<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Sun, 14 Jun 2026 08:21:14 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/international" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[Train Rules: టికెట్ లేకుండా రైలు ప్ర‌యాణం చేస్తే.. పాకిస్థాన్‌లో ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/pakistan-train-rules-what-happens-if-you-travel-without-a-ticket-in-pakistan-railways-3p4ohsb</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/pakistan-train-rules-what-happens-if-you-travel-without-a-ticket-in-pakistan-railways-3p4ohsb</guid>
            <pubDate>Tue, 26 May 2026 11:03:29 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Train Rules: పాకిస్తాన్&zwnj;లో రైలు ప్రయాణానికి సంబంధించిన నియమాలు కఠినంగా ఉంటాయి. టికెట్ లేకుండా ట్రైన్&zwnj;లో ప్రయాణిస్తే భారీ జరిమానాలు, జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత్&zwnj;లోలాగే అక్కడ కూడా రైల్వే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ksgz5yft49fbxgswqwjdqkfz,imgname-train-rules-1779759774202.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Train Rules: పాకిస్తాన్&zwnj;లో రైలు ప్రయాణానికి సంబంధించిన నియమాలు కఠినంగా ఉంటాయి. టికెట్ లేకుండా ట్రైన్&zwnj;లో ప్రయాణిస్తే భారీ జరిమానాలు, జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత్&zwnj;లోలాగే అక్కడ కూడా రైల్వే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పాకిస్తాన్ రైల్వే నిబంధనల ప్రకారం, టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తి పట్టుబడితే వెంటనే చర్యలు తీసుకుంటారు. ప్రయాణికుడు ఎక్కడి నుంచి ట్రైన్ ఎక్కాడో అంచనా వేసి, అక్కడి నుంచి పట్టుబడిన స్టేషన్ వరకు మొత్తం దూరానికి సంబంధించిన పూర్తి చార్జీ వసూలు చేస్తారు. రైల్వే చెకింగ్ సిబ్బంది ఈ ప్రక్రియను చాలా కఠినంగా అమలు చేస్తారు. ట్రైన్&zwnj;లో చట్టవిరుద్ధంగా ప్రయాణించడం అక్కడ పెద్ద తప్పుగా పరిగణిస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కేవలం టికెట్ ధర మాత్రమే కాదు, అదనంగా భారీ జరిమానా కూడా విధిస్తారు. ఉదాహరణకు ఒక ప్రయాణానికి అసలు టికెట్ ధర రూ.1000 అయితే, టికెట్ లేకుండా పట్టుబడిన వ్యక్తి మరో రూ.1000 జరిమానాగా చెల్లించాలి. అంటే మొత్తం రూ.2000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణికుడికి రెట్టింపు భారం పడుతుంది. ఈ విధానం వల్ల ప్రజలు టికెట్ తీసుకుని ప్రయాణించేలా రైల్వే శాఖ కఠిన చర్యలు అమలు చేస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;చెకింగ్ సమయంలో జరిమానా లేదా టికెట్ చార్జీ చెల్లించడానికి ప్రయాణికుడు నిరాకరిస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. అలాగే కావాలనే మోసం చేసే ఉద్దేశంతో టికెట్ లేకుండా ప్రయాణించినట్లు తేలితే, వెంటనే అతడిని తదుపరి స్టేషన్&zwnj;లో రైల్వే పోలీసులకు అప్పగిస్తారు. అక్కడి నుంచి కేసు చట్టపరమైన దిశగా వెళుతుంది. రైల్వే పోలీసులు సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడతారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రైల్వే పోలీసులు పట్టుకున్న తర్వాత ఆ వ్యక్తిని రైల్వే మేజిస్ట్రేట్ లేదా కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. కోర్టులో నేరం నిరూపితమైతే కఠిన శిక్షలు అమలవుతాయి. పాకిస్తాన్ రైల్వే చట్టం 1890 ప్రకారం, టికెట్ లేకుండా ప్రయాణించినట్లు రుజువైతే గరిష్ఠంగా మూడు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. దీనితో పాటు జరిమానా కూడా విధించవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పాకిస్తాన్ రైల్వే శాఖ తమ అధికారిక వెబ్&zwnj;సైట్, ప్రకటనల ద్వారా ప్రయాణికులకు తరచూ హెచ్చరికలు జారీ చేస్తోంది. టికెట్ లేకుండా ప్రయాణించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేస్తోంది. రైళ్ల&zwnj;లో ఆదాయ నష్టాన్ని తగ్గించడం, అక్రమ ప్రయాణాలను అరికట్టడం లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్&zwnj;లు కూడా నిర్వహిస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/pakistan-train-rules-what-happens-if-you-travel-without-a-ticket-in-pakistan-railways-3p4ohsb"/>
        </item>
        <item>
            <title><![CDATA[POK: పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో అస‌లేం జ‌రుగుతోంది.? ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి ఎందుకొస్తున్నారు.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/pok-protests-explained-why-are-people-taking-to-the-streets-in-pakistan-occupied-kashmir-3xh9dhl</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/pok-protests-explained-why-are-people-taking-to-the-streets-in-pakistan-occupied-kashmir-3xh9dhl</guid>
            <pubDate>Tue, 09 Jun 2026 17:37:31 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;POK: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెల&zwnj;కొన్నాయి. పాక్ ప్రభుత్వ విధానాలు, ఆర్థిక సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ ఇచ్చిన బంద్&zwnj;కు విశేష స్పంద&zwnj;న ల&zwnj;భించింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ktp47cnbgt4c030558n1jm6k,imgname-pok-1781006578347.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;POK: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెల&zwnj;కొన్నాయి. పాక్ ప్రభుత్వ విధానాలు, ఆర్థిక సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ ఇచ్చిన బంద్&zwnj;కు విశేష స్పంద&zwnj;న ల&zwnj;భించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పీఓకేలో నెలలుగా కొనసాగుతున్న అసంతృప్తి ఇటీవల మరింత తీవ్రరూపం దాల్చింది. స్థానిక ప్రజలు తమ రాజకీయ హక్కులు, ఆర్థిక ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ బంద్&zwnj;కు మద్ధతు ప్రకటించారు. అనేక పట్టణాల్లో మార్కెట్లు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రధాన రహదారులపై నిరసనకారులు బైఠాయించి రాకపోకలకు అంతరాయం కలిగించారు. స్థానికుల అభిప్రాయం ప్రకారం, పాక్ కేంద్ర ప్రభుత్వం తమ ప్రాంత ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్న భావన ప్రజల్లో బలపడుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నిరసనలను అణచివేసేందుకు పాక్ భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. పలు ప్రాంతాల్లో పోలీసులు, పారామిలిటరీ దళాలు భారీగా మోహరించాయి. ఈ క్రమంలో నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. స్థానిక మీడియా ప్రకారం కాల్పులు, టియర్ గ్యాస్ ప్రయోగాల కారణంగా పలువురు గాయపడ్డారు. ఇటీవల జరిగిన సంఘటనల్లో 11 మంది మరణించగా, 70 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. భద్రతా బలగాలకు చెందిన కొందరు అధికారులు కూడా ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పీఓకే అసెంబ్లీలో పాకిస్థాన్&zwnj;లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 రిజర్వు స్థానాలే తాజా ఆందోళనలకు ప్రధాన కారణంగా మారాయి. ఈ స్థానాల ద్వారా ఇస్లామాబాద్ తమ రాజకీయ ప్రభావాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తోందని జేఏఏసీ ఆరోపిస్తోంది. స్థానిక ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు విమర్శిస్తున్నారు. పీఓకే రాజకీయ వ్యవస్థలో ఇత&zwnj;రుల&zwnj; జోక్యం తగ్గించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రాజకీయ అంశాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా ఆందోళనలకు కారణమయ్యాయి. విద్యుత్ ధరలు, నిత్యావసర వస్తువుల ఖర్చులు పెరగడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం వంటి సమస్యలు స్థానికుల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా తమ ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ప్రయోజనాలు స్థానికులకు అందడం లేదని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో యువతలో అసంతృప్తి మరింత పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పీఓకేలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొన్ని దేశాలు తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా కెనడా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించాయి. కొన్ని ప్రాంతాల్లో టెలికం సేవలపై ఆంక్షలు విధించిన&zwnj;ట్లు కూడా హెచ్చరించాయి. పరిస్థితులు ఎప్పుడు మారుతాయో చెప్పలేని విధంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.&lt;/p&gt;&lt;h2&gt;పరిస్థితి ఎటు దారి తీస్తుంది?&lt;/h2&gt;&lt;p&gt;పీఓకేలో గత ఏడాది కూడా ఇలాంటి నిరసనలు జరిగినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి మరింత సంక్లిష్టంగా కనిపిస్తోంది. రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక హక్కులు, పరిపాలనా స్వేచ్ఛ వంటి అంశాలు కలిసి పెద్ద ఉద్యమంగా మారుతున్నాయి. జేఏఏసీపై నిషేధం విధించినప్పటికీ నిరసనలు ఆగకపోవడం పాక్ ప్రభుత్వానికి కొత్త సవాలుగా మారింది. భవిష్యత్తులో ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరిస్తుందా, లేక మరింత కఠిన చర్యలు తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/pok-protests-explained-why-are-people-taking-to-the-streets-in-pakistan-occupied-kashmir-3xh9dhl"/>
        </item>
        <item>
            <title><![CDATA[Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/pakistan-s-space-spy-network-6-surveillance-satellites-launched-in-16-months-with-china-s-help-raising-india-concerns-4xqlegf</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/pakistan-s-space-spy-network-6-surveillance-satellites-launched-in-16-months-with-china-s-help-raising-india-concerns-4xqlegf</guid>
