<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Wed, 02 Sep 2026 11:46:18 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/international" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[Nepal Floods: నేపాల్ వరదల్లో 3000 మంది మిస్సింగ్.. గండక్ నది ఒడ్డున మృతదేహాల కలకలం]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/nepal-floods-tragedy-3000-missing-as-bodies-wash-up-on-gandak-river-11-year-old-boy-searches-father-for-up-11g3539</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/nepal-floods-tragedy-3000-missing-as-bodies-wash-up-on-gandak-river-11-year-old-boy-searches-father-for-up-11g3539</guid>
            <pubDate>Sun, 30 Aug 2026 08:10:57 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Nepal Floods : నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఉప్పొంగిన ఆకస్మిక వరదలు అత్యంత విషాదాన్ని మిగిల్చాయి. విపత్తు దాటికి వేలాది మంది కొట్టుకుపోగా, బాధితుల ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యల్లో కలచివేసే ఘటనాంశాలు వెలుగులోకి వస్తున్నాయి.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m18716zgkk66cb912tfg9h4s,imgname-nepal-glacier-collapse-flood-nepal-china-border-100-km-trishuli-river-disaster-10-photo-12-1788055952368.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Nepal Floods : నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఉప్పొంగిన ఆకస్మిక వరదలు అత్యంత విషాదాన్ని మిగిల్చాయి. విపత్తు దాటికి వేలాది మంది కొట్టుకుపోగా, బాధితుల ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యల్లో కలచివేసే ఘటనాంశాలు వెలుగులోకి వస్తున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నేపాల్&zwnj;లో సంభవించిన భయంకరమైన జలప్రళయం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదంలో బీహార్&zwnj;లోని మోతిహారీకి చెందిన 11 ఏళ్ల బాలుడు తన తండ్రిని కోల్పోయాడు. శనివారం రోజు ఉత్తరప్రదేశ్&zwnj;లోని కుషీనగర్ ఖడ్డా ప్రాంతానికి చేరుకున్న ఈ చిన్నారి, నేపాల్&zwnj;లో జరిగిన ఆ భయంకర సంఘటనను కన్నీళ్లతో గుర్తుచేసుకున్నాడు. తండ్రి జాడ కోసం గండక్ నది తీరంలో వెతుకుతున్న ఆ బాలుడి ఆవేదన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కంటితడి పెట్టించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆ బాలుడు తెలిపిన వివరాల ప్రకారం, అతని తండ్రి నేపాల్&zwnj;లోని రసువా జిల్లాలో స్క్రాప్ షాప్ నడుపుతుండేవాడు. ఆ రోజు ఉదయం బాలుడు స్కూల్&zwnj;కి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. తండ్రి వంట చేస్తున్నాడు. ఇంతలోనే ఊహించని విధంగా ఒక్కసారిగా పైనుంచి ఉధృతంగా వరద నీరు దూసుకొచ్చింది. ఆ నీటి ప్రవాహంలో తండ్రి కొట్టుకుపోయారు. బాలుడు తన ముగ్గురు సోదరులతో కలిసి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకుని బీహార్&zwnj;లోని తమ స్వగ్రామానికి చేరుకున్నాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే తండ్రి కోసం వెతకడం ప్రారంభించారు. బీహార్&zwnj;లోని నదీ తీర ప్రాంతాల్లో వెతికినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో, తన బాబాయ్&zwnj;తో కలిసి శనివారం కుషీనగర్&zwnj;లోని ఛితౌని బంధ్, మదన్&zwnj;పూర్ సుక్రౌలీ, భైన్సా ప్రాంతాలకు చేరుకున్నాడు. గండక్ నది ఒడ్డున తన తండ్రి ఆచూకీ దొరుకుతుందనే ఆశతో ఆ చిన్నారి ఇంకా వెతుకుతూనే ఉన్నాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నేపాల్ వరదల ప్రభావంతో గండక్ నదిలో నీటి ఉధృతి మళ్లీ పెరిగింది. దీంతో కుషీనగర్&zwnj;లోని ఖడ్డా ప్రాంతంలో వరద, నదీ తీర కోత ప్రమాదం ఎక్కువైంది. నది ప్రవాహం ఛితౌని ఆకట్ట వద్ద ఒత్తిడిని పెంచుతోంది. మరోవైపు, నేపాల్ నుంచి కొట్టుకువచ్చిన 6 మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకుని జిల్లా ఆసుపత్రిలోని డిప్ ఫ్రీజర్&zwnj;లో భద్రపరిచారు. మృతదేహాలను గుర్తించడానికి నేపాల్ సరిహద్దు జిల్లాల అధికారులతో ఎడిఎమ్ వైభవ్ మిశ్రా సమన్వయం చేసుకుంటున్నారు. గుర్తింపు పూర్తయ్యాక నిబంధనల ప్రకారం బంధువులకు అప్పగిస్తామని తెలిపారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నేపాల్&zwnj;లో వరద ముప్పు మళ్లీ పెరిగింది. భోటేకోషి నదిలో నీటి ఉధృతి పెరగడంతో రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. ఆగస్టు 26న వచ్చిన వరదల్లో ఇప్పటివరకు 691 మంది మృతి చెందగా, 3000 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో 275 మంది భారతీయులు ఉన్నారు. భారత్ ఇప్పటివరకు 108 మందిని సురక్షితంగా రక్షించింది. చైనా నుంచి 598 మంది భారతీయులు నేపాల్ చేరుకోగా, మరో 900 మంది చైనాలో సురక్షితంగా ఉన్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/nepal-floods-tragedy-3000-missing-as-bodies-wash-up-on-gandak-river-11-year-old-boy-searches-father-for-up-11g3539"/>
        </item>
        <item>
            <title><![CDATA[Iran-US: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ఈ షరతులకు ఒప్పుకుంటేనే హర్మూజ్ జలసంధి తెరుస్తాం]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/iran-us-tensions-iran-sets-new-conditions-to-reopen-strait-of-hormuz-demands-sanctions-relief-4clgon6</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/iran-us-tensions-iran-sets-new-conditions-to-reopen-strait-of-hormuz-demands-sanctions-relief-4clgon6</guid>
            <pubDate>Sun, 09 Aug 2026 15:01:57 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Iran-US: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ మరోసారి కఠిన వైఖరిని ప్రకటించింది. అమెరికా తమ డిమాండ్లను అంగీకరించే వరకు ఈ సముద్ర మార్గాన్ని పూర్తిగా తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kxakhrft4kbza228ty1rqgf1,imgname-iran-hormuz-attack-indian-crew-missing-mea-container-ship-us-iran-tensions-1783841219066.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Iran-US: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ మరోసారి కఠిన వైఖరిని ప్రకటించింది. అమెరికా తమ డిమాండ్లను అంగీకరించే వరకు ఈ సముద్ర మార్గాన్ని పూర్తిగా తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇరాన్ తాజా ప్రకటనలో అమెరికాపై పలు కీలక డిమాండ్లు చేసింది. తమపై అమలులో ఉన్న అన్ని ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ నిధులను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కోరింది. అలాగే, ఇరాన్ నౌకాశ్రయాలపై అమలులో ఉన్న దిగ్బంధనాన్ని తొలగించాలని, తమ భూభాగం సమీపంలోని అమెరికా సైనిక ఉనికిని తగ్గించి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పూర్తి స్థాయి పరిహారం చెల్లించాలని కూడా స్పష్టం చేసింది. ఈ షరతులు అమలైన తర్వాతే హర్మూజ్ జలసంధిని పూర్తిస్థాయిలో తెరవడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇటీవల ఇరు దేశాల నడుమ జరిగిన చర్చల్లో కొన్ని అంశాలపై సూత్రప్రాయ అంగీకారం కుదిరినా, తుది ఒప్పందంపై ఇంకా స్పష్టత రాలేదు. అమెరికా ముందుగా హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు సాధారణ స్థితికి రావాలని కోరుతోంది. ఆ తర్వాతే ఆంక్షల సడలింపు, నిధుల విడుదల వంటి అంశాలను పరిశీలిస్తామని భావిస్తోంది. అయితే ఇరాన్ మాత్రం ముందు తమ డిమాండ్లు అమలు చేయాల్సిందేనని పట్టుబడుతోంది. దీంతో రెండు దేశాల నడుమ చర్చలు ముందుకు సాగకుండా ప్రతిష్ఠంబన నెలకొంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హర్మూజ్ జలసంధి నిర్వహణకు సంబంధించి ఒమన్&zwnj;తో సాంకేతిక స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని ఇరాన్ తెలిపింది. అయితే అవి కేవలం నౌకల రాకపోకల నిర్వహణకు సంబంధించినవేనని, అమెరికాతో ఉన్న రాజకీయ, ఆర్థిక వివాదాలకు వాటికి సంబంధం లేదని స్పష్టం చేసింది. అమెరికా తమ షరతులను అంగీకరించే వరకు జలసంధిని పూర్తిగా తెరవబోమని మరోసారి ప్రకటించింది. అవసరమైతే చర్చల గడువును పొడిగించే అవకాశాన్ని కూడా ఇరు పక్షాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో ఎగుమతి అయ్యే చమురులో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఈ కారణంగా హర్మూజ్ జలసంధిపై ఏ చిన్న ఉద్రిక్తత ఏర్పడినా అంతర్జాతీయ చమురు ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్ ప్రకటించిన కొత్త షరతులు, అమెరికా స్పందన కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రెండు దేశాల నడుమ తుది ఒప్పందం ఎప్పుడు కుదురుతుందన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా కీలక అంశంగా మారింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/iran-us-tensions-iran-sets-new-conditions-to-reopen-strait-of-hormuz-demands-sanctions-relief-4clgon6"/>
        </item>
        <item>
            <title><![CDATA[Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/nepal-flood-fury-how-40-year-old-green-house-survived-floods-5vg4wg4</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/nepal-flood-fury-how-40-year-old-green-house-survived-floods-5vg4wg4</guid>
            <pubDate>Wed, 02 Sep 2026 11:46:17 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Nepal Floods: నేపాల్ త్రిశూలి నది వరదల్లో అంతా కొట్టుకుపోయింది. వందల మంది చనిపోయారు. కానీ 40 ఏళ్ల నాటి గ్రీన్ హౌస్ సురక్షితంగా నిలిచింది. 6 మంది ప్రాణాలు కాపాడిన ఈ ఇల్లు ఎలా వరదలను తట్టుకోగలిగింది?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m11m1n45h5j5za61s5hwxee7,imgname-20260827143l-1787834717317.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Nepal Floods: నేపాల్ త్రిశూలి నది వరదల్లో అంతా కొట్టుకుపోయింది. వందల మంది చనిపోయారు. కానీ 40 ఏళ్ల నాటి గ్రీన్ హౌస్ సురక్షితంగా నిలిచింది. 6 మంది ప్రాణాలు కాపాడిన ఈ ఇల్లు ఎలా వరదలను తట్టుకోగలిగింది?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆగస్టు 26న నేపాల్&zwnj;లోని త్రిశూలి నది తీవ్ర రౌద్రరూపం దాల్చింది. ఉప్పొంగిన వరద నీరు తన దారిలో ఉన్న వాహనాలు, భవనాలు సర్వనాశనం చేస్తూ కొట్టుకుపోయింది. నువాకోట్ జిల్లాలోని డంగే బజార్ పరిసర ప్రాంతాలు మట్టి, రాళ్లు, మురుగుతో నిండిపోయాయి.&lt;/p&gt;&lt;p&gt;అయితే, ఈ విధ్వంసం మధ్య ఒక అద్భుతం జరిగింది. పచ్చ రంగులో ఉన్న ఒక 40 ఏళ్ల నాటి పాత ఇల్లు భయంకరమైన వరదలను తట్టుకుని అలాగే నిలబడింది. ఈ పచ్చని ఇల్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. చుట్టూ ఉన్న భవనాలన్నీ కొట్టుకుపోయినా, ఈ ఒక్క ఇల్లు ఎలా నిలబడిందనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వరద ఉధృతి మరింత గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు ప్రకాష్, ఆయన కుటుంబంలోని ఆరుగురు సభ్యులు దాదాపు గంట నుండి గంటన్నర పాటు ఇంట్లోనే చిక్కుకుపోయారు. ప్రాణాలు కాపాడుకోవడానికి వారు భవనం పై అంతస్తుకు చేరుకుని గడిపారు. వరద నీటి మట్టం స్వల్పంగా తగ్గగానే, సమీపంలోని టోల్ ప్రాంతానికి చెందిన ప్రజలు రక్షణ చర్యలు చేపట్టారు. వారు పొరుగు భవనాల మధ్య ఒక పెద్ద పైప్&zwnj;ను ఉంచారు. ఆ పైప్&zwnj;, తాళ్ల సహాయంతో అవతలి వైపు నుంచి వచ్చి ప్రకాష్ కుటుంబాన్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సర్వస్వం కోల్పోయినా నిలిచిన ప్రాణాలు వరద రాక్షసి నుంచి కుటుంబ సభ్యులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరు ఖాట్మండ్ లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో వారి వాహనాలు, దుకాణంలోని సరుకులు, ఇంట్లోని నిత్యావసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి.&lt;/p&gt;&lt;p&gt;ఇంటి గ్రౌండ్ ఫ్లోర్&zwnj;లో ఉన్న కిరాణా షాప్ వరద నీటికి తీవ్రంగా దెబ్బతింది. &quot;అందరూ సురక్షితంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నదంతా ధ్వంసమైంది లేదా మట్టిలో పూడిపోయింది. ఇప్పుడు మేమంతా మళ్లీ మొదటి నుంచి జీవితాన్ని నిర్మించుకోవాలి&quot; అని ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ గ్రీన్ హౌస్ యజమాని ప్రకాష్. వరద తాకిడికి తన ఇల్లు ఎక్కడ కూలిపోతుందో అని ఆయన తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఇల్లు సురక్షితంగా నిలవడం ఒక అద్భుతమని ఆయన చెప్పారు. ఇల్లు ఎలా నిలబడింది అనే ప్రశ్నకు ప్రకాష్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.&lt;/p&gt;&lt;p&gt;&quot;ఇది దాదాపు 40 సంవత్సరాల నాటి పాత ఇల్లు. ఆ సమయంలో వాడిన సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రి నాణ్యత చాలా బాగుండేది. ఈ భవనం నదికి చాలా దగ్గరగా ఉండటం వల్ల, నిర్మాణం సమయంలో పునాదిని చాలా జాగ్రత్తగా, బలంగా నిర్మించారు&quot; అని ప్రకాష్ తెలిపారు. ఇంజనీరింగ్ పరమైన విశ్లేషణలు అధికారికంగా రాకపోయినా, ఇంటి నిర్మాణం, పునాది బలం, వరద ప్రవాహానికి అనుకూలంగా ఉన్న డిజైన్ దీనికి కారణమని భావిస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నువాకోట్ నుండి రసువా వెళ్లే రహదారిపై ఉన్న ఈ ఇల్లు చుట్టుపక్కల విధ్వంసం మధ్య ఏకైక ఆధారంగా నిలిచింది. ఇల్లు దెబ్బతిన్నా, ఆస్తి నష్టం తీవ్రంగా ఉన్నా ప్రకాష్ కుటుంబం అధైర్యపడలేదు. ఎంతటి నష్టం వచ్చినా మళ్లీ అదే స్థలం నుంచి తమ జీవితాన్ని పునఃప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకాష్ ధైర్యంగా చెప్పారు. &quot;అవును, మేము మళ్లీ అక్కడి నుంచే కొత్తగా ప్రారంభించడానికి ప్రయత్నిస్తాము&quot; అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/nepal-flood-fury-how-40-year-old-green-house-survived-floods-5vg4wg4"/>
