అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గాయి&hellip; దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించింది&hellip; ఇది వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, మార్కెట్ పోటీకి అనుగుణంగా మన దేశంలో ఇంధన ధరలు మారుతూ ఉంటాయి. అయితే ఇటీవల ఇజ్రాయెల్, అమెరికాతో ఇరాన్ యుద్దానికి దిగడంతో కీలకమైన చమురు రవాణా మార్గం హర్మూజ్ మూతపడింది. సరఫరా తగ్గి డిమాండ్ పెరగడంతో ఆటోమెటిగ్గా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు ఉద్రిక్తతలు తగ్గి సరఫరా పెరగడంతో ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజిల్ ధరలను తగ్గించింది నయారా సంస్థ. &amp;nbsp; అంతర్జాతీయ మార్కెట్ ప్రయోజనాలను నేరుగా వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నయారాా సంస్థ ప్రతినిధులు తెలిపారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రైవేట్ రంగ సంస్థ అయిన నయారా ఎనర్జీ (Nayara Energy) ఈ ధరల తగ్గింపును ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న 7,000కు పైగా నయారా బంకుల్లో ఈ కొత్త ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థల ధరలతో పోలిస్తే నయారా బంకుల్లో రూ.5 తక్కువకే లీటర్ పెట్రోల్, రూ.3 తగ్గింపుకే లీటర్ డీజిల్ లభిస్తుండటం వాహనదారులను ఆకర్షిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ధరల తగ్గింపు వల్ల మధ్యతరగతి ప్రజల నుంచి వ్యాపారుల వరకు అందరికీ ప్రయోజనం చేకూరుతుంది. రోజూ బైకులు, కార్లు వాడే ఉద్యోగులు, విద్యార్థులకు నెలవారీ పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది. చిన్న వ్యాపారులకు, డెలివరీ సంస్థలకు రవాణా ఖర్చులు (Operational Cost) ఆదా అవుతాయి. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు సరుకు రవాణాచేసే లారీలు, ట్రక్కులు వంటి పెద్ద వాహనాలకు ఈ తగ్గింపుతో పెద్ద మొత్తంలో డబ్బును మిగులుస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత ఇంధన మార్కెట్లో ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థలదే ఆధిపత్యం. ఇలాంటి సమయంలో నయారా లాంటి ప్రైవేట్ సంస్థ 7,000 బంకుల్లో ధరలు తగ్గించడంతో, కస్టమర్లను కాపాడుకోవడానికి ఇతర కంపెనీలు కూడా ధరలు తగ్గించే అవకాశం ఉంది. ఈ ఆరోగ్యకరమైన పోటీ, వినియోగదారులకు మరింత మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న జనాలకు నయారా ప్రకటించిన ఈ తగ్గింపు పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఈ చర్య వినియోగదారుల చేతిలో అదనపు డబ్బును మిగల్చడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఒకరకంగా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ ఇంధన సంస్థలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే ప్రజలకు మరింత ఊరట దక్కుతుంది.&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>national</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/nayara-energy-petrol-price-cut-across-7000-outlets-in-india-xoqsesc"/>
        </item>
    </channel>
</rss>