            <pubDate>Wed, 10 Jun 2026 12:07:21 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Space War: పాకిస్థాన్ చైనా సాయంతో కేవలం 16 నెలల్లో 6 నిఘా ఉపగ్రహాలను ప్రయోగించి భారత్ సరిహద్దులపై నిరంతర నిఘా పెంచుతోంది. ఇది భారత భద్రతకు సవాలుగా మారింది. పాకిస్థాన్ ఏం ప్లాన్ చేస్తోంది? అసలు ఏం జరుగుతోంది?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ktnbqxesc3ahffq6a5x7hdte,imgname-----------------------2026-06-09t102432.279-1780980905433.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Space War: పాకిస్థాన్ చైనా సాయంతో కేవలం 16 నెలల్లో 6 నిఘా ఉపగ్రహాలను ప్రయోగించి భారత్ సరిహద్దులపై నిరంతర నిఘా పెంచుతోంది. ఇది భారత భద్రతకు సవాలుగా మారింది. పాకిస్థాన్ ఏం ప్లాన్ చేస్తోంది? అసలు ఏం జరుగుతోంది?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. ఇప్పుడు ఆ పోరు నింగిలోకి కూడా పాకింది. గత 16 నెలల కాలంలో పాకిస్థాన్ అనూహ్య వేగంతో అంతరిక్షంలో మరో కుట్రకు తెరలేపింది. కేవలం 16 నెలల్లోనే ఏకంగా ఆరు భూ-పరిశీలన (Earth-observation) ఉపగ్రహాలను పాక్ ప్రయోగించింది. దీని వెనుక చైనా హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఉపగ్రహాల ప్రధాన లక్ష్యం భారత భూభాగంపై, ముఖ్యంగా వ్యూహాత్మక ప్రాంతాలపై కన్నేసి ఉంచడమేనని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాక్ మధ్య పరిస్థితులు శాంతించినట్లు కనిపిస్తున్నా, తెరవెనుక పాకిస్థాన్ తన గూఢచారి వ్యవస్థను అంతరిక్షం ద్వారా బలోపేతం చేసుకుంటోంది. జనవరి 2025 నుండి ఏప్రిల్ 2026 మధ్య కాలంలో పాక్ ప్రయోగించిన ఈ శాటిలైట్లు ఇప్పుడు భారత్&zwnj;కు కొత్త తలనొప్పిగా మారాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పాకిస్థాన్ స్పేస్ ఏజెన్సీ &lsquo;సుపార్కో&rsquo; (SUPARCO) 1961లో ప్రారంభమైంది. అంటే మన ఇస్రో కంటే ముందే ఇది ఏర్పాటైనా, దశాబ్దాల పాటు దీని ప్రగతి చాలా నెమ్మదిగా సాగింది. గత కొన్ని దశాబ్దాల్లో పాక్ ప్రయోగించిన శాటిలైట్లు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. కేవలం 16 నెలల వ్యవధిలోనే ఆరు హై టెక్ శాటిలైట్లను నింగిలోకి పంపడం చూస్తుంటే, పాక్ ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తోందో అర్థమవుతుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజింగ్, హైపర్ స్పెక్ట్రల్, రిమోట్ సెన్సింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలు ఉన్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పాకిస్థాన్ సొంతంగా ఈ ఘనత సాధించడం అసాధ్యం. దీని వెనుక చైనా పూర్తి సహకారం ఉంది. చాలా శాటిలైట్లను చైనా రాకెట్ల ద్వారానే ప్రయోగించారు. కేవలం రాకెట్లే కాకుండా, శాటిలైట్ డిజైన్, టెక్నాలజీ ట్రాన్స్&zwnj;ఫర్, డేటా షేరింగ్&zwnj;లో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. చైనాకు చెందిన &lsquo;యావోగాన్, గావోఫెన్&rsquo; శాటిలైట్ నెట్&zwnj;వర్క్&zwnj;తో ఈ పాక్ శాటిలైట్లు అనుసంధానమైతే, భారత్ కదలికలను సెకన్ల వ్యవధిలో పసిగట్టే ప్రమాదం ఉంది. అంటే పాకిస్థాన్ కళ్లు ఇప్పుడు అంతరిక్షంలో చైనా పవర్&zwnj;తో పనిచేస్తున్నాయనే హెచ్చరికలు ఆందోళన కలిగించే విషయం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఏప్రిల్ 2026లో ప్రయోగించిన PRSC-EO3 శాటిలైట్ గురించి షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. అమెరికాకు చెందిన స్పేస్ అనాలిసిస్ సంస్థ &lsquo;COMSPOC&rsquo; విశ్లేషణ ప్రకారం, ఈ శాటిలైట్ కక్ష్యను ప్రపంచం మొత్తం చూడటానికి కాకుండా, కేవలం దక్షిణాసియాను మాత్రమే లక్ష్యంగా చేసుకుని డిజైన్ చేశారు. దీనివల్ల పాకిస్థాన్, ఉత్తర భారత్, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలను రోజుకు అనేకసార్లు ఈ శాటిలైట్ స్కాన్ చేస్తుంది. దీంతో సైనిక మోహరింపులు, బంకర్లు, కొత్తగా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాల వివరాలన్నీ పాక్ చేతికి చిక్కే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పాక్ ప్రయోగించిన &lsquo;HS-1&rsquo; వంటి హైపర్ స్పెక్ట్రల్ శాటిలైట్లు అత్యంత ప్రమాదకరమైనవి. సాధారణ కెమెరాలకు చిక్కని వస్తువులను కూడా ఇవి గుర్తించగలవు. ఉదాహరణకు, అడవుల్లో లేదా కొండల్లో మారువేషంలో దాచిన ఆయుధాలను, ట్యాంకులను ఇవి ఈజీగా కనిపెడతాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అలాగే PRSC-EO2 వంటి శాటిలైట్లు ఏఐ సాయంతో డేటాను ప్రాసెస్ చేస్తాయి. అంటే భూమి మీద ఏ చిన్న మార్పు జరిగినా వెంటనే అలర్ట్ పంపిస్తాయి. ఇది మన సరిహద్దు భద్రతకు పెద్ద సవాలు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అంతరిక్ష రంగంలో భారత్ పాకిస్థాన్ కంటే ఎంతో ముందున్న మాట వాస్తవమే. అయితే, గత రెండేళ్లలో ఇస్రో కొన్ని సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంది. కొన్ని కీలకమైన ఎర్త్ అబ్జర్వేషన్, నావిగేషన్ మిషన్లు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇదే సమయంలో పాక్ తన సామర్థ్యాన్ని పెంచుకోవడం రక్షణ నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.&lt;/p&gt;&lt;p&gt;భవిష్యత్తులో యుద్ధాలు కేవలం భూమి మీద మాత్రమే కాదు, అంతరిక్షం నుండి వచ్చే సమాచారం ఆధారంగానే జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాక్ &lsquo;స్పేస్ గూఢచర్యాన్ని&rsquo; అడ్డుకోవడానికి భారత్ తన స్పేస్ డిఫెన్స్ సిస్టమ్&zwnj;ను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/pakistan-s-space-spy-network-6-surveillance-satellites-launched-in-16-months-with-china-s-help-raising-india-concerns-4xqlegf"/>
        </item>
        <item>
            <title><![CDATA[Rivers : ఇవేం దేశాల్రా బాబు.. కనీసం నదులు కూడా లేవా..!]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/countries-without-rivers-list-of-nations-with-no-permanent-rivers-in-the-world-5n522g0</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/countries-without-rivers-list-of-nations-with-no-permanent-rivers-in-the-world-5n522g0</guid>
            <pubDate>Fri, 24 Apr 2026 12:04:26 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ప్రవహించే నదులు మన జీవితంలో భాగం. నది లేని జీవితాన్ని ఊహించుకోలేం. కానీ ప్రపంచంలో ఒక్కటంటే ఒక్క శాశ్వత నది కూడా లేని దేశాలు చాలానే ఉన్నాయి. అవేవో తెలుసా..?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kpz2jgeqsrjx8yxsqdsyxmga,imgname-river-1777011868118.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ప్రవహించే నదులు మన జీవితంలో భాగం. నది లేని జీవితాన్ని ఊహించుకోలేం. కానీ ప్రపంచంలో ఒక్కటంటే ఒక్క శాశ్వత నది కూడా లేని దేశాలు చాలానే ఉన్నాయి. అవేవో తెలుసా..?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకు నదులే జీవనాధారం... ఇండియా వంటి వ్యవసాయ ఆధారిత దేశాలను నదులు లేకుండా ఊహించలేం. కానీ భౌగోళిక పరిస్థితుల వల్ల కొన్ని దేశాల్లో ఒక్కటంటే ఒక్క శాశ్వత నది కూడా లేదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. నదులు లేని దేశాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;సౌదీ అరేబియా&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;శాశ్వత నది లేని ప్రపంచంలోనే అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. ఇక్కడి విశాలమైన ఎడారిలో 'వాడిస్' అనే ఎండిన నదీ లోయలు ఉంటాయి. అప్పుడప్పుడు కురిసే వర్షాలకు ఇవి నిండినా, వెంటనే ఎండిపోతాయి. అందుకే ఈ దేశం భూగర్భ జలాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. అలాగే సముద్రపు ఉప్పునీటిని శుద్దిచేసి తాగునీటిగా వాడుకుంటుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;దుబాయ్, అబుదాబి వంటి ప్రపంచ ప్రఖ్యాత నగరాలు కలిగిన యూఏఈలో కూడా శాశ్వత నదులు లేవు. తీవ్రమైన పొడి వాతావరణం కారణంగా నదులు ఏర్పడలేవు. వర్షాకాలంలో అక్కడక్కడా లోయల్లో నీరున్నా, అవి ఎక్కువ కాలం నిలవవు. అందుకే తమ రోజువారీ అవసరాల కోసం ఈ దేశం సముద్రపు నీటిని శుద్ధి చేసే అత్యాధునిక డిసాలినేషన్ ప్లాంట్లపై ఆధారపడుతుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఖతార్&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఖతార్ భూభాగం మొత్తం చదునైన ఎడారి. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. అందుకే నదులు ఏర్పడవు. దేశంలో మంచినీటి సరస్సులు గానీ, ప్రవాహాలు గానీ లేవు. భూగర్భ జలాలు ఉన్నా అవి చాలా పరిమితం. ఇక్కడ కూడా ప్రజల దాహాన్ని తీర్చేది డిసాలినేషన్ ప్లాంట్లే.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;కువైట్&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;కువైత్ దేశ సరిహద్దుల్లో ఒక్క నది గానీ, సరస్సు గానీ లేదు. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం వల్ల ఇక్కడ సహజంగా మంచినీటిని నిల్వ చేయడం అసాధ్యం. చారిత్రకంగా నీటి కొరతే ఈ ప్రాంతంలో జనావాసాలను ప్రభావితం చేసింది. ప్రస్తుతం సముద్రపు నీటిని శుద్ధి చేసి తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;బహ్రెయిన్&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;బహ్రెయిన్&zwnj;లో నదులు లేవు. కానీ ఒకప్పుడు సముద్ర మట్టానికి దిగువన సహజసిద్ధమైన మంచినీటి ఊటలు ఉండేవి. కాలక్రమేణా అధిక వాడకం వల్ల ఈ ఊటలు చాలా వరకు ఎండిపోయాయి. ఇప్పుడు ఇక్కడ కూడా నీటి అవసరాలకు డిసాలినేషన్ ప్లాంట్లే ఆధారం.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఓమన్&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఓమన్&zwnj;లో శాశ్వత నదులు లేవు. కానీ రుతుపవన వర్షాల తర్వాత నీటితో నిండే లోయలు (వాడిస్) చాలా ఉన్నాయి. వర్షాల తర్వాత ఇవి వ్యవసాయానికి తాత్కాలికంగా నీటిని అందిస్తాయి. అయినా ఇక్కడి ఏ ప్రవాహాన్ని పూర్తిస్థాయి నదిగా పరిగణించరు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;మాల్టా&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;మాల్టాలోనూ నదులు లేవు. భారీ వర్షాలు కురిసినప్పుడు మాత్రమే చిన్న చిన్న వాగులు ఏర్పడతాయి. అవి కూడా కొద్దికాలమే ప్రవహించి ఎండిపోతాయి. ఈ ద్వీపంలోని సున్నపురాయి నేల వల్ల వర్షపు నీరు వేగంగా భూమిలోకి ఇంకిపోతుంది. ఇక్కడ భూగర్భ జలాలే మంచినీటి సరఫరాలో కీలక పాత్ర పోషిస్తాయి.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;మాల్దీవులు&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;మాల్దీవులు పల్లపు ప్రాంతంలో ఉండే పగడపు దీవుల సముదాయం. నదులు ఏర్పడటానికి అవసరమైన ఎత్తైన ప్రదేశాలు ఇక్కడ లేవు. అందుకే ఇక్కడ వాగులు, సరస్సులు వంటి మంచినీటి వనరులు ఏవీ కనిపించవు. వర్షపు నీరు నేరుగా భూమిలోకి ఇంకిపోతుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;వాటికన్ సిటీ&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ప్రపంచంలోనే అతిచిన్న దేశమైన వాటికన్ సిటీలో నదులు ప్రవహించడానికి సరిపడా స్థలం కూడా లేదు. ఇది కేవలం 0.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే కలిగి ఉంటుంది... కాబట్టి నదులు ఏర్పడే అవకాశమే లేకుండాపోయింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచంలో సుమారు 19 దేశాల్లో నదులు లేవు. వీటిలో ఎక్కువ శాతం మధ్యప్రాచ్య దేశాలు (Middle East) లేదా చిన్న ద్వీప దేశాలు. అయితే .నదులు లేకుండా ఈ దేశాల్లో ప్రజలు ఎలా జీవిస్తున్నాయి..? అనేగా మీ ప్రశ్న. అయితే నదులు లేకపోయినా ఈ దేశాలు అధునాతన సాంకేతికతతో అభివృద్ధి చెందుతున్నాయి. మంచినీటి కోసం వారు అనుసరించే పద్ధతులు..&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;డీశాలినేషన్ (Desalination&lt;/strong&gt;) : సముద్రపు నీటి నుండి ఉప్పును తొలగించి స్వచ్ఛమైన నీరుగా మార్చడం.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;భూగర్భ జలాలు (Ground Water)&lt;/strong&gt; : భూమి లోపల ఉన్న పురాతన నీటి నిల్వలను బోర్ల ద్వారా వెలికి తీయడం.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;నీటి శుద్ధి (Water Recycling)&lt;/strong&gt; : వాడిన నీటిని మళ్ళీ శుద్ధి చేసి వ్యవసాయానికి లేదా పరిశ్రమలకు వాడటం.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;వాడీలు (Wadis)&lt;/strong&gt; : వర్షాకాలంలో వచ్చే తాత్కాలిక ప్రవాహాలను ఆనకట్టల ద్వారా నిల్వ చేయడం.&lt;/p&gt;&lt;p&gt;నీరు ప్రాణాధారం. నదులు లేని దేశాలు నీటి విలువను గుర్తించి, ప్రతి చుక్కను పొదుపుగా వాడుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రకృతి ప్రసాదించిన వనరులు లేకపోయినా, మానవ మేథస్సుతో ఆ కొరతను ఎలా అధిగమించవచ్చో ఈ దేశాలు నిరూపిస్తున్నాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/countries-without-rivers-list-of-nations-with-no-permanent-rivers-in-the-world-5n522g0"/>
        </item>
        <item>
            <title><![CDATA[IND vs PAK : పాకిస్థాన్ సాయం కోరిన ఇండియా.. ఏం చేసిందో తెలుసా..?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/pakistan-navy-helps-indian-cargo-ship-in-arabian-sea-emergency-5rc1upa</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/pakistan-navy-helps-indian-cargo-ship-in-arabian-sea-emergency-5rc1upa</guid>
            <pubDate>Tue, 05 May 2026 15:23:18 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ఇండియా, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేసినా భగ్గుమనే స్థాయిలో శత్రుత్వం ఉంది. ఇలాంటి సమయంలోనూ ఓ దేశం మరో దేశానికి సహకారం అందిస్తూ సోదరభావాన్ని చాటుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kp32xghk04g5beewxeay9ptm,imgname-cargo-ship-1776072704563.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ఇండియా, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేసినా భగ్గుమనే స్థాయిలో శత్రుత్వం ఉంది. ఇలాంటి సమయంలోనూ ఓ దేశం మరో దేశానికి సహకారం అందిస్తూ సోదరభావాన్ని చాటుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;India vs Pakistan : కుటుంబంలో గొడవలు సర్వసాధారణం... కానీ కుటుంబసభ్యులకు ఏదైనా ఆపద వస్తే అందరూ ఏకమవుతారు. ఇదే ఇండియా-పాకిస్థాన్ విషయంలో కూడా జరుగుతోంది... ఇరు దేశాలు బద్దశత్రువులైనా అవసరం అయినపుడు ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో భారత్ సాయం చేసింది... ఇప్పుడు పాకిస్థాన్ వంతు వచ్చింది. భారతీయులు నడి సముద్రంలో ప్రమాదంలో చిక్కుకోగా మానవత్వంతో స్పందించిన పాక్ సాయం చేసింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇటీవల గుజరాత్&zwnj;లోని పోర్&zwnj;బందర్ పోర్ట్ నుండి మస్కట్ కు కార్గో షిప్&zwnj; 'ఎంవి గౌతమ్' బయలుదేరింది. అయితే ఈ షిప్ అరేబియా సముద్రంలో ప్రయాణిస్తుండగా టెక్నికల్ ప్రాబ్లమ్&zwnj; ఏర్పడింది... దీంతో కంట్రోల్ కోల్పోయి నీటిపై కొట్టుకుపోవడం మొదలైంది. ఇలా సముద్రం మధ్యలో ప్రమాదంలో చిక్కుకోవడంతో షిప్ లోని సిబ్బంది కంగారుపడిపోయారు... సాయం కోరగా పాకిస్థాన్ పాజిటివ్ గా స్పందించింది. మానవత్వాన్ని చాటుకుంటూ ప్రమాదంలో ఉన్న షిప్ సిబ్బందిని కాపాడింది పాక్ నేవి.&lt;/p&gt;&lt;p&gt;ప్రమాద సమయంలో ఎంవి గౌతమ్ షిప్ లో ఆరుగురు భారతీయులు, ఓ ఇండోనేషియా పౌరుడు ఉన్నారు. షిప్ ఆగిపోవడంతో మొదట ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్&zwnj;కు సమాచారం అందించారు సిబ్బంది. వాళ్లే పాకిస్థాన్&zwnj;కు సహాయం కోసం సమాచారం పంపారు. ఆ సమయంలో పాకిస్థాన్ నేవీకి చెందిన ఓ నిఘా నౌక అటువైపే పెట్రోలింగ్ చేస్తోంది. సమాచారం అందగానే పాక్ నేవీ అధికారులు వెంటనే 'ఎంవి గౌతమ్' దగ్గరకు చేరుకున్నారు. షిప్&zwnj;లోని సిబ్బందికి అవసరమైన మంచి నీళ్లు, ఆహారం, మందులు అందించారు.&lt;/p&gt;&lt;p&gt;ఇలా అంతర్జాతీయ జలాల్లో ప్రమాదాలు జరిగితే దగ్గర్లోని దేశం సహాయం అందించాలి. ఇలా అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే పాకిస్థాన్ ఈ సహాయం చేసింది. గత నెలలో కూడా అరేబియా సముద్రంలో ఇలాంటి ఎమర్జెన్సీ కాల్ రావడంతో పాక్ నేవీ స్పందించి 18 మంది విదేశీ నావికులను కాపాడింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/pakistan-navy-helps-indian-cargo-ship-in-arabian-sea-emergency-5rc1upa"/>
        </item>
        <item>
            <title><![CDATA[USA: అమెరికా సైన్యానికి వేరే దేశాల్లో ఏం పని.? ఆ దేశాలు వారిని ఎందుకు అనుమ‌తిస్తాయి.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/usa-why-does-the-us-military-stay-in-other-countries-reasons-behind-americas-global-army-bases-gg18mbr</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/usa-why-does-the-us-military-stay-in-other-countries-reasons-behind-americas-global-army-bases-gg18mbr</guid>
            <pubDate>Fri, 08 May 2026 11:08:23 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;USA: అమెరికా త&zwnj;న సైన్యాన్ని కేవలం ఆ దేశ సరిహద్దులకే పరిమితం చేయ&zwnj;దు. యూరప్&zwnj;, ఆసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా ఇలా ప్రపంచంలోని 80కిపైగా దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. అయితే వేరే దేశాల్లో అమెరికాకు ఏం ప&zwnj;ని అనే సందేహం ఎప్పుడైనా వ&zwnj;చ్చిందా.?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kr3120r4hs420q3cyj4060nn,imgname-usa--5--1778218238723.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;USA: అమెరికా త&zwnj;న సైన్యాన్ని కేవలం ఆ దేశ సరిహద్దులకే పరిమితం చేయ&zwnj;దు. యూరప్&zwnj;, ఆసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా ఇలా ప్రపంచంలోని 80కిపైగా దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. అయితే వేరే దేశాల్లో అమెరికాకు ఏం ప&zwnj;ని అనే సందేహం ఎప్పుడైనా వ&zwnj;చ్చిందా.?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా ఇతర దేశాల్లో సైన్యాన్ని ఉంచడాన్ని &ldquo;ఫార్వర్డ్ ప్రెజెన్స్&rdquo; వ్యూహంగా పిలుస్తారు. అంటే ప్రమాదం అమెరికా వద్దకు వచ్చే వరకు ఎదురుచూడకుండా, ముందుగానే కీలక ప్రాంతాల్లో సైన్యాన్ని సిద్ధంగా ఉంచడం. ఇలా చేయడం వల్ల ప్రపంచంలో ఎక్కడ యుద్ధం, ఉగ్రదాడి లేదా భద్రతా సంక్షోభం వచ్చినా అమెరికా వెంటనే స్పందించగలుగుతుంది. ఈ సైనిక స్థావరాలు తాత్కాలిక శిబిరాలు కావు. ఇవి దశాబ్దాలుగా కొనసాగుతున్న భారీ రక్షణ వ్యవస్థలో భాగం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా సైన్యం ఇతర దేశాల్లో ఉండటానికి ప్రధాన కారణం తమ మిత్రదేశాలకు రక్షణ కల్పించడం. ఉదాహరణకు జ&zwnj;పాన్, సౌత్ కొరియా వంటి దేశాలు అమెరికా సైన్యాన్ని తమ దేశాల్లో ఉంచేందుకు అనుమతిస్తాయి. ఎందుకంటే వారికి నార్త్ కొరియా, చైనా నుంచి నుంచి భద్రతా ముప్పు ఉందని భావిస్తుంటారు. అలాగే యూరప్&zwnj;లోని అమెరికా సైనిక స్థావరాలు నాటో సభ్య దేశాలకు మద్ధతు ఇస్తూ, ర&zwnj;ష్యా నుంచి వచ్చే ప్రమాదాలను అడ్డుకునే రక్షణ గోడలా పనిచేస్తాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా మిత్రదేశాలకు &ldquo;న్యూక్లియర్ అంబ్రెలా&rdquo; అనే అణు భద్రతా హామీ కూడా ఇస్తుంది. అంటే ఎవరు ఆ దేశాలపై అణు దాడి చేస్తే, అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుందనే సంకేతం. దీంతో చిన్న దేశాలు తమకు తామే భారీ అణ్వస్త్ర ప్రోగ్రామ్&zwnj;లు అభివృద్ధి చేయాల్సిన అవసరం తగ్గుతుంది. అలాగే శత్రు దేశాలు కూడా దాడి చేయడానికి వెనుకడుగు వేస్తాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇతర దేశాల్లో ముందుగానే సైనిక బలగాలు ఉండటం వల్ల అమెరికా అత్యవసర పరిస్థితుల్లో చాలా వేగంగా చర్యలు తీసుకోగలుగుతుంది. ఉదాహరణకు యుద్ధం, ఉగ్రదాడి, ప్రకృతి విపత్తు వంటి ఘటనలు జరిగితే అమెరికా ప్రధాన భూభాగం నుంచి సైన్యాన్ని పంపేందుకు సమయం పడుతుంది. కానీ సమీప దేశాల్లో ఉన్న స్థావరాల నుంచి వెంటనే సైనికులు, యుద్ధవిమానాలు, ఆయుధాలు పంపే అవకాశం ఉంటుంది. ఇటీవ&zwnj;ల ఇరాన్&zwnj;లో జ&zwnj;రిగిన యుద్ధ&zwnj;మే దీనికి సాక్ష్యం. ఇరాన్&zwnj;పై అమెరికా భూభాగంపై నుంచి కాకుండా.. దుబాయ్ వంటి మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న స్థావ&zwnj;రాల నుంచి దాడులు చేసిన విష&zwnj;యం తెలిసిందే.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా సైనిక వ్యూహం కేవలం రక్షణకే పరిమితం కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో కూడా ముడిపడి ఉంటుంది. ప్రపంచ వాణిజ్యం సముద్ర మార్గాలు, చమురు రవాణా మార్గాలు, అంతర్జాతీయ ట్రేడ్ నెట్&zwnj;వర్క్&zwnj;లపై ఆధారపడి ఉంటుంది. అందుకే కీలక సముద్ర మార్గాలు, చమురు ప్రాంతాల దగ్గర అమెరికా సైనిక ఉనికిని కొనసాగిస్తుంది. దీని ద్వారా ప్రపంచ వ్యాపార ప్రవాహం సజావుగా సాగడంతో పాటు, అమెరికా ఆర్థిక ప్రయోజనాలు, విదేశాల్లో ఉన్న తమ పౌరుల భద్రతను కూడా కాపాడుతుంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/usa-why-does-the-us-military-stay-in-other-countries-reasons-behind-americas-global-army-bases-gg18mbr"/>
        </item>
        <item>
            <title><![CDATA[Donald Trump: భార‌త్‌ను న‌ర‌కంతో పోల్చిన ట్రంప్‌.. ఒక‌సారి వ‌చ్చి చూడ‌మ‌ని ఇరాన్ కౌంట‌ర్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/donald-trump-controversy-iran-slams-remarks-comparing-india-to-hell-global-reactions-explained-iiq7py8</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/donald-trump-controversy-iran-slams-remarks-comparing-india-to-hell-global-reactions-explained-iiq7py8</guid>
            <pubDate>Fri, 24 Apr 2026 14:15:38 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Donald Trump: నిత్యం ఏదో ఒక వివాదాస్ప&zwnj;ద వ్యాఖ్య&zwnj;లు చేసే అమెరికా అధ్య&zwnj;క్షుడు ట్రంప్ తాజాగా సోషల్ మీడియా షేర్ ప్రస్తుతం పెద్ద వివాదానికి దారితీసింది. భారత్&zwnj;ను అవమానించేలా ఉన్న ఒక లేఖను ఆయన షేర్ చేయడంతో ఈ అంశం అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kpz94y4pxtpzm3e5ea0pa7dc,imgname-donald-trump--2--1777018763413.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Donald Trump: నిత్యం ఏదో ఒక వివాదాస్ప&zwnj;ద వ్యాఖ్య&zwnj;లు చేసే అమెరికా అధ్య&zwnj;క్షుడు ట్రంప్ తాజాగా సోషల్ మీడియా షేర్ ప్రస్తుతం పెద్ద వివాదానికి దారితీసింది. భారత్&zwnj;ను అవమానించేలా ఉన్న ఒక లేఖను ఆయన షేర్ చేయడంతో ఈ అంశం అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సేవేజ్ రాసిన ఒక లేఖలో భారత్&zwnj;, చైనా దేశాలను తీవ్రంగా విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ లేఖను ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్&zwnj;ఫామ్ అయిన ట్రూత్ సోష&zwnj;ల్&zwnj;లో రీషేర్ చేశారు. ఇందులో భారత్&zwnj;ను న&zwnj;ర&zwnj;కంతో పోల్చడం తీవ్ర విమర్శలకు దారితీసింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు అవగాహన లేని, అనుచితమైనవి అని స్పష్టం చేశారు. భారత్-అమెరికా సంబంధాలు పరస్పర గౌరవం, భాగస్వామ్య ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇదిలా ఉండగా, అమెరికా ప్రతినిధి క్రిస్టోఫ&zwnj;ర్ ఎల్మ్స్ మరో కోణాన్ని వెల్లడించారు. ట్రంప్ వ్యక్తిగతంగా భారత్&zwnj;పై మంచి అభిప్రాయం కలిగి ఉన్నారని, ముఖ్యంగా ప్రధాని న&zwnj;రేంద్ర మోదీతో తనకు స్నేహం ఉందని ఆయన చెప్పినట్లు తెలిపారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ వివాదానికి ప్రధాన కారణం అమెరికాలో అమలులో ఉన్న &ldquo;బర్త్&zwnj;రైట్ సిటిజన్&zwnj;షిప్&rdquo; విధానం. దీనిపై ట్రంప్ ఎప్పటి నుంచో వ్యతిరేకంగా ఉన్నారు. ఆసియా దేశాల నుంచి, ముఖ్యంగా భారత్&zwnj;, చైనా నుంచి వచ్చే వలసదారులపై కొన్ని ఆరోపణలు చేయడం ఈ వివాదానికి దారి తీసింది. టెక్ రంగంలో ఉద్యోగాలపై కూడా వ్యాఖ్యలు చేయడం విమర్శలకు కారణమైంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ వివాదంలో భారత్&zwnj;కు మద్ధతుగా ఇరాన్ ఎంబసీలు కూడా స్పందించాయి. ముంబయిలోని ఇరాన్ ప్రతినిధులు భారత్ గొప్ప నాగరికత కలిగిన దేశమని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి, సంస్కృతి గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలని సూచించారు. ఇందులో భాగంగానే మ&zwnj;హారాష్ట్రాలోని ప&zwnj;లు టూరిస్ట్ ప్లేసెస్&zwnj;కి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.&lt;/p&gt;&lt;p&gt;Maybe someone should book a one-way cultural detox for Mr. #Trump, it might just reduce the random bakwaas Kabhi #India aa ke dekho, phir bolna. pic.twitter.com/kkocLZ31XX&lt;/p&gt;&lt;p&gt;&mdash; Iran in Mumbai (@IRANinMumbai) April 23, 2026&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/donald-trump-controversy-iran-slams-remarks-comparing-india-to-hell-global-reactions-explained-iiq7py8"/>
        </item>
        <item>
            <title><![CDATA[USA: అమెరికాలో వెలుగులోకి మ‌రో స్కామ్‌.. భార‌తీయ విద్యార్థుల్లో ఆందోళ‌న‌, అస‌లేం జ‌రుగుతోంది.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/usa-opt-scam-shock-why-indian-students-in-america-are-worried-about-new-ice-investigation-k368zo4</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/usa-opt-scam-shock-why-indian-students-in-america-are-worried-about-new-ice-investigation-k368zo4</guid>
            <pubDate>Wed, 13 May 2026 15:42:02 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;USA: అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు కీలకంగా భావించే OPT (ఆప్ష&zwnj;న&zwnj;ల్ ప్రాక్టిక&zwnj;ల్ ట్రైనింగ్&zwnj;)ప్రోగ్రామ్ చుట్టూ వివాదం నెలకొంది. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్&zwnj;ఫోర్స్&zwnj;మెంట్ (ICE) తాజాగా చేసిన ప్రకటన పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01krgbp4fs5a8qv93p46pwgarb,imgname-usa--6--1778665591289.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;USA: అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు కీలకంగా భావించే OPT (ఆప్ష&zwnj;న&zwnj;ల్ ప్రాక్టిక&zwnj;ల్ ట్రైనింగ్&zwnj;)ప్రోగ్రామ్ చుట్టూ వివాదం నెలకొంది. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్&zwnj;ఫోర్స్&zwnj;మెంట్ (ICE) తాజాగా చేసిన ప్రకటన పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికాలో F-1 స్టూడెంట్ వీసాతో చదువుతున్న విదేశీ విద్యార్థులకు చదువు పూర్తయ్యాక పని అనుభవం కల్పించే విధానమే OPT. సాధారణంగా ఇది 12 నెలలపాటు ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సులు పూర్తి చేసిన వారికి అదనంగా 24 నెలల పొడిగింపు లభిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు అమెరికన్ కంపెనీల్లో పనిచేసి అనుభవం సంపాదిస్తారు. చాలామంది తరువాత H-1B ఉద్యోగ వీసాకు మారే అవకాశాన్ని కూడా పొందుతున్నారు. అందుకే అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులకు OPT చాలా కీలకం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ICE అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అనేక అనుమానాస్పద అంశాలు బయటపడ్డాయని చెబుతున్నారు. కొందరు విద్యార్థులు వాస్తవానికి పనిచేయకపోయినా ఉద్యోగం చేస్తున్నట్లు చూపించినట్లు గుర్తించినట్లు సమాచారం. దర్యాప్తులో లేని కంపెనీల్లో ఉద్యోగాలు చూపించడం, మూసివేసిన కార్యాలయాలను ఉద్యోగ సంస్థలుగా నమోదు చేయడం, ఒకే చిరునామాలో అనేక కంపెనీలు పనిచేస్తున్నట్లు చూపించడం, విదేశాల్లో నుంచే ఉద్యోగ నిర్వహణ చేస్తున్నట్లు గుర్తించడం, షెల్ కంపెనీల ద్వారా వీసా నిబంధనలు తప్పించుకోవడం వంటి విష&zwnj;యాలు వెలుగులోకి వ&zwnj;చ్చాయి. ICE యాక్టింగ్ డైరెక్టర్ టాడ్ లైయోన్స్ ప్రకారం, OPT వ్యవస్థ కొంతమంది చేతుల్లో మోసాలకు మార్గంగా మారిందని తెలిపారు. ICE ప్రకారం, ఇప్పటివరకు పరిశీలించిన టాప్ 25 OPT ఉద్యోగ సంస్థల్లోనే 10 వేల మందికి పైగా విద్యార్థులు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ వ్యవహారాన్ని అమెరికా ప్రభుత్వం కేవలం వీసా ఉల్లంఘనగా మాత్రమే చూడడం లేదు. జాతీయ భద్రతకు ముప్పుగా కూడా పరిగణిస్తోంది. కొన్ని కేసుల్లో ఉద్యోగ మోసాలు, ఆర్థిక నేరాలు, గూఢచర్య ఆరోపణలు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అమెరికా హోమ్&zwnj;ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రస్తుతం OPT విధానాన్ని పూర్తిగా సమీక్షిస్తోంది. పన్ను నిబంధనలు, ఉద్యోగ ధృవీకరణ, విద్యార్థుల పని విధానం వంటి అంశాలను కఠినంగా పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికాలో విదేశీ విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ. ముఖ్యంగా ఐటీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సుల్లో చదివే విద్యార్థులు ఎక్కువగా OPTపై ఆధారపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికా దర్యాప్తు భారతీయ విద్యార్థుల్లో ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా కన్సల్టెన్సీల ద్వారా ఉద్యోగాలు పొందినవారిపై అదనపు పరిశీలన ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇకపై ఉద్యోగ సంస్థల ఫిజిక&zwnj;ల్ వెరిఫికేష&zwnj;న్ ఉండొచ్చు. ఫేక్ కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్ట&zwnj;నున్నారు. OPT దరఖాస్తులపై కఠిన పరిశీలనతో పాటు వీసా రద్దు, డిపోర్టేషన్ వంటి చర్యలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఇమిగ్రేషన్ విధానాల్లో కఠిన మార్పులు కనిపిస్తున్నాయి. విదేశీ విద్యార్థుల ప్రవేశం, ఉద్యోగ వీసాలు, అంతర్జాతీయ కార్మిక విధానాలపై మరింత కఠిన నిబంధనలు తీసుకొస్తున్నట్లు సంకేతాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలపై సుంకాలు పెంచడం, వీసా ప్రక్రియలను కఠినతరం చేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు OPT వ్యవస్థపై దర్యాప్తు కూడా అదే దిశగా చూస్తున్నారు. అమెరికాలో చదువుతున్న విద్యార్థులు చట్టబద్ధమైన కంపెనీల్లోనే పనిచేయాలని, అన్ని వీసా నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో OPT, H-1B వీసా విధానాల్లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/usa-opt-scam-shock-why-indian-students-in-america-are-worried-about-new-ice-investigation-k368zo4"/>
        </item>
        <item>
            <title><![CDATA[ప్రపంచంలో ప్రాస్టిట్యూషన్ అనుమతి ఉన్న దేశాలేవో తెలుసా.? భారతదేశంలో పరిస్థితి ఏంటి.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/laws-sex-work-laws-around-the-world-which-countries-allow-prostitution-and-what-is-indias-legal-position-kp9tzix</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/laws-sex-work-laws-around-the-world-which-countries-allow-prostitution-and-what-is-indias-legal-position-kp9tzix</guid>
            <pubDate>Sat, 06 Jun 2026 18:28:08 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Laws: ప్రాస్టిట్యూషన్ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తూనే ఉంటుంది. కొన్ని దేశాలు దీనిని చట్టబద్ధమైన వృత్తిగా గుర్తించగా, మరికొన్ని దేశాలు పూర్తిగా నిషేధించాయి. భారత్&zwnj;లో కూడా ఈ అంశంపై తరచుగా చర్చ జరుగుతుంది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ktef6f8r8z1qgar16dkgdvzr,imgname-laws-1780749647128.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Laws: ప్రాస్టిట్యూషన్ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తూనే ఉంటుంది. కొన్ని దేశాలు దీనిని చట్టబద్ధమైన వృత్తిగా గుర్తించగా, మరికొన్ని దేశాలు పూర్తిగా నిషేధించాయి. భారత్&zwnj;లో కూడా ఈ అంశంపై తరచుగా చర్చ జరుగుతుంది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత్&zwnj;లో ఇద్దరు పెద్దవాళ్లు పరస్పర అంగీకారంతో చేసే ప్రాస్టిట్యూషన్ నేరంగా పరిగణించరు. అయితే దీనికి సంబంధించిన కొన్ని కార్యకలాపాలు మాత్రం చట్ట విరుద్ధంగా ఉంటాయి. ప్రత్యేకంగా ప్రాస్టిట్యూషన్ గృహాలు (బ్రోతెల్స్) నిర్వహించడం, ప్రాస్టిట్యూషన్ కోసం మధ్యవర్తిత్వం చేయడం, ఎవరినైనా బలవంతంగా ఈ వృత్తిలోకి నెట్టడం, మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) వంటి చర్యలు చట్టపరంగా నేరాలు. భారత సుప్రీంకోర్టు కూడా ప్రాస్టిట్యూషన్ వర్కర్లకు ఇతర పౌరుల మాదిరిగానే రాజ్యాంగం కల్పించిన జీవన హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచంలోని కొన్ని దేశాలు ప్రాస్టిట్యూషన్ వర్క్&zwnj;ను నియంత్రిత పద్ధతిలో అనుమతిస్తున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;* &amp;nbsp;నెద&zwnj;ర్లాండ్స్&zwnj;లో ప్రాస్టిట్యూషన్ చట్టబద్ధం. అక్కడ లైసెన్స్ పొందిన ప్రాస్టిట్యూషన్ గృహాలు నిర్వహించేందుకు అనుమతి ఉంటుంది. ప్రాస్టిట్యూషన్ వర్కర్లు పన్నులు చెల్లిస్తూ కొన్ని కార్మిక హక్కులను కూడా పొందగలరు.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;* &amp;nbsp;జ&zwnj;ర్మ&zwnj;నీలో కూడా ప్రాస్టిట్యూషన్ ను చట్టబద్ధమైన వృత్తిగా గుర్తించారు. అక్కడ ఉద్యోగ ఒప్పందాలు చేసుకునే అవకాశం, ఆరోగ్య సేవలు, సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.&lt;/p&gt;&lt;p&gt;* &amp;nbsp;స్విట్జ&zwnj;ర్లాండ్&zwnj;లో ప్రాస్టిట్యూషన్ వర్క్ చట్టబద్ధమే. అక్కడ పనిచేసే వారు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కార్మిక హక్కులు కూడా వారికి లభిస్తాయి.&lt;/p&gt;&lt;p&gt;* &amp;nbsp;బెల్జియం ఇటీవల ప్రాస్టిట్యూషన్ వర్కర్ల హక్కులను బలోపేతం చేసే చర్యలు చేపట్టింది. ఉద్యోగ భద్రత, భీమా, సామాజిక రక్షణ వంటి అంశాల్లో వారికి మద్ధతు ఇస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;* న్యూజిలాండ్&zwnj; 2003లో చట్టాల్లో మార్పులు చేసింది. అప్పటి నుంచి పరస్పర అంగీకారంతో జరిగే ప్రాస్టిట్యూషన్ వర్క్&zwnj;ను నేరాల జాబితా నుంచి తొలగించారు.&lt;/p&gt;&lt;p&gt;* ఆస్ట్రేలియాలో జాతీయ స్థాయిలో ఒకే విధమైన చట్టం లేదు. ప్రతి రాష్ట్రానికి వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇది చట్టబద్ధం కాగా, మరికొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పరిమితులు అమలులో ఉన్నాయి.&lt;/p&gt;&lt;p&gt;* స్వీడ&zwnj;న్&zwnj;లో ప్రత్యేక విధానం అమలులో ఉంది. అక్కడ ప్రాస్టిట్యూషన్ వర్కర్&zwnj;ను నేరస్థుడిగా పరిగణించరు. కానీ సేవలను కొనుగోలు చేసే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;* &amp;nbsp;థాయ్&zwnj;లాండ్&zwnj;లో ప్రాస్టిట్యూషన్ వర్క్ సాంకేతికంగా చట్ట విరుద్ధమే. అయినప్పటికీ కొన్ని నగరాల్లో ఇది బహిరంగంగా కనిపించే వాస్తవ పరిస్థితి ఉంది.&lt;/p&gt;&lt;p&gt;* &amp;nbsp;జ&zwnj;పాన్&zwnj;లో డబ్బు తీసుకుని నేరుగా ప్రాస్టిట్యూషన్ సేవలు అందించడం నిషేధితమే. అయితే అనేక రకాల అడల్ట్ ఎంటర్&zwnj;టైన్&zwnj;మెంట్ సేవలకు చట్టబద్ధ అనుమతులు ఉన్నాయి. దీంతో చట్టం, ఆచరణ మధ్య తేడా కనిపిస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;* సింగ&zwnj;పూర్&zwnj;లో కొన్ని నియంత్రిత ప్రాంతాల్లో, ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రాస్టిట్యూషన్ వర్క్&zwnj;కు అనుమతి ఉంది. అనుమతి లేని కార్యకలాపాలపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్ర&zwnj;పంచ ఆరోగ్య సంస్థ (WHO), UNAIDS వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రాస్టిట్యూషన్ వర్క్&zwnj;ను పూర్తిగా నేరంగా పరిగణించడం వల్ల ఆరోగ్య సేవలకు చేరుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చని చెబుతున్నాయి. వారి అభిప్రాయం ప్రకారం, ప్రాస్టిట్యూషన్ వర్కర్లు చట్టపరమైన భయం లేకుండా ఉంటే ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలు, HIV నివారణ కార్యక్రమాలు, న్యాయ సహాయం వంటి సేవలను మరింత సులభంగా పొందగలుగుతారు. అందువల్ల ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన చట్టాలు, విధానాలు అమలులో ఉన్నాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/laws-sex-work-laws-around-the-world-which-countries-allow-prostitution-and-what-is-indias-legal-position-kp9tzix"/>
        </item>
        <item>
            <title><![CDATA[War: ఇరాన్ అమెరికా యుద్ధంలో.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రు ఎక్కువ ఖ‌ర్చు చేశారో తెలుసా.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/war-iran-vs-usa-war-who-spent-more-full-breakdown-of-military-expenses-and-impact-l0vw4rf</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/war-iran-vs-usa-war-who-spent-more-full-breakdown-of-military-expenses-and-impact-l0vw4rf</guid>
            <pubDate>Sun, 26 Apr 2026 14:20:48 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;War: దాదాపు 3 నెల&zwnj;లుగా సాగుతోన్న అమెరికా, ఇరాన్ యుద్ధానికి బ్రేక్ ప&zwnj;డింది. ప్ర&zwnj;స్తుతం ఇరు దేశాల మ&zwnj;ధ్య చ&zwnj;ర్చ&zwnj;లు సాగుతున్నాయి. ఈ నేప&zwnj;థ్యంలో ఈ యుద్ధంలో భారీగా డబ్బు, ఆయుధాలు వినియోగం అవుతున్నాయి. దీంతో ఎవరు ఎంత ఖర్చు చేశారు అన్నదానిపై చర్చ మొదలైంది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kq4f8jv7m9kfzh144st2e44e,imgname-war--3--1777192946535.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;War: దాదాపు 3 నెల&zwnj;లుగా సాగుతోన్న అమెరికా, ఇరాన్ యుద్ధానికి బ్రేక్ ప&zwnj;డింది. ప్ర&zwnj;స్తుతం ఇరు దేశాల మ&zwnj;ధ్య చ&zwnj;ర్చ&zwnj;లు సాగుతున్నాయి. ఈ నేప&zwnj;థ్యంలో ఈ యుద్ధంలో భారీగా డబ్బు, ఆయుధాలు వినియోగం అవుతున్నాయి. దీంతో ఎవరు ఎంత ఖర్చు చేశారు అన్నదానిపై చర్చ మొదలైంది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా ఈ యుద్ధంలో ఇప్పటివరకు 30 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసినట్లు అంచనాలు చెబుతున్నాయి. రోజుకు సుమారు 890 మిలియన్ నుంచి 2 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు అవుతోంది. యుద్ధం ప్రారంభమైన తొలి 6 రోజుల్లోనే 11&ndash;12 బిలియన్ డాలర్లు ఖర్చు అయ్యాయి. ఈ ఖర్చులో నేవీ ఆపరేషన్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఇంటెలిజెన్స్ వంటి అంశాలు ఉన్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా ఖర్చులో పెద్ద భాగం ఆయుధాలపైనే వెళ్తోంది. ఒక్క టోమాహాక్ మిస్సైల్ ధర సుమారు 3.5 మిలియన్ డాలర్లు. వేల సంఖ్యలో మిస్సైళ్లు వినియోగం అవుతుండటంతో ఖర్చు భారీగా పెరుగుతోంది. అదే సమయంలో వాడిన ఆయుధాలను మళ్లీ నిల్వ చేయడానికి కూడా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇరాన్ ఖర్చులపై స్పష్టమైన లెక్కలు బయటకు రాలేదు. కానీ యుద్ధ చర్యల ద్వారా పెద్ద నష్టం జరిగిందని తెలుస్తోంది. ఇరాన్ ఇప్పటివరకు సుమారు 2500 డ్రోన్లు, మిస్సైళ్లు ప్రయోగించింది. ఈ క్రమంలో వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, కీలక మిలిటరీ సదుపాయాలు దెబ్బతిన్నాయి. అంటే డబ్బు లెక్కల కంటే ఆస్తి నష్టం ఎక్కువగా ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ యుద్ధం రెండు దేశాలకు మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ప్రభావం చూపుతోంది. అమెరికా భారీ ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక లోటు పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ నష్టాలు ప్రాంతీయ భద్రతపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ యుద్ధం కొనసాగితే ప్రపంచ ఆర్థిక స్థిరత్వంపై కూడా ప్రభావం మరింత పెరగవచ్చు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/war-iran-vs-usa-war-who-spent-more-full-breakdown-of-military-expenses-and-impact-l0vw4rf"/>
        </item>
        <item>
            <title><![CDATA[పేరుకే పెద్ద‌న్న, బుద్ధి మాత్రం.. హైద‌రాబాద్ చిలుకూరు ఆల‌యంపై అమెరికా సెనేట‌ర్ వివాద‌స్ప‌ద వ్యాఖ్యలు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/hyderabad-us-senator-eric-schmitt-sparks-controversy-with-remarks-on-chilkur-balaji-temple-s04bq8h</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/hyderabad-us-senator-eric-schmitt-sparks-controversy-with-remarks-on-chilkur-balaji-temple-s04bq8h</guid>
            <pubDate>Fri, 15 May 2026 17:00:05 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Hyderabad: అమెరికాలో ఉపాధి ఆధారిత వీసా విధానాలపై మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. మిస్సౌరీకి చెందిన రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ ష్మిట్ తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత్&zwnj;లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. చిలుకూరు బాలాజీ ఆల&zwnj;యంపై చర్చకు దారి తీశాయి.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01krnp3b0sz0ghs4asxbx67dvb,imgname-hyderabad--85--1778844281879.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Hyderabad: అమెరికాలో ఉపాధి ఆధారిత వీసా విధానాలపై మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. మిస్సౌరీకి చెందిన రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ ష్మిట్ తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత్&zwnj;లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. చిలుకూరు బాలాజీ ఆల&zwnj;యంపై చర్చకు దారి తీశాయి.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా ఉద్యోగ మార్కెట్&zwnj;ను విదేశీ కార్మికులు ఆక్రమిస్తున్నారని ఎరిక్ ష్మిట్ ఆరోపించారు. హెచ్-1బీ, ఎల్-1, ఎఫ్-1, ఓపీటీ వంటి కార్యక్రమాలు అమెరికా మధ్యతరగతి ఉద్యోగుల అవకాశాలను తగ్గిస్తున్నాయని అన్నారు. ఈ విధానాల వల్ల అమెరికన్ ఉద్యోగులకు వేతన ఒత్తిడి పెరుగుతోందని, పెద్ద టెక్ కంపెనీలు తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయని విమర్శించారు. అమెరికా ఫస్ట్ విధానాలను ముందుకు తీసుకెళ్తున్న అధ్య&zwnj;క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలకు అనుగుణంగా ష్మిట్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విదేశీ కార్మికులపై ఆధారపడటం వల్ల అమెరికన్ యువత ఉద్యోగ పోటీలో వెనుకబడుతోందని పేర్కొన్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్&zwnj;లోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని ష్మిట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ ఆలయాన్ని &ldquo;వీసా టెంపుల్&rdquo;గా పేర్కొంటూ, అమెరికా వర్క్ వీసాల కోసం వేలాది మంది భారతీయులు అక్కడ ప్రార్థనలు చేస్తారని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వీసాలు రావాలని ప్రార్థనలు చేసే భారతీయుల ఫోటోలు, వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ష్మిట్ &ldquo;ఈ వీసా మాఫియాకు ఒక వీసాల ఆలయం ఉంది&rdquo; అంటూ వ్యాఖ్యానించారు. ఆయన పోస్టులో చిలుకూరు బాలాజీ ఆలయ ఫోటోను కూడా షేర్ చేయడం మరింత చర్చకు దారితీసింది. భారతీయుల ఆధ్యాత్మిక విశ్వాసాలను అవమానించేలా వ్యాఖ్యానించారని సోషల్ మీడియాలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.&lt;/p&gt;&lt;p&gt;The &quot;Visa Cartel&quot; has its own &ldquo;Visa Temple&rdquo; in Hyderabad, which sees thousands of Indians circling altars and getting passports blessed for U.S. work visas.American workers shouldn&rsquo;t have to compete against a system this gamed. pic.twitter.com/k7wSlECTJ6&lt;/p&gt;&lt;p&gt;&mdash; Senator Eric Schmitt (@SenEricSchmitt) May 13, 2026&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;విదేశీ విద్యార్థుల్లో పెద్ద సంఖ్యలో భారతీయులే ఉన్నారని ష్మిట్ పేర్కొన్నారు. అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బుతో విదేశీ విద్యార్థులకు రాయితీలు అందుతున్నాయని ఆరోపించారు. చదువు పూర్తయ్యాక వీరు హెచ్-1బీ వీసాలు, తరువాత గ్రీన్ కార్డులు పొందుతూ అమెరికా ఉద్యోగ మార్కెట్&zwnj;లో స్థిరపడుతున్నారని అన్నారు.&lt;/p&gt;&lt;p&gt;తక్కువ వేతనాలకు పనిచేసే విదేశీ ఉద్యోగుల కారణంగా అమెరికా గ్రాడ్యుయేట్లు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విద్యారుణాలతో బాధపడుతున్న స్థానిక యువతకు ఇది అన్యాయం అవుతోందని విమర్శించారు. అంతేకాకుండా, వీసా ఇంటర్వ్యూలలో అడిగే ప్రశ్నలను పరస్పరం పంచుకుంటున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఈ వ్యవస్థ వల్ల ప్రతిభ కంటే జాతి ఆధారిత ప్రాధాన్యం పెరుగుతోందని పేర్కొన్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్&zwnj;కు సమీపంలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆల&zwnj;యానికి ఎన్నో ఏళ్లుగా &ldquo;వీసా బాలాజీ&rdquo;గా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా అమెరికా లేదా ఇతర దేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. భక్తులు 11 ప్రదక్షిణలు చేసి కోరిక కోరుతూ, వీసా వచ్చిన తర్వాత 108 ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. ఈ విశ్వాసం వల్ల దేశవ్యాప్తంగా ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా హెచ్-1బీ వీసాల్లో భారతీయుల వాటా చాలా ఎక్కువగా ఉంది. టెక్నాలజీ, సాఫ్ట్&zwnj;వేర్ రంగాల్లో భారతీయ నిపుణులకు అధిక డిమాండ్ ఉండటంతో ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో భారతీయులు ఈ వీసాలను పొందుతున్నారు. అమెరికా గణాంకాల ప్రకారం హెచ్-1బీ వీసాల్లో 70 నుంచి 80 శాతం వరకు భారతీయులకే లభిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ఐటీ నగరాల నుంచి పెద్ద సంఖ్యలో యువత అమెరికాకు వెళ్తున్నారు. చైనా తర్వాత అత్యధికంగా అమెరికా వర్క్ వీసాలు పొందుతున్న దేశం భారత్&zwnj;గానే కొనసాగుతోంది. ఇటీవల అమెరికాలో వలస విధానాలపై రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కుతున్న నేపథ్యంలో, ఎరిక్ ష్మిట్ వ్యాఖ్యలు మరోసారి హెచ్-1బీ వ్యవస్థపై అంతర్జాతీయ దృష్టిని తీసుకువచ్చాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/hyderabad-us-senator-eric-schmitt-sparks-controversy-with-remarks-on-chilkur-balaji-temple-s04bq8h"/>
        </item>
        <item>
            <title><![CDATA[World Longest Train : బాబోయ్.. 7 కిలోమీటర్ల పొడవున్న రైలా? ఒకసారి చూస్తే దిమ్మతిరగాల్సిందే!]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/world-longest-train-bhp-australia-iron-ore-train-facts-full-details-seaxsum</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/world-longest-train-bhp-australia-iron-ore-train-facts-full-details-seaxsum</guid>
            <pubDate>Thu, 07 May 2026 21:46:50 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;World Longest Train : 7.3 కిలోమీటర్ల పొడవు, 682 కోచ్&zwnj;లు, 8 ఇంజన్లు.. ఆస్ట్రేలియాకు చెందిన ఈ భారీ రైలు ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా రికార్డు సృష్టించింది. దీని విశేషాలు మీకోసం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kr1k4rfb6087wamsrzjqh49h,imgname-world-longest-train-1778170094059.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;World Longest Train : 7.3 కిలోమీటర్ల పొడవు, 682 కోచ్&zwnj;లు, 8 ఇంజన్లు.. ఆస్ట్రేలియాకు చెందిన ఈ భారీ రైలు ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా రికార్డు సృష్టించింది. దీని విశేషాలు మీకోసం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద నెట్&zwnj;వర్క్&zwnj;లలో ఒకటిగా పేరుగాంచాయి. మన దేశంలో కిలోమీటరు కంటే పొడవైన సరుకు రవాణా రైళ్లను చూసి మనం ఆశ్చర్యపోతుంటాం. కానీ, మీరు ఎప్పుడైనా 7 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవున్న రైలు గురించి విన్నారా? అవును, మీరు చదివింది నిజమే! ఒకే రైలు, ఏకంగా 7.3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనిని లాగడానికి ఏకంగా 8 శక్తివంతమైన ఇంజన్లు అవసరమవుతాయి. ఇంతటి భారీ రైలు ఏ దేశంలో నడుస్తోంది? భారత్, అమెరికా లేదా చైనాలో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే!&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ రైలు ఆస్ట్రేలియా ఖండంలో నడుస్తోంది. మైనింగ్ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన BHP అనే కంపెనీ ఈ భారీ రైలును నడుపుతోంది. దీని మొత్తం పొడవు దాదాపు 7.3 కిలోమీటర్లు (7,353 మీటర్లు). సాధారణంగా మనం చూసే ప్యాసింజర్ రైళ్లు లేదా గూడ్స్ రైళ్లతో పోలిస్తే ఇది కొన్ని రెట్లు పెద్దది. దీని భారీ కాయం, సామర్థ్యం కారణంగా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో కూడా చోటు సంపాదించుకుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ రైలు పరిమాణం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ రైలులో మొత్తం 682 కోచ్&zwnj;లు ఉంటాయి. ఇన్ని వందల కోచ్&zwnj;లను లాగడం ఒక ఇంజన్ వల్ల అయ్యే పని కాదు. అందుకే, దీనికి అత్యంత శక్తివంతమైన 8 లోకోమోటివ్ ఇంజన్లను ఉపయోగిస్తారు. ఈ ఎనిమిది ఇంజన్లు కలిసి రైలును కదిలిస్తాయి. ఇంత పెద్ద రైలు ఒకేసారి ప్రయాణించడం వల్ల భారీ మొత్తంలో సరుకును తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరవేయడం సాధ్యమవుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆస్ట్రేలియాలో ఉన్న ఈ రైలును ప్రధానంగా ఇనుప ఖనిజాన్ని సుదూర ప్రాంతాలకు చేరవేయడానికి ఉపయోగిస్తారు. మైనింగ్ కేంద్రాల నుండి ఓడరేవులకు ఈ ఖనిజాన్ని తరలించడంలో ఈ రైలు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ఇంత పొడవైన రైలును నడపడం మామూలు విషయం కాదు. దీని భారీ బరువు, పొడవు కారణంగా రైలును కంట్రోల్ చేయడం లోకో పైలట్లకు సవాలుతో కూడుకున్న పని. మలుపులు తిరిగేటప్పుడు, బ్రేకులు వేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ రైలు ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి. ఎవరైనా ఒక వ్యక్తి ఈ రైలు మొదలు నుండి చివరి వరకు నడిచి వెళ్లాలని అనుకుంటే, అతనికి కొన్ని గంటల సమయం పడుతుంది. 7.3 కిలోమీటర్ల దూరం అంటే అది తక్కువ విషయం కాదు! ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యంత బరువైన రైలుగా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డును తన పేరిట ఉంచుకుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇలాంటి భారీ ప్రయోగాలు సాధారణంగా రవాణా ఖర్చులను తగ్గించుకోవడానికి కంపెనీలు చేస్తుంటాయి. BHP కంపెనీ చేపట్టిన ఈ సాహసోపేతమైన చర్య రైల్వే చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఒకే రైలులో 682 బోగీలను అమర్చి, విజయవంతంగా నడపడం ద్వారా ఆస్ట్రేలియా ఇంజనీరింగ్ అద్భుతాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/world-longest-train-bhp-australia-iron-ore-train-facts-full-details-seaxsum"/>
        </item>
        <item>
            <title><![CDATA[Richest Person: ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. 174 దేశాల జీడీపీ కంటే ఎక్కువ సంపద]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/richest-person-elon-musk-becomes-the-worlds-first-trillionaire-wealth-surpasses-gdp-of-174-countries-tep9l59</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/richest-person-elon-musk-becomes-the-worlds-first-trillionaire-wealth-surpasses-gdp-of-174-countries-tep9l59</guid>
            <pubDate>Sun, 14 Jun 2026 08:21:11 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Richest Person: ప్రపంచ కుబేరుల జాబితాలో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండే ఎలాన్ మస్క్ మరో చరిత్ర సృష్టించారు. ఆయన వ్యక్తిగత సంపద 1 ట్రిలియన్ డాలర్ల (1,000 బిలియన్ డాలర్లు) మార్కును దాటినట్లు అంతర్జాతీయ ఆర్థిక వర్గాలు పేర్కొంటున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kv0kx1hfh21xsrfbkw17knmm,imgname-richest-person-1781358560815.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Richest Person: ప్రపంచ కుబేరుల జాబితాలో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండే ఎలాన్ మస్క్ మరో చరిత్ర సృష్టించారు. ఆయన వ్యక్తిగత సంపద 1 ట్రిలియన్ డాలర్ల (1,000 బిలియన్ డాలర్లు) మార్కును దాటినట్లు అంతర్జాతీయ ఆర్థిక వర్గాలు పేర్కొంటున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మస్క్&zwnj;కు చెందిన SpaceX కంపెనీ షేర్లు మార్కెట్లో భారీగా పెరగడంతో సంస్థ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు పైగా చేరింది. కంపెనీలో మస్క్&zwnj;కు ఉన్న భారీ వాటా కారణంగా ఆయన వ్యక్తిగత నికర సంపద సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రపంచ చరిత్రలో తొలి ట్రిలియనీర్&zwnj;గా నిలిచిన వ్యక్తిగా మస్క్ పేరు నమోదైంది. ఈ భారీ సంపద పెరుగుదలకు ప్రధాన కారణం స్పేస్&zwnj;ఎక్స్ కంపెనీ విలువ ఒక్కసారిగా పెరగడమేనని నివేదికలు చెబుతున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచంలో కేవలం కొద్ది దేశాలకే 1 ట్రిలియన్ డాలర్లకు పైగా జీడీపీ ఉంది. మస్క్ సంపద ప్రస్తుతం సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లుగా ఉండటంతో, ప్రపంచంలోని దాదాపు 174 దేశాల వార్షిక ఆర్థిక ఉత్పత్తి కంటే ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆసియాలో ప్రముఖ టెక్నాలజీ కేంద్రంగా గుర్తింపు పొందిన తైవాన్ వార్షిక జీడీపీ సుమారు 976 బిలియన్ డాలర్లుగా అంచనా. మస్క్ సంపద దానికంటే ఎక్కువగా ఉంది. అలాగే ఆయన జన్మస్థలం అయిన సౌత్ ఆఫ్రికా జీడీపీ సుమారు 480 బిలియన్ డాలర్ల పరిధిలో ఉండగా, మస్క్ సంపద దానికి రెండింతలకు పైగానే ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మస్క్ వ్యక్తిగత సంపద ప్రస్తుతం స్విట్జార్లాండ్, స్వీడన్, సింగపూర్, ఐర్లాండ్, ఇజ్రాయెల్, ఆస్ట్రీయా వంటి పలు అభివృద్ధి చెందిన దేశాల వార్షిక జీడీపీలను కూడా అధిగమించినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. భారత జీడీపీ సుమారు 4 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉండగా, మస్క్ సంపద దాదాపు దాని నాలుగో వంతుకు సమానంగా ఉందని అంచనా వేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి సంపదే అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలకు సమానంగా ఉండటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/richest-person-elon-musk-becomes-the-worlds-first-trillionaire-wealth-surpasses-gdp-of-174-countries-tep9l59"/>
        </item>
        <item>
            <title><![CDATA[World Coldest Places: ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్లేసెస్ ఇవే! ఇక్కడ ఎలా బతుకుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/world-coldest-inhabited-places-where-life-thrives-despite-extreme-frost-tgedhkg</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/world-coldest-inhabited-places-where-life-thrives-despite-extreme-frost-tgedhkg</guid>
            <pubDate>Sun, 10 May 2026 22:32:44 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;World Coldest Inhabited Places: మైనస్ 50 డిగ్రీల చలి.. ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతాల్లో ప్రజలు ఎలా నివసిస్తున్నారు? రష్యా నుంచి కెనడా వరకు గడ్డకట్టే చలిలో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kr9d0rhar7fy3vfm4a17fy74,imgname-world-coldest-places-1778432107050.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;World Coldest Inhabited Places: మైనస్ 50 డిగ్రీల చలి.. ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతాల్లో ప్రజలు ఎలా నివసిస్తున్నారు? రష్యా నుంచి కెనడా వరకు గడ్డకట్టే చలిలో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ భూమి మీద ప్రకృతి సృష్టించిన వింతలు ఎన్నో ఉన్నాయి. కొన్ని చోట్ల ఎండలు మండిపోతుంటే, మరికొన్ని చోట్ల అసలు మనుషులు ఉండగలరా? అన్నంతగా చలి వణికిస్తుంటుంది. మెర్క్యూరీ కూడా గడ్డకట్టేంతటి అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు మన భూమిపై కొన్ని ఉన్నాయి.&lt;/p&gt;&lt;p&gt;అక్కడ చలి అంటే మామూలు చలి కాదు, ఊపిరి పీల్చుకుంటే ముక్కు రంధ్రాలు కూడా ఐస్&zwnj;లా అయిపోయేంత గడ్డకట్టే పరిస్థితి. కానీ, అన్నీ ఉన్న చోట బతకడం గొప్ప కాదు.. అసలు వసతులే లేని, ప్రకృతి సవాలు విసిరే చోట కూడా మనుషులు అద్భుతంగా జీవిస్తున్నారు. రష్యాలోని మంచు గ్రామాల నుండి కెనడాలోని నగరాల వరకు లైఫ్ ఎలా సాగుతుందో ఇప్పుడు చూద్దాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచంలోనే మనుషులు నివసించే అత్యంత శీతల ప్రాంతంగా రష్యాలోని 'ఒమ్యాకోన్' (Oymyakon) రికార్డు సృష్టించింది. ఇక్కడ శీతాకాలంలో సగటు ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అసలు ఊహించుకోవడానికే భయం వేస్తుంది కదా? కానీ అక్కడ దాదాపు వెయ్యి మందికి పైగా జనాభా నివసిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;ఇక్కడ కార్లు స్టార్ట్ చేయాలన్నా, బయటకు వెళ్లాలన్నా చాలా ప్లానింగ్ ఉండాలి. బట్టలు కూడా చాలా లేయర్లుగా వేసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు. అయినా సరే, అక్కడి జనం తమ రోజువారీ పనులను చాలా కూల్&zwnj;గా చేసుకుపోతుంటారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రష్యాలోని 'నోరిల్స్క్' (Norilsk) మరో వింతైన నగరం. ఇక్కడ ఏడాదిలో ఆరు నెలల కంటే ఎక్కువ కాలం కేవలం మంచు మాత్రమే కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీల ఫారెన్&zwnj;హీట్ వరకు పడిపోతాయి. ఇంతటి కఠినమైన వాతావరణం ఉన్నా, ఇక్కడ దాదాపు 1.80 లక్షల మంది జనాభా ఉండటం విశేషం. పరిశ్రమలు, వ్యాపారాలు అన్నీ ఇక్కడ మామూలుగానే నడుస్తాయి. ఈ నగరం చలికి కేరాఫ్ అడ్రస్&zwnj;గా నిలుస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కెనడాలోని 'ఎల్లోనైఫ్' (Yellowknife) నగరంలో కూడా చలి తీవ్రత మామూలుగా ఉండదు. ఇక్కడ మైనస్ 40 డిగ్రీల ఫారెన్&zwnj;హీట్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే, ఇక్కడ ఆధునిక మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉన్నాయి. హై-స్పీడ్ ఇంటర్నెట్, మంచి కనెక్టివిటీ ఉండటంతో ప్రజలు ఇంట్లో ఉండే తమ పనులను చక్కబెట్టుకుంటారు. బయట వాతావరణం గడ్డకట్టేలా ఉన్నా, లోపల మాత్రం లైఫ్ చాలా బిజీగా సాగిపోతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అలాస్కాలోని 'బారో'.. ఇప్పుడు ఉట్కియాగ్విక్ అని పిలుచుకునే ప్రాంతం వింతలకు నెలవు. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీల ఫారెన్&zwnj;హీట్ ఉంటుంది. ఈ ప్రాంతం ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ కొన్ని రోజుల పాటు అసలు సూర్యుడే ఉదయించడు. కేవలం చీకటి మాత్రమే ఉంటుంది. ఇటు గడ్డకట్టే చలి, అటు కటిక చీకటి.. ఈ రెండింటి మధ్య కూడా అక్కడి ప్రజలు తమ పనులను ఎక్కడా ఆపరు.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;అసాధారణ పరిస్థితుల్లో జీవనం&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;ఈ ప్రాంతాల్లో నివసించడం అంటే ప్రతిరోజూ ఒక సాహసమే. మంచినీళ్ల పైపులు గడ్డకట్టకుండా చూసుకోవడం, వాహనాల ఇంజిన్లు ఆగిపోకుండా జాగ్రత్త పడటం వంటివి అక్కడ సర్వసాధారణం. మనకు ఏదో వింతగా అనిపించినా, వారికి అది ఒక లైఫ్ స్టైల్. మనిషి తలచుకుంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుని ముందుకు సాగుతాడని ఈ ప్రాంతాల ప్రజలను చూస్తే అర్థమవుతుంది. ప్రకృతి ఎంత కఠినంగా ఉన్నా, మానవ జీవనం మాత్రం ఎక్కడా ఆగదు అనడానికి వీరే నిదర్శనం.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/world-coldest-inhabited-places-where-life-thrives-despite-extreme-frost-tgedhkg"/>
        </item>
        <item>
            <title><![CDATA[POK లో రక్తపాతం.. 19 మంది పిల్లలు, ఏడుగురు గర్భిణీల మృతి.. షాకింగ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్]]></title>
            <link>https://telugu.asianetnews.com/international/pok-unrest-escalates-intel-report-claims-19-children-7-pregnant-women-killed-in-crackdown-articleshow-uoxao38</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/international/pok-unrest-escalates-intel-report-claims-19-children-7-pregnant-women-killed-in-crackdown-articleshow-uoxao38</guid>
            <pubDate>Wed, 10 Jun 2026 11:57:34 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;POK: పాక్ ఆక్రమిత కశ్మీర్&zwnj;లో పాక్ సైన్యం జరిపిన అణిచివేతలో పెద్ద సంఖ్యలో పౌరులు చనిపోయారని ఓ ఇంటెలిజెన్స్ &amp;nbsp;రిపోర్ట్ &amp;nbsp;ఆరోపించింది. ఈ హింసలో 19 మంది చిన్నారులు, ఏడుగురు గర్భిణీలు ప్రాణాలు కోల్పోయారని, ఈ ఘటనలపై అంతర్జాతీయ సమాజం విచారణ జరపాలని కోరింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ktp47cnbgt4c030558n1jm6k,imgname-pok-1781006578347.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లో ఉద్రిక్తతలు పీక్స్&zwnj;కు చేరాయి. అక్కడ జరుగుతున్న అల్లర్లపై తాజాగా ఒక సంచలన ఇంటెలిజెన్స్ రిపోర్టు బయటకు వచ్చింది. పాకిస్తాన్ భద్రతా దళాలు జరిపిన క్రూరమైన అణచివేతలో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఈ రిపోర్టు ఆరోపించింది. ముఖ్యంగా 19 మంది అమాయక పిల్లలు, ఏడుగురు గర్భిణీ స్త్రీలు ఈ హింసలో చనిపోయినట్లు రిపోర్టు వెల్లడించింది. ఈ దారుణాలపై అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించి, దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. జూన్ 5 నుండి జూన్ 9 మధ్య పాక్ దళాలు అక్కడ సాగించిన హింసను ఈ రిపోర్టు పూసగుచ్చినట్లు వివరించింది.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;బార్మంగ్ బ్రిడ్జ్ కాల్పులు.. అసలు ఏం జరిగిందంటే?&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;పీఓకేలో ఈ తాజా సంక్షోభానికి 'బార్మంగ్ బ్రిడ్జ్' వద్ద జరిగిన కాల్పుల ఘటనే కారణం. ఆర్థిక, రాజ్యాంగ సంస్కరణల కోసం శాంతియుతంగా పోరాడుతున్న 'జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ' (JAAC)ని పాకిస్తాన్ మిలిటరీ టార్గెట్ చేయడంతో గొడవలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. ప్రజా సంక్షేమం కోసం అహింసా మార్గంలో ఉద్యమిస్తున్న జేఏఏసీ (JAAC) సంస్థను పాక్ అధికారులు ఏకంగా ఉగ్రవాద నిరోధక చట్టం కింద చేర్చారు. ఈ లోపే జేఏఏసీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు షాజైబ్ హబీబ్&zwnj;ను టార్గెట్ చేసి హత్య చేయడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ హత్యే పీఓకే అంతటా కార్చిచ్చులా నిరసనలు ఎగిసిపడేలా చేసింది.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;ఇంటెలిజెన్స్ రిపోర్టులో షాకింగ్ నిజాలు&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం కేవలం 11 మంది పురుషులు మాత్రమే చనిపోయినట్లు చెబుతున్నారు. కానీ, ఈ ఇంటెలిజెన్స్ రిపోర్టు అసలు నిజాన్ని బయటపెట్టింది. చనిపోయిన వారిలో 19 మంది చిన్నారులు, ఏడుగురు గర్భిణీలు ఉన్నారని తెలిపింది. నిరసనలను అణచివేయడానికి పాకిస్తాన్ ఏకంగా 14,000 మంది సైనికులను పీఓకేలో రంగంలోకి దించింది. అక్కడ కమ్యూనికేషన్ బ్లాకౌట్ (ఇంటర్నెట్, ఫోన్ల బంద్) విధించింది. నిరసనకారులు, హబీబ్ అంత్యక్రియలకు వచ్చిన నిరాయుధులైన జనాలపై సైన్యం నిజమైన బుల్లెట్లు ఉపయోగించి కాల్పులు జరిపిందని రిపోర్టు తీవ్ర ఆరోపణలు చేసింది.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;స్థానికుల కోపం వెనుక అసలు రీజన్ ఇదే&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;పీఓకే ప్రజల్లో పాక్ ప్రభుత్వంపై చాలా కాలంగా తీవ్ర అసంతృప్తి ఉంది. తమను రాజకీయంగా పక్కన పెట్టేస్తున్నారని, పీఓకేలో ఉన్న జలవిద్యుత్ వనరులను పాకిస్తాన్ దోచుకుంటోందని స్థానికులు మండిపడుతున్నారు. తమ ప్రాంతంలో తయారయ్యే కరెంటును పాకిస్తాన్ వాడుకుంటూ, తమకు మాత్రం కరెంట్ కోతలు విధిస్తోందని, భారీగా విద్యుత్ బిల్లులు బాదుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వివక్షకు వ్యతిరేకంగానే జేఏఏసీ 38 డిమాండ్లతో ఒక చార్టర్&zwnj;ను రూపొందించి ఉద్యమించింది. చౌకగా గోధుమల సబ్సిడీ ఇవ్వాలని, రాజకీయ నాయకులకు ఇచ్చే ప్రభుత్వ ప్రోత్సాహకాలను రద్దు చేయాలని, ప్రాంతీయ వనరులపై తమకు హక్కులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;ముజఫరాబాద్ ఒప్పందం బ్రేక్.. ముదిరిన వివాదం&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;నిజానికి అక్టోబర్ 2025లో జరిగిన 'ముజఫరాబాద్ ఒప్పందం' ప్రకారం ఈ డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది. కానీ ఆరు నెలల గడువు ముగిసినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పాక్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. దీంతో నిరసనలు మళ్లీ మొదలయ్యాయి. హబీబ్ హత్య తర్వాత పరిస్థితి చేతులు దాటిపోయింది. హబీబ్ మరణం తర్వాత పాక్ దళాలు స్వీపింగ్ ఆపరేషన్ చేపట్టి, 72 మందికి పైగా సివిల్ సొసైటీ నేతలను అరెస్ట్ చేశాయి. జేఏఏసీ సెంట్రల్ ఆఫీస్&zwnj;కు సీల్ వేశాయి. జూన్ 7న హబీబ్ అంత్యక్రియల ప్రార్థనల కోసం వచ్చిన జనాలపై లాఠీలు, టియర్ గ్యాస్, తుపాకులతో సైన్యం దాడి చేయడంతో పీఓకే అట్టుడికిపోయింది.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;సైన్యంపై తిరగబడ్డ జనం.. ఆర్మీ ఆర్డర్ నో చెప్పిన పోలీస్ అధికారి హత్య&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;జూన్ 9న దాదాపు 45 లక్షల మంది కాశ్మీరీలు మాస్ మార్చ్&zwnj;లో పాల్గొనాలని పిలుపునివ్వడంతో నిరసనలు మిన్నంటాయి. భీంబర్ ప్రాంతంలో రావల్కోట్ వైపు శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తున్న పౌరుల కాన్వాయ్&zwnj;లపై పాక్ సైన్యం షెల్లింగ్ జరిపింది. ఇక మాంగ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో 27 మంది పౌరులు చనిపోవడంతో, కోపోద్రిక్తులైన నిరసనకారులు పాక్ మిలిటరీ సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ఇదే సమయంలో పీఓకే పోలీస్ సబ్ ఇన్&zwnj;స్పెక్టర్ సర్దార్ ఇనాయత్ దారుణ హత్యకు గురయ్యారు. నిరసనకారులపై కాల్పులు జరపాలన్న పాక్ ఆర్మీ ఆదేశాలను ఆయన నిరాకరించినందుకే ఇనాయత్&zwnj;ను పాక్ సైన్యం కాల్చి చంపిందని ఈ రిపోర్టు సంచలన విషయాన్ని వెల్లడించింది. దీంతో పీఓకేలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/international/pok-unrest-escalates-intel-report-claims-19-children-7-pregnant-women-killed-in-crackdown-articleshow-uoxao38"/>
        </item>
        <item>
            <title><![CDATA[IMF: ప్ర‌పంచ దేశాల‌కు ఐఎమ్ఎఫ్ రుణాలు ఇస్తుంది స‌రే.. ఇంత‌కీ IMFకి డ‌బ్బులు ఎక్క‌డివి]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/imf-funding-source-explained-where-does-the-imf-get-money-to-lend-countries-around-the-world-vqfg11l</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/imf-funding-source-explained-where-does-the-imf-get-money-to-lend-countries-around-the-world-vqfg11l</guid>
            <pubDate>Tue, 26 May 2026 08:59:28 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;IMF: ఇంట&zwnj;ర్నేష&zwnj;నల్ మానిట&zwnj;రీ ఫండ్ ఇటీవ&zwnj;ల పాకిస్థాన్&zwnj;కు సుమారు రూ.11,322 కోట్ల సహాయ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది తెలిసిందే. ప్రపంచ దేశాలకు అవసరమైనప్పుడు రుణాలు ఇస్తున్న IMF దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా.?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ksgy909ha3rx9eysn8q94fy4,imgname-imf-1779758825777.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;IMF: ఇంట&zwnj;ర్నేష&zwnj;నల్ మానిట&zwnj;రీ ఫండ్ ఇటీవ&zwnj;ల పాకిస్థాన్&zwnj;కు సుమారు రూ.11,322 కోట్ల సహాయ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది తెలిసిందే. ప్రపంచ దేశాలకు అవసరమైనప్పుడు రుణాలు ఇస్తున్న IMF దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా.?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;IMFకు అత్యంత పెద్ద ఆదాయ వనరు సభ్య దేశాలు చెల్లించే &ldquo;కోటా&rdquo; వ్యవస్థ. ఇది ఒకరకంగా సభ్యత్వ రుసుములా పనిచేస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక దేశం ఎంత బలంగా ఉందో, ఆ దేశ GDP ఎంత ఉందో ఆధారంగా కోటా నిర్ణయిస్తారు. అమెరికా, చైనా, జపాన్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఎక్కువ కోటా చెల్లిస్తాయి. చిన్న దేశాలు తక్కువ చెల్లిస్తాయి. ఈ కోటా ద్వారా IMF వద్ద భారీ నిధులు చేరుతాయి. అంతేకాదు, IMFలో ఓటింగ్ హక్కులు కూడా కోటాపైనే ఆధారపడి ఉంటాయి. ఎవరు ఎక్కువ కోటా చెల్లిస్తే వారికి అంత ఎక్కువ ప్రభావం ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;IMF కేవలం డబ్బు నిల్వ చేసుకునే సంస్థ కాదు. ఇది ఒక బ్యాంక్&zwnj;లా కూడా పనిచేస్తుంది. ఏ దేశమైనా ఆర్థిక సంక్షోభంలో IMF నుంచి రుణం తీసుకుంటే దానిపై వడ్డీ చెల్లించాలి. ఈ వడ్డీ IMFకు మరో ముఖ్యమైన ఆదాయ మార్గం. ఈ డబ్బుతో సంస్థ తన పరిపాలనా ఖర్చులు, పరిశోధనలు, ఆర్థిక విశ్లేషణలు నిర్వహిస్తుంది. అయితే IMF ఇచ్చే రుణాలకు కఠినమైన నిబంధనలు ఉంటాయి. ప్రభుత్వ ఖర్చులు తగ్గించడం, పన్ను సంస్కరణలు, ఆర్థిక నియంత్రణలు వంటి షరతులు దేశాలు అంగీకరించాల్సి ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కొన్ని సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వస్తే సభ్య దేశాల కోటా ద్వారా వచ్చిన డబ్బు సరిపోదు. అలాంటి పరిస్థితుల్లో IMF &ldquo;న్యూ అరేంజ్&zwnj;మెంట్స్ టు బోరో&rdquo; (NAB) అనే విధానాన్ని ఉపయోగిస్తుంది. దీనిలో ఆర్థికంగా బలమైన దేశాలు IMFకు తాత్కాలికంగా డబ్బు అప్పుగా ఇస్తాయి. అంటే IMF కూడా కొన్ని దేశాల నుంచి అప్పు తీసుకుని, ఆ నిధులను సంక్షోభంలో ఉన్న దేశాలకు రుణాలుగా ఇస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలుకాకుండా ఉండేందుకు ఇది ఒక భద్రతా వ్యవస్థలా పనిచేస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;NAB సరిపోని పరిస్థితుల్లో IMF మరో మార్గాన్ని ఉపయోగిస్తుంది. దీనిని &ldquo;బైలేటరల్ బోరోయింగ్ అగ్రిమెంట్స్&rdquo; (BBA) అంటారు. ఇందులో IMF కొన్ని దేశాలతో నేరుగా ఒప్పందాలు కుదుర్చుకుని డబ్బు సమీకరిస్తుంది. ఈ విధానం ద్వారా IMF తన రుణాల సామర్థ్యాన్ని తాత్కాలికంగా పెంచుకుంటుంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒత్తిడి పెరిగినప్పుడు ఈ విధానం కీలకంగా మారుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;IMFను 1944లో ఏర్పాటు చేశారు. అప్పట్లో జరిగిన మహా మాంద్యం మళ్లీ రాకుండా చూడడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం IMFలో 191 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ సంస్థ ప్రతి దేశ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తూ నివేదికలు విడుదల చేస్తుంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయినప్పుడు లేదా అంతర్జాతీయ చెల్లింపులు చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు IMF ఆ దేశానికి చివరి ఆశగా నిలుస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;ర్యాపిడ్ ఫైనాన్సింగ్ అరేంజ్&zwnj;మెంట్, ఎక్స్&zwnj;టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ, స్టాండ్&zwnj;బై అరేంజ్&zwnj;మెంట్స్ అనే మూడు రకాల రుణ పథకాల ద్వారా సహాయం అందిస్తుంది. దేశం ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా ఏ రుణ పథకం ఇవ్వాలో నిర్ణయిస్తారు. అయితే IMF సహాయం పొందాలంటే ఆర్థిక సంస్కరణలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. IMF లక్ష్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడం. దేశాలు పూర్తిగా ఆర్థికంగా కుప్పకూలకుండా కాపాడటంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/imf-funding-source-explained-where-does-the-imf-get-money-to-lend-countries-around-the-world-vqfg11l"/>
        </item>
        <item>
            <title><![CDATA[Cockroach: ల‌క్ష‌లాది బొద్దింక‌ల‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. అస‌లేం జ‌రిగిందంటే.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/cockroach-australia-seizes-over-100000-cockroaches-massive-illegal-breeding-operation-exposed-ythc4wh</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/cockroach-australia-seizes-over-100000-cockroaches-massive-illegal-breeding-operation-exposed-ythc4wh</guid>
            <pubDate>Sun, 07 Jun 2026 10:14:40 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Cockroach: బొద్దింక&zwnj;లు అన&zwnj;గానే ప్ర&zwnj;స్తుతం కాక్రోచ్ జనతా పార్టీ గుర్తొస్తోంది. అయితే తాజాగా రియల్ బొద్దింకలకు సంబంధించిన ఓ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్&zwnj;గా మారింది. ఆస్ట్రేలియాలో లక్షకు పైగా బొద్దింకలను స్వాధీనం చేసుకోవ&zwnj;డం చ&zwnj;ర్చ&zwnj;నీయాంశంగా మారింది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ktewvd2z4ezqg88hepy64ybw,imgname-cockroach-1780763964511.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Cockroach: బొద్దింక&zwnj;లు అన&zwnj;గానే ప్ర&zwnj;స్తుతం కాక్రోచ్ జనతా పార్టీ గుర్తొస్తోంది. అయితే తాజాగా రియల్ బొద్దింకలకు సంబంధించిన ఓ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్&zwnj;గా మారింది. ఆస్ట్రేలియాలో లక్షకు పైగా బొద్దింకలను స్వాధీనం చేసుకోవ&zwnj;డం చ&zwnj;ర్చ&zwnj;నీయాంశంగా మారింది.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని బాథర్స్ట్ ప్రాంతంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒక వాణిజ్య బ్రీడర్ వద్ద విదేశీ జాతులకు చెందిన భారీ సంఖ్యలో బొద్దింకలను పెంచుతున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేపట్టారు. తనిఖీల సమయంలో అక్కడ లక్షకు పైగా బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. కీట&zwnj;కాల&zwnj;కు సంబంధించిన కేసుల్లో దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద స్వాధీన చర్యగా అధికారులు పేర్కొన్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో ప్రధానంగా మ&zwnj;డ&zwnj;గాస్క&zwnj;ర్ హిస్సింగ్ కాక్రోచ్&zwnj;, దుబాయ్ కాక్రోచ్ జాతులకు చెందిన బొద్దింకలు ఉన్నాయి. మడగాస్కర్ హిస్సింగ్ బొద్దింకలు ప్రపంచంలోనే అతిపెద్ద బొద్దింక జాతుల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి. ఇవి సాధారణ బొద్దింకల కంటే చాలా పెద్దవిగా ఉండి, 5 నుంచి 8 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. మెరిసే గోధుమ రంగులో కనిపించే ఈ కీటకాలు సాధారణ బొద్దింకల కంటే భిన్నంగా ఉంటాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;స్వాధీనం చేసిన బొద్దింకల మార్కెట్ విలువ సుమారు 2 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1.35 కోట్లకు పైగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ జాతి బొద్దింకలను పెంపుడు సరీసృపాలు, పాములు, బల్లులు వంటి జంతువులకు ఆహారంగా ఉపయోగిస్తుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సంఖ్యలో పెంచుకునే అవకాశం ఉండటంతో కొన్ని వర్గాల్లో వీటికి డిమాండ్ ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ నిబంధనలు అమలు చేస్తున్న దేశాల్లో ఒకటి. విదేశీ జాతుల జీవులు స్థానిక జీవవైవిధ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వాటి దిగుమతి, పెంపకం, విక్రయాలపై కఠిన నియంత్రణలు అమలులో ఉన్నాయి. ఈ బొద్దింకలు బయటకు వ్యాపిస్తే స్థానిక పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో వ్యాధుల వ్యాప్తికి కూడా కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఘటనలో స్వాధీనం చేసిన బొద్దింకలన్నింటినీ నియంత్రిత విధానంలో తొలగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సంబంధిత బ్రీడర్&zwnj;పై అధికారిక అభియోగాలు నమోదు కాలేదని పేర్కొన్నప్పటికీ, కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. నిబంధనలను ఉల్లంఘించి విదేశీ జీవులను పెంచడం లేదా విక్రయించడం తీవ్రమైన నేరమని ఆస్ట్రేలియా అధికారులు మరోసారి హెచ్చరించారు. ఈ ఘటన దేశంలో అక్రమ జీవుల వ్యాపారంపై నిఘాను మరింత కఠినతరం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>international</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/cockroach-australia-seizes-over-100000-cockroaches-massive-illegal-breeding-operation-exposed-ythc4wh"/>
        </item>
    </channel>
</rss>