        </item>
        <item>
            <title><![CDATA[Nepal Floods: ముప్పు ఇంకా ముగిసిపోలేదు.. నేపాల్‌కు చైనా హెచ్చ‌రిక‌, మ‌రో 3 రోజుల్లో]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/nepal-flood-alert-china-warns-of-another-major-flood-threat-in-3-days-65e4y3o</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/nepal-flood-alert-china-warns-of-another-major-flood-threat-in-3-days-65e4y3o</guid>
            <pubDate>Thu, 27 Aug 2026 21:32:05 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Nepal Floods: ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలమైన నేపాల్&zwnj;ను మరో ప్రమాదం భయపెడుతోంది. ఇప్పటికే ఆకస్మిక వరదలు భారీ నష్టాన్ని మిగిల్చిన వేళ.. రసువా జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఓ సరస్సు ఆందోళనకు కార&zwnj;ణ&zwnj;మ&zwnj;వుతోంది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m11ynjbjshyjds9mzjjksqfk,imgname-nepal-floods-1787845855601.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Nepal Floods: ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలమైన నేపాల్&zwnj;ను మరో ప్రమాదం భయపెడుతోంది. ఇప్పటికే ఆకస్మిక వరదలు భారీ నష్టాన్ని మిగిల్చిన వేళ.. రసువా జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఓ సరస్సు ఆందోళనకు కార&zwnj;ణ&zwnj;మ&zwnj;వుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నేపాల్&zwnj;లోని రసువా జిల్లాలో భోటే కోషి నదీ ప్రవాహానికి సమీపంలో ఈ కొత్త సరస్సు ఏర్పడినట్లు సమాచారం. టిబెట్ ప్రాంతంలో పుట్టే చోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో నదులు ముందుకు సాగుతూ పరస్పరం కలుస్తాయి. అనంతరం వాటి ప్రవాహం నేపాల్&zwnj;లోకి ప్రవేశిస్తుంది. ఈ నదులు కలిసే ప్రాంతానికి సమీపంలోనే భారీగా నీరు నిలిచి సరస్సు రూపుదిద్దుకున్నట్లు చైనా అధికారులు గుర్తించారు. గురువారం నాటికి సరస్సులో సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరినట్లు అంచనా వేశారు. రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు నీరు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీంతో నీటి ఒత్తిడి పెరిగి సరస్సు తెగిపోయే పరిస్థితి ఏర్పడొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కొత్తగా ఏర్పడిన సరస్సుకు గండి పడితే భారీ మొత్తంలో నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భోటేకోషి, త్రిశూలి నదుల్లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వెలువడ్డాయి. ఇప్పటికే వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలకు ఇది మరో పెద్ద సవాలుగా మారనుంది.&lt;/p&gt;&lt;p&gt;పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చైనా అధికారులు సరస్సును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ గండి పడితే నీటి ప్రవాహం ఏ ప్రాంతాలపై ప్రభావం చూపవచ్చు, ఎలాంటి అత్యవసర చర్యలు చేపట్టాలి అనే అంశాలపై అధికారులు సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కొత్త సరస్సు, దాని వల్ల తలెత్తే ప్రమాదంపై చైనా ప్రభుత్వం నేపాల్&zwnj;కు అధికారికంగా సమాచారం అందించినట్లు నేపాల్ జల విజ్ఞాన, వాతావరణ విభాగం తెలిపింది. ఈ సమాచారాన్ని నేపాల్ విదేశాంగ శాఖకు కూడా చైనా అధికారులు తెలియజేసినట్లు పేర్కొంది. భోటేకోషి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లో మరోసారి వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీ తీర ప్రాంతాల్లోకి వెళ్లకుండా దూరంగా ఉండాలని హెచ్చరించారు. తదుపరి అధికారిక సమాచారం వచ్చే వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో కొత్తగా వరద ముప్పు పొంచి ఉండటంతో సెర్చ్, రెస్క్యూ బృందాలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రయాణికులు, భద్రతా సిబ్బంది కూడా నదుల పరిసర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.&lt;/p&gt;&lt;p&gt;ఇదిలా ఉంటే.. ఇటీవల సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలతో నేపాల్&zwnj;లో పరిస్థితి విషమంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ విపత్తుల్లో 359 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్వాన్ జిల్లాలోనే 132 మృతదేహాలను గుర్తించినట్లు నేపాల్ పోలీసులు వెల్లడించారు. ఇంకా పలువురి ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ఇప్పటికే భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటున్న నేపాల్&zwnj;కు కొత్త సరస్సు రూపంలో మరో ముప్పు ఎదురవడంతో ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. రాబోయే కొన్ని రోజులు కీలకంగా మారనున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అధికారుల హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/nepal-flood-alert-china-warns-of-another-major-flood-threat-in-3-days-65e4y3o"/>
        </item>
        <item>
            <title><![CDATA[Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/nepal-flash-floods-over-160-dead-133-indian-pilgrims-missing-near-tibet-border-tragedy-on-kailash-yatra-74daeqz</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/nepal-flash-floods-over-160-dead-133-indian-pilgrims-missing-near-tibet-border-tragedy-on-kailash-yatra-74daeqz</guid>
            <pubDate>Thu, 27 Aug 2026 10:45:55 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Nepal Flash Floods: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ల్యాండ్&zwnj;స్లైడ్ కారణంగా ఆకస్మిక వరదలు వచ్చాయి. 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 133 మంది భారతీయులు సహా వందలాది మంది గల్లంతయ్యారు. కైలాస యాత్రలో ఊహించని విషాదంతో చాలా మంది భారతీయులు గల్లంతయ్యారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m10ha8r60hmdvw48kdkxfd5b,imgname-today-top-10-morning-news-august-27-2026-nepal-flood-trump-india-china-h1n1-railways-1787798299398.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Nepal Flash Floods: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ల్యాండ్&zwnj;స్లైడ్ కారణంగా ఆకస్మిక వరదలు వచ్చాయి. 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 133 మంది భారతీయులు సహా వందలాది మంది గల్లంతయ్యారు. కైలాస యాత్రలో ఊహించని విషాదంతో చాలా మంది భారతీయులు గల్లంతయ్యారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఊహించని పర్యావరణ విపత్తు ముంచెత్తింది. హిమపాతం, కొండచరియలు విరిగిపడటంతో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు వచ్చాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, ఈ కొండచరియలు విరిగిపడిన తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో కూడిన భూకంపంతో సమానంగా నమోదు కావడం గమనార్హం. ఈ దెబ్బకు మంచు, రాళ్లు, మట్టి, నీరు పెద్ద ఎత్తున 'ల్హెండే ఖోలా' నదిలోకి కొట్టుకొచ్చాయి. అక్కడి నుంచి 'భోటే కోశి', 'త్రిశూలి' నదుల ద్వారా నీరు ఉగ్రరూపం దాల్చి దిగువ ప్రాంతాలను ముంచెత్తింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ భయానక వరదల వల్ల ఇప్పటివరకు 163 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. నూవాకోట్, రసువా, ధాడింగ్, చిత్రవాన్, గూర్ఖా వంటి జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయి. అత్యధికంగా చిత్వాన్&zwnj;లో 64 మంది, ధాడింగ్&zwnj;లో 27 మంది మరణించారు. దాదాపు 750 మందికి పైగా జాడ తెలియకుండా పోయినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. సరిహద్దుల్లోని టిబెట్ భూభాగంలో కూడా ముగ్గురు మరణించగా, 265 మంది గల్లంతయ్యారు. నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ, శతాబ్ద కాలంలో ఇదొక అతిపెద్ద విపత్తు అని, గ్రామాలు క్షణాల్లో తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పవిత్ర కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన భక్తులు ఈ విపత్తులో చిక్కుకున్నారు. వీరిలో 133 మంది భారతీయ యాత్రికుల అడ్రస్ దొరకడం లేదు. తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఈ జాబితాలో ఉన్నారు. ఈషా ఫౌండేషన్&zwnj;కు చెందిన 77 మంది సభ్యులు ఇమ్మిగ్రేషన్ సెంటర్ వద్ద ఉండగా వరదల్లో చిక్కుకున్నారని, వారితో కమ్యూనికేషన్ కట్ అయిందని సద్గురు తెలిపారు. బాధితులను రక్షించడానికి నేపాల్ ఆర్మీ, హెలికాప్టర్లను రంగంలోకి దించింది. భారత్ కూడా వెంటనే స్పందించి 10 టన్నుల సహాయక సామగ్రిని సీ-130జే విమానంలో ఖాట్మండుకు పంపింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వరద దెబ్బకు రవాణా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. కనీసం 19 మోటారబుల్ వంతెనలు కొట్టుకుపోయాయి. కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే ఒక భారీ బ్రిడ్జి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు 354 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 8 పవర్ ప్రాజెక్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బెట్రావతి నుండి రసువాగధి సరిహద్దు వరకు ఉండే 42 కిలోమీటర్ల ప్రధాన రహదారి కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నేపాల్&zwnj;లో ఉప్పొంగిన ప్రవాహం బీహార్&zwnj;లోని గండక్ నది వైపు రావడంతో అక్కడి ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. వాల్మీకినగర్ బ్యారేజీకి చెందిన మొత్తం 36 గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు విడుదల చేశారు. రాత్రి వేళ 1.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో ముంపు ప్రాంతాల నుంచి 4,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశ్చిమ చంపారన్, గోపాల్&zwnj;గంజ్, ముజఫర్&zwnj;పూర్ జిల్లాల్లో ఎన్డీఆర్&zwnj;ఎఫ్ (NDRF) బలగాలను మోహరించారు. ప్రస్తుతం గండక్ నదిలో నీటి మట్టం కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఉపశమనం పొందారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/nepal-flash-floods-over-160-dead-133-indian-pilgrims-missing-near-tibet-border-tragedy-on-kailash-yatra-74daeqz"/>
        </item>
        <item>
            <title><![CDATA[Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. 132 మందికి పైగా మృతి.. వేల మందికి గాయాలు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/colombia-earthquake-7-4-magnitude-quake-hits-colombia-buildings-collapse-airports-shut-as-death-toll-rises-above-132-8nw0pa6</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/colombia-earthquake-7-4-magnitude-quake-hits-colombia-buildings-collapse-airports-shut-as-death-toll-rises-above-132-8nw0pa6</guid>
            <pubDate>Tue, 11 Aug 2026 09:06:36 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. 132 మంది మృతి చెందారు. మరణాలు మరింత పెరిగే అవకాశముంది. వేల మంది గాయపడగా, వీరిలో 570 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kzqe8h79f83cy2z57v7ay0xc,imgname-colombia-earthquake-1786419365097.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. 132 మంది మృతి చెందారు. మరణాలు మరింత పెరిగే అవకాశముంది. వేల మంది గాయపడగా, వీరిలో 570 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కొలంబియా దేశంలో సోమవారం ఉదయం ఒక పెద్ద విషాదం జరిగింది. పశ్చిమ కొలంబియా ప్రాంతాన్ని 7.4 తీవ్రతతో భారీ భూకంపం తీవ్రంగా కుదిపేసింది. దశాబ్ద కాలంలో ఈ స్థాయిలో భూకంపం రావడం ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు కనీసం 132 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది గాయపడ్డారు. వీరిలో 570 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని కొలంబియన్ అసోసియేషన్ ఆఫ్ క్యాపిటల్ సిటీస్ ఈ అధికారిక లెక్కలను వెల్లడించింది.&lt;/p&gt;&lt;p&gt;భూకంపం ధాటికి అనేక భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద ఇంకా అనేకమంది చిక్కుకుపోయారు. వారిని కాపాడటానికి రెస్క్యూ టీమ్&zwnj;లు, స్థానిక ప్రజలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకున్న ప్రభుత్వం దేశంలో నేషనల్ డిజాస్టర్ ప్రకటించింది. ఆర్మీ సైనికులను రంగంలోకి దించి రెస్క్యూ ఆపరేషన్లను వేగవంతం చేసింది.&lt;/p&gt;&lt;p&gt;Terrifying video: University Hospital collapses in Colombia  after massive 7.4 earthquake pic.twitter.com/B48ZrqPrq5&lt;/p&gt;&lt;p&gt;&mdash; TaraBull (@TaraBull) August 10, 2026&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ భారీ భూకంప కేంద్రం పశ్చిమ కొలంబియాలోని శాన్ జోసే డెల్ పాల్మర్ ప్రాంతంలో ఉంది. ఇది రాజధాని బొగోటాకు దాదాపు 150 మైళ్ల దూరంలో ఉండే ఒక వెనుకబడిన ప్రాంతం. అయితే, దీని ప్రభావం రాజధాని బొగోటాలో కూడా చాలా తీవ్రంగా కనిపించింది. పెద్ద శబ్దంతో సైరన్లు మోగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ భూకంపం వల్ల దేశంలో 5 ప్రధాన నగరాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా దాదాపు 86 భారీ భవనాలు పూర్తిగా కూలిపోయాయి. అంతేకాకుండా, భద్రతా కారణాల వల్ల 7 విమానాశ్రయాల్లో విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసారు. 20కి పైగా మున్సిపాలిటీలపై ఈ ప్రభావం పడింది. పొరుగున ఉన్న ఈక్వెడార్, పనామా దేశాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి.&lt;/p&gt;&lt;p&gt;#Temblor Pereira. Tras #Terremoto 7.4 grados. pic.twitter.com/TiIpeebAnx&lt;/p&gt;&lt;p&gt;&mdash; Vicky D&aacute;vila (@VickyDavilaH) August 10, 2026&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ భూకంపంలో కాలి అనే నగరంలో ఒక ప్రధాన ఆసుపత్రికి చెందిన పిల్లల, నవజాత శిశువుల వార్డులు ఉన్న భవనం కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాలి నగరంలో ముందస్తు జాగ్రత్తగా ప్రముఖ పెట్రోనియో అల్వారెజ్ ఫెస్టివల్&zwnj;ను కూడా వాయిదా వేశారు.&lt;/p&gt;&lt;p&gt;అలాగే, పెరీరా నగరంలో పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. అక్కడ ప్లాజా బొలీవర్ వద్ద ఉన్న ఏడు అంతస్తుల భవనం నేలమట్టమైంది. కార్లు శిథిలాల కింద నలిగిపోయాయి. ఒక్క పెరీరా నగరంలోనే 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు స్పష్టం చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పెరీరా నగరంలో కొండ ప్రాంతాల నుంచి సిటీ సెంటర్&zwnj;కు ప్రయాణించడానికి కేబుల్ కార్లు వాడుతుంటారు. భూకంపం వచ్చిన సమయంలో కేబుల్ కార్లు గాల్లోనే ఆగిపోయాయి. దాంతో అందులో ఉన్న 16 మంది ప్రయాణికులు సుమారు 6 గంటల పాటు గాల్లోనే భయం భయంగా చిక్కుకుపోయారు.&lt;/p&gt;&lt;p&gt;సహాయక బృందాలు మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. భద్రతా తనిఖీలు పూర్తయ్యే వరకు కేబుల్ కార్ సేవలన్నీ నిలిపివేశారు. మానిజాలెస్ నగరంలో కూడా కేబుల్ కార్ వ్యవస్థ దెబ్బతినడంతో సేవలు ఆపివేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కొలంబియాలో సహాయక చర్యల కోసం అమెరికా ప్రభుత్వం 15.5 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఆహారం, తాత్కాలిక నివాసాలు, రక్షణ కొరకు ఈ నిధులను ఉపయోగిస్తారు. కొలంబియన్ ప్రెసిడెంట్ అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా నేరుగా అత్యవసర చర్యలను పర్యవేక్షిస్తున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ప్రసిద్ధ గాయని కరోల్ జి తన 'కాన్ కోరా' ఫౌండేషన్ ద్వారా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. మరో అంతర్జాతీయ పాప్ స్టార్ షకీరా కూడా విచారం వ్యక్తం చేస్తూ బాధితులకు తన సానుభూతి తెలిపారు.&lt;/p&gt;View this post on Instagram&lt;p&gt;A post shared by Global Empowerment Mission (@globalempowermentmission)&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;కొలంబియా భూకంపం: జియాలజిస్టులు ఏమంటున్నారు?&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం.. పసిఫిక్ మహాసముద్రంలోని నాజ్కా ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్ కిందకు నెట్టబడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇది భూమి అంతర్భాగంలో 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతులో జరిగింది. గతంలో వెనిజులాలో వచ్చిన భూకంపాల కంటే ఇది పూర్తిగా వేరైన భూగర్భ ప్రక్రియ అని నిపుణులు వివరించారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/colombia-earthquake-7-4-magnitude-quake-hits-colombia-buildings-collapse-airports-shut-as-death-toll-rises-above-132-8nw0pa6"/>
        </item>
        <item>
            <title><![CDATA[Donald Trump: మ‌రో కొత్త పంచాయ‌తీ మొద‌లు పెట్టిన ట్రంప్‌.. హార్మోజ్ మాదే అంటూ ప్ర‌క‌ట‌న]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/donald-trump-trump-claims-hormuz-strait-as-us-territory-shares-new-map-96v9mif</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/donald-trump-trump-claims-hormuz-strait-as-us-territory-shares-new-map-96v9mif</guid>
            <pubDate>Tue, 18 Aug 2026 21:17:31 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Donald Trump: అమెరికా, ఇరాన్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. హార్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేసిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kvc8bxxppxbpd8hve7c86ybg,imgname-us-iran-peace-deal-hormuz-strait-300-billion-fund-nuclear-weapons-ban-sanctions-relief-00-1781749118902.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Donald Trump: అమెరికా, ఇరాన్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. హార్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేసిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హోర్ముజ్ జలసంధి పూర్తిగా తమ అధీనంలో ఉందని ట్రంప్ కొంతకాలంగా చెబుతున్నారు. తాజాగా ఈ ప్రాంతాన్ని అమెరికాకు చెందిన భూభాగంగా ప్రకటించే ఆలోచన కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.విలేకరులతో మాట్లాడుతూ హార్ముజ్&zwnj;ను అమెరికా ప్రాంతంగా ప్రకటించాలన్న ఆలోచన మంచిదేనని ట్రంప్ అన్నారు. ఇప్పటికే అక్కడ అమెరికా నియంత్రణ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా హార్ముజ్&zwnj;ను అమెరికాకు చెందిన ప్రాంతంగా ప్రకటిస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా షేర్ చేసిన మ్యాప్&zwnj;లో హార్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా చూపించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హోర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికాతో చర్చలు కొనసాగుతున్నప్పటికీ జలసంధిని తెరవడంపై ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. అమెరికా తన హామీలను అమలు చేసే వరకు హోర్ముజ్&zwnj;ను తెరవబోమని ఇరాన్ నేతలు చెబుతున్నారు. అమెరికా నౌకాదళ చర్యలను తగ్గించాలని, చమురు వాణిజ్యంపై విధించిన ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. విదేశాల్లో నిలిచిపోయిన తమ ఆస్తులను విడుదల చేయాలని కూడా కోరుతోంది. మరోవైపు అమెరికా మాత్రం హార్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌకా రవాణాకు స్వేచ్ఛగా ఉండాలని పట్టుబడుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని చమురు, గ్యాస్ సరఫరాలో ఈ జలసంధికి కీలక పాత్ర ఉంది. ప్రపంచంలోని అనేక దేశాలకు ఈ ప్రాంతం నుంచి చమురు, ఇంధనం సముద్ర మార్గంలో చేరుతుంది. అందుకే హార్ముజ్&zwnj;లో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడితే ప్రపంచ ఇంధన మార్కెట్&zwnj;పై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మార్గంలో నౌకల రాకపోకలు తగ్గితే చమురు సరఫరాపై ఆందోళనలు పెరుగుతాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో హార్ముజ్ జలసంధి కీలక అంశంగా మారింది. హార్ముజ్&zwnj;ను తెరవడం, ఇరాన్&zwnj;పై అమెరికా ఆంక్షలు, అమెరికా నౌకాదళ చర్యలు, ఇరాన్ అణు కార్యక్రమం వంటి అంశాలపై ఇరుదేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ముందుగా అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించాలని, ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతోంది. అమెరికా మాత్రం ఇరాన్&zwnj;పై ఒత్తిడిని కొనసాగిస్తూ హార్ముజ్&zwnj;ను పూర్తిగా తెరవాలని డిమాండ్ చేస్తోంది. ఇరువైపులా కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు ముందుకు సాగడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ షేర్ చేసిన మ్యాప్ వివాదాన్ని మరింత పెంచింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హార్ముజ్ జలసంధి మూసివేత లేదా నౌకా రవాణాపై ఆంక్షలు కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. చమురు రవాణాలో అంతరాయం ఏర్పడితే సరఫరా తగ్గి ధరలు పెరగవచ్చు. చమురు ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు, ఇంధన ధరలు, నౌకలకు సంబంధించిన భీమా వ్యయాలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం కేవలం చమురు మార్కెట్&zwnj;కే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడొచ్చు. అందుకే అమెరికా&ndash;ఇరాన్ మధ్య హోర్ముజ్ అంశంపై నెలకొన్న వివాదాన్ని ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరుదేశాల మధ్య రాజీ కుదిరి నౌకా రవాణా సాధారణ స్థితికి వస్తుందా? లేక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అనేది ఇప్పుడు కీలకంగా మారింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/donald-trump-trump-claims-hormuz-strait-as-us-territory-shares-new-map-96v9mif"/>
        </item>
        <item>
            <title><![CDATA[Nepal Disaster: 30 ఏళ్లలో 1500 సార్లు వరదలు.. నేపాల్‌ను ప్రకృతి ఎందుకు టార్గెట్ చేస్తోంది?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/nepal-disaster-1500-floods-in-30-years-why-nepal-faces-deadly-floods-and-landslides-explained-b3ecnd3</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/nepal-disaster-1500-floods-in-30-years-why-nepal-faces-deadly-floods-and-landslides-explained-b3ecnd3</guid>
            <pubDate>Sun, 30 Aug 2026 09:56:24 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Nepal Disaster: నేపాల్ లో వరదల కారణంగా ఇప్పటికే వందల మంది చనిపోయారు. వేల మంది గల్లంతయ్యారు. అంచనా వేయలేనంతగా ఆస్తినష్టం జరిగింది. అయితే, నేపాల్&zwnj;లో ఇలా పదే పదే వరదలు, కొండచరియల విధ్వంసానికి అసలు కారణాలేంటి? గత 30 ఏళ్ల డేటా ఏం చెబుతోంది?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m18egvx4n3bdycsasmct71tf,imgname-nepal-disaster-1788063805347.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Nepal Disaster: నేపాల్ లో వరదల కారణంగా ఇప్పటికే వందల మంది చనిపోయారు. వేల మంది గల్లంతయ్యారు. అంచనా వేయలేనంతగా ఆస్తినష్టం జరిగింది. అయితే, నేపాల్&zwnj;లో ఇలా పదే పదే వరదలు, కొండచరియల విధ్వంసానికి అసలు కారణాలేంటి? గత 30 ఏళ్ల డేటా ఏం చెబుతోంది?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హిమాలయ పర్వత ప్రాంతమైన నేపాల్&zwnj;లో మరోసారి భారీ జలప్రళయం ముంచెత్తింది. చైనా-టిబెట్ సరిహద్దును ఆనుకుని ఉన్న ఉత్తర నేపాల్&zwnj; ప్రాంతంలో సంభవించిన ఘోర ప్లాష్ ఫ్లడ్స్ తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. ఈ విధ్వంసంలో ఇప్పటివరకు సుమారు 675 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 3 వేల మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 288 మంది భారతీయులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నేపాల్&zwnj;లో ఇలాంటి విపత్తులు రావడం ఇదే మొదటిసారి ఏమీ కాదు. గత 30 ఏళ్ల గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దాదాపు 1,500కు పైగా భారీ వరద సంఘటనలు ఇక్కడ నమోదయ్యాయి. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 4,200 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నిమిషాల్లో ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయేంత స్థాయిలో ఇక్కడ ప్రళయం ఎందుకు వస్తోంది? పదే పదే కొండచరియలు విరిగిపడటానికి, వరదలు రాడానికి అసలు కారణాలు ఏంటి? ఈ అంశాలు గమనిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణుల్లో నేపాల్ ఉంది. ఇవి భౌగోళికంగా చాలా లేత పర్వతాలు (యంగ్ మౌంటేన్స్). అందుకే ఇక్కడి నేల, రాళ్ల అమరిక చాలా లూజ్&zwnj;గా ఉంటుంది. వాలు ఎక్కువగా ఉండటం వల్ల చిన్నపాటి వర్షం పడినా నేల సులభంగా జారిపోయి కొండచరియలు విరిగిపడతాయి. దీనికి తోడు దక్షిణాసియా మాన్సూన్ ఈ కొండలను తాకినప్పుడు తక్కువ సమయంలో భారీ వర్షాలు పడతాయి. ఇటీవల క్లౌడ్ బరస్ట్&zwnj;లు పెరగడంతో నదులు ఒక్కసారిగా ఉప్పొంగి ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయాల్లోని మంచు నదులు వేగంగా కరిగిపోతున్నాయి. దీనివల్ల మంచు కొండల కింద పెద్ద పెద్ద సరస్సులు ఏర్పడుతున్నాయి. నీటి ఒత్తిడి ఎక్కువై ఈ సరస్సుల గట్లు తెగిపోయినప్పుడు 'గ్లేషియల్ లేక్ అవుట్&zwnj;బర్స్ట్ ఫ్లడ్' (GLOF) ఏర్పడుతుంది. ఈ నీరు ఒక్కసారిగా కింద ఉన్న గ్రామాలపై విరుచుకుపడుతుంది. నేపాల్&zwnj;లోని ప్రధాన నదులైన కోషి, గండక్, కర్నాలి ఒకేసారి ఉప్పొంగడం, ప్రవాహానికి కొండచరియల మట్టి అడ్డుపడటంతో ఈ ప్రమాద తీవ్రత రెట్టింపు అవుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నేపాల్ అత్యంత ప్రమాదకరమైన సిస్మిక్ అంటే భూకంప జోన్&zwnj;లో ఉంది. 2015లో వచ్చిన భీకర భూకంపంతో పాటు ఇక్కడ పదే పదే వచ్చే ప్రకంపనలు పర్వతాల లోపలి నిర్మాణాన్ని బాగా బలహీనపరిచాయి. మరోవైపు నేపాల్&zwnj;లో 80 శాతానికి పైగా పర్వత ప్రాంతాలే ఉంటాయి. రోడ్లు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, భవనాల నిర్మాణం కోసం విపరీతంగా అడవులను నరికివేస్తున్నారు. చెట్లు లేకపోవడంతో మట్టి పట్టు కోల్పోయి, వర్షపు నీరు నేరుగా నదుల్లోకి చేరి ఆకస్మిక వరదలకు దారితీస్తోంది. ప్రకృతి కోపానికి మానవ తప్పిదాలు తోడవడమే ఈ వరుస ప్రళయాలకు మరో కారణంగా ఉంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/nepal-disaster-1500-floods-in-30-years-why-nepal-faces-deadly-floods-and-landslides-explained-b3ecnd3"/>
        </item>
        <item>
            <title><![CDATA[మురికి కాలువ కోసం భూమి తవ్వుతుండ‌గా అద్భుతం.. బ‌య‌ట‌ప‌డ్డ‌ రూ. 98 కోట్ల నిధి]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/viral-news-belgium-treasure-18-year-old-finds-rs-98-crore-gold-treasure-during-sewer-work-g77oro7</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/viral-news-belgium-treasure-18-year-old-finds-rs-98-crore-gold-treasure-during-sewer-work-g77oro7</guid>
            <pubDate>Sun, 16 Aug 2026 19:03:26 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Viral News: బెల్జియంలో ఓ 18 ఏళ్ల యువకుడికి ఊహించని అదృష్టం ఎదురైంది. సాధారణంగా చేపట్టిన మురుగునీటి కాలువ పనుల్లో భాగంగా భూమిని తవ్వుతుండగా భారీ మొత్తంలో బంగారం, అరుదైన నాణేలు బయటపడ్డాయి. ఇప్పుడీ వార్త నెట్టింట వైర&zwnj;ల్ అవుతోంది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m059sqvcejq5xw04cb44vvgr,imgname-viral-news--3--1786884448108.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Viral News: బెల్జియంలో ఓ 18 ఏళ్ల యువకుడికి ఊహించని అదృష్టం ఎదురైంది. సాధారణంగా చేపట్టిన మురుగునీటి కాలువ పనుల్లో భాగంగా భూమిని తవ్వుతుండగా భారీ మొత్తంలో బంగారం, అరుదైన నాణేలు బయటపడ్డాయి. ఇప్పుడీ వార్త నెట్టింట వైర&zwnj;ల్ అవుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బెల్జియంలోని సింట్-గిల్లిస్-డెండర్&zwnj;మొండే ప్రాంతంలో మురుగునీటి పైపులను మార్చే పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం రాజధాని బ్రస్సెల్స్&zwnj;కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిర్మాణ పనుల్లో భాగంగా కార్మికులు భూమిని తవ్వుతుండగా అనుకోకుండా ఓ భారీ నిధి బయటపడింది. ఈ సంపదలో బంగారు నాణేలు, బంగారు ముక్కలు, నంబర్లు ఉన్న బంగారు బార్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు 9 మిలియన్ యూరోలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంపద బయటపడటంలో ప్రధాన పాత్ర పోషించింది 18 ఏళ్ల కోబే అనే యువకుడు. సెలవుల్లో తాత్కాలికంగా నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న అతడు.. మంగళవారం తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఈ నిధిని గుర్తించాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భూమిలో ఏదో వస్తువు కనిపించడంతో కోబే తొలుత వాటిని సాధారణ నాణేలుగా భావించాడు. దగ్గరగా పరిశీలించిన తర్వాత అక్కడ బంగారు బార్ కూడా ఉన్నట్లు గుర్తించాడు. అప్పుడే అక్కడ బయటపడింది సాధారణ వస్తువు కాదని అతడికి అర్థమైంది. ఈ విషయాన్ని అతడు బెల్జియం మీడియాతో పంచుకున్నాడు. మొదట కనిపించినప్పుడు అవి ఒక యూరో నాణేలేమో అనుకున్నానని.. ఆ తర్వాత బంగారు బార్ కనిపించడంతో విషయం చాలా పెద్దదని తెలిసిందని చెప్పాడు. కోబే తన సహచరులతో కలిసి అక్కడ పనిచేస్తున్నాడు. ఇంత భారీ సంపద తమ కళ్ల ముందుకు రావడం వారికి కూడా ఊహించని అనుభవంగా మారింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బయటపడిన నిధి ఓ పురాతన భవనంతో సంబంధం కలిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో 19వ శతాబ్దం చివర్లో బీరు తయారీ వ్యాపారి థియోఫిలస్ వాన్ అస్చే కోసం ఓ భారీ భవనం నిర్మించారు. ఆ భవనంలోని ఓ గోడలో ఇటుకలతో మూసివేసిన నేలమాళిగ ప్రాంతంలో ఈ సంపద దొరికింది. ఓ సంచిలో భద్రపరిచి, గోడలో దాచినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఎవరైనా కావాలనే ఈ బంగారాన్ని అక్కడ రహస్యంగా ఉంచి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో బీరు తయారీ కార్యకలాపాలు 1899లో ప్రారంభమయ్యాయి. అవి 1970 వరకు కొనసాగాయి. ప్రస్తుతం ఆ పురాతన భవనాన్ని పూర్తిగా పునరుద్ధరిస్తున్నారు. సామాజిక సంక్షేమ సంస్థ CAW ఊస్ట్&zwnj;-వ్లాండెర్న్ అక్కడ కొత్త కార్యాలయాలు, నివాస సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టింది.&lt;/p&gt;&lt;p&gt;ఇంత&zwnj;కీ బంగారం ఎవ&zwnj;రిది.?&lt;/p&gt;&lt;p&gt;భారీ నిధి బయటపడటంతో అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బంగారం, నాణేలను సురక్షిత ప్రాంతానికి తరలించి భద్రపరిచారు. ఇప్పుడు ఈ సంపద అసలు ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో ఎవరైనా దాన్ని దొంగిలించి అక్కడ దాచారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంపదపై హక్కు ఎవరికి ఉంటుందన్నది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు, ప్రస్తుతం భవనాన్ని పునరుద్ధరిస్తున్న సంక్షేమ సంస్థ, గతంలో ఆ భవనాన్ని కలిగి ఉన్న వాన్ అస్చే కుటుంబ వారసులు.. ఇలా పలువురు తమ హక్కును కోరే అవకాశం ఉంది. అయితే బంగారం నేరాలకు సంబంధించినదా? దొంగతనంతో సంబంధం ఉందా? అనే విషయాలు ముందుగా తేలాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాతే చట్టపరంగా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇంత భారీ సంపద దొరికిందని తెలిసిన వెంటనే.. దాన్ని గుర్తించిన 18 ఏళ్ల కోబేకు మొత్తం బంగారం దక్కుతుందా అనే ఆసక్తి మొదలైంది. అయితే బెల్జియం చట్టాల ప్రకారం ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోలేరు. నిధికి అసలు యజమాని ఎవరైనా ఉంటే వారు ముందుకు వచ్చేందుకు కనీసం ఐదేళ్ల వరకు వేచి చూడాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ గడువులో సరైన యజమాని లేదా వారసులు ఎవరూ ముందుకు రాకపోతే తదుపరి చట్టపరమైన ప్రక్రియ ప్రారంభమవుతుంది. తనకు దొరికిన సంపదను దాచుకునే ఉద్దేశం లేదని కోబే కూడా చెప్పాడు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం దొరికినప్పుడు దాన్ని అధికారులకు అప్పగించాల్సిందేనని తమకు తెలుసని పేర్కొన్నాడు. అయితే భవిష్యత్తులో తనకు ఏదైనా ఫైండర్ రివార్డ్ లభిస్తుందేమోనని ఆశాభావం వ్యక్తం చేశాడు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/viral-news-belgium-treasure-18-year-old-finds-rs-98-crore-gold-treasure-during-sewer-work-g77oro7"/>
        </item>
        <item>
            <title><![CDATA[Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 20 మంది మృతి]]></title>
            <link>https://telugu.asianetnews.com/international/earthquake-rocks-colombia-causing-widespread-damage-articleshow-h2t81tk</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/international/earthquake-rocks-colombia-causing-widespread-damage-articleshow-h2t81tk</guid>
            <pubDate>Mon, 10 Aug 2026 21:25:21 +0530</pubDate>
            <description><![CDATA[దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్&zwnj;పై దీని తీవ్రత 7.4గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ భూకంపం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది.]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kzp1fzb3y7q5y82dqp9k4crj,imgname-g2b9fd96ae1345126a4fd65b0b7ba772f20b86080ad37ecda66c2cf5b65c----tumisu----pixabay-1786372423011.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Earthquake :&lt;/strong&gt; దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్&zwnj;పై దీని తీవ్రత 7.4గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా 20 మంది మరణించినట్లు&hellip; వేలాదిమంది గాయపడినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద ఇంకా క్షతగాత్రులు చిక్కుకుని ఉండే అవకాశాలున్నాయి&hellip; కాబట్టి మరణాల సంఖ్య పెరగవచ్చిన అంతర్జాతీయ మీడియా పేర్కొంటొంది.&lt;/p&gt;&lt;h2&gt;వెనిజులా, ఈక్వెడార్ లోనూ కంపించిన భూమి&lt;/h2&gt;&lt;p&gt;ఈ భూకంపం వల్ల కొలంబియాలోని చోకో ప్రావిన్స్&zwnj;లో తీవ్ర నష్టం జరిగింది. ఆస్తినష్టమే కాదు ప్రాణనష్టం కూడా జరిగింది. రాజధాని బోగోటాలోనూ భూమి కంపించింది&hellip; కానీ ఇక్కడ తీవ్రత అంతగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పక్క దేశాలైన వెనిజులా, ఈక్వెడార్&zwnj;లలో కూడా ప్రకంపనలు వచ్చాయి.&lt;/p&gt;&lt;p&gt;భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:04 గంటలకు ఈ భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే, కొలంబియా జియోలాజికల్ సర్వీస్ రెండూ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్&zwnj;పై 7.4గా నిర్ధారించాయి. సాన్ జోస్ డెల్ పామర్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. పశ్చిమ కొలంబియాలో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని సిటీ మేయర్ ధృవీకరించారు. కాలి నగరంలో 20 భవనాలు కూలిపోయాయని, శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారని మేయర్ తెలిపారు.&lt;/p&gt;&lt;h2&gt;నిలిచిన విమాన సర్వీసులు&lt;/h2&gt;&lt;p&gt;పెరీరా, మణిజాలెస్, క్విబ్డో, అర్మేనియా, కార్టాగో, బ్యూనావెంచురా నగరాల్లోని విమానాశ్రయాలు కూడా దెబ్బతిన్నాయని కొలంబియా ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/international/earthquake-rocks-colombia-causing-widespread-damage-articleshow-h2t81tk"/>
        </item>
        <item>
            <title><![CDATA[ప్రపంచ ప్రఖ్యాత సరస్సు పేరు మార్చిన ట్రంప్... ఎందుకో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/trump-renames-lake-ontario-why-did-he-order-it-to-be-called-lake-america-iuzigmo</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/trump-renames-lake-ontario-why-did-he-order-it-to-be-called-lake-america-iuzigmo</guid>
            <pubDate>Sat, 29 Aug 2026 14:02:05 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;నిత్యం ఏదో ఒక వివాదంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు వినిపిస్తుంటుంది. తాజాగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఓ సరస్సు పేరును మార్చి వార్తల్లో నిలిచారు. సరస్సుపై అతడి కన్ను ఎందుకు పడిందంటే&hellip;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kwb8xmffj54xk1mrkm2f3kee,imgname-gurudongmar-lake-area-1782789886447.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;నిత్యం ఏదో ఒక వివాదంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు వినిపిస్తుంటుంది. తాజాగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఓ సరస్సు పేరును మార్చి వార్తల్లో నిలిచారు. సరస్సుపై అతడి కన్ను ఎందుకు పడిందంటే&hellip;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కెనడాతో వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రఖ్యాత 'ఒంటారియో సరస్సు' (Lake Ontario) పేరును &quot;లేక్ అమెరికా&quot;గా మారుస్తూ అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా-కెనడా సంబంధాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో అయితే ఈ విషయంపై మీమ్స్, జోకులు పేలుతున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;ఈ కొత్త పేరు కేవలం అమెరికా ప్రభుత్వ రికార్డులకు మాత్రమే వర్తిస్తుంది. కెనడా గానీ, అంతర్జాతీయ సంస్థలు గానీ ఈ పేరును వాడాల్సిన అవసరం లేదు. ఒంటారియో సరస్సులో 52 శాతం కెనడా భూభాగంలో ఉండగా, మిగిలిన ప్రాంతం అమెరికాలోని న్యూయార్క్&zwnj;లో ఉంది. &quot;ఒంటారియో సరస్సు పేరును తక్షణమే 'లేక్ అమెరికా'గా మారుస్తున్నాం. ఈ విషయం గురించి నేను చాలా కాలంగా ఆలోచిస్తున్నాను&quot; అని ట్రంప్ మీడియాకు తెలిపారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే 'ఎక్స్' (ట్విట్టర్) సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్&zwnj;ఫామ్&zwnj;లలో మీమ్స్ వరద పారింది. కెనడా జాతీయ పక్షులైన కెనడియన్ గీస్&zwnj;ను (Canadian Geese) ఇకపై &quot;డొనాల్డ్ డక్స్&quot; (Donald Ducks) అని పిలవాలా? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. &quot;సరస్సు పేరునే 'లేక్ అమెరికా' అని మార్చాక, అక్కడున్న కెనడియన్ బాతులను 'డొనాల్డ్ డక్స్' అని పిలవడమే కరెక్ట్!&quot; అంటూ యూజర్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ట్రంప్ నిర్ణయాన్ని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా వ్యతిరేకించారు. &quot;కెనడా, అమెరికా దేశాలు పుట్టకముందు నుంచే ఈ సరస్సుకు ఒక చరిత్ర ఉంది. వాస్తవం ఏంటంటే, దీనిని అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పటికీ 'ఒంటారియో సరస్సు' అనే పిలుస్తారు&quot; అని ఆయన ఘాటుగా స్పందించారు. అమెరికాలోనూ ట్రంప్ చర్యపై వ్యతిరేకత వ్యక్తమైంది.&lt;/p&gt;&lt;p&gt;క్యాథీ హోచుల్ (న్యూయార్క్ గవర్నర్) : న్యూయార్క్ ఎప్పటికీ ఈ కొత్త పేరుతో పిలవదని స్పష్టం చేశారు.&lt;/p&gt;&lt;p&gt;ఫిల్ స్కాట్ (వెర్మాంట్ గవర్నర్) : అధ్యక్షుడి నిర్ణయం &quot;చిల్లరగా, నిరాశపరిచేలా ఉంది&quot; అని వ్యాఖ్యానించారు.&lt;/p&gt;&lt;p&gt;బెర్నీ శాండర్స్ (సెనెటర్) : అమెరికా ప్రజలకు ఉచిత వైద్యం, విద్య, ఇళ్లు కావాలి కానీ, సరస్సుల పేర్లు మార్చడం కాదని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ముదిరిన అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఈ పేరు మార్పు వివాదం రెండు దేశాల మధ్య జరుగుతున్న తీవ్రమైన ఆర్థిక యుద్ధంలో భాగమే. ఆగస్టులో చర్చలు విఫలమైన తర్వాత, అమెరికా సుమారు $20 బిలియన్ల విలువైన కెనడా వస్తువులపై (వైన్, పాల ఉత్పత్తులు, ఫర్నిచర్, సిమెంట్, హాకీ పరికరాలు మొదలైనవి) ఏకంగా 50% సుంకం (Tariff) విధించింది. అమెరికా చర్యను అన్యాయమన్న కెనడా, ప్రతీకారంగా 15% నుంచి 50% వరకు సుంకాలను ప్రకటించింది. ఇవి సెప్టెంబర్ 8, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి తోడు జనవరి 1, 2027 నుంచి కెనడా వాహనాలు, ఉక్కుపై సుంకాన్ని 50%కి పెంచుతామని ట్రంప్ హెచ్చరించడంతో సరిహద్దుల్లోని ఇరు దేశాల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/trump-renames-lake-ontario-why-did-he-order-it-to-be-called-lake-america-iuzigmo"/>
        </item>
        <item>
            <title><![CDATA[Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/nepal-flash-floods-death-toll-rises-to-903-over-4200-missing-m84qc1m</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/nepal-flash-floods-death-toll-rises-to-903-over-4200-missing-m84qc1m</guid>
            <pubDate>Mon, 31 Aug 2026 15:08:07 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Nepal Flash Floods: నేపాల్&zwnj;లో సంభవించిన ఘోర వరదల్లో మరణాల సంఖ్య 903కు చేరింది. 4,200 మందికి పైగా గల్లంతవ్వగా, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంకా వరద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1b892ynbry1qv1dp3074w4r,imgname-20260829269l-1788157922261.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Nepal Flash Floods: నేపాల్&zwnj;లో సంభవించిన ఘోర వరదల్లో మరణాల సంఖ్య 903కు చేరింది. 4,200 మందికి పైగా గల్లంతవ్వగా, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంకా వరద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నేపాల్-టిబెట్ సరిహద్దు వద్ద ఎత్తైన ప్రాంతంలో హిమపాతం, మంచు కొండచరియలు విరిగిపడటంతో భోటే కోశి నది ఉగ్రరూపం దాల్చింది. సరిహద్దు దాటి విరుచుకుపడిన ఈ మెరుపు వరదలు, బురద నేపాల్&zwnj;లోని పలు జిల్లాలను పూర్తిగా ముంచెత్తాయి. వరదల ధాటికి అనేక గ్రామాలు, రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు అందిన అధికారిక లెక్కల ప్రకారం మరణించిన వారి సంఖ్య 903కి చేరినట్లు నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ (NDRRMA) ప్రకటించింది. దట్టమైన బురద, రాయి కలిసి ముంచెత్తడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 4,247 మంది గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. అందులో 3,655 మంది నేపాల్ పౌరులు ఉండగా, 592 మంది విదేశీయులు ఉన్నారు. అలాగే 85 మందికి పైగా భద్రతా సిబ్బంది కూడా వరదల్లో గల్లంతయ్యారు.&lt;/p&gt;&lt;p&gt;వివిధ జిల్లాల్లో నమోదైన మరణాల వివరాలు:&lt;/p&gt;&lt;p&gt;&bull; చిత్వాన్: 272&lt;/p&gt;&lt;p&gt;&bull; నవల్ పరాసి (ఈస్ట్): 207&lt;/p&gt;&lt;p&gt;&bull; నవల్ పరాసి (వెస్ట్): 151&lt;/p&gt;&lt;p&gt;&bull; నువాకోట్: 95&lt;/p&gt;&lt;p&gt;&bull; గోర్ఖా: 62&lt;/p&gt;&lt;p&gt;&bull; ధాడింగ్: 55&lt;/p&gt;&lt;p&gt;&bull; తనహున్: 37&lt;/p&gt;&lt;p&gt;&bull; రసువా: 24&lt;/p&gt;&lt;p&gt;ఇప్పటివరకు దాదాపు 10,451 మందిని రెస్క్యూ టీమ్&zwnj;లు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఘోర వరదల్లో పలువురు భారతీయ యాత్రికులు కూడా చిక్కుకున్నారు. అయితే, టిబెట్ నుంచి కాట్మండు చేరుకోవడానికి ప్రయత్నించిన 20 మంది తెలుగు యాత్రికులు సురక్షితంగా కాట్మండు చేరుకున్నారని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, ఆంధ్రప్రదేశ్&zwnj;కు చెందిన మరో 14 మంది యాత్రికుల ఆచూకీ ఇంకా దొరకలేదని, వారి కోసం రెస్క్యూ టీమ్&zwnj;లు ముమ్మరంగా గాలిస్తున్నాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వరదల వల్ల సుమారు 933 మంది హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కార్మికులు టన్నెళ్లలో చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా రసువా జిల్లాలోని త్రిశూలి-3A, చిలిమ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల టన్నెళ్లలో కార్మికులు చిక్కుకున్నారు. భారత స్పెషల్ టన్నెల్ రెస్క్యూ టీమ్&zwnj;లు, విదేశీ నిపుణులు, నేపాల్ సైన్యం వీరిని రక్షించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. టన్నెల్&zwnj;లోకి ఎయిర్ పైపులు పంపి, డ్రిల్లింగ్ యంత్రాల సహాయంతో ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నేపాల్ విపత్తు తీవ్రత దృష్ట్యా దాదాపు 20,000 మంది భద్రతా సిబ్బంది, 14 మిలిటరీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. బాధితులకు తక్షణ వైద్యాన్ని అందించడానికి 6 స్పెషల్ సర్జికల్ టీమ్&zwnj;లు పనిచేస్తున్నాయి. వరదల వల్ల 40 కి పైగా సస్పెన్షన్ బ్రిడ్జిలు, 25 మైళ్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు, సోషల్ మీడియాలో ఏఐ క్రియేట్ చేసిన నకిలీ వీడియోలు, భయాందోళనలు రేకెత్తించే ప్రచారాలను అడ్డుకునేందుకు నేపాల్ ప్రెస్ కౌన్సిల్ కఠిన చర్యలు చేపట్టింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/nepal-flash-floods-death-toll-rises-to-903-over-4200-missing-m84qc1m"/>
        </item>
        <item>
            <title><![CDATA[USA: ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంచలన నిర్ణయం.. అమెరికా వెళ్లే భార‌తీయుల‌కు గ‌ట్టి షాక్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/usa-trump-administration-shocks-indians-us-visa-appointments-temporarily-rescheduled-worldwide-mp8dfzy</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/usa-trump-administration-shocks-indians-us-visa-appointments-temporarily-rescheduled-worldwide-mp8dfzy</guid>
            <pubDate>Thu, 27 Aug 2026 15:00:40 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేష&zwnj;న్ విధానంలో మ&zwnj;రో కీల&zwnj;క నిర్ణ&zwnj;యం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా వీసా దరఖాస్తుదారుల్లో ఆందోళన పెరిగింది. ఇంత&zwnj;కీ అమెరికా తీసుకున్న నిర్ణ&zwnj;యం ఏంటి.? దీంతో ఏం జ&zwnj;ర&zwnj;గ&zwnj;నుంది.?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m117m76k1vqger1ae7gsabya,imgname-usa--3--1787821694163.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేష&zwnj;న్ విధానంలో మ&zwnj;రో కీల&zwnj;క నిర్ణ&zwnj;యం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా వీసా దరఖాస్తుదారుల్లో ఆందోళన పెరిగింది. ఇంత&zwnj;కీ అమెరికా తీసుకున్న నిర్ణ&zwnj;యం ఏంటి.? దీంతో ఏం జ&zwnj;ర&zwnj;గ&zwnj;నుంది.?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా విదేశాంగ శాఖ అధికారుల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూఎస్ ఎంబసీలు, కాన్సులేట్లలో పనిచేస్తున్న కాన్సులర్ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే షెడ్యూల్ చేసిన కొన్ని వీసా ఇంటర్వ్యూలను మార్చే ప్రక్రియ మొదలైంది. అయితే వీసాల జారీ పూర్తి నిలిపివేసిన&zwnj;ట్లు కాదు. ముఖ్యంగా ఎఫ్-1 విద్యార్థి వీసా, హెచ్-1బీ వంటి వర్క్ వీసాల దరఖాస్తు ప్రక్రియ మొత్తాన్ని అమెరికా ప్రభుత్వం నిలిపివేసినట్లు సమాచారం లేదు. ప్రధానంగా అపాయింట్&zwnj;మెంట్ తేదీల్లో మార్పులు, ఇంటర్వ్యూ షెడ్యూల్&zwnj;లో అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే ఇంటర్వ్యూ తేదీ పొందిన కొందరు దరఖాస్తుదారులకు కూడా అపాయింట్&zwnj;మెంట్ రద్దు చేసి, కొత్త తేదీని తర్వాత తెలియజేస్తామని సమాచారం అందుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వీసా దరఖాస్తులను మరింత లోతుగా పరిశీలించేందుకు అమెరికా కాన్సులర్ అధికారులకు కొత్త శిక్షణ ఇస్తున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా అమెరికాకు వెళ్లాల&zwnj;నుకుంటున్న వ్యక్తులు భవిష్యత్తులో అక్కడి ప్రభుత్వ ప్రజా సంక్షేమ ప్రయోజనాలపై ఆధారపడే అవకాశం ఉందా అనే అంశాన్ని అంచనా వేయడంపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుదారుల నేపథ్యం, వారి ఆర్థిక పరిస్థితులు, అమెరికా వెళ్లే ఉద్దేశం, అక్కడ ఉండే కాలం వంటి అంశాలను మరింత జాగ్రత్తగా పరిశీలించే విధానానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ శిక్షణ ఎంతకాలం కొనసాగుతుంది, సాధారణ వీసా అపాయింట్&zwnj;మెంట్లు ఎప్పటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయనే దానిపై మాత్రం స్పష్టమైన గడువు ప్రకటించలేదు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తాజా పరిణామం భారతీయులపై ఎక్కువ ప్ర&zwnj;భావం చూప&zwnj;నుంది. అమెరికా ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులు, సాఫ్ట్&zwnj;వేర్&zwnj; నిపుణులు, ఇతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీసా ఇంటర్వ్యూ తేదీలు ఆలస్యమైతే యూనివర్సిటీల్లో చేరే తేదీలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో అమెరికాలో ఉద్యోగం ప్రారంభించాల్సిన వారికి కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగంలో చేరే తేదీ, ప్రయాణ ప్రణాళిక, కుటుంబ సభ్యుల రీలొకేషన్ వంటి అంశాలను వీసా అపాయింట్&zwnj;మెంట్ ఆలస్యం ప్రభావితం చేయొచ్చు.&lt;/p&gt;&lt;p&gt;అమెరికా హెచ్-1బీ వీసా వ్యవస్థలో భారతీయుల వాటా కూడా గణనీయంగా ఉంది. దీంతో టెక్నాలజీ రంగానికి చెందిన నిపుణులు తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం హెచ్-1బీ లేదా ఎఫ్-1 వీసాలను పూర్తిగా రద్దు చేయ&zwnj;లేదు. కేవ&zwnj;లం అపాయింట్&zwnj;మెంట్ ప్రక్రియలో మార్పులు మాత్ర&zwnj;మే చేస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసలను అడ్డుకోవడంతో పాటు చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై కూడా కఠిన వైఖరి అవ&zwnj;లంభిస్తున్నారు. వీసాలు, గ్రీన్ కార్డుల పరిశీలనను కఠినతరం చేయడం, కొన్ని సందర్భాల్లో రాజకీయ కార్యకలాపాలు లేదా నిరసనలకు సంబంధించిన అంశాలను పరిశీలనలోకి తీసుకోవడం వంటి చర్యలు చర్చకు దారితీశాయి.&lt;/p&gt;&lt;p&gt;ఇటీవల పలు దేశాలకు చెందిన వలసదారులపై వీసా ఆంక్షలకు సంబంధించిన నిర్ణయాలు కూడా వివాదాస్పదమయ్యాయి. కొన్ని చర్యలకు వ్యతిరేకంగా అమెరికా కోర్టుల్లో న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరిపై మానవ హక్కుల సంస్థలు కూడా విమర్శలు చేస్తున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;వీసా స్క్రీనింగ్&zwnj;లో వివక్షకు అవకాశం ఉందని, వ్యక్తుల భావప్రకటన స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకోవడం ఆందోళనకరమని కొన్ని సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. అయితే అమెరికా ప్రభుత్వం మాత్రం దేశ భద్రత, ఇమ్మిగ్రేషన్ నియంత్రణ, ప్రజా ప్రయోజనాల పరిరక్షణే తమ చర్యల ప్రధాన ఉద్దేశమని చెబుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వీసా కోసం సిద్ధమవుతున్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు తాజా షెడ్యూల్ మార్పులను నిరంతరం పరిశీలించడం అవసరం. ఇప్పటికే అపాయింట్&zwnj;మెంట్ పొందినవారు తమ ఇమెయిల్, సంబంధిత వీసా పోర్టల్&zwnj;లో వచ్చే సమాచారాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. అపాయింట్&zwnj;మెంట్ రద్దయితే కొత్త తేదీకి సంబంధించిన సూచనలు అధికారిక మార్గాల్లోనే వస్తాయి. విద్యార్థులు యూనివర్సిటీ ప్రారంభ తేదీ, ప్రయాణ తేదీ, వీసా ఇంటర్వ్యూ తేదీ మధ్య తగిన సమయం ఉండేలా ప్రణాళిక చేసుకోవడం మంచిది. ఉద్యోగులైతే జాయినింగ్ డేట్, ప్రయాణ ఏర్పాట్లు, కుటుంబ సభ్యుల వీసా ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.&lt;/p&gt;&lt;p&gt;మొత్తంగా చూస్తే.. అమెరికా తాజా చర్య వీసా జారీని పూర్తిగా నిలిపివేయడం కంటే కాన్సులర్ పరిశీలన విధానాన్ని మరింత కఠినతరం చేసే ప్రక్రియలో భాగంగా కనిపిస్తోంది. అపాయింట్&zwnj;మెంట్&zwnj;ల రీషెడ్యూల్ కారణంగా తాత్కాలికంగా ఆలస్యాలు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ, ఎఫ్-1, హెచ్-1బీ వంటి వీసాలపై పూర్తిస్థాయి నిషేధం విధించినట్లు ప్రస్తుతానికి స్పష్టమైన సమాచారం లేదు. అమెరికా వెళ్లే ప్రణాళికలో ఉన్నవారు అధికారిక ప్రకటనలను ఆధారంగా చేసుకుని తదుపరి నిర్ణయాలు తీసుకోవడం అత్యంత కీలకం.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/usa-trump-administration-shocks-indians-us-visa-appointments-temporarily-rescheduled-worldwide-mp8dfzy"/>
        </item>
        <item>
            <title><![CDATA[Nepal Floods : నేపాల్ వరదల్లో చిక్కుకున్న సద్గురు టీమ్.. ఈ హీరోయిన్ సంగతేంటి?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/actress-manasi-parekh-safe-amid-nepal-floods-77-isha-pilgrims-missing-nz75243</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/actress-manasi-parekh-safe-amid-nepal-floods-77-isha-pilgrims-missing-nz75243</guid>
            <pubDate>Thu, 27 Aug 2026 14:02:42 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;నేపాల్&zwnj;లో ఆకస్మిక వరదల కారణంగా మానస సరోవర యాత్రకు వెళ్లిన ఈశా ఫౌండేషన్&zwnj;కు చెందిన 77 మంది యాత్రికులు గల్లంతయ్యారు. అయితే ఇదే యాత్రలో ఉన్న నటి మానసి పరేఖ్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1154d9kgjn1jyjt4pm8e85y,imgname-nepal-1787819078962.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;నేపాల్&zwnj;లో ఆకస్మిక వరదల కారణంగా మానస సరోవర యాత్రకు వెళ్లిన ఈశా ఫౌండేషన్&zwnj;కు చెందిన 77 మంది యాత్రికులు గల్లంతయ్యారు. అయితే ఇదే యాత్రలో ఉన్న నటి మానసి పరేఖ్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 160కి చేరింది. గల్లంతైన వారి సంఖ్య 1000 దాటింది. నేపాల్-టిబెట్ సరిహద్దులో హిమపాతం కారణంగా కేవలం 30 నిమిషాల్లో నీటిమట్టం 9 మీటర్లు పెరిగింది&hellip; కోశీ నదిలో నీరు ఒక్కసారిగా పోటెత్తింది. దీంతో ఈ నది చుట్టుపక్కల గ్రామాలు, నగరాలు, పట్టణాలు వరదల్లో కొట్టుకుపోయాయి.&lt;/p&gt;&lt;p&gt;అయితే ఈ వరదల్లో టిబెట్ సరిహద్దు మార్గంలో మానస సరోవర యాత్రకు వెళ్లిన చాలా మంది భారతీయులు గల్లంతయ్యారు. వీరిలో సద్గురు జగ్గీ వాసుదేవ్ కు చెందిన ఈశా ఫౌండేషన్ ద్వారా యాత్రకు వెళ్లిన 77 మంది ఉన్నారు. అయితే ఇదే యాత్రలో ఉన్న నటి మానసి పరేఖ్ సురక్షితంగా బయటపడ్డారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కైలాస మానస సరోవర యాత్రలో భాగంగా టిబెట్ సరిహద్దులోని గిరియాంగ్ ప్రాంతంగుండా వెళుతున్న ఈశా ఫౌండేషన్&zwnj;కు చెందిన 77 మంది యాత్రికులు వరదల్లో గల్లంతయ్యారు. ఈశా ఫౌండేషన్ యాత్రికులు దశలవారీగా యాత్ర చేపట్టారు. గిరియాంగ్ ప్రాంతంలో వరదలు తీవ్రంగా ఉండటంతో చాలా మంది భారతీయులు గల్లంతయ్యారు. అయితే మానసి పరేఖ్ అప్పటికే గిరియాంగ్ ప్రాంతాన్ని దాటడంతో సురక్షితంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె చైనాలో సేఫ్&zwnj;గా ఉన్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&quot;నేపాల్ వరదలు హృదయ విదారకం. ఈ దుర్ఘటనలో చిక్కుకున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. దేవుడి దయవల్ల మేము చైనాలో సురక్షితంగా ఉన్నాం. ఈశా ఫౌండేషన్ మమ్మల్ని ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. గల్లంతైన యాత్రికులను గుర్తించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించండి&quot; అని మానసి పరేఖ్ పోస్ట్ చేశారు.&lt;/p&gt;&lt;img&gt;తాను సద్గురుతో పాటు చైనాలో ఉన్నట్లు మానసి పరేఖ్ తెలిపారు. &quot;మేము చాలా మంది యాత్రికులం సద్గురుతో కలిసి చైనాలోని ఒక హోటల్&zwnj;లో ఉన్నాం. చైనా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాం. సద్గురు ఇక్కడి నుంచే తమ యాత్రికుల ఆచూకీ కోసం అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నారు. ఈశా ఫౌండేషన్ ద్వారా యాత్రకు వచ్చిన చాలా మంది గల్లంతైనట్లు తెలిసింది. వారిని సంప్రదించడం సాధ్యం కావడం లేదు. అందుకే అధికారుల ద్వారా వారిని గుర్తించాలని సద్గురు కోరారు&quot; అని మానసి పరేఖ్ వివరించారు.&lt;img&gt;&lt;p&gt;భారత్ నుంచి కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన వారిలో సుమారు 450 మందికి పైగా గల్లంతైనట్లు పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే నేపాల్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. చైనా కూడా నేపాల్&zwnj;లో సహాయక చర్యలు చేపట్టింది. భారత ప్రభుత్వం రెండు విమానాల్లో సహాయక సామగ్రిని పంపింది.&lt;/p&gt;&lt;p&gt;నేపాల్ వరదల్లో సామాన్య యాత్రికులే కాదు కొందరు ప్రముఖులు కూడా చిక్కుకున్నారు. మానస సరోవరం యాత్రకు హైదరాబాద్ నుండి వెళ్లిన 31 యాత్రికులు ఈ వరదల్లో చిక్కుకున్నారు... వీరంతా ప్రస్తుతం మానస సరోవరంలో క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టీమ్ లోనే DRDO మాజీ ఛైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/actress-manasi-parekh-safe-amid-nepal-floods-77-isha-pilgrims-missing-nz75243"/>
        </item>
        <item>
            <title><![CDATA[Nepal Floods : నేపాల్‌ను ముంచెత్తిన వరదలు.. 105 మంది భారతీయులు గల్లంతు!]]></title>
            <link>https://telugu.asianetnews.com/international/nepal-flash-floods-kill-9-as-384-go-missing-including-105-indians-articleshow-odgmynv</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/international/nepal-flash-floods-kill-9-as-384-go-missing-including-105-indians-articleshow-odgmynv</guid>
            <pubDate>Wed, 26 Aug 2026 17:13:30 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;నేపాల్&zwnj;లో ఆకస్మిక వరదల కారణంగా తొమ్మిది మంది చనిపోయారు. 105 మంది భారతీయులతో సహా 384 మంది గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m0yw8smeb4tfxxzfka6qgner,imgname-nepal-flood-1787742676621.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Nepal Floods : &lt;/strong&gt;పొరుగుదేశం నేపాల్&zwnj;ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు&hellip; ఈ ప్రకృతి విపత్తులో తొమ్మిది మంది మరణించారు. 105 మంది భారతీయులతో సహా మొత్తం 384 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 32 మంది పోలీసులు, 25 మంది యాత్రికులు కూడా ఉన్నారు.&lt;/p&gt;&lt;p&gt;ఇండియా నుండి నేపాల్ ను సందర్శించేందకు వెళ్లిన చాలామంది వరదల్లో చిక్కుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న టూరిస్టులతో సంబంధాలు తెగిపోయాయని నేపాల్ టూరిజం బోర్డు తెలిపింది. ఇండియన్ టూరిస్ట్ కు సహాయం అందించేందుకు నేపాల్&zwnj;లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్&zwnj;లైన్ నంబర్లను (+977 985 131 6807, +977 970 910 7500) ఏర్పాటు చేసింది.&lt;/p&gt;&lt;p&gt;చైనా సరిహద్దు ప్రాంతాల్లో వరదలు సంభవించడం వల్ల నష్టం ఎక్కువగా జరిగిందని అంచనా వేస్తున్నారు. ఎన్నో గ్రామాలు, మార్కెట్లు, నీటిపారుదల ప్రాజెక్టులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. రోడ్లు, వంతెనలు పూర్తిగా దెబ్బతినడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఆరు ప్రధాన జలవిద్యుత్ కేంద్రాలు కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నేపాల్ డిజాస్టర్ మేనేజ్&zwnj;మెంట్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;బీహార్, యూపీలో హై అలర్ట్&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;నేపాల్&zwnj;లోని వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పొరుగు రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్&zwnj;లో హై అలర్ట్ ప్రకటించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అత్యవసర సమావేశాలు నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అక్కడి పరిస్థితుల గురించి ఆరా తీశారు.&lt;/p&gt;&lt;p&gt;కష్టకాలంలో ఉన్న నేపాల్&zwnj;కు అవసరమైన అన్ని రకాల సహాయ సామగ్రిని వెంటనే అందిస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని బలేంద్ర షా తో మాట్లాడి అక్కడి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కష్టకాలంలో ఉన్న నేపాల్ ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు.&lt;/p&gt;&lt;p&gt;Spoke to Prime Minister Balendra Shah and conveyed condolences on the loss of lives due to the floods in Nepal. The people of India stand in solidarity with their sisters and brothers in Nepal at this difficult time.&amp;nbsp;India is ready to provide all possible humanitarian&hellip;&lt;/p&gt;&lt;p&gt;&mdash; Narendra Modi (@narendramodi) August 26, 2026&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి&hellip;&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;నేపాల్&zwnj;లో చాలా గ్రామాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు సమాచారం. టిబెట్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఆకస్మిక వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో టిబెట్ నుంచి వచ్చే భోటే కోశీ నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగి, వరద పోటెత్తింది. దీంతో నదీ తీరంలోని గ్రామాలన్నీ నీట మునిగాయి. ఇళ్లు, వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి.&lt;/p&gt;&lt;p&gt;ఈ ఘటన జరిగిన వెంటనే సైన్యం, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఆర్మీ హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యలను సమన్వయం చేయడానికి, పరిస్థితిని అంచనా వేయడానికి నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/international/nepal-flash-floods-kill-9-as-384-go-missing-including-105-indians-articleshow-odgmynv"/>
        </item>
        <item>
            <title><![CDATA[Gold Treasure: గోడ వెనుక రూ.100 కోట్ల లంకె బిందెలు.. తవ్వకాల్లో షాకింగ్.. ఆ గోడలో ఏముందో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/gold-treasure-discovery-rs-100-cr-worth-gold-coins-found-inside-secret-wall-in-belgium-full-details-ohqun97</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/gold-treasure-discovery-rs-100-cr-worth-gold-coins-found-inside-secret-wall-in-belgium-full-details-ohqun97</guid>
            <pubDate>Sun, 16 Aug 2026 10:16:20 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Gold Treasure: బెల్జియంలో డ్రైనేజీ పనుల సమయంలో రూ.100 కోట్ల విలువైన బంగారు నాణాలు, బిస్కెట్లు లభించాయి. కోట్ల రూపాయల విలువ చేసే లంకె బిందెలు బయటపడటం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఆ గోడలో ఏముందో తెలుసా?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m04ck8nb2k45nza1srk4vkh8,imgname-gold-treasure-1786853827243.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Gold Treasure: బెల్జియంలో డ్రైనేజీ పనుల సమయంలో రూ.100 కోట్ల విలువైన బంగారు నాణాలు, బిస్కెట్లు లభించాయి. కోట్ల రూపాయల విలువ చేసే లంకె బిందెలు బయటపడటం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఆ గోడలో ఏముందో తెలుసా?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బెల్జియంలోని ఈస్ట్ ఫ్లాండర్స్ పరిధిలోని సెంట్ గిలిస్ డెండర్&zwnj;మోండే అనే ప్రాంతంలో ఒక పాత భవనంలో డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. అక్కడ సీవేజ్ పైపులు వేసేందుకు మట్టిని తవ్వుతున్నారు. ఆ భవనం పునాదులను డ్రిల్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గోడల నుంచి ఏదో పసుపు రంగు వస్తువు మెరుస్తూ బయటపడింది. రోజూలాగే పనులు చేస్తుండగా ఈ దృశ్యం చూసి అక్కడున్న కార్మికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆ సమయంలో పార్ట్ టైమ్ వర్క్ కోసం వచ్చిన 18 ఏళ్ల విద్యార్థి కోబే, సైట్ మేనేజర్ వారియో పనుల్లో ఉన్నారు. మొదట నేలపై మెరుస్తున్నవి చూసి వారు సాధారణ 1 యూరో నాణాలు అనుకున్నారు. కానీ దగ్గరకు వెళ్లి మట్టిని తొలగించి చూసేసరికి వారి మైండ్ బ్లాక్ అయింది. అవి సాధారణ నాణాలు కావు, బంగారు నాణాలు, బంగారు బిస్కెట్లు. సుమారు 9 మిలియన్ యూరోలు, అంటే భారతీయ కరెన్సీలో రూ.85 కోట్ల నుంచి రూ.100 కోట్ల విలువైన బంగారం అక్కడ లభించింది. 33 ఏళ్లుగా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న సైట్ మేనేజర్ వారియో, తన జీవితంలో ఇంతటి ఆశ్చర్యకరమైన విషయాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అంత పెద్ద మొత్తంలో బంగారం లభించినప్పటికీ, కార్మికులు దానిని దాచుకునే ప్రయత్నం చేయలేదు. దానిని దాచడం చట్టరీత్యా నేరం అని, దొంగతనంతో సమానమని భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్వాధీనం చేసుకున్న ఆ నిధిని అధికారులు సురక్షితమైన ప్రభుత్వ ఖజానాకు తరలించారు. ఈ వార్త తెలియగానే ఆ ప్రాంతానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇంకేమైనా బంగారం దొరుకుతుందేమో అని జనాలు తవ్వకాలు జరపడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ బంగారం ఎక్కడిది అనే దానిపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. 19వ శతాబ్దంలో అక్కడ నడిచిన ఒక పాత బీర్ ఫ్యాక్టరీ యజమాని థియోఫిలస్ వాన్ ఆషే కుటుంబానికి ఇది చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ రోజుల్లో ఉన్న రాజకీయ అస్థిరత లేదా ఆర్థిక భయాల వల్ల వారు తమ జీవితకాల సంపాదనను ఇలా భవనం గోడల వెనుక దాచిపెట్టి ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆస్తి 'CAW Oost-Vlaanderen' అనే చారిటీ సంస్థకు చెందింది. ఈ నిధి తమకే దక్కితే పేదల సంక్షేమానికి వాడతామని ఆ సంస్థ తెలిపింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బెల్జియం చట్టాల ప్రకారం ఈ నిధిపై హక్కు చెప్పుకోవడానికి అసలైన యజమానులకు లేదా వారి వారసులకు 5 ఏళ్ల సమయం ఉంటుంది. ఒకవేళ 5 ఏళ్ల వరకు ఎవరూ రాకపోతే, ఆ బంగారానికి ఎలాంటి నేర చరిత్ర లేకపోతే, చట్టప్రకారం ఆ నిధిని భవనం యజమానికి, దానిని కనుగొన్న కార్మికులకు చెరిసగం పంచుతారు. బంగారం నేరుగా తమకు దక్కకపోయినా, అంత పెద్ద నిధిని కనిపెట్టినందుకు తమకు రివార్డు దక్కుతుందని 18 ఏళ్ల కోబే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/gold-treasure-discovery-rs-100-cr-worth-gold-coins-found-inside-secret-wall-in-belgium-full-details-ohqun97"/>
        </item>
        <item>
            <title><![CDATA[Iran: ఇరాన్ ప్రాక్సీ నెట్‌వ‌ర్క్ కొత్త రూపం.. మునుపటి కంటే ఎందుకు ప్రమాదకరం?]]></title>
            <link>https://telugu.asianetnews.com/international/iran-proxy-network-2026-why-tehrans-new-strategy-is-more-dangerous-than-ever-articleshow-oq94pb4</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/international/iran-proxy-network-2026-why-tehrans-new-strategy-is-more-dangerous-than-ever-articleshow-oq94pb4</guid>
            <pubDate>Wed, 19 Aug 2026 21:43:08 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Iran: మధ్యప్రాచ్యంలో ఎన్నో ఏళ్లుగా దేశాల మధ్య జరిగే ఘర్షణలకు ప్రభుత్వాల చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందని భావించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఇంత&zwnj;కీ ఘ&zwnj;ర్ష&zwnj;ణ&zwnj;ల&zwnj;కు ఎప్పుడు తెర&zwnj;ప&zwnj;డ&zwnj;నుంది.? అస&zwnj;లేం జ&zwnj;ర&zwnj;గ&zwnj;నుంది.?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m0czkjwxmdqy4ncjm7frchqj,imgname-iran-flag--1--1787142196125.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ప్రభుత్వాల నియంత్రణకు పూర్తిగా లోబడని సాయుధ సంస్థలు ప్రాంతీయ భద్రతపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. దీంతో కాల్పుల విరమణ ఒప్పందాలు నిలకడగా కొనసాగడం, శాశ్వత రాజకీయ పరిష్కారాలు సాధించడం మరింత కష్టంగా మారింది. ఈ విధానాన్ని అత్యంత క్రమబద్ధంగా ఉపయోగించిన దేశాల్లో ఇరాన్&zwnj; ఒకటి. గత నాలుగు దశాబ్దాల్లో టెహ్రాన్&zwnj; పలు దేశాల్లో తనకు అనుకూలంగా ఉన్న సాయుధ సంస్థలను బలోపేతం చేసింది. లెబనాన్&zwnj;లో హిజ్బుల్లా, యెమెన్&zwnj;లో హౌతీలు, ఇరాక్&zwnj;లో షియా మిలీషియాలు, గాజాలో హమాస్&zwnj; వంటి సంస్థలు ఈ నెట్&zwnj;వర్క్&zwnj;లో కీలకంగా ఉన్నాయి. సిరియాలో అసద్&zwnj; ప్రభుత్వం కూడా గతంలో ఇరాన్&zwnj;కు ముఖ్యమైన భాగస్వామిగా ఉండేది. 2024 చివర్లో అసద్&zwnj; ప్రభుత్వం కూలిపోవడంతో ఆ వ్యవస్థలో ఒక ప్రధాన భాగం బలహీనపడింది. అయినా ఇరాన్&zwnj; ప్రభావం పూర్తిగా ముగియలేదు.&lt;/p&gt;&lt;h2&gt;హిజ్బుల్లా బలహీనపడినా ప్రమాదం తగ్గలేదు&lt;/h2&gt;&lt;p&gt;ఇరాన్&zwnj; ప్రాంతీయ వ్యూహంలో హిజ్బుల్లా అత్యంత ముఖ్యమైన సంస్థగా ఉంది. 2023 చివరి నుంచి ఇజ్రాయెల్&zwnj; చేపట్టిన దాడుల్లో హిజ్బుల్లా నాయకత్వం, మౌలిక వసతులు, ఆయుధ సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2024లో హసన్&zwnj; నస్రల్లా మరణం కూడా ఆ సంస్థకు పెద్ద దెబ్బగా మారింది. భారీగా ఆయుధాలు కోల్పోయినప్పటికీ హిజ్బుల్లా పూర్తిగా నిర్వీర్యం కాలేదు.&lt;/p&gt;&lt;p&gt;2026లో జరిగిన ఘర్షణల్లో ఆ సంస్థ మళ్లీ రంగంలోకి రావడం దీనికి ఉదాహరణ. ఇజ్రాయెల్&zwnj; నుంచి దక్షిణ లెబనాన్&zwnj; నుంచి ఉపసంహరణకు హిజ్బుల్లా నిరాయుధీకరణను అనుసంధానించే అమెరికా మధ్యవర్తిత్వ వ్యవస్థ ఉన్నప్పటికీ, సంస్థ తన ఆయుధాలను వదులుకోవడానికి సిద్ధంగా లేదనే పరిస్థితి కనిపిస్తోంది. భవిష్యత్&zwnj; దాడులను తట్టుకునేందుకు పెద్ద వ్యవస్థకు బదులుగా చిన్న చిన్న విభాగాలుగా పనిచేసే విధానాన్ని హిజ్బుల్లా అవలంబించే అవకాశం ఉంది. అందువల్ల ఆయుధాలపై దాడులతో పాటు నిధుల మార్గాలు, శిక్షణ అందించే ఇరాన్&zwnj; రివల్యూషనరీ గార్డ్&zwnj; వర్గాలపై నిఘా కూడా కీలకంగా మారుతోంది.&lt;/p&gt;&lt;h2&gt;హౌతీల ప్రభావం మధ్యప్రాచ్యాన్ని దాటి ప్రపంచానికి&lt;/h2&gt;&lt;p&gt;యెమెన్&zwnj;లోని హౌతీల విషయంలో ఇరాన్&zwnj; సపోర్ట్ కేవలం ప్రాంతీయ భద్రత సమస్యగా మిగలలేదు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులు ప్రపంచ సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపాయి. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 15 శాతం ఈ కీలక సముద్ర మార్గం గుండా సాగుతుందని అంచనాలు ఉన్నాయి. దాడులు తీవ్ర స్థాయికి చేరిన సమయంలో సూయెజ్&zwnj; కాలువ గుండా వెళ్లే కంటైనర్&zwnj; నౌకల సంఖ్య వారానికి దాదాపు 80 నుంచి ఇరవైల్లోకి పడిపోయింది. దీంతో అనేక షిప్పింగ్&zwnj; సంస్థలు ఆఫ్రికా చుట్టూ కేప్&zwnj; ఆఫ్&zwnj; గుడ్&zwnj; హోప్&zwnj; మార్గాన్ని ఎంచుకున్నాయి. ఫలితంగా ఒక్క ప్రయాణానికి సుమారు 11 వేల నాటికల్&zwnj; మైళ్ల అదనపు దూరం, దాదాపు పది రోజుల అదనపు సమయం, భారీ ఇంధన వ్యయం చేరింది. ప్రస్తుతం దాడులు కొంత తగ్గినా, ఇది శాశ్వత పరిష్కారం కాదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. హౌతీలను ఎదుర్కోవడానికి నిఘా, గోప్య చర్యలు, గల్ఫ్&zwnj; దేశాలతో సమన్వయం కీలకం కానున్నాయి.&lt;/p&gt;&lt;h2&gt;ఇరాక్&zwnj;లో మరో భద్రతా వ్యవస్థగా మిలీషియాలు&lt;/h2&gt;&lt;p&gt;ఇరాక్&zwnj;లో ఇరాన్&zwnj; ప్రభావం ప్రధానంగా పాపులర్&zwnj; మొబిలైజేషన్&zwnj; ఫోర్సెస్&zwnj; ద్వారా కొనసాగుతోంది. ఈ సాయుధ సంస్థలు అధికారికంగా ఇరాక్&zwnj; ప్రభుత్వ భద్రతా వ్యవస్థలో భాగమైనప్పటికీ, కొన్ని వర్గాలు తమ సొంత కమాండ్&zwnj; వ్యవస్థను కొనసాగిస్తూ టెహ్రాన్&zwnj;తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి. 2026లో జరిగిన ఘర్షణల సమయంలో ఈ వర్గాలు అమెరికా స్థావరాలు, ఇరాక్&zwnj;లోని కుర్దిస్తాన్&zwnj; ప్రాంతంపై పలు దాడులు చేశాయి. ఆయుధాలను వదులుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ కటాయిబ్&zwnj; హిజ్బుల్లా వంటి కఠినవాద వర్గాలు నిరాయుధీకరణకు వ్యతిరేకంగా ఉన్నాయి. మిలీషియాలను బలవంతంగా నిరాయుధులను చేస్తే దేశంలో అంతర్గత ఘర్షణలు పెరిగే ప్రమాదం ఉంది. వాటికి ఆయుధాలు కొనసాగించేందుకు అనుమతిస్తే ప్రభుత్వ భద్రతా వ్యవస్థకు సమాంతరంగా మరో శక్తి కొనసాగుతుంది. ఇదే ఇరాక్&zwnj; ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.&lt;/p&gt;&lt;h2&gt;అసద్&zwnj; పతనం తర్వాత ఇరాన్&zwnj; కొత్త మార్గాలు&lt;/h2&gt;&lt;p&gt;2024 చివర్లో సిరియాలో అసద్&zwnj; ప్రభుత్వం కూలిపోవడం ఇరాన్&zwnj;కు కీలక ఎదురుదెబ్బగా మారింది. ఇరాన్&zwnj; నుంచి లెబనాన్&zwnj;లోని హిజ్బుల్లాకు ఆయుధాలు, ఇతర సరఫరాలు చేరేందుకు సిరియా ముఖ్యమైన భూసంబంధ మార్గంగా ఉండేది. ఇజ్రాయెల్&zwnj; దాడులు ఈ సరఫరా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. అయితే మార్గం కోల్పోయినంత మాత్రాన ఇరాన్&zwnj; ప్రయత్నాలు ఆగలేదు. సముద్ర, వాయు మార్గాల ద్వారా సరఫరాలు కొనసాగించే ప్రయత్నాలు చేస్తోందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. అదే సమయంలో ఇరాన్&zwnj; రివల్యూషనరీ గార్డ్&zwnj; సభ్యులను వివిధ ప్రాక్సీ సంస్థల్లో మరింత లోతుగా చేర్చే వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది. అందువల్ల భవిష్యత్&zwnj;లో ఆయుధాల సరఫరా మార్గాలను గుర్తించేందుకు ఇజ్రాయెల్&zwnj; నిఘా వ్యవస్థలకు కొత్త విధానాలు అవసరం అవుతున్నాయి.&lt;/p&gt;&lt;h2&gt;ఇరాన్&zwnj; అంతర్గత పరిస్థితులు కూడా కీలకం&lt;/h2&gt;&lt;p&gt;ఇరాన్&zwnj; ప్రభుత్వం తన విదేశాంగ విధానాన్ని సమర్థించేందుకు ఉపయోగించే &lsquo;ప్రతిఘటన&rsquo; భావజాలానికి దేశ ప్రజల్లో గతంలో ఉన్నంత ఆదరణ లేదనే వాదనలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు, నిరసనలు, ప్రభుత్వంపై అసంతృప్తి టెహ్రాన్&zwnj; సామర్థ్యంపై ప్రభావం చూపుతున్నాయి. దేశంలో ఆర్థిక ఒత్తిడి పెరిగితే విదేశాల్లోని మిత్ర సాయుధ సంస్థలకు నిధులు అందించడం కష్టమవుతుంది. ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే ప్రభుత్వం పెద్ద స్థాయి ఘర్షణలకు వెళ్లడంపై కూడా పరిమితులు ఏర్పడవచ్చు. అదే సమయంలో పాలక వ్యవస్థలోని అంతర్గత విభేదాలు ప్రత్యర్థులకు మరింత సమాచారాన్ని అందించే అవకాశాలు కల్పించవచ్చు. అందుకే ఇరాన్&zwnj; అంతర్గత బలహీనత కూడా దాని ప్రాక్సీ నెట్&zwnj;వర్క్&zwnj;ను ఎదుర్కొనే వ్యూహంలో ఒక ముఖ్యమైన అంశంగా మారుతోంది.&lt;/p&gt;&lt;p&gt;ఇరాన్&zwnj; ప్రాక్సీ నెట్&zwnj;వర్క్&zwnj;ను ఎదుర్కోవడానికి ఒక్క సైనిక దాడి సరిపోదు. నిరంతర నిఘా, కీలక స్థావరాలపై కచ్చితమైన చర్యలు, నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవడం, ప్రాంతీయ మిత్ర దేశాలతో సమన్వయం అవసరం. ముఖ్యంగా ఆయుధాలు, అక్రమ చమురు రవాణా, మనీలాండరింగ్&zwnj; వంటి ఆర్థిక మార్గాలపై ఒత్తిడి పెంచితే ఈ సంస్థల సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. అలాగే గల్ఫ్&zwnj; దేశాలు, అబ్రహం ఒప్పందాల్లో భాగమైన దేశాలతో సహకారం పెంచడం ద్వారా సమిష్ఠి భద్రతా వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ఇరాన్&zwnj; ప్రభుత్వాన్ని నేరుగా యుద్ధంలోకి లాగకుండా ప్రాక్సీ దాడులకు బాధ్యత వహించేలా ఒత్తిడి పెంచడం కూడా కీలకం.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/international/iran-proxy-network-2026-why-tehrans-new-strategy-is-more-dangerous-than-ever-articleshow-oq94pb4"/>
        </item>
        <item>
            <title><![CDATA[Agnipariksha Season 2: అభిజిత్‌కు షాక్ ఇచ్చిన అమ్మాయి, కంటెస్టెంట్ ముఖంపై నీళ్లు కొట్టిన బిందు మాధవి.. గరం గరంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష2]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/bigg-boss-agnipariksha-2-bindu-madhavi-splashes-water-on-contestant-abijeet-gets-shocked-by-apoorva-phsfsga</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/bigg-boss-agnipariksha-2-bindu-madhavi-splashes-water-on-contestant-abijeet-gets-shocked-by-apoorva-phsfsga</guid>
            <pubDate>Tue, 18 Aug 2026 11:29:23 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Bigg Boss Agnipariksha Season 2: బిగ్ బాస్ అగ్నిపరీక్ష2 రసవత్తరంగా కొనసాగుతోంది. తాజా ఎపిసోడ్&zwnj;లో అభిజిత్&zwnj;కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఇక బిందు మాధవి చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m09q0f69pzegtas54nz0es4z,imgname-bigg-boss-agnipariksha-2-1787032517833.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Bigg Boss Agnipariksha Season 2: బిగ్ బాస్ అగ్నిపరీక్ష2 రసవత్తరంగా కొనసాగుతోంది. తాజా ఎపిసోడ్&zwnj;లో అభిజిత్&zwnj;కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఇక బిందు మాధవి చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సామాన్యుడిని బిగ్ బాస్ హౌస్&zwnj;లోకి పంపించడానికి అగ్నిపరీక్ష2 స్టార్ట్ అయ్యింది. కొంచెం ఫన్, కొంచెం కాంట్రవర్సీతో ఎంతో మంది టాలెంటెడ్ కంటెస్టెంట్స్ తమ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో అగ్నిపరీక్ష సీజన్ 2 చాలా ఘాటుగా నడుస్తోంది. గతంలో కంటే ఈసారి కాస్త డోస్ పెంచారు. జడ్జిలు కూడా పరిస్థితిని చాలా టైట్ చేస్తున్నారు. తాజా ఎపిసోడ్&zwnj;లో కంటెస్టెంట్స్&zwnj;కు జడ్జిలు షాక్ ఇవ్వడంతో పాటు.. ఓ కంటెస్టెంట్ అభిజిత్&zwnj;కు కోలుకోలేని పంచ్ ఇచ్చింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అగ్నిపరీక్ష2లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే తన ఎనర్జీ లెవల్స్&zwnj;తో అందరినీ ఆశ్చర్యపరిచింది అపూర్వ. ఖమ్మంకు చెందిన ఆమె గతంలో యాంకర్&zwnj;గా, మిస్ తెలంగాణగా గెలిచింది. ఖమ్మం కళాకారుల గుమ్మం అంటూ.. తన మాటల దాడితో ఉక్కిరిబిక్కిరి చేసింది. ముఖ్యంగా నవదీప్ మీద ఫోకస్ చేస్తూ.. ఆయన్ను ఇంప్రెస్ చేయాలని చూసింది. బిందు మాధవిని కూడా బుట్టలో వేయాలని చూసిన అపూర్వ.. అభిజిత్&zwnj;పై మాత్రం షాకింగ్ కామెంట్స్ చేసింది. అతను తనకు నచ్చడని.. ఆయన సేఫ్ గేమ్ ఆడాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఫిజికల్ టాస్క్&zwnj;లు ఆడే టైమ్&zwnj;లో ఎడ్యుకేషన్ గురించి చెబుతూ.. తప్పించుకున్నాడని, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయకుండానే మైండ్ గేమ్&zwnj;తో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యాడంటూ మైండ్ బ్లాక్ అయ్యే కామెంట్స్ చేసింది. దాంతో అభిజిత్ కూడా డిఫెన్స్ చేసుకోవడానికి గట్టిగా ట్రై చేశాడు. ఫైనల్&zwnj;గా అపూర్వ ఎంత టాలెంట్ చూపించినా కూడా చివరకు అభిజిత్, బిందు నుంచి రెడ్ కార్డ్ రాగా.. నవదీప్ మాత్రం &quot;ముందు ముందు ఎలా ఉంటావో చూడాలి నువ్వు&quot; అంటూ.. గ్రీన్ కార్డ్ ఇచ్చి హోల్డ్ చేశాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అగ్నిపరీక్ష2లో చాలామంది తమ ఒరిజినల్ పర్సనాలిటీని దాచిపెట్టి.. ఏదో చూపించాలి అన్నట్టుగా స్టేజ్ మీదకు వస్తున్నట్టు కనిపిస్తోంది. తాజా ఎపిసోడ్&zwnj;లో ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ లక్ష్మీదీపక్ సేనాపతి కూడా అలానే చేశాడు. తన డిటైల్స్&zwnj;ను చాలా ఎమోషనల్&zwnj;గా చెప్పి.. తాను సాధించిన విజయాలు చెప్పుకొచ్చిన దీపక్.. చివరిలో బిగ్ బాస్ కోసం జుట్టు తీయడానికి నిరాకరించాడు. ఇక మరో కంటెస్టెంట్ రోహిత్ నాయుడు పట్నం కూడా సెంటిమెంట్&zwnj;తో గెలవాలని ట్రై చేశాడు. ఫైనాన్షియల్&zwnj;గా స్ట్రాంగ్&zwnj;గా ఉన్న అతను.. తన తండ్రి లేకపోవడంతో సింగిల్ పేరెంట్&zwnj;గా అమ్మ కష్టం గురించి చెప్పాడు. ఆ తరువాత తెలియకుండా ఇద్దరితో డేట్ చేసిన విషయం వెల్లడించాడు. అది అతనికి నెగెటివ్&zwnj;గా మారింది. ఇక అతనికి కోపం వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి బిందు మాధవి మూడు సార్లు అతని ముఖంపై నీళ్లు కొట్టింది. అతను కాస్త నటిస్తున్నట్టు అనిపించడంతో నవదీప్, బిందు రెడ్ కార్డ్ ఇవ్వగా.. అభిజిత్ మాత్రం రోహిత్&zwnj;కు తనను తాను నిరూపించుకోవడం కోసం మరో ఛాన్స్ ఇచ్చాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తాజా ఎపిసోడ్&zwnj;లో అగ్నిపరీక్ష2 గెస్ట్&zwnj;ల మనసు గెలిచిన ఏకైక కంటెస్టెంట్ బాగి తుల్లూరి. వచ్చీ రావడంతోనే శ్రీముఖితో పాటు ముగ్గురు జడ్జిల మనసు గెలిచింది బాగి. నెల్లూరు యాసలో &quot;నాయనా&quot; అనుకుంటూ.. ఆమె ఇచ్చిన పెర్ఫామెన్స్&zwnj;కు అందరూ ఫిదా అయిపోయారు. అంతే కాదు తన లవ్ స్టోరీ గురించి చెప్పి అందరి మనసులు గెలిచింది బాగి. ఇక అభిజిత్ లాంటి హస్బెండ్ కావాలంటూ షాక్ ఇచ్చింది. ఇక ఆమె టాలెంట్&zwnj;కు పడిపోయిన జడ్జెస్ గ్రీన్ కార్డ్ ఇవ్వగా.. ఆమెలో టాలెంట్&zwnj;ను ఇంకా బయటకు తీయాలని డైరెక్ట్&zwnj;గా బిగ్ బాస్&zwnj;లోకి పంపించకుండా నవదీప్ రెడ్ కార్డ్ ఇచ్చి హోల్డ్ చేశాడు. నెక్స్ట్ రౌండ్&zwnj;లో బాగి పోటీకి రెడీ అవ్వబోతోంది. ఇక వెళ్తూ.. వెళ్తూ.. బిగ్ బాస్ జడ్జెస్ ముగ్గురితో పాటు యాంకర్ శ్రీముఖికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తానంటూ షాక్ ఇచ్చింది బాగి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Jujjuri</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/bigg-boss-agnipariksha-2-bindu-madhavi-splashes-water-on-contestant-abijeet-gets-shocked-by-apoorva-phsfsga"/>
        </item>
        <item>
            <title><![CDATA[USA Travel Tips: అమెరికా వెళ్లే ముందు తప్పక తెలుసుకోవాల్సిన 15 విషయాలు ఇవే]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/15-things-you-must-know-before-traveling-to-usa-first-time-rk02ew2</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/15-things-you-must-know-before-traveling-to-usa-first-time-rk02ew2</guid>
            <pubDate>Mon, 10 Aug 2026 11:13:06 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;USA Travel Tips: అమెరికాకు తొలిసారి వెళ్తున్నారా? వీసా, ఖర్చులు, టిప్పింగ్, ట్రాన్స్&zwnj;పోర్ట్, ట్యాక్స్, డ్రైవింగ్ రూల్స్ సహా తప్పక తెలుసుకోవాల్సిన 15 విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే. 15 విషయాలు తెలుసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kzn0wwmb5kcbv53kyjr80b3q,imgname-usa-travel-tips-1786338243211.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;USA Travel Tips: అమెరికాకు తొలిసారి వెళ్తున్నారా? వీసా, ఖర్చులు, టిప్పింగ్, ట్రాన్స్&zwnj;పోర్ట్, ట్యాక్స్, డ్రైవింగ్ రూల్స్ సహా తప్పక తెలుసుకోవాల్సిన 15 విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే. 15 విషయాలు తెలుసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఉద్యోగం, ఉన్నత చదువులు, టూరిజం లేదా బంధువులను కలవడానికి తొలిసారి అమెరికా వెళ్తున్న భారతీయులు అక్కడి జీవన విధానం, రూల్స్ పై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. భారతదేశంతో పోలిస్తే అమెరికాలోని చట్టాలు, రవాణా, ఖర్చులు, అలవాట్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. సరైన ముందస్తు ప్లాన్ లేకపోతే విమానాశ్రయం ల్యాండింగ్ దగ్గర నుంచే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;p&gt;అమెరికాకు చేరుకోవడానికి సరైన వీసా లేదా కొన్ని అర్హత కలిగిన దేశాల వారికి ఈఎస్టీఏ అవసరం. భారతీయులకు సాధారణంగా B1/B2, H-1B, F-1 వంటి వీసాలు ఉంటాయి. అయితే, కేవలం చేతిలో వీసా ఉంటే సరిపోదు. అమెరికా విమానాశ్రయం చేరుకున్న తర్వాత ఇమిగ్రేషన్ అధికారుల ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీ ప్రయాణ ఉద్దేశం, తిరుగు ప్రయాణ, టికెట్, వసతి వివరాలకు సంబంధించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం తప్పనిసరి. అలాగే మీ పాస్&zwnj;పోర్ట్ కనీసం 6 నెలల వాలిడిటీ కలిగి ఉండేలా చూసుకోవాలి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికాలో వైద్య సేవలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. చిన్న డాక్టర్ సంప్రదింపుల నుంచి అత్యవసర చికిత్సల వరకు భారీగా ఖర్చువుతుంది. ఇన్సూరెన్స్ లేకపోతే ఒక్క రోజు హాస్పిటల్ స్టేకే వేల డాలర్లు వెచ్చించాల్సి వస్తుంది. అందుకే కనీసం $50,000 నుంచి $100,000 కవరేజీ ఉన్న ప్రాపర్ ట్రావెల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకెళ్లడం చాలా అవసరం.&lt;/p&gt;&lt;p&gt;డాలర్ విలువ ఎక్కువగా ఉండటమే కాకుండా, అక్కడి జీవన వ్యయం కూడా గణనీయంగా ఉంటుంది. హోటల్స్, ఇళ్ల అద్దెలు, రెస్టారెంట్లు, రవాణా ఖర్చులు భారత్&zwnj;తో పోలిస్తే చాలా ఎక్కువ. డబ్బుల విషయంలో సరైన ప్లానింగ్ లేకపోతే ఆర్థికంగా భారంగా మారే ప్రమాదం ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా సంస్కృతిలో టిప్పింగ్ ఒక సామాజిక బాధ్యతగా ఉంటుంది. రెస్టారెంట్లు, క్యాబ్&zwnj;లు, బార్బర్ షాప్&zwnj;లు, డెలివరీ సర్వీసుల్లో సర్వీస్ అందించిన వారికి బిల్లులో సాధారణంగా 15% నుంచి 20% వరకు టిప్ ఇవ్వడం ఆనవాయితీ. ట్యాక్స్ కాకుండా అసలు బిల్లు మొత్తంపై ఈ టిప్&zwnj;ను లెక్కిస్తారు.&lt;/p&gt;&lt;p&gt;అలాగే సూపర్ మార్కెట్లు లేదా మాల్స్&zwnj;లో వస్తువులపై కనిపించే ప్రైస్ టాక్ ఫైనల్ ధర కాదు. బిల్లింగ్ కౌంటర్ వద్ద స్థానిక, రాష్ట్ర సేల్స్ ట్యాక్స్ అదనంగా తోడవుతుంది. దాంతో ప్రైస్ టాగ్ కంటే బిల్లులో ఎక్కువ మొత్తం కనిపిస్తుంది. రాష్ట్రాలను బట్టి ఈ టాక్స్ రేటు 0% నుంచి 10% వరకు ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;న్యూయార్క్, చికాగో, వాషింగ్టన్ డిసి వంటి పెద్ద నగరాల్లో పబ్లిక్ ట్రాన్స్&zwnj;పోర్ట్ మెరుగ్గా ఉంటుంది. కానీ మిగిలిన ప్రాంతాల్లో లేదా చిన్న నగరాల్లో ప్రజారవాణా సౌకర్యాలు తక్కువ. అక్కడికి వెళ్లేవారు సొంత కారు, రెంటల్ కార్ లేదా ఉబర్, లిఫ్ట్ వంటి రైడ్-షేరింగ్ యాప్&zwnj;లపైనే ఆధారపడాల్సి ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;కారు నడపాలనుకునే వారు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కలిగి ఉండాలి. అక్కడ వాహనాలు రోడ్డుకు కుడి వైపున నడుస్తాయి. స్పీడ్ లిమిట్స్, స్టాప్ సైన్, పెడెస్ట్రియన్ క్రాసింగ్స్ వద్ద పాదచారులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం వంటి నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. జెబ్రా క్రాసింగ్ లేని చోట రోడ్డు దాటడాన్ని 'Jaywalking' అంటారు, కొన్ని నగరాల్లో దీనికి భారీగా ఫైన్ విధిస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికాలో మెట్రిక్ విధానం వాడరు, ఇంపీరియల్ సిస్టమ్ ఉపయోగిస్తారు. దూరాలను మైళ్ళు, బరువును పౌండ్లు, ఉష్ణోగ్రతను ఫారెన్&zwnj;హీట్, ద్రవాలను గ్యాలన్లలో కొలుస్తారు. దీనికి భారతీయులు ముందే అలవాటు పడటం మంచిది. అలాగే అక్కడ క్యాష్ వాడకం చాలా తక్కువ, క్రెడిట్/డెబిట్ కార్డ్&zwnj;లు లేదా ఆపిల్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులే ఎక్కువ. విదేశీ లావాదేవీల ఛార్జీలు పడని కార్డ్&zwnj;లను వాడటం ఉత్తమం.&lt;/p&gt;&lt;p&gt;అక్కడ ప్లగ్ పాయింట్లు టైప్ ఏ/బీ తరహాలో ఉండి, విద్యుత్ సరఫరా 110V / 60Hz వద్ద పనిచేస్తుంది. కాబట్టి యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు. ఎమర్జెన్సీ సమయంలో పోలీస్, ఫైర్ లేదా మెడికల్ హెల్ప్ కోసం తక్షణమే 911 నంబర్&zwnj;కు కాల్ చేయవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;లిక్కర్ సేవించడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు. బహిరంగ ప్రదేశాల్లో అంటే రోడ్లు, పార్కులలో లిక్కర్ తాగడం నేరం. అలాగే వ్యక్తిగత ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. క్రమశిక్షణ, సమయపాలన, వరుసలో నిలబడటం, థాంక్యూ, సారీ చెప్పడం వంటి దైనందిన మర్యాదలు పాటించడం ద్వారా అమెరికా ప్రయాణాన్ని మరింత ప్రశాంతంగా, సురక్షితంగా మార్చుకోవచ్చు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/15-things-you-must-know-before-traveling-to-usa-first-time-rk02ew2"/>
        </item>
        <item>
            <title><![CDATA[USA Coconut Price: అమెరికాలో కొబ్బరి బొండం కొనాలంటే జేబుకు చెల్లే...రేటు తెలిస్తే షాక్ అవుతారు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/why-a-tender-coconut-is-a-10-dollar-luxury-in-the-usa-sgmt6wy</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/why-a-tender-coconut-is-a-10-dollar-luxury-in-the-usa-sgmt6wy</guid>
            <pubDate>Wed, 12 Aug 2026 14:51:08 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;USA Coconut Price: మన దగ్గర కొబ్బరి బొండం రేటు ఎంతుంటుంది? ఏ రూ.40, రూ.50 ఉంటుంది. దానికే బేరమాడి మరీ కొంటాం. కానీ అమెరికాలో ఒక కొబ్బరి బొండం ధర ఎంతుంటుందో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు. అందుకే అంటారు ఎంత చెట్టుకు అంతే గాలి అని.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kztm1np9xwvfdctct3h4f8xk,imgname-chatgpt-image-aug-12--2026--02-44-21-pm-1786526095049.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;USA Coconut Price: మన దగ్గర కొబ్బరి బొండం రేటు ఎంతుంటుంది? ఏ రూ.40, రూ.50 ఉంటుంది. దానికే బేరమాడి మరీ కొంటాం. కానీ అమెరికాలో ఒక కొబ్బరి బొండం ధర ఎంతుంటుందో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు. అందుకే అంటారు ఎంత చెట్టుకు అంతే గాలి అని.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇండియాలో రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు అమ్ముతుంటారు. రూ.40, రూ.50, రూ.60 కి సేల్ చేస్తుంటారు. అదే కేరళ కొబ్బరి అయింతే ఇంకొంచెం ధర ఉంటుంది. అయినా రూ.100 దాటదు. కానీ అమెరికాలో మాత్రం కొబ్బరి బొండం ఒక లగ్జరీ డ్రింక్ అంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే అక్కడ ఒక బొండం ధర 10 డాలర్లు. అంటే మన కరెన్సీలో చూసుకుంటే సుమారు రూ.950 నుంచి రూ.960.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కొబ్బరి చెట్లు పెరగాలంటే వేడి, తేమతో కూడిన వాతావరణం కావాలి. కానీ అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఎప్పుడూ చలిగానే ఉంటుంది. ఫ్లోరిడా, హవాయి వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొబ్బరి చెట్లు పెరుగుతాయి. ఇది దేశీయ అవసరాలకు సరిపోదు. అందుకే అమెరికా 90% కొబ్బరికాయలను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికాకు అవసరమైన కొబ్బరి బొండాలను ఎక్కువగా థాయ్&zwnj;లాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్, భారత్ నుంచి ఎగుమతి చేస్తారు. ఇవి వేల కిలోమీటర్లు సముద్ర మార్గంలో ప్రయాణిస్తాయి. షిప్పింగ్ ఛార్జీలు, కంటైనర్ ఖర్చులు, ప్యాకింగ్, ముఖ్యంగా బొండాలు పాడవకుండా ఉండేందుకు అవసరమైన 'కోల్డ్ స్టోరేజ్' ఖర్చులు. దీనివల్ల అమెరికాలో కొబ్బరి బొండాల ధర ఎక్కువ.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత్&zwnj;తో పోలిస్తే అమెరికాలో కార్మికుల కూలీ (లేబర్ కాస్ట్) చాలా ఎక్కువ. ఓడల నుంచి బొండాలను దించడం, ట్రక్కుల్లో ఎక్కించడం, సూపర్ మార్కెట్లలో సర్దడం వరకు ప్రతి దశలోనూ ఎక్కువ జీతాలు చెల్లించాలి. వీటికి ఇంపోర్ట్ డ్యూటీ, షాపుల అద్దె, కరెంట్ బిల్లులు కూడా తోడవడంతో రూ.1000 దాటిపోతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచంలోనే కొబ్బరికాయలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ఒకటి. మన దేశంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కొబ్బరి పంట విరివిగా పండుతుంది. దేశీయంగానే ఉత్పత్తి అవుతుండటంతో రవాణా ఖర్చు చాలా తక్కువ. ఎలాంటి ఇంపోర్ట్ ట్యాక్స్ ఉండవు. అందుకే మనకు తాజాగా ఉండే కొబ్బరి బొండాలు చౌకగా దొరుకుతాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికాలో 10 డాలర్లకు కొబ్బరి బొండం అమ్ముతున్న వీడియో వైరల్ అయ్యాక, సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. &quot;ఆ డబ్బుతో ఇండియాలో ఓ కుటుంబం మొత్తం చాలాసార్లు బొండాలు తాగొచ్చు&quot; అని ఒకరు కామెంట్ చేశారు. విదేశాలకు వెళ్తేనే మన దగ్గర దొరికే వస్తువుల విలువ తెలుస్తుంది&quot; అని మరొకరు కామెంట్ చేశారు.&lt;/p&gt;&lt;p&gt;భారత్&zwnj;లో కొబ్బరి సాగు సులభం కాబట్టి ధర తక్కువ. కానీ అమెరికాలో సాగు చాలా తక్కువ కాబట్టి, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. దిగుమతి ఖర్చులు, పన్నులు, ఇతర ఖర్చుల వల్ల అక్కడ ఒక్కో బొండం ధర 10 డాలర్లకు (సుమారు రూ.950) చేరుకుంది. అందుకే అంటారు ఎంత చెట్టుకు అంతే గాలి, పిండి కొద్దీ రొట్టె అని. అమెరికాలో లక్షల్లో ఆదాయం వచ్చినా ఆచితూచి ఖర్చులు పెట్టాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Nandini Arava</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/why-a-tender-coconut-is-a-10-dollar-luxury-in-the-usa-sgmt6wy"/>
        </item>
    </channel>
</rss>
