<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Sat, 05 Sep 2026 21:32:55 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/feature" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[జీవితం అంటే ఇదే.. విధి రాత‌ను మార్చ‌డం అసాధ్య‌మ‌ని చాటే గొప్ప క‌థ]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/motivational-story-you-cannot-change-fate-a-powerful-story-about-life-and-destiny-00dfyg9</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/motivational-story-you-cannot-change-fate-a-powerful-story-about-life-and-destiny-00dfyg9</guid>
            <pubDate>Thu, 03 Sep 2026 14:19:43 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Motivational: జీవితంలో కొన్ని సంఘటనలు మనం ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేం. వాటిని ముందుగానే ఊహించి భయపడటం వల్ల ప్రయోజనం ఉండదు. విధి రాత&zwnj;ను మార్చ&zwnj;డం అసాధ్య&zwnj;మ&zwnj;ని చాటే ఒక మంచి క&zwnj;థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1k6r4remm658gt73rfen2b3,imgname-motivational--7--1788424753934.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Motivational: జీవితంలో కొన్ని సంఘటనలు మనం ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేం. వాటిని ముందుగానే ఊహించి భయపడటం వల్ల ప్రయోజనం ఉండదు. విధి రాత&zwnj;ను మార్చ&zwnj;డం అసాధ్య&zwnj;మ&zwnj;ని చాటే ఒక మంచి క&zwnj;థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఒకరోజు ఆనంద్ ఇంట్లో ప్రశాంతంగా టీవీ చూస్తూ కూర్చున్నాడు. కుటుంబ సభ్యులు తమ పనుల్లో ఉన్నారు. ఆనంద్ మాత్రం టీవీలో వస్తున్న కార్యక్రమాన్ని ఆసక్తిగా చూస్తున్నాడు. అంతలో ఒక్కసారిగా ఇంట్లో వాతావరణం మారిపోయింది. గదిలోకి యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. ఆనంద్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. &ldquo;నువ్వెవరు?&rdquo; అని భయంతో అడిగాడు. అప్పుడు యమధర్మరాజు ప్రశాంతంగా, &ldquo;నేను యమధర్మరాజును. నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాను.&lt;/p&gt;&lt;p&gt;ఈరోజే నీ ఆయుష్షు పూర్తవుతుంది. ఇక నాతో పాటు రావాలి&rdquo; అన్నాడు. ఆ మాట విన్న ఆనంద్&zwnj;కు గుండె ఆగిపోయినంత పనైంది. &ldquo;ఏంటి? నాకు ఇంకా చిన్న వయసే కదా! అప్పుడే నేను చనిపోవడం ఏంటి? నాకు ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి. కుటుంబాన్ని చూసుకోవాలి. ఎన్నో కలలు ఉన్నాయి. ఇంత త్వరగా ఎలా?&rdquo; అని ప్రశ్నించాడు. అప్పుడు యమధర్మరాజు తన చేతిలో ఉన్న జాబితాను చూపిస్తూ, &ldquo;ఇందులో ఎవరి పేరు ఎప్పుడు వస్తుందో ముందే నిర్ణయమై ఉంటుంది. ఈరోజు తీసుకెళ్లాల్సిన వారి జాబితాలో మొదటి పేరు నీదే ఉంది. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా నాతో రా&rdquo; అన్నాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;యమధర్మరాజు మాటలు విన్న ఆనంద్ తీవ్రంగా ఆలోచించాడు. &ldquo;ఎలాగైనా సరే నేను చావకూడదు. నా పేరు ఈ జాబితాలో ఉన్నా దాన్ని మార్చే మార్గం ఏదైనా ఉండాలి&rdquo; అనుకున్నాడు. యముడిని ఎదిరించి పారిపోవడం సాధ్యం కాదు. బలంతో పోరాడటం అసాధ్యం. అందుకే తన తెలివిని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు.&lt;/p&gt;&lt;p&gt;కొద్దిసేపు ఆలోచించిన తర్వాత యమధర్మరాజుతో, &ldquo;సరే యమధర్మరాజా.. ఎలాగో నేను చనిపోతున్నాను కదా. కనీసం చివరిసారిగా ఒక కప్పు కాఫీ తాగి వస్తాను. నువ్వు కూడా కాఫీ తాగుతావా?&rdquo; అని అడిగాడు. యమధర్మరాజు కూడా అందుకు అంగీకరించాడు. &ldquo;సరే. నువ్వు వెళ్లి కాఫీ తీసుకుని రా. నేను ఇక్కడే కూర్చుంటాను&rdquo; అంటూ కుర్చీలో కూర్చున్నాడు. ఆనంద్ వంటగదిలోకి వెళ్లాడు. అక్కడే అతని మనసులో ఒక ప్రమాదకరమైన ఆలోచన వచ్చింది. &ldquo;యముడికి కాఫీలో నిద్రమాత్రలు కలిపి ఇస్తే.. అతను నిద్రపోతాడు. ఆ సమయంలో జాబితాలో నా పేరును చివరికి మార్చేస్తే.. నేను ఈరోజు చావను కదా!&rdquo; అనుకున్నాడు. తన ప్రాణాలను కాపాడుకోవాలనే ఆలోచనతో ఆనంద్ యమధర్మరాజుకు ఇచ్చే కాఫీలో నిద్రమాత్రలు కలిపాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కాఫీ తీసుకొచ్చిన ఆనంద్ యమధర్మరాజుకు అందించాడు. &ldquo;ఇదిగో యమధర్మరాజా.. వేడివేడి కాఫీ. తాగండి&rdquo; అన్నాడు. యమధర్మరాజు కాఫీ తాగాడు. కొద్దిసేపటికే నిద్రమాత్రల ప్రభావంతో ఆయనకు నిద్ర వచ్చింది. కుర్చీలోనే గాఢంగా నిద్రపోయాడు. ఆనంద్&zwnj;కు ఇదే సరైన సమయంగా అనిపించింది. అతను వెంటనే యమధర్మరాజు దగ్గర ఉన్న జాబితాను తీసుకున్నాడు. అందులో తన పేరు మొదట ఉంది. ఆనంద్ గుండె వేగంగా కొట్టుకుంది. &ldquo;ఇదే నా జీవితాన్ని మార్చే అవకాశం&rdquo; అనుకున్నాడు. ఎలాగైనా తన పేరు మొదటి స్థానంలో ఉంటే ఈరోజే చనిపోవాల్సి వస్తుందని భావించిన ఆనంద్.. తన పేరును జాబితాలో చివరికి మార్చేశాడు. తర్వాత జాబితాను యమధర్మరాజు దగ్గర పెట్టి ఏమీ తెలియనట్టుగా కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత యమధర్మరాజు నిద్ర నుంచి మేల్కొన్నాడు. ఆనంద్&zwnj;లో మాత్రం ఒక చిన్న ఆశ మొదలైంది. &ldquo;ఇక నేను ఈరోజు చనిపోను. నా పేరు చివరికి వెళ్లిపోయింది. నేను తెలివిగా విధిని మార్చేశాను&rdquo; అని ఆనంద్ మనసులో ఆనందపడ్డాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నిద్ర నుంచి లేచిన యమధర్మరాజు ఆనంద్ వైపు చూశాడు. &ldquo;ఆనంద్.. నువ్వు నన్ను చంపడానికి వచ్చిన వ్యక్తిగా చూసినా, నాకు ఆతిథ్యం ఇచ్చావు. కాఫీ ఇచ్చావు. చాలా రోజులుగా ఎలాంటి విశ్రాంతి లేకుండా పని చేస్తున్న నాకు కాసేపు విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించావు. నీ ఆతిథ్యానికి నేను సంతోషించాను&rdquo; అన్నాడు. ఆనంద్ మనసులో, &ldquo;అయితే నా ప్రాణాలు కాపాడినట్టే&rdquo; అని అనుకున్నాడు. అప్పుడు యమధర్మరాజు మరో మాట చెప్పాడు. &ldquo;నీ మంచితనానికి కృతజ్ఞతగా ఈరోజు నిన్ను తీసుకెళ్లడం లేదు. నీకు మరికొంత కాలం జీవించే అవకాశం ఇస్తాను. అందుకు నా జాబితాలో ఉన్న క్రమాన్ని మార్చేస్తాను. జాబితాలో చివ&zwnj;రి నుంచి వ్య&zwnj;క్తుల&zwnj;ను తీసుకెళ్తాను. ఆ మాట విన్న ఆనంద్ ఒక్క&zwnj;సారిగా షాక్&zwnj;కి గుర&zwnj;య్యాడు. ఎందుకంటే జాబితాలో చివ&zwnj;రి పేరుగా ఆనంద్ మార్చుకున్నాడు కాబ&zwnj;ట్టి. తన ప్రాణాలను కాపాడుకోవాలని తానే తన పేరును చివరికి మార్చుకున్నాడు. కానీ అదే పని చివరికి తన మరణానికి కారణమైంది. తాను విధిని మార్చానని అనుకున్నాడు. కానీ నిజానికి విధి అతని చేతుల మీదుగానే తన పని పూర్తి చేసుకుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ కథలోని అసలు సందేశం ఇదే. జరిగేది జరగక మానదు. మన జీవితంలో కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉంటాయి. కొన్ని విషయాలు మాత్రం ఎంత ప్రయత్నించినా మన చేతిలో ఉండవు. మనం ఎంత ఆలోచించినా, ఎంత భయపడినా, ఎంత బాధపడినా వాటిని మార్చలేం. అందుకే భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని నిరంతరం భయపడుతూ ప్రస్తుత జీవితాన్ని కోల్పోవద్దు. అదే సమయంలో &ldquo;ఏది జరగాలో అది జరుగుతుంది&rdquo; అంటూ బాధ్యతలను వదిలేయడం కూడా సరైనది కాదు. మన చేతిలో ఉన్న పని మనం నిజాయితీగా చేయాలి. మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబాన్ని ప్రేమించాలి. మన లక్ష్యాల కోసం కష్టపడాలి. తప్పులు చేస్తే సరిదిద్దుకోవాలి. ప్రమాదం కనిపిస్తే జాగ్రత్త పడాలి.&lt;/p&gt;&lt;p&gt;కానీ మన నియంత్రణలో లేని ప్రతి విషయాన్ని మార్చాలని ప్రయత్నిస్తూ మనశ్శాంతిని కోల్పోవద్దు. జీవితం మనం అనుకున్నట్టుగా ప్రతిసారీ నడవదు. కానీ అది మనకు నేర్పించాల్సిన పాఠాన్ని మాత్రం తప్పకుండా నేర్పిస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;ఆనంద్ తన విధిని మార్చాలని ప్రయత్నించాడు. చివరికి అదే ప్రయత్నం అతన్ని మరణం వైపు తీసుకెళ్లింది. అందుకే జీవితంలో మనం చేయాల్సింది విధితో పోరాడటం కాదు.. మన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ, వచ్చే పరిస్థితులను ధైర్యంగా స్వీకరించడం. ఎందుకంటే... మన చేతిలో ఉన్నది ప్రయత్నం మాత్రమే. ఫలితం ఎప్పుడు ఎలా రావాలో కాలమే నిర్ణయిస్తుంది. జరిగేది జరగక మానదు. కాబట్టి రేపు ఏం జరుగుతుందోనని భయపడుతూ ఈరోజును నాశనం చేసుకోకండి. గతాన్ని మార్చలేం.. భవిష్యత్తును పూర్తిగా నియంత్రించలేం. మన చేతిలో ఉన్నది ఒక్కటే. ఈ క్షణాన్ని మంచిగా జీవించడం.&lt;/p&gt;]]></content:encoded>
            <category>feature</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/motivational-story-you-cannot-change-fate-a-powerful-story-about-life-and-destiny-00dfyg9"/>
        </item>
        <item>
            <title><![CDATA[Marriage Rules : ఈ అబ్బాయిలు పాాకిస్థాన్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవద్దా? ఎందుకో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/saudi-arabia-bans-marriages-to-women-from-four-countries-3hyk2s8</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/saudi-arabia-bans-marriages-to-women-from-four-countries-3hyk2s8</guid>
            <pubDate>Fri, 04 Sep 2026 12:42:30 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరుల పెళ్లిళ్లపై కఠిన నిబంధనలు పెట్టింది. సౌదీ అబ్బాయిలు ఓ నాలుగు దేశాలకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవడంపై నిషేధం ఉంది&hellip; ఆ దేశాలేవో తెలుసా?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1kz0xgdg2j0w89jqg5wn0gn,imgname-saudi-arabia-couple--4--1788450207245.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరుల పెళ్లిళ్లపై కఠిన నిబంధనలు పెట్టింది. సౌదీ అబ్బాయిలు ఓ నాