<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Sun, 05 Jul 2026 16:20:45 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/international" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[Modi Trump: 16 నెల‌ల త‌ర్వాత తొలిసారి క‌లిసిన మోదీ, ట్రంప్‌.. అంతా సెట్ అయిన‌ట్లేనా.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/modi-trump-meet-at-g7-summit-pm-modi-and-donald-trump-hold-first-face-to-face-meeting-in-16-months-2e4i0ig</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/modi-trump-meet-at-g7-summit-pm-modi-and-donald-trump-hold-first-face-to-face-meeting-in-16-months-2e4i0ig</guid>
            <pubDate>Tue, 16 Jun 2026 21:46:02 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Modi Trump: ఫ్రాన్స్&zwnj;లో జరుగుతున్న జీ7 (G7) సదస్సులో భారత ప్రధాని న&zwnj;రేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్&zwnj; కలుసుకున్నారు. దాదాపు 16 నెలల తర్వాత ఇద్దరు నేతలు ప్రత్యక్షంగా సమావేశం కావడం అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kv8fhv9275arevnhb0yeyx46,imgname-modi-trump-1781622435106.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Modi Trump: ఫ్రాన్స్&zwnj;లో జరుగుతున్న జీ7 (G7) సదస్సులో భారత ప్రధాని న&zwnj;రేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్&zwnj; కలుసుకున్నారు. దాదాపు 16 నెలల తర్వాత ఇద్దరు నేతలు ప్రత్యక్షంగా సమావేశం కావడం అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఫ్రాన్స్&zwnj;లోని ఇవియ&zwnj;న్ లెస్ బెయిన్స్&zwnj;లో జరిగిన ఈ సమావేశంలో మోదీ, ట్రంప్ మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపించింది. సదస్సు హాల్&zwnj;లోకి వచ్చిన మోదీని ట్రంప్ స్వయంగా పలకరించారు. ఇద్దరూ కరచాలనం చేసుకోవడంతో పాటు కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నట్లు అక్కడి దృశ్యాల్లో క&zwnj;నిపించింది. ట్రంప్ మోదీ భుజంపై స్నేహపూర్వకంగా తట్టడం కూడా చర్చనీయాంశమైంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇటీవలి నెలల్లో భారత్-అమెరికా సంబంధాల్లో కొన్ని అంశాలపై విభేదాలు కనిపించాయి. ముఖ్యంగా వాణిజ్య సుంకాలు, ఎగుమతులపై అమెరికా తీసుకున్న నిర్ణయాలు రెండు దేశాల మధ్య చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో మోదీ-ట్రంప్ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై పురోగతి సాధించే అవకాశం ఉందనే అంచనాలు కూడా ఉన్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత్ జీ7 సభ్య దేశం కాకపోయినా, గత కొన్ని సంవత్సరాలుగా ఈ సధస్సుకు ప్రత్యేక ఆహ్వానిత దేశంగా హాజరవుతోంది. ఈసారి మోదీ వరుసగా ఏడోసారి జీ7 సదస్సులో పాల్గొనడం విశేషం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, కృత్రిమ మేథస్సు (AI), ఉక్రెయిన్-మధ్యప్రాచ్య ఘర్షణలు వంటి కీలక అంశాలపై భారత్ తన అభిప్రాయాలను వ్యక్తం చేయనుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జీ7 సదస్సు సందర్భంగా మోదీ పలు దేశాధినేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో మార్క్ కార్నీ, కెయిర్ స్టార్మ&zwnj;ర్&zwnj;, షేక్ మ&zwnj;హ్మ&zwnj;ద్ బిన్ జ&zwnj;యాద్ ఏ1 న&zwnj;యాన్&zwnj;ల&zwnj;తో ద్వైపాక్షిక చర్చలు ఉన్నాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;p&gt;#WATCH | Prime Minister Narendra Modi and US President Donald Trump seen interacting at the G7 Summit in Evian, France.&amp;nbsp;(Video: DD News) pic.twitter.com/HIiZPZOyxR&lt;/p&gt;&lt;p&gt;&mdash; ANI (@ANI) June 16, 2026&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జీ7 ను భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలను ప్రపంచానికి తెలియజేసే అవకాశంగా ఉపయోగించుకుంటోంది. గ్లోబల్ సౌత్ దేశాల ఆందోళనలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పులు, సాంకేతిక సహకారం వంటి అంశాలను మోదీ ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందనే సంకేతాన్ని ఈ సదస్సు మరోసారి ఇస్తోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/modi-trump-meet-at-g7-summit-pm-modi-and-donald-trump-hold-first-face-to-face-meeting-in-16-months-2e4i0ig"/>
        </item>
        <item>
            <title><![CDATA[POK: పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో అస‌లేం జ‌రుగుతోంది.? ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి ఎందుకొస్తున్నారు.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/pok-protests-explained-why-are-people-taking-to-the-streets-in-pakistan-occupied-kashmir-3xh9dhl</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/pok-protests-explained-why-are-people-taking-to-the-streets-in-pakistan-occupied-kashmir-3xh9dhl</guid>
            <pubDate>Tue, 09 Jun 2026 17:37:31 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;POK: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెల&zwnj;కొన్నాయి. పాక్ ప్రభుత్వ విధానాలు, ఆర్థిక సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ ఇచ్చిన బంద్&zwnj;కు విశేష స్పంద&zwnj;న ల&zwnj;భించింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ktp47cnbgt4c030558n1jm6k,imgname-pok-1781006578347.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;POK: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెల&zwnj;కొన్నాయి. పాక్ ప్రభుత్వ విధానాలు, ఆర్థిక సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ ఇచ్చిన బంద్&zwnj;కు విశేష స్పంద&zwnj;న ల&zwnj;భించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పీఓకేలో నెలలుగా కొనసాగుతున్న అసంతృప్తి ఇటీవల మరింత తీవ్రరూపం దాల్చింది. స్థానిక ప్రజలు తమ రాజకీయ హక్కులు, ఆర్థిక ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ బంద్&zwnj;కు మద్ధతు ప్రకటించారు. అనేక పట్టణాల్లో మార్కెట్లు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రధాన రహదారులపై నిరసనకారులు బైఠాయించి రాకపోకలకు అంతరాయం కలిగించారు. స్థానికుల అభిప్రాయం ప్రకారం, పాక్ కేంద్ర ప్రభుత్వం తమ ప్రాంత ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్న భావన ప్రజల్లో బలపడుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నిరసనలను అణచివేసేందుకు పాక్ భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. పలు ప్రాంతాల్లో పోలీసులు, పారామిలిటరీ దళాలు భారీగా మోహరించాయి. ఈ క్రమంలో నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. స్థానిక మీడియా ప్రకారం కాల్పులు, టియర్ గ్యాస్ ప్రయోగాల కారణంగా పలువురు గాయపడ్డారు. ఇటీవల జరిగిన సంఘటనల్లో 11 మంది మరణించగా, 70 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. భద్రతా బలగాలకు చెందిన కొందరు అధికారులు కూడా ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పీఓకే అసెంబ్లీలో పాకిస్థాన్&zwnj;లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 రిజర్వు స్థానాలే తాజా ఆందోళనలకు ప్రధాన కారణంగా మారాయి. ఈ స్థానాల ద్వారా ఇస్లామాబాద్ తమ రాజకీయ ప్రభావాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తోందని జేఏఏసీ ఆరోపిస్తోంది. స్థానిక ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు విమర్శిస్తున్నారు. పీఓకే రాజకీయ వ్యవస్థలో ఇత&zwnj;రుల&zwnj; జోక్యం తగ్గించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రాజకీయ అంశాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా ఆందోళనలకు కారణమయ్యాయి. విద్యుత్ ధరలు, నిత్యావసర వస్తువుల ఖర్చులు పెరగడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం వంటి సమస్యలు స్థానికుల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా తమ ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ప్రయోజనాలు స్థానికులకు అందడం లేదని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో యువతలో అసంతృప్తి మరింత పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పీఓకేలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొన్ని దేశాలు తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా కెనడా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించాయి. కొన్ని ప్రాంతాల్లో టెలికం సేవలపై ఆంక్షలు విధించిన&zwnj;ట్లు కూడా హెచ్చరించాయి. పరిస్థితులు ఎప్పుడు మారుతాయో చెప్పలేని విధంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.&lt;/p&gt;&lt;h2&gt;పరిస్థితి ఎటు దారి తీస్తుంది?&lt;/h2&gt;&lt;p&gt;పీఓకేలో గత ఏడాది కూడా ఇలాంటి నిరసనలు జరిగినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి మరింత సంక్లిష్టంగా కనిపిస్తోంది. రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక హక్కులు, పరిపాలనా స్వేచ్ఛ వంటి అంశాలు కలిసి పెద్ద ఉద్యమంగా మారుతున్నాయి. జేఏఏసీపై నిషేధం విధించినప్పటికీ నిరసనలు ఆగకపోవడం పాక్ ప్రభుత్వానికి కొత్త సవాలుగా మారింది. భవిష్యత్తులో ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరిస్తుందా, లేక మరింత కఠిన చర్యలు తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/pok-protests-explained-why-are-people-taking-to-the-streets-in-pakistan-occupied-kashmir-3xh9dhl"/>
        </item>
        <item>
            <title><![CDATA[Europe Heatwave: అగ్నిగుండంగా మారిన యూరప్.. వేడికి తట్టుకోలేక రోడ్డుపైనే జనం..]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/europe-heatwave-crisis-europe-is-warming-twice-as-fast-as-the-rest-of-the-word-who-issues-a-serious-warning-4l59oox</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/europe-heatwave-crisis-europe-is-warming-twice-as-fast-as-the-rest-of-the-word-who-issues-a-serious-warning-4l59oox</guid>
            <pubDate>Tue, 30 Jun 2026 16:36:00 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Europe Heatwave: యూరప్ అనగానే గుర్తొచ్చేది మంచు కొండలు. పర్యాటకులు వేసవి ఉపశమనం కోసం యూరప్ దేశాలకు క్యూ కడతారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారిపోయాయి. భానుడి ప్రతాపానికి అల్లాడిపోతున్నారు. రికార్డు ఉష్ణోగ్రతలతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwc2knr5wx9w7x0jq4ntrqv2,imgname-screenshot-2026-06-30-155915-1782816823045.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Europe Heatwave: యూరప్ అనగానే గుర్తొచ్చేది మంచు కొండలు. పర్యాటకులు వేసవి ఉపశమనం కోసం యూరప్ దేశాలకు క్యూ కడతారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారిపోయాయి. భానుడి ప్రతాపానికి అల్లాడిపోతున్నారు. రికార్డు ఉష్ణోగ్రతలతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఐస్&zwnj;క్రీమ్&zwnj;లా కరిగిపోతున్న తారు రోడ్లు..ఎండ వేడికి వంగిపోతున్న రైలు పట్టాలు.. వడదెబ్బతో వేలాది మంది మరణాలు..ఇది ఎక్కడో కాదు.. ఎప్పుడూ చలితో వణికిపోయే శీతల ఖండం యూరప్&zwnj;లో కనిపిస్తున్న భయంకర నిజాలివి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) స్వయంగా రంగంలోకి దిగి.. 'ఈ హీట్ వేవ్ ను సైలంట్ కిల్లర్ అని హెచ్చరించింది. అసలు ఏసీలు, కూలర్లు కూడా లేని ఆ దేశాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేడెక్కుతున్న ప్రాంతంగా యూరప్ మారుతోంది.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సాధారణంగా శీతల దేశాలకు మారుపేరైన ఐరోపా ఖండం.. ఇప్పుడు భానుడి ప్రతాపానికి అల్లాడిపోతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలులతో యూరప్ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం.. జూన్ 21 నుంచి వడదెబ్బ కారణంగా రికార్డు స్థాయిలో 1,300 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఫ్రాన్స్ దేశంలోనే, గత బుధవారం నాటికే వెయ్యి మందికి పైగా జనం చనిపోయినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఐరోపాలోని పలు దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి కనిపిస్తోంది. బ్రిటన్ చరిత్రలోనే తొలిసారి తీవ్రమైన వేడికి సంకేతంగా 'రెడ్ అలర్ట్' జారీ చేయాల్సి వచ్చింది.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారతదేశంలో 40 నుండి 45 డిగ్రీల ఎండలు కామన్ కదా.. మరి యూరప్&zwnj;లో ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు? దీనికి WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఒక ముఖ్యమైన కారణం చెప్పారు. యూరప్&zwnj;లోని ఇళ్లు, ఆఫీసులు, పాఠశాలలు.. చల్లటి వాతావరణాన్ని తట్టుకుని, లోపల వేడిగా ఉండేలా నిర్మించారు. అంటే అవి హీట్-ఇన్సులేటెడ్ ఇళ్లు. కానీ, ఇప్పుడు బయట ఎండలు పెరిగేసరికి ఆ ఇళ్లు వేడిని లోపలే బంధించేస్తున్నాయి. పైగా అక్కడ ఏసీలు, కూలర్లు వాడే అలవాటు చాలా తక్కువ. దీంతో ఆ ఇళ్లే ఇప్పుడు ప్రజలకు నిప్పులు కొలిమిలా మారుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే..ఈ ఒక్క ఆదివారమే ఐరోపా వ్యాప్తంగా కనీసం 19 కోట్ల మంది ప్రజలు సగటున 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా జర్మనీ, చెక్ రిపబ్లిక్, హంగరీ, పోలాండ్ దేశాలలో ఎండలు మండిపోతున్నాయి. జనం ఒక్కసారిగా ఏసీలు, కూలింగ్ సిస్టమ్స్ ఆన్ చేయడంతో పవర్ గ్రిడ్స్&zwnj;పై ఒత్తిడి పెరిగి విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రోడ్లపై వెళ్లే ప్రజలపై ప్రభుత్వాలు వాటర్ స్ప్రేలు చల్లుతుంటే.. కొందరైతే వేడి తట్టుకోలేక రోడ్ల పక్కన ఉన్న కాలువల్లో, నదుల్లో దూకి స్నానాలు చేస్తూ సేదతీరుతున్నారు. అడవులు కాలిపోతున్నాయి. ట్రాఫిక్ లైట్లు కరిగిపోతున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వందల ఏళ్లకు ఒకసారి వచ్చే ఇలాంటి విపరీత వాతావరణ మార్పులు, భూతాపం వంటివి.. యూరప్ లో ఇప్పుడు ప్రతి ఏడాది కనిపిస్తున్నాయి. ప్రపంచ సగటుతో పోలిస్తే.. ఈ భూమిపై అత్యధిక వేగంతో ఐరోపా ఖండం వేడెక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వేడి కంటే ఇక్కడ రెండింతలు ఎక్కువగా వేడి పెరుగుతోంది. దీనివల్ల పొడి వాతావరణం ఏర్పడి ఇటలీ, గ్రీస్, స్పెయిన్ దేశాలలో అడవులు అంటుకుని వేలాది ఎకరాల పచ్చదనం బూడిదైపోతోంది. ఈ హీట్ వేవ్ ఇప్పుడు మిగతా బాల్కన్ దేశాలకు కూడా వేగంగా విస్తరిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సాధారణంగా యూరప్ దేశాల్లో 10-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. రాత్రి అయితే మైనస్ ల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు 40 వరకూ వచ్చేశాయి. రోడ్లపై తారు కరిగిపోతోంది. రైలు పట్టాలు వంగిపోతున్నాయి. పక్షులు గిలగిలకొట్టుకుంటున్నాయి. జనం వేడిని తట్టుకోలేక నదులు, కాలవల్లో దూకేస్తున్నారు. ప్రస్తుతం ఐరాస (UN) తన సభ్యదేశాలతో కలిసి అత్యధిక వేడితో పొంచి ఉన్న ఆరోగ్య ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కానీ, ఇది ఒక్క యూరప్ సమస్య మాత్రమే కాదు. ప్రపంచానికి ఇదొక డేంజర్ బెల్ గా మారింది.&lt;/p&gt;&lt;p&gt;ఒకవైపు మన దేశంలో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతుంటే.. యూరప్ మాత్రం హీట్ వేవ్ తో అల్లాడిపోతోంది. ఇది గ్లోబల్ వార్మింగ్ మానవాళికి ఇస్తున్న చివరి హెచ్చరిక. ఇప్పటికైనా మనం పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మున్ముందు రోజులు ఇంకా భయంకరంగా మారతాయి.&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Nandini Arava</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/europe-heatwave-crisis-europe-is-warming-twice-as-fast-as-the-rest-of-the-word-who-issues-a-serious-warning-4l59oox"/>
        </item>
        <item>
            <title><![CDATA[Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/pakistan-s-space-spy-network-6-surveillance-satellites-launched-in-16-months-with-china-s-help-raising-india-concerns-4xqlegf</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/pakistan-s-space-spy-network-6-surveillance-satellites-launched-in-16-months-with-china-s-help-raising-india-concerns-4xqlegf</guid>
            <pubDate>Wed, 10 Jun 2026 12:07:21 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Space War: పాకిస్థాన్ చైనా సాయంతో కేవలం 16 నెలల్లో 6 నిఘా ఉపగ్రహాలను ప్రయోగించి భారత్ సరిహద్దులపై నిరంతర నిఘా పెంచుతోంది. ఇది భారత భద్రతకు సవాలుగా మారింది. పాకిస్థాన్ ఏం ప్లాన్ చేస్తోంది? అసలు ఏం జరుగుతోంది?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ktnbqxesc3ahffq6a5x7hdte,imgname-----------------------2026-06-09t102432.279-1780980905433.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Space War: పాకిస్థాన్ చైనా సాయంతో కేవలం 16 నెలల్లో 6 నిఘా ఉపగ్రహాలను ప్రయోగించి భారత్ సరిహద్దులపై నిరంతర నిఘా పెంచుతోంది. ఇది భారత భద్రతకు సవాలుగా మారింది. పాకిస్థాన్ ఏం ప్లాన్ చేస్తోంది? అసలు ఏం జరుగుతోంది?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. ఇప్పుడు ఆ పోరు నింగిలోకి కూడా పాకింది. గత 16 నెలల కాలంలో పాకిస్థాన్ అనూహ్య వేగంతో అంతరిక్షంలో మరో కుట్రకు తెరలేపింది. కేవలం 16 నెలల్లోనే ఏకంగా ఆరు భూ-పరిశీలన (Earth-observation) ఉపగ్రహాలను పాక్ ప్రయోగించింది. దీని వెనుక చైనా హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఉపగ్రహాల ప్రధాన లక్ష్యం భారత భూభాగంపై, ముఖ్యంగా వ్యూహాత్మక ప్రాంతాలపై కన్నేసి ఉంచడమేనని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాక్ మధ్య పరిస్థితులు శాంతించినట్లు కనిపిస్తున్నా, తెరవెనుక పాకిస్థాన్ తన గూఢచారి వ్యవస్థను అంతరిక్షం ద్వారా బలోపేతం చేసుకుంటోంది. జనవరి 2025 నుండి ఏప్రిల్ 2026 మధ్య కాలంలో పాక్ ప్రయోగించిన ఈ శాటిలైట్లు ఇప్పుడు భారత్&zwnj;కు కొత్త తలనొప్పిగా మారాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పాకిస్థాన్ స్పేస్ ఏజెన్సీ &lsquo;సుపార్కో&rsquo; (SUPARCO) 1961లో ప్రారంభమైంది. అంటే మన ఇస్రో కంటే ముందే ఇది ఏర్పాటైనా, దశాబ్దాల పాటు దీని ప్రగతి చాలా నెమ్మదిగా సాగింది. గత కొన్ని దశాబ్దాల్లో పాక్ ప్రయోగించిన శాటిలైట్లు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. కేవలం 16 నెలల వ్యవధిలోనే ఆరు హై టెక్ శాటిలైట్లను నింగిలోకి పంపడం చూస్తుంటే, పాక్ ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తోందో అర్థమవుతుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజింగ్, హైపర్ స్పెక్ట్రల్, రిమోట్ సెన్సింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలు ఉన్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పాకిస్థాన్ సొంతంగా ఈ ఘనత సాధించడం అసాధ్యం. దీని వెనుక చైనా పూర్తి సహకారం ఉంది. చాలా శాటిలైట్లను చైనా రాకెట్ల ద్వారానే ప్రయోగించారు. కేవలం రాకెట్లే కాకుండా, శాటిలైట్ డిజైన్, టెక్నాలజీ ట్రాన్స్&zwnj;ఫర్, డేటా షేరింగ్&zwnj;లో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. చైనాకు చెందిన &lsquo;యావోగాన్, గావోఫెన్&rsquo; శాటిలైట్ నెట్&zwnj;వర్క్&zwnj;తో ఈ పాక్ శాటిలైట్లు అనుసంధానమైతే, భారత్ కదలికలను సెకన్ల వ్యవధిలో పసిగట్టే ప్రమాదం ఉంది. అంటే పాకిస్థాన్ కళ్లు ఇప్పుడు అంతరిక్షంలో చైనా పవర్&zwnj;తో పనిచేస్తున్నాయనే హెచ్చరికలు ఆందోళన కలిగించే విషయం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఏప్రిల్ 2026లో ప్రయోగించిన PRSC-EO3 శాటిలైట్ గురించి షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. అమెరికాకు చెందిన స్పేస్ అనాలిసిస్ సంస్థ &lsquo;COMSPOC&rsquo; విశ్లేషణ ప్రకారం, ఈ శాటిలైట్ కక్ష్యను ప్రపంచం మొత్తం చూడటానికి కాకుండా, కేవలం దక్షిణాసియాను మాత్రమే లక్ష్యంగా చేసుకుని డిజైన్ చేశారు. దీనివల్ల పాకిస్థాన్, ఉత్తర భారత్, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలను రోజుకు అనేకసార్లు ఈ శాటిలైట్ స్కాన్ చేస్తుంది. దీంతో సైనిక మోహరింపులు, బంకర్లు, కొత్తగా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాల వివరాలన్నీ పాక్ చేతికి చిక్కే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పాక్ ప్రయోగించిన &lsquo;HS-1&rsquo; వంటి హైపర్ స్పెక్ట్రల్ శాటిలైట్లు అత్యంత ప్రమాదకరమైనవి. సాధారణ కెమెరాలకు చిక్కని వస్తువులను కూడా ఇవి గుర్తించగలవు. ఉదాహరణకు, అడవుల్లో లేదా కొండల్లో మారువేషంలో దాచిన ఆయుధాలను, ట్యాంకులను ఇవి ఈజీగా కనిపెడతాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అలాగే PRSC-EO2 వంటి శాటిలైట్లు ఏఐ సాయంతో డేటాను ప్రాసెస్ చేస్తాయి. అంటే భూమి మీద ఏ చిన్న మార్పు జరిగినా వెంటనే అలర్ట్ పంపిస్తాయి. ఇది మన సరిహద్దు భద్రతకు పెద్ద సవాలు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అంతరిక్ష రంగంలో భారత్ పాకిస్థాన్ కంటే ఎంతో ముందున్న మాట వాస్తవమే. అయితే, గత రెండేళ్లలో ఇస్రో కొన్ని సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంది. కొన్ని కీలకమైన ఎర్త్ అబ్జర్వేషన్, నావిగేషన్ మిషన్లు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇదే సమయంలో పాక్ తన సామర్థ్యాన్ని పెంచుకోవడం రక్షణ నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.&lt;/p&gt;&lt;p&gt;భవిష్యత్తులో యుద్ధాలు కేవలం భూమి మీద మాత్రమే కాదు, అంతరిక్షం నుండి వచ్చే సమాచారం ఆధారంగానే జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాక్ &lsquo;స్పేస్ గూఢచర్యాన్ని&rsquo; అడ్డుకోవడానికి భారత్ తన స్పేస్ డిఫెన్స్ సిస్టమ్&zwnj;ను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/pakistan-s-space-spy-network-6-surveillance-satellites-launched-in-16-months-with-china-s-help-raising-india-concerns-4xqlegf"/>
        </item>
        <item>
            <title><![CDATA[ప్రపంచంలో తొలిసారి న్యాయవాదిని ఓడించిన AI చాట్‌బాట్.. రూ.8.79 లక్షల కేసులో విజయం]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/ai-chatbot-defeats-lawyer-in-court-worlds-first-legal-ai-wins-8-lakh-case-in-the-uk-7v8cig2</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/ai-chatbot-defeats-lawyer-in-court-worlds-first-legal-ai-wins-8-lakh-case-in-the-uk-7v8cig2</guid>
            <pubDate>Sun, 28 Jun 2026 10:40:33 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;AI: కృత్రిమ మేధస్సు (AI) ఇప్పటికే విద్య, వైద్యం, సాఫ్ట్&zwnj;వేర్, వ్యాపారం వంటి అనేక రంగాల్లో తన సామర్థ్యాన్ని నిరూపించింది. ఇప్పుడు న్యాయ రంగంలోనూ AI కొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో తొలిసారి ఓ AI ఆధారిత లీగల్ చాట్&zwnj;బాట్ కోర్టులో విజయం సాధించింది.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kw4sxxk98q17y1zgb0xmcrtr,imgname-ai-1782572840553.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;AI: కృత్రిమ మేధస్సు (AI) ఇప్పటికే విద్య, వైద్యం, సాఫ్ట్&zwnj;వేర్, వ్యాపారం వంటి అనేక రంగాల్లో తన సామర్థ్యాన్ని నిరూపించింది. ఇప్పుడు న్యాయ రంగంలోనూ AI కొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో తొలిసారి ఓ AI ఆధారిత లీగల్ చాట్&zwnj;బాట్ కోర్టులో విజయం సాధించింది.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ కేసులో గార్&zwnj;ఫీల్డ్ AI పూర్తిస్థాయిలో న్యాయపరమైన ప్రక్రియను నిర్వహించింది. కేసుకు సంబంధించిన సమాచారం విశ్లేషించడం, చట్టపరమైన అంశాలను పరిశీలించడం, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేయడం వంటి పనులన్నీ AI సాయంతో పూర్తయ్యాయి. అనంతరం కోర్టులో వాదనలు వినిపించడానికి ఒక జూనియర్ న్యాయవాదిని నియమించారు. అంటే కేసు వెనుక ఉన్న మొత్తం ప్రిప&zwnj;రేష&zwnj;న్&zwnj;ను AI నిర్వహించగా, కోర్టులో చట్టపరమైన వాదనలు మాత్రం మానవ న్యాయవాది వినిపించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ కేసులో మరో విశేషం ఖర్చు. సాధారణంగా బ్రిటన్&zwnj;లో ఇలాంటి న్యాయపరమైన కేసులకు న్యాయవాదులు భారీ ఫీజులు వసూలు చేస్తారు. అయితే గార్&zwnj;ఫీల్డ్ AI సుమారు రూ.50 వేల ఖర్చుతోనే ఈ సేవలను అందించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో తక్కువ ఆదాయం ఉన్నవారికి కూడా న్యాయ సహాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ కేసు విచారణ గత నెలలో బ్రిటన్&zwnj;లోని వాండ్స్&zwnj;వర్త్ కౌంటీ కోర్టులో జరిగింది. దాదాపు మూడు గంటల పాటు విచారణ సాగింది. చివరికి కోర్టు గార్&zwnj;ఫీల్డ్ AI క్లయింట్&zwnj;కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కేసు ముగిసిన తర్వాత ప్రత్యర్థి తరఫు న్యాయవాది కూడా AI సిద్ధం చేసిన డాక్యుమెంట్లు నాణ్యంగా ఉన్నాయని అంగీకరించినట్లు సమాచారం. దీంతో న్యాయ రంగంలో AI సామర్థ్యంపై మరింత చర్చ మొదలైంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ విజయం సాధించినప్పటికీ AI పూర్తిగా న్యాయవాదుల స్థానాన్ని భర్తీ చేయలేదని గుర్తుంచుకోవాలి. గార్&zwnj;ఫీల్డ్ AI ప్రస్తుతం 10 వేల పౌండ్ల వరకు విలువైన చిన్న కేసులను మాత్రమే నిర్వహిస్తోంది. అలాగే కోర్టులో స్వయంగా వాదనలు వినిపించే అవకాశం AIకి లేదు. అందుకే కోర్టు ప్రక్రియలో మానవ న్యాయవాదిని ఉపయోగించారు. అంటే AI ప్రస్తుతం న్యాయపరమైన పరిశోధన, డాక్యుమెంట్ల తయారీ, కేసు సిద్ధత వంటి పనుల్లో మాత్రమే కీలక పాత్ర పోషిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచవ్యాప్తంగా కోర్టు వ్యవస్థలో AI వినియోగం కొత్త విషయం కాదు. అమెరికా సహా అనేక దేశాల్లో ఇప్పటికే న్యాయ పరిశోధన, పత్రాల విశ్లేషణ, కేసుల నిర్వహణలో AI ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అయితే కోర్టులో ఉపయోగించిన లీగల్ డాక్యుమెంట్ల తయారీలో AI ప్రధాన పాత్ర పోషించి, ఆ కేసు విజయవంతం కావడం మాత్రం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఈ ఘటనతో భవిష్యత్తులో న్యాయ సేవలు మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో ప్రజలకు అందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే AI ఒక సహాయక సాధనమే కానీ, తుది చట్టపరమైన నిర్ణయాలు, కోర్టు వాదనలు, న్యాయ బాధ్యతలు ఇప్పటికీ మానవ న్యాయవాదుల చేతుల్లోనే ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/ai-chatbot-defeats-lawyer-in-court-worlds-first-legal-ai-wins-8-lakh-case-in-the-uk-7v8cig2"/>
        </item>
        <item>
            <title><![CDATA[Astronomy Crisis: అంతరిక్షంలో మస్క్ మాఫియా? 17 లక్షల శాటిలైట్లతో చీకటి మాయం..! భారీ ముప్పు తప్పదా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/astronomy-crisis-could-spacex-starlink-s-planned-17-million-satellites-threaten-the-future-of-space-observation-hrsoq3g</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/astronomy-crisis-could-spacex-starlink-s-planned-17-million-satellites-threaten-the-future-of-space-observation-hrsoq3g</guid>
            <pubDate>Thu, 02 Jul 2026 13:21:06 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Astronomy Crisis: అంతరిక్షంలోకి 17 లక్షల శాటిలైట్లను పంపే ప్లాన్స్ వల్ల ఖగోళ పరిశోధనలు ఆగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇస్తున్నారు. ఖగోళ శాస్త్రానికి ఇక ఎండ్ కార్డేనా? ఎలాన్ మస్క్ స్పేస్&zwnj;ఎక్స్ ప్లాన్స్&zwnj;పై శాస్త్రవేత్తల ఆందోళన ఎందుకు?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwgwq21849dgbwretztk8hyj,imgname-astronomy-crisis-1782978414632.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Astronomy Crisis: అంతరిక్షంలోకి 17 లక్షల శాటిలైట్లను పంపే ప్లాన్స్ వల్ల ఖగోళ పరిశోధనలు ఆగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇస్తున్నారు. ఖగోళ శాస్త్రానికి ఇక ఎండ్ కార్డేనా? ఎలాన్ మస్క్ స్పేస్&zwnj;ఎక్స్ ప్లాన్స్&zwnj;పై శాస్త్రవేత్తల ఆందోళన ఎందుకు?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రస్తుతం మన భూమి చుట్టూ లోఎర్త్ ఆర్బిట్ లో 14,000 కంటే ఎక్కువ శాటిలైట్లు తిరుగుతున్నాయి. స్పేస్ హిస్టరీలోనే ఇది చాలా పెద్ద నంబర్. కానీ, రాబోయే రోజుల్లో ఈ నంబర్ ఏకంగా వంద రెట్లకు పైగా పెరగబోతోంది. వివిధ ప్రైవేట్ కంపెనీలు, దేశాలు కలిసి రాబోయే ఏళ్లలో ఏకంగా 17 లక్షల కొత్త శాటిలైట్లను అంతరిక్షంలోకి లాంచ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి.&lt;/p&gt;&lt;p&gt;అయితే, ఈ నిర్ణయం వల్ల గ్రౌండ్ బేస్డ్ అస్ట్రానమీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని &lsquo;యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ&rsquo; (ESO) చేసిన ఒక తాజా పీర్ రివ్యూడ్ స్టడీ హెచ్చరించింది. ఈ శాటిలైట్ల వల్ల రాత్రి పూట ఆకాశం సాధారణం కంటే నాలుగు రెట్లు ఎక్కువ వెలుగుతో నిండిపోతుందని, దీనివల్ల ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్&zwnj;లు ప్రతి రాత్రీ కొన్ని గంటల పాటు పూర్తిగా బ్లైండ్ అయిపోతాయని ఈ స్టడీ స్పష్టం చేసింది. ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని తిరిగి వెనక్కి తీసుకోలేని 'పాయింట్ ఆఫ్ నో రిటర్న్' గా అభివర్ణిస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ అంతరిక్ష సంక్షోభానికి ప్రధాన కారణం ఎలాన్ మస్క్&zwnj;కు చెందిన స్పేస్&zwnj;ఎక్స్ (SpaceX) కంపెనీయే. ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఇప్పటికే వేలాది స్టార్&zwnj;లింక్ శాటిలైట్లను నడుపుతున్న ఈ కంపెనీ, అంతరిక్షంలో ఒక డేటా సెంటర్ నెట్&zwnj;వర్క్&zwnj;ను క్రియేట్ చేయడం కోసం మరో 10 లక్షలకు పైగా అదనపు శాటిలైట్లను లాంచ్ చేయడానికి రెగ్యులేటర్లకు దరఖాస్తు చేసుకుంది.&lt;/p&gt;&lt;p&gt;స్పేస్&zwnj;ఎక్స్ మాత్రమే కాదు, &lsquo;ఇ-స్పేస్&rsquo; అనే శాటిలైట్ స్టార్టప్ కంపెనీ కూడా &lsquo;సిన్నమోన్&rsquo; పేరుతో లక్షలాది శాటిలైట్లను పంపేందుకు ప్లాన్ చేస్తోంది. అటు చైనా కూడా సీటీసీ-1, సీటీసీ-2 పేరుతో రెండు భారీ నెట్&zwnj;వర్క్&zwnj;ల ద్వారా లక్షలాది శాటిలైట్లను పంపడానికి సిద్ధమవుతోంది. ఇక అన్నింటికంటే షాకింగ్ ఏంటంటే.. &lsquo;రిఫ్లెక్ట్ ఆర్బిటల్&rsquo; అనే కంపెనీ ఏకంగా 50,000 మిర్రర్ శాటిలైట్లను పంపాలని చూస్తోంది. ఇవి రాత్రి వేళల్లో సూర్యుడి వెలుగును నేరుగా భూమిపైకి రిఫ్లెక్ట్ చేస్తాయి. దీనివల్ల రాత్రి పూట ఆకాశం విపరీతంగా వెలిగిపోనుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ రీసెర్చ్&zwnj;ను లీడ్ చేసిన ఒలివియర్ హైనాట్ అనే శాస్త్రవేత్తకు అబ్జర్వేటరీలో 30 ఏళ్లకు పైగా ఎక్స్&zwnj;పీరియన్స్ ఉంది. వేర్వేరు శాటిలైట్ల నంబర్ల వల్ల టెలిస్కోప్&zwnj;లపై ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందో ఆయన ఒక మోడల్ ద్వారా లెక్కించారు. ఆయన రిపోర్ట్ ప్రకారం.. అంతరిక్షంలో కేవలం 1,00,000 శాటిలైట్లు మాత్రమే ఉంటే ఖగోళ పరిశోధనలకు ఎలాంటి తీవ్రమైన నష్టం జరగదు. పైగా అవి సాధారణ కంటికి కనిపించనంత తక్కువ వెలుతురుతో ఉండాలి. కానీ, ఇప్పుడు ప్రతిపాదనల్లో ఉన్న 17 లక్షల నంబర్ అనేది ఈ సేఫ్ లిమిట్ కంటే 17 రెట్లు ఎక్కువ.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ 17 లక్షల శాటిలైట్లు వస్తే భూమిపై ఉన్న అబ్జర్వేటరీల పరిస్థితి ఏంటనే దానిపై శాస్త్రవేత్తలు సిమ్యులేషన్స్ రన్ చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పవర్&zwnj;ఫుల్ ఆప్టికల్ టెలిస్కోప్ అయిన యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన &lsquo;వెరీ లార్జ్ టెలిస్కోప్&rsquo; (VLT) ఇమేజింగ్ కెపాసిటీ 28 శాతం వరకు దెబ్బతింటుంది. శాటిలైట్లు వెళ్లేటప్పుడు పడే బ్రైట్ లైన్ స్ట్రీక్స్ వల్ల ఫోటోలు పాడైపోతాయి.&lt;/p&gt;&lt;p&gt;అలాగే, చిలీలో ఉన్న &lsquo;వెరా సి. రూబిన్ అబ్జర్వేటరీ&rsquo; దక్షిణ ఆకాశాన్ని సర్వే చేయడానికి, భూమికి ముప్పుగా మారే ఆస్టరాయిడ్స్ ను కనిపెట్టడానికి చాలా కీలకం. కానీ ఈ శాటిలైట్ల వెలుతురు వల్ల ట్విలైట్ లో ఈ టెలిస్కోప్ తీసే మోస్ట్ ఆఫ్ ది ఇమేజెస్ పనికిరాకుండా పోతాయి. ఫలితంగా భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న ప్రమాదకరమైన గ్రహశకలాలను ముందుగా గుర్తించే అవకాశాన్ని మనం కోల్పోతాము.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సాధారణ శాటిలైట్లు కేవలం ఫోటోలలో వెలుగు చారలను మాత్రమే క్రియేట్ చేస్తే, &lsquo;రిఫ్లెక్ట్ ఆర్బిటల్&rsquo; ప్లాన్ చేస్తున్న 50,000 మిర్రర్ శాటిలైట్లు అంతకంటే పెద్ద ప్రమాదాన్ని తెస్తున్నాయి. ఇవి రాత్రి ఆకాశం బేస్&zwnj;లైన్ బ్రైట్&zwnj;నెస్&zwnj;ను ఏకంగా 3 నుండి 4 రెట్లు పెంచేస్తాయి. శాటిలైట్లు వెళ్లే టైమింగ్స్ చూసుకుని రీసెర్చ్ చేద్దామన్నా ఇది కుదరదు. ఎందుకంటే ఆకాశం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఆకాశంలో బ్యాక్&zwnj;గ్రౌండ్ వెలుతురు అంతలా పెరిగితే, సుదూర విశ్వంలో ఉండే గెలాక్సీలు, ఎక్సోప్లానెట్లు, విశ్వం ఆవిర్భావానికి సంబంధించిన ప్రాచీన కాంతిని భూమిపై నుండి అసలు చూడలేము. అందుకే ఈ అప్లికేషన్&zwnj;కు వ్యతిరేకంగా ఎఫ్&zwnj;సీసీ కి 1,500 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రస్తుతం అమెరికాకు చెందిన ఎఫ్&zwnj;సీసీ స్పేస్&zwnj;ఎక్స్, రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అప్లికేషన్లను పరిశీలిస్తోంది. వీటిపై ఇప్పటికే వేలాది అభ్యంతరాలు వచ్చాయి. ఇంటర్నేషనల్ అస్ట్రానమికల్ యూనియన్ వంటి అంతర్జాతీయ సంస్థలు శాటిలైట్ల బ్రైట్&zwnj;నెస్&zwnj;పై గ్లోబల్ రూల్స్ తేవాలని, వాటి సంఖ్యపై క్యాప్ విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి అంతర్జాతీయ బైండింగ్ చట్టాలు లేవు. శాటిలైట్ ఆపరేటర్లు తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. బిజినెస్ లాభాలు, ఇంటర్నెట్ కాంపిటీషన్ కారణంగా రెగ్యులేటరీ సంస్థల కంటే వేగంగా కంపెనీలు అంతరిక్షంలోకి దూసుకుపోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ఇది ఖగోళ శాస్త్రానికి చివరి హెచ్చరిక అని ఒలివియర్ హైనాట్ చెప్తున్నారు. ఒకసారి ఈ 17 లక్షల శాటిలైట్లు కక్ష్యలోకి చేరితే, ఆ తర్వాత వాటిని వెనక్కి పిలవడం ఇంపాజిబుల్. మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుండి అందరికీ ఉమ్మడి ఆస్తిగా ఉన్న రాత్రి ఆకాశం, కేవలం కొన్ని కంపెనీల కమర్షియల్ నిర్ణయాల వల్ల శాశ్వతంగా మారిపోనుందని హెచ్చరిస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/astronomy-crisis-could-spacex-starlink-s-planned-17-million-satellites-threaten-the-future-of-space-observation-hrsoq3g"/>
        </item>
        <item>
            <title><![CDATA[Viral News: మహిళా ఎంపీ ఇంట్లో బంగారు బికినీ.? సోష‌ల్ మీడియాను ఊపేస్తున్న ఫొటోలు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/viral-news-gold-bikini-found-at-iraqi-woman-mps-house-here-the-truth-behind-the-viral-photos-i0ie376</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/viral-news-gold-bikini-found-at-iraqi-woman-mps-house-here-the-truth-behind-the-viral-photos-i0ie376</guid>
            <pubDate>Thu, 02 Jul 2026 16:49:24 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Viral News: ఇరాక్&zwnj;లో అవినీతి వ్యతిరేక చర్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ మహిళా ఎంపీ ఇంటిపై అధికారులు దాడి చేసిన స&zwnj;మ&zwnj;యంలో బంగారంతో తయారైన లోదుస్తులు ల&zwnj;భ్య&zwnj;మైన&zwnj;ట్లు వార్తలు వ&zwnj;స్తున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwh8jbstrnq05vgd0d6zfhyd,imgname-viral-news--4--1782990843706.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Viral News: ఇరాక్&zwnj;లో అవినీతి వ్యతిరేక చర్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ మహిళా ఎంపీ ఇంటిపై అధికారులు దాడి చేసిన స&zwnj;మ&zwnj;యంలో బంగారంతో తయారైన లోదుస్తులు ల&zwnj;భ్య&zwnj;మైన&zwnj;ట్లు వార్తలు వ&zwnj;స్తున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం, ఇరాక్&zwnj;కు చెందిన మహిళా ప్రజాప్రతినిధి హింద్ అల్-అబ్బాసి నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారనే ప్రచారం సాగింది. ఈ దాడిలో సుమారు 57 మిలియన్ అమెరికన్ డాలర్ల నగదు, 27 కిలోల బంగారం, అలాగే బంగారంతో తయారుచేసిన విలాసవంతమైన లోదుస్తులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వాదనలకు మద్ధతుగా కొన్ని ఫొటోలు కూడా వైర&zwnj;ల్ అయ్యాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ వైరల్ ప్రచారాన్ని పరిశీలించిన తర్వాత, అందులో పేర్కొన్న అంశాలకు అధికారికంగా ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడైంది. ముఖ్యంగా హింద్ అల్-అబ్బాసి ఇంట్లో బంగారు లోదుస్తులు లేదా 57 మిలియన్ డాలర్ల నగదు దొరికిందని ఇరాక్ ప్రభుత్వం, భద్రతా సంస్థలు లేదా అధికారిక మీడియా ఎక్కడా ప్రకటించలేదు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాక్ అవినీతి నిరోధక దర్యాప్తులో భాగంగా అధికారులు నిర్వహించిన దాడులు మాజీ ఎంపీ అలియా నాసిఫ్కు సంబంధించిన వ్య&zwnj;వ&zwnj;హారం చుట్టూ తిరిగాయి. ఈ సోదాల్లో సుమారు 15.5 మిలియన్ డాలర్ల నగదుతో పాటు గణనీయమైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వ&zwnj;చ్చాయి. అదే కేసులో ఆమె కుమారుడిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే ఈ ఘటనను కొందరు సోషల్ మీడియాలో హింద్ అల్-అబ్బాసి పేరుతో ప్రచారం చేస్తూ తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇటీవలి కాలంలో ఇరాక్ ప్రభుత్వం అవినీతిని అరికట్టేందుకు పెద్ద ఎత్తున ప్రత్యేక దర్యాప్తు చేపడుతోంది. మాజీ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులపై విచారణ కొనసాగుతోంది. అవినీతి ఆరోపణలపై అరెస్టయిన మాజీ డిప్యూటీ చమురు శాఖ మంత్రి ఇచ్చిన సమాచారంతో పలుచోట్ల సోదాలు నిర్వహించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ చర్యల్లో భాగంగా ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను విచారించినట్లు సమాచారం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించే ప్రతి సమాచారం నిజం కావాల్సిన అవసరం లేదు. ఇరాక్&zwnj;లో అవినీతి వ్యతిరేక సోదాలు జరిగిన విషయం నిజమే అయినప్పటికీ, 27 కిలోల బంగారం, బంగారు లోదుస్తులు, 57 మిలియన్ డాలర్ల నగదు వంటి సంచలనాత్మక వాదనలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. అందువల్ల ఇలాంటి వార్తలను నమ్మే ముందు విశ్వసనీయ వార్తా సంస్థలు లేదా అధికారిక ప్రకటనలను పరిశీలించడం అవసరం. ప్రస్తుతం వైరల్ అవుతున్న కథనంలోని కీలక ఆరోపణలు నిర్ధారణ కాలేదని గుర్తించాలి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/viral-news-gold-bikini-found-at-iraqi-woman-mps-house-here-the-truth-behind-the-viral-photos-i0ie376"/>
        </item>
        <item>
            <title><![CDATA[Iran: మళ్లీ మొదటికొచ్చిన పంచాయతీ.. దేశంలో ధరలు భారీగా పెరగడం తప్పదా]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/iran-closes-strait-of-hormuz-again-will-fuel-prices-and-inflation-rise-in-india-mig0nsc</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/iran-closes-strait-of-hormuz-again-will-fuel-prices-and-inflation-rise-in-india-mig0nsc</guid>
            <pubDate>Sat, 20 Jun 2026 20:44:19 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయనే సమయంలో ఇరాన్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత ముఖ్యమైన హర్మూజ్ జలసంధిని నౌకల రాకపోకలకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kvjsc0wthp7c5sa9fmwvwcmr,imgname-iran-1781968274330.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయనే సమయంలో ఇరాన్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత ముఖ్యమైన హర్మూజ్ జలసంధిని నౌకల రాకపోకలకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇరాన్ అత్యున్నత సంయుక్త సైనిక కమాండ్ అయిన ఖతమ్ అల్-అన్బియా ప్రధాన కార్యాలయం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలు శాంతి ఒప్పంద స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, ముఖ్యంగా లెబనాన్&zwnj;లో ఇజ్రాయెల్ సైనిక దాడులు కొనసాగుతున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. దీనికి ప్రతిస్పందనగానే హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించినట్లు తెలిపింది. ఇదే తమ తొలి చర్య మాత్రమేనని, పరిస్థితులు మారకపోతే మరిన్ని చర్యలు ఉంటాయని హెచ్చరించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హర్మూజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో ఒకటి. గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ మార్కెట్లకు వెళ్లే చమురు, ద్రవీకృత సహజ వాయువు (LNG)లో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు ఈ జలసంధిపై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అందువల్ల ఇక్కడ ఏ చిన్న అంతరాయం వచ్చినా అంతర్జాతీయ మార్కెట్లపై వెంటనే ప్రభావం పడే అవకాశం ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇరాన్ ప్రకటనపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ స్పందించారు. హర్మూజ్ జలసంధి పూర్తిగా మూసివేసినట్లు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు. అలాగే అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందం కొనసాగుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత అంశాలపై చర్చలు కొనసాగించేందుకు ఇరు దేశాల ప్రతినిధులు స్విట్జర్లాండ్&zwnj;లో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హర్మూజ్ జలసంధి మూసివేత వార్తలతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందనే భయంతో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతం నుంచి ఆసియా, యూరప్ దేశాలకు వెళ్లే చమురు రవాణా ప్రభావితమైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది సవాలుగా మారవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభమవడంతో ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గుతాయనే ఆశలు వ్యక్తమయ్యాయి. అయితే లెబనాన్, ఇజ్రాయెల్ పరిణామాలు, హర్మూజ్ జలసంధి అంశం మళ్లీ పరిస్థితులను సంక్లిష్టంగా మార్చుతున్నాయి. ఒకవైపు దౌత్య చర్చలు కొనసాగుతుండగా, మరోవైపు సైనిక హెచ్చరికలు రావడం వల్ల పశ్చిమాసియా భవిష్యత్ పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ తీసుకునే నిర్ణయాలు ఈ సంక్షోభం దిశను నిర్ణయించే అవకాశముంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/iran-closes-strait-of-hormuz-again-will-fuel-prices-and-inflation-rise-in-india-mig0nsc"/>
        </item>
        <item>
            <title><![CDATA[India Vs China: చైనాకు చుక్కలు చూపించే సత్తా ఉన్న ఏకైక దేశం.. భారత్ పవర్ పై అమెరికా మైండ్ బ్లోయింగ్ స్టేట్‌మెంట్ !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/us-says-india-is-the-only-country-capable-of-challenging-china-in-tech-workforce-dominance-p2ykwbb</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/us-says-india-is-the-only-country-capable-of-challenging-china-in-tech-workforce-dominance-p2ykwbb</guid>
            <pubDate>Tue, 30 Jun 2026 18:48:01 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;India Vs China : చైనాకు చుక్కలు చూపించే సత్తా ఉన్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలెంట్, టెక్నాలజీ, సప్లై చైన్ రంగాల్లో చైనాకు గట్టి పోటీ ఇచ్చే సత్తా కేవలం భారత్&zwnj;కే ఉందని అమెరికా అధికారి జాకబ్ హెల్బర్గ్ అన్నారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwca616fpav26ncy4d5p7wvd,imgname-us-says-india-only-country-that-can-challenge-china-in-tech-workforce-1782824764622.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;India Vs China : చైనాకు చుక్కలు చూపించే సత్తా ఉన్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలెంట్, టెక్నాలజీ, సప్లై చైన్ రంగాల్లో చైనాకు గట్టి పోటీ ఇచ్చే సత్తా కేవలం భారత్&zwnj;కే ఉందని అమెరికా అధికారి జాకబ్ హెల్బర్గ్ అన్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎదుగుతున్న తీరు, దేశ సాంకేతిక సామర్థ్యం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. తాజాగా అమెరికా చేసిన ఒక పెద్ద ప్రకటన బీజింగ్ నుంచి వాషింగ్టన్ వరకు రచ్చలేపుతోంది. చైనాకు అడ్డుగా కొండలా నిలబడగలిగే సత్తా, ఆ దేశాన్ని నిలువరించే కెపాసిటీ కేవలం భారత్&zwnj;కు మాత్రమే ఉందని అమెరికా ఓపెన్&zwnj;గా ఒప్పేసుకుంది. అమెరికాకు అకస్మాత్తుగా భారత్ పవర్ ఎందుకు గుర్తొచ్చింది? చైనా పాలక వర్గాల్లో ఈ వ్యాఖ్యలు ఎలాంటి కలకలం రేపాయి? నిజంగానే భారత్ ప్రపంచ శక్తిగా మారుతోందా?&lt;/p&gt;&lt;p&gt;వాషింగ్టన్&zwnj;లో జరిగిన 9వ యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్&zwnj;నర్&zwnj;షిప్ ఫోరమ్ లీడర్&zwnj;షిప్ సమ్మిట్&zwnj;లో అమెరికా విదేశాంగ శాఖ ఆర్థిక వృద్ధి, ఇంధన, పర్యావరణ వ్యవహారాల అండర్ సెక్రటరీ జాకబ్ హెల్బర్గ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్&zwnj;కార్డ్ చీఫ్ గవర్నమెంట్ అఫైర్స్ అండ్ పాలసీ ఆఫీసర్ టకర్ ఫుట్&zwnj;తో జరిగిన సంభాషణలో భారత్ ఇంజనీరింగ్ పవర్, టాలెంట్&zwnj;ను జాకబ్ హెల్బర్గ్ ప్రశంసించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జాకబ్ హెల్బర్గ్ మాట్లాడుతూ, వర్క్&zwnj;ఫోర్స్, టెక్నాలజీ, గ్లోబల్ సప్లై చైన్ రంగాల్లో చైనాకు నిజమైన సవాలు విసిరే సత్తా ఉన్న ఒకే ఒక్క దేశం భారత్ అని స్పష్టం చేశారు. ముఖ్యంగా వర్క్&zwnj;ఫోర్స్, టాలెంట్ పూల్ విషయంలో చైనాతో ఢీకొట్టే ఏకైక దేశం ఇండియానేనని ఆయన అన్నారు. సురక్షితమైన, నమ్మకమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్&zwnj;ను నిర్మించడంలో భారత్ పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. చైనాపై ప్రపంచ దేశాల ఆధారపడటాన్ని తగ్గించే వ్యూహంలో భారత్, అమెరికాకు అత్యంత ముఖ్యమైన, నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని తెలిపారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రస్తుతం ఉన్న గ్లోబల్ సప్లై చైన్ స్ట్రక్చర్ ఎక్కువ కాలం నిలబడదని హెల్బర్గ్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ప్రపంచ సప్లై చైన్&zwnj;లోని ఒక పెద్ద భాగం కేవలం కొన్ని నిర్దిష్ట ప్రాంతాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఇలాంటి వ్యవస్థ వల్ల భవిష్యత్తులో సప్లై నిలిచిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. అందుకే సప్లై చైన్&zwnj;ను వేర్వేరు దేశాలకు, వివిధ ప్రాంతాలకు విస్తరించి వైవిధ్యభరితంగా మార్చడం ప్రస్తుతం రావాల్సిన తక్షణ అవసరం అని ఆయన పేర్కొన్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత్ ఎప్పుడూ అమెరికాకు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఉందని జాకబ్ హెల్బర్గ్ గుర్తుచేశారు. ప్యాక్స్ డిక్లరేషన్&zwnj;పై మొదట సంతకం చేసిన దేశాల్లో భారత్ కూడా ఒకటని ఆయన చెప్పారు. ఏఐ, టెక్నాలజీకి సంబంధించిన అంతర్జాతీయ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ఫిబ్రవరిలో భారత్&zwnj;లో జరిగిన 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో తాను కూడా పాల్గొన్నానని హెల్బర్గ్ చెప్పారు. ఆ సమయంలో రెండు దేశాలు ఏఐ రంగంలో సహకారాన్ని పెంచుకోవడానికి అంగీకరించి, ఒక జాయింట్ స్టేట్&zwnj;మెంట్&zwnj;ను కూడా విడుదల చేశాయని గుర్తుచేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత్ ఎందుకు ఇంత ప్రత్యేకం అనే విషయానికి జాకబ్ హెల్బర్గ్ కొన్ని బలమైన కారణాలను లెక్కగట్టారు. భారత్, అమెరికా దేశాల విలువలు ఒకేలా ఉంటాయని ఆయన అన్నారు. అలాగే ఇంజనీరింగ్ వర్క్&zwnj;ఫోర్స్, టాలెంట్ పూల్ లోతు విషయంలో చైనాకు గట్టి పోటీ ఇచ్చే ఏకైక దేశం ఇండియానేనని స్పష్టం చేశారు. భారత్&zwnj;లో బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ, భారీ సంఖ్యలో ఇంజనీర్లు, ఖనిజాల రిఫైనింగ్ సామర్థ్యం, వేగంగా దూసుకుపోతున్న టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఉన్నాయని కొనియాడారు. ఈ అద్భుతమైన ఫీచర్ల వల్లే గ్లోబల్ టెక్నాలజీ, సప్లై చైన్&zwnj;లో భారత్ ఒక అనివార్యమైన పార్ట్నర్&zwnj;గా మారిందని చెప్పారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా తన మిత్రదేశాల మధ్య టెక్నాలజీ అభివృద్ధిని జీరో సమ్ పోటీగా చూడటం లేదని హెల్బర్గ్ స్పష్టం చేశారు. టెక్నాలజీ రంగంలో ఇతర కంపెనీల విజయాల వల్ల అమెరికాకు ఎలాంటి ముప్పు లేదని, ఎందుకంటే టెక్నాలజీ ఇండస్ట్రీ అనేది కాలంతో పాటు నిరంతరం పెరుగుతూనే ఉంటుందని చెప్పారు. భారత్&zwnj;లోని ఖనిజాల రిఫైనింగ్ ఇండస్ట్రీని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రారంభ దశలో ఉన్న టెక్నాలజీ ఎకోసిస్టమ్&zwnj;ను ప్రస్తావిస్తూ.. దేశం టెక్నాలజీ అప్లికేషన్ లేయర్&zwnj;లో పెద్ద ఎత్తున సహకారం అందిస్తోందని చెప్పారు. భవిష్యత్తులో కొత్త టెక్నాలజీని భారీ స్థాయిలో విస్తరించడానికి ఈ అప్లికేషన్ లేయర్ చాలా అవసరం అని జాకబ్ హెల్బర్గ్ అన్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/us-says-india-is-the-only-country-capable-of-challenging-china-in-tech-workforce-dominance-p2ykwbb"/>
        </item>
        <item>
            <title><![CDATA[Tourism: ప్ర‌పంచంలో అత్యంత అంద‌మైన గ్రామం.. రోడ్లు లేని ప్రాంతం, ప‌డ‌వ‌ల్లోనే ప్ర‌యాణం]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/tourism-giethoorn-the-beautiful-dutch-village-with-no-roads-and-176-wooden-bridges-s1g5mgz</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/tourism-giethoorn-the-beautiful-dutch-village-with-no-roads-and-176-wooden-bridges-s1g5mgz</guid>
            <pubDate>Sun, 05 Jul 2026 16:20:44 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Tourism: ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునే వారికి నెదర్లాండ్స్&zwnj;లోని గీథోర్న్ గ్రామం అద్భుతమైన పర్యాటక కేంద్రంగా చెప్పొచ్చు. కాలువలు, చిన్న పడవలు, పచ్చని ప్రకృతి, చెక్క వంతెనలతో ఈ గ్రామం ఒక కలల ప్రపంచంలా కనిపిస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwrpkecn7vxer34s4py6r2sy,imgname-tourism-1783240440213.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Tourism: ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునే వారికి నెదర్లాండ్స్&zwnj;లోని గీథోర్న్ గ్రామం అద్భుతమైన పర్యాటక కేంద్రంగా చెప్పొచ్చు. కాలువలు, చిన్న పడవలు, పచ్చని ప్రకృతి, చెక్క వంతెనలతో ఈ గ్రామం ఒక కలల ప్రపంచంలా కనిపిస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ గ్రామాన్ని చాలామంది &quot;ఉత్తర ప్రాంతంలోని వెనిస్ (Little Venice of the North)&quot; అని పిలుస్తారు. ప్రముఖ ట్రావెల్ గైడ్ Le Petit Fut&eacute; 2026 సంవత్సరానికి ప్రపంచంలోని అత్యంత అందమైన గ్రామాల జాబితాలో గీథోర్న్&zwnj;కు రెండో స్థానాన్ని ఇచ్చింది. గీథోర్న్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ రోడ్ల కంటే కాలువలే ఎక్కువ. గ్రామం మొత్తం నీటి మార్గాలతో అనుసంధానమై ఉంటుంది. గ్రామంలో ప్రయాణించాలంటే నడవాలి, సైకిల్ తొక్కాలి లేదా చిన్న పడవల్లో ప్రయాణించాలి. కార్ల రద్దీ, హారన్ శబ్దాలు లేకుండా ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శించేందుకు వస్తుంటారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గీథోర్న్ గ్రామంలో మొత్తం 176 చిన్న చెక్క వంతెనలు ఉన్నాయి. ఇవే గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కాలువల మధ్య చిన్న దీవులపై సంప్రదాయ శైలిలో నిర్మించిన ఇళ్లు కనిపిస్తాయి. గడ్డి పైకప్పులతో ఉండే కాటేజీలు, రంగురంగుల పూల తోటలు, పచ్చని చెట్లు ఈ గ్రామాన్ని మరింత అందంగా మార్చాయి. ప్రతి ఇంటికి ఒక చిన్న వంతెన ద్వారా వెళ్లేలా నిర్మాణం ఉండటం ప్రత్యేకత.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గీథోర్న్&zwnj;కు వెళ్లిన వారు తప్పకుండా పడవ ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. చిన్న తెడ్డు పడవలు లేదా ఎలక్ట్రిక్ బోట్లలో కాలువల గుండా ప్రయాణిస్తూ గ్రామ అందాలను దగ్గరగా చూడవచ్చు. కాలువల ఒడ్డున ఉన్న పూల తోటలు, సంప్రదాయ ఇళ్లు, ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అలాగే నీటి ఒడ్డున ఉన్న రెస్టారెంట్లలో కూర్చొని ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించడం కూడా ప్రత్యేక అనుభూతినిస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రఖ్యాత ట్రావెల్ గైడ్ Le Petit Fut&eacute; 2026లో ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత అందమైన గ్రామాల జాబితాలో గీథోర్న్ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానాన్ని ఫ్రాన్స్&zwnj;లోని కాంక్స్-ఎన్-రూయెర్గ్ (Conques-en-Rouergue) గ్రామం దక్కించుకుంది. గీథోర్న్ మాత్రం తన ప్రశాంత వాతావరణం, సహజ సౌందర్యం, నీటి కాలువలు, చెక్క వంతెనలతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఫ్రాన్స్ రాజధాని పారిస్&zwnj;కు సుమారు రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఈ గ్రామం వీకెండ్ ట్రిప్&zwnj;కు అద్భుతమైన గమ్యస్థానంగా భావిస్తారు. నగర జీవితంలోని హడావుడికి దూరంగా, ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపాలనుకునే వారికి గీథోర్న్ సరైన ఎంపిక. నీరు, పచ్చదనం, నిశ్శబ్దం కలిసిన ఈ గ్రామం జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా పర్యాటక నిపుణులు సూచిస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/tourism-giethoorn-the-beautiful-dutch-village-with-no-roads-and-176-wooden-bridges-s1g5mgz"/>
        </item>
        <item>
            <title><![CDATA[Richest Person: ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. 174 దేశాల జీడీపీ కంటే ఎక్కువ సంపద]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/richest-person-elon-musk-becomes-the-worlds-first-trillionaire-wealth-surpasses-gdp-of-174-countries-tep9l59</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/richest-person-elon-musk-becomes-the-worlds-first-trillionaire-wealth-surpasses-gdp-of-174-countries-tep9l59</guid>
            <pubDate>Sun, 14 Jun 2026 08:21:11 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Richest Person: ప్రపంచ కుబేరుల జాబితాలో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండే ఎలాన్ మస్క్ మరో చరిత్ర సృష్టించారు. ఆయన వ్యక్తిగత సంపద 1 ట్రిలియన్ డాలర్ల (1,000 బిలియన్ డాలర్లు) మార్కును దాటినట్లు అంతర్జాతీయ ఆర్థిక వర్గాలు పేర్కొంటున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kv0kx1hfh21xsrfbkw17knmm,imgname-richest-person-1781358560815.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Richest Person: ప్రపంచ కుబేరుల జాబితాలో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండే ఎలాన్ మస్క్ మరో చరిత్ర సృష్టించారు. ఆయన వ్యక్తిగత సంపద 1 ట్రిలియన్ డాలర్ల (1,000 బిలియన్ డాలర్లు) మార్కును దాటినట్లు అంతర్జాతీయ ఆర్థిక వర్గాలు పేర్కొంటున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మస్క్&zwnj;కు చెందిన SpaceX కంపెనీ షేర్లు మార్కెట్లో భారీగా పెరగడంతో సంస్థ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు పైగా చేరింది. కంపెనీలో మస్క్&zwnj;కు ఉన్న భారీ వాటా కారణంగా ఆయన వ్యక్తిగత నికర సంపద సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రపంచ చరిత్రలో తొలి ట్రిలియనీర్&zwnj;గా నిలిచిన వ్యక్తిగా మస్క్ పేరు నమోదైంది. ఈ భారీ సంపద పెరుగుదలకు ప్రధాన కారణం స్పేస్&zwnj;ఎక్స్ కంపెనీ విలువ ఒక్కసారిగా పెరగడమేనని నివేదికలు చెబుతున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచంలో కేవలం కొద్ది దేశాలకే 1 ట్రిలియన్ డాలర్లకు పైగా జీడీపీ ఉంది. మస్క్ సంపద ప్రస్తుతం సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లుగా ఉండటంతో, ప్రపంచంలోని దాదాపు 174 దేశాల వార్షిక ఆర్థిక ఉత్పత్తి కంటే ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆసియాలో ప్రముఖ టెక్నాలజీ కేంద్రంగా గుర్తింపు పొందిన తైవాన్ వార్షిక జీడీపీ సుమారు 976 బిలియన్ డాలర్లుగా అంచనా. మస్క్ సంపద దానికంటే ఎక్కువగా ఉంది. అలాగే ఆయన జన్మస్థలం అయిన సౌత్ ఆఫ్రికా జీడీపీ సుమారు 480 బిలియన్ డాలర్ల పరిధిలో ఉండగా, మస్క్ సంపద దానికి రెండింతలకు పైగానే ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మస్క్ వ్యక్తిగత సంపద ప్రస్తుతం స్విట్జార్లాండ్, స్వీడన్, సింగపూర్, ఐర్లాండ్, ఇజ్రాయెల్, ఆస్ట్రీయా వంటి పలు అభివృద్ధి చెందిన దేశాల వార్షిక జీడీపీలను కూడా అధిగమించినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. భారత జీడీపీ సుమారు 4 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉండగా, మస్క్ సంపద దాదాపు దాని నాలుగో వంతుకు సమానంగా ఉందని అంచనా వేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి సంపదే అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలకు సమానంగా ఉండటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/richest-person-elon-musk-becomes-the-worlds-first-trillionaire-wealth-surpasses-gdp-of-174-countries-tep9l59"/>
        </item>
        <item>
            <title><![CDATA[POK లో రక్తపాతం.. 19 మంది పిల్లలు, ఏడుగురు గర్భిణీల మృతి.. షాకింగ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్]]></title>
            <link>https://telugu.asianetnews.com/international/pok-unrest-escalates-intel-report-claims-19-children-7-pregnant-women-killed-in-crackdown-articleshow-uoxao38</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/international/pok-unrest-escalates-intel-report-claims-19-children-7-pregnant-women-killed-in-crackdown-articleshow-uoxao38</guid>
            <pubDate>Wed, 10 Jun 2026 11:57:34 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;POK: పాక్ ఆక్రమిత కశ్మీర్&zwnj;లో పాక్ సైన్యం జరిపిన అణిచివేతలో పెద్ద సంఖ్యలో పౌరులు చనిపోయారని ఓ ఇంటెలిజెన్స్ &amp;nbsp;రిపోర్ట్ &amp;nbsp;ఆరోపించింది. ఈ హింసలో 19 మంది చిన్నారులు, ఏడుగురు గర్భిణీలు ప్రాణాలు కోల్పోయారని, ఈ ఘటనలపై అంతర్జాతీయ సమాజం విచారణ జరపాలని కోరింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ktp47cnbgt4c030558n1jm6k,imgname-pok-1781006578347.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లో ఉద్రిక్తతలు పీక్స్&zwnj;కు చేరాయి. అక్కడ జరుగుతున్న అల్లర్లపై తాజాగా ఒక సంచలన ఇంటెలిజెన్స్ రిపోర్టు బయటకు వచ్చింది. పాకిస్తాన్ భద్రతా దళాలు జరిపిన క్రూరమైన అణచివేతలో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఈ రిపోర్టు ఆరోపించింది. ముఖ్యంగా 19 మంది అమాయక పిల్లలు, ఏడుగురు గర్భిణీ స్త్రీలు ఈ హింసలో చనిపోయినట్లు రిపోర్టు వెల్లడించింది. ఈ దారుణాలపై అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించి, దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. జూన్ 5 నుండి జూన్ 9 మధ్య పాక్ దళాలు అక్కడ సాగించిన హింసను ఈ రిపోర్టు పూసగుచ్చినట్లు వివరించింది.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;బార్మంగ్ బ్రిడ్జ్ కాల్పులు.. అసలు ఏం జరిగిందంటే?&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;పీఓకేలో ఈ తాజా సంక్షోభానికి 'బార్మంగ్ బ్రిడ్జ్' వద్ద జరిగిన కాల్పుల ఘటనే కారణం. ఆర్థిక, రాజ్యాంగ సంస్కరణల కోసం శాంతియుతంగా పోరాడుతున్న 'జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ' (JAAC)ని పాకిస్తాన్ మిలిటరీ టార్గెట్ చేయడంతో గొడవలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. ప్రజా సంక్షేమం కోసం అహింసా మార్గంలో ఉద్యమిస్తున్న జేఏఏసీ (JAAC) సంస్థను పాక్ అధికారులు ఏకంగా ఉగ్రవాద నిరోధక చట్టం కింద చేర్చారు. ఈ లోపే జేఏఏసీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు షాజైబ్ హబీబ్&zwnj;ను టార్గెట్ చేసి హత్య చేయడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ హత్యే పీఓకే అంతటా కార్చిచ్చులా నిరసనలు ఎగిసిపడేలా చేసింది.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;ఇంటెలిజెన్స్ రిపోర్టులో షాకింగ్ నిజాలు&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం కేవలం 11 మంది పురుషులు మాత్రమే చనిపోయినట్లు చెబుతున్నారు. కానీ, ఈ ఇంటెలిజెన్స్ రిపోర్టు అసలు నిజాన్ని బయటపెట్టింది. చనిపోయిన వారిలో 19 మంది చిన్నారులు, ఏడుగురు గర్భిణీలు ఉన్నారని తెలిపింది. నిరసనలను అణచివేయడానికి పాకిస్తాన్ ఏకంగా 14,000 మంది సైనికులను పీఓకేలో రంగంలోకి దించింది. అక్కడ కమ్యూనికేషన్ బ్లాకౌట్ (ఇంటర్నెట్, ఫోన్ల బంద్) విధించింది. నిరసనకారులు, హబీబ్ అంత్యక్రియలకు వచ్చిన నిరాయుధులైన జనాలపై సైన్యం నిజమైన బుల్లెట్లు ఉపయోగించి కాల్పులు జరిపిందని రిపోర్టు తీవ్ర ఆరోపణలు చేసింది.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;స్థానికుల కోపం వెనుక అసలు రీజన్ ఇదే&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;పీఓకే ప్రజల్లో పాక్ ప్రభుత్వంపై చాలా కాలంగా తీవ్ర అసంతృప్తి ఉంది. తమను రాజకీయంగా పక్కన పెట్టేస్తున్నారని, పీఓకేలో ఉన్న జలవిద్యుత్ వనరులను పాకిస్తాన్ దోచుకుంటోందని స్థానికులు మండిపడుతున్నారు. తమ ప్రాంతంలో తయారయ్యే కరెంటును పాకిస్తాన్ వాడుకుంటూ, తమకు మాత్రం కరెంట్ కోతలు విధిస్తోందని, భారీగా విద్యుత్ బిల్లులు బాదుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వివక్షకు వ్యతిరేకంగానే జేఏఏసీ 38 డిమాండ్లతో ఒక చార్టర్&zwnj;ను రూపొందించి ఉద్యమించింది. చౌకగా గోధుమల సబ్సిడీ ఇవ్వాలని, రాజకీయ నాయకులకు ఇచ్చే ప్రభుత్వ ప్రోత్సాహకాలను రద్దు చేయాలని, ప్రాంతీయ వనరులపై తమకు హక్కులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;ముజఫరాబాద్ ఒప్పందం బ్రేక్.. ముదిరిన వివాదం&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;నిజానికి అక్టోబర్ 2025లో జరిగిన 'ముజఫరాబాద్ ఒప్పందం' ప్రకారం ఈ డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది. కానీ ఆరు నెలల గడువు ముగిసినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పాక్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. దీంతో నిరసనలు మళ్లీ మొదలయ్యాయి. హబీబ్ హత్య తర్వాత పరిస్థితి చేతులు దాటిపోయింది. హబీబ్ మరణం తర్వాత పాక్ దళాలు స్వీపింగ్ ఆపరేషన్ చేపట్టి, 72 మందికి పైగా సివిల్ సొసైటీ నేతలను అరెస్ట్ చేశాయి. జేఏఏసీ సెంట్రల్ ఆఫీస్&zwnj;కు సీల్ వేశాయి. జూన్ 7న హబీబ్ అంత్యక్రియల ప్రార్థనల కోసం వచ్చిన జనాలపై లాఠీలు, టియర్ గ్యాస్, తుపాకులతో సైన్యం దాడి చేయడంతో పీఓకే అట్టుడికిపోయింది.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;సైన్యంపై తిరగబడ్డ జనం.. ఆర్మీ ఆర్డర్ నో చెప్పిన పోలీస్ అధికారి హత్య&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;జూన్ 9న దాదాపు 45 లక్షల మంది కాశ్మీరీలు మాస్ మార్చ్&zwnj;లో పాల్గొనాలని పిలుపునివ్వడంతో నిరసనలు మిన్నంటాయి. భీంబర్ ప్రాంతంలో రావల్కోట్ వైపు శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తున్న పౌరుల కాన్వాయ్&zwnj;లపై పాక్ సైన్యం షెల్లింగ్ జరిపింది. ఇక మాంగ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో 27 మంది పౌరులు చనిపోవడంతో, కోపోద్రిక్తులైన నిరసనకారులు పాక్ మిలిటరీ సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ఇదే సమయంలో పీఓకే పోలీస్ సబ్ ఇన్&zwnj;స్పెక్టర్ సర్దార్ ఇనాయత్ దారుణ హత్యకు గురయ్యారు. నిరసనకారులపై కాల్పులు జరపాలన్న పాక్ ఆర్మీ ఆదేశాలను ఆయన నిరాకరించినందుకే ఇనాయత్&zwnj;ను పాక్ సైన్యం కాల్చి చంపిందని ఈ రిపోర్టు సంచలన విషయాన్ని వెల్లడించింది. దీంతో పీఓకేలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/international/pok-unrest-escalates-intel-report-claims-19-children-7-pregnant-women-killed-in-crackdown-articleshow-uoxao38"/>
        </item>
        <item>
            <title><![CDATA[Bus Accident: ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు, 40 మంది మృతి]]></title>
            <link>https://telugu.asianetnews.com/international/bus-accident-pakistan-40-killed-after-passenger-bus-falls-into-ravine-in-balochistan-articleshow-venycoi</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/international/bus-accident-pakistan-40-killed-after-passenger-bus-falls-into-ravine-in-balochistan-articleshow-venycoi</guid>
            <pubDate>Fri, 03 Jul 2026 20:01:03 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Bus Accident: పాకిస్థాన్&zwnj;లోని బలూచిస్తాన్ ప్రావిన్స్&zwnj;లో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. క్వెట్టా నుంచి ఉత్తర దిశగా ప్రయాణిస్తున్న ఓ బస్సు పర్వత ప్రాంతంలో అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఏకంగా 40 మంది మ&zwnj;ర&zwnj;ణించారు.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwm65a77awgpet3yp76srmmy,imgname-bus-accident-1783088982247.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;h2&gt;సామర్థ్యానికి మించి ప్రయాణికులు.. ప్రమాదానికి ఇదే కారణమా?&lt;/h2&gt;&lt;p&gt;అధికారుల వివరాల ప్రకారం, బస్సు మొదట 36 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి బయలుదేరింది. అయితే దారిలోో మరో బస్సు నిలిచిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులను కూడా ఈ బస్సులో ఎక్కించుకున్నారు. దీంతో బస్సులో మొత్తం 48 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో పాటు పర్వత ప్రాంతంలో వేగంగా ప్రయాణించడం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో బస్సు రహదారి నుంచి జారి లోతైన లోయలో పడిపోయింది.&lt;/p&gt;&lt;h2&gt;సహాయక చర్యలకు పర్వత ప్రాంతం అడ్డంకి&lt;/h2&gt;&lt;p&gt;ప్రమాదం జరిగిన ప్రాంతం కొండలు, లోయలతో కూడిన క్లిష్ట భూభాగం కావడంతో సహాయక చర్యలు చేపట్టడం అధికారులకు సవాలుగా మారింది. భారీ లోయలో పడిపోయిన బస్సు శిథిలాల నడుమ చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది గంటల తరబడి శ్రమించారు. ఘటన స్థలంలో అంబులెన్స్&zwnj;లు, అత్యవసర వైద్య బృందాలు, ఇతర సహాయక వాహనాలను మోహరించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించగా, గాయపడిన వారిని ఝోబ్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.&lt;/p&gt;&lt;h2&gt;ప్రమాదకర రహదారిపై తరచూ ప్రమాదాలు&lt;/h2&gt;&lt;p&gt;షెరాణి-ఝోబ్ హైవే బలూచిస్తాన్&zwnj;ను ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్&zwnj;తో కలిపే కీలక రహదారి. అయితే ఈ మార్గం సన్నని మలుపులు, ఎత్తైన కొండలు, లోతైన లోయలతో కూడి ఉండటంతో అత్యంత ప్రమాదకర రహదారుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. స్థానికుల ప్రకారం, రహదారి భద్రతా ప్రమాణాలు తగిన స్థాయిలో లేకపోవడం, రక్షణ గోడలు లేకపోవడం, కొండ ప్రాంతాల్లో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.&lt;/p&gt;&lt;h2&gt;విచారణకు ఆదేశాలు..&lt;/h2&gt;&lt;p&gt;ప్రమాదంపై బలూచిస్తాన్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఆదేశాల మేరకు సంఘటనపై సమగ్ర విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. షెరాణి జిల్లా అధికారులు మాట్లాడుతూ, బస్సులో అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ మంది ప్రయాణించడం కూడా ప్రమాద తీవ్రతను పెంచిన అంశంగా కనిపిస్తోందన్నారు. డ్రైవింగ్ వేగం, రహదారి పరిస్థితి, బస్సు సాంకేతిక స్థితి వంటి అన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ప్రమాదం మరోసారి పాకిస్థాన్&zwnj;లోని పర్వత ప్రాంత రహదారుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ప్రయాణికుల రక్షణ కోసం కఠినమైన రోడ్డు భద్రతా చర్యలు అవసరం అని స్థానికులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/international/bus-accident-pakistan-40-killed-after-passenger-bus-falls-into-ravine-in-balochistan-articleshow-venycoi"/>
        </item>
        <item>
            <title><![CDATA[Cockroach: ల‌క్ష‌లాది బొద్దింక‌ల‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. అస‌లేం జ‌రిగిందంటే.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/cockroach-australia-seizes-over-100000-cockroaches-massive-illegal-breeding-operation-exposed-ythc4wh</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/cockroach-australia-seizes-over-100000-cockroaches-massive-illegal-breeding-operation-exposed-ythc4wh</guid>
            <pubDate>Sun, 07 Jun 2026 10:14:40 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Cockroach: బొద్దింక&zwnj;లు అన&zwnj;గానే ప్ర&zwnj;స్తుతం కాక్రోచ్ జనతా పార్టీ గుర్తొస్తోంది. అయితే తాజాగా రియల్ బొద్దింకలకు సంబంధించిన ఓ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్&zwnj;గా మారింది. ఆస్ట్రేలియాలో లక్షకు పైగా బొద్దింకలను స్వాధీనం చేసుకోవ&zwnj;డం చ&zwnj;ర్చ&zwnj;నీయాంశంగా మారింది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ktewvd2z4ezqg88hepy64ybw,imgname-cockroach-1780763964511.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Cockroach: బొద్దింక&zwnj;లు అన&zwnj;గానే ప్ర&zwnj;స్తుతం కాక్రోచ్ జనతా పార్టీ గుర్తొస్తోంది. అయితే తాజాగా రియల్ బొద్దింకలకు సంబంధించిన ఓ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్&zwnj;గా మారింది. ఆస్ట్రేలియాలో లక్షకు పైగా బొద్దింకలను స్వాధీనం చేసుకోవ&zwnj;డం చ&zwnj;ర్చ&zwnj;నీయాంశంగా మారింది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని బాథర్స్ట్ ప్రాంతంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒక వాణిజ్య బ్రీడర్ వద్ద విదేశీ జాతులకు చెందిన భారీ సంఖ్యలో బొద్దింకలను పెంచుతున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేపట్టారు. తనిఖీల సమయంలో అక్కడ లక్షకు పైగా బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. కీట&zwnj;కాల&zwnj;కు సంబంధించిన కేసుల్లో దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద స్వాధీన చర్యగా అధికారులు పేర్కొన్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో ప్రధానంగా మ&zwnj;డ&zwnj;గాస్క&zwnj;ర్ హిస్సింగ్ కాక్రోచ్&zwnj;, దుబాయ్ కాక్రోచ్ జాతులకు చెందిన బొద్దింకలు ఉన్నాయి. మడగాస్కర్ హిస్సింగ్ బొద్దింకలు ప్రపంచంలోనే అతిపెద్ద బొద్దింక జాతుల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి. ఇవి సాధారణ బొద్దింకల కంటే చాలా పెద్దవిగా ఉండి, 5 నుంచి 8 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. మెరిసే గోధుమ రంగులో కనిపించే ఈ కీటకాలు సాధారణ బొద్దింకల కంటే భిన్నంగా ఉంటాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;స్వాధీనం చేసిన బొద్దింకల మార్కెట్ విలువ సుమారు 2 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1.35 కోట్లకు పైగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ జాతి బొద్దింకలను పెంపుడు సరీసృపాలు, పాములు, బల్లులు వంటి జంతువులకు ఆహారంగా ఉపయోగిస్తుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సంఖ్యలో పెంచుకునే అవకాశం ఉండటంతో కొన్ని వర్గాల్లో వీటికి డిమాండ్ ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ నిబంధనలు అమలు చేస్తున్న దేశాల్లో ఒకటి. విదేశీ జాతుల జీవులు స్థానిక జీవవైవిధ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వాటి దిగుమతి, పెంపకం, విక్రయాలపై కఠిన నియంత్రణలు అమలులో ఉన్నాయి. ఈ బొద్దింకలు బయటకు వ్యాపిస్తే స్థానిక పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో వ్యాధుల వ్యాప్తికి కూడా కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఘటనలో స్వాధీనం చేసిన బొద్దింకలన్నింటినీ నియంత్రిత విధానంలో తొలగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సంబంధిత బ్రీడర్&zwnj;పై అధికారిక అభియోగాలు నమోదు కాలేదని పేర్కొన్నప్పటికీ, కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. నిబంధనలను ఉల్లంఘించి విదేశీ జీవులను పెంచడం లేదా విక్రయించడం తీవ్రమైన నేరమని ఆస్ట్రేలియా అధికారులు మరోసారి హెచ్చరించారు. ఈ ఘటన దేశంలో అక్రమ జీవుల వ్యాపారంపై నిఘాను మరింత కఠినతరం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/cockroach-australia-seizes-over-100000-cockroaches-massive-illegal-breeding-operation-exposed-ythc4wh"/>
        </item>
    </channel>
</rss>
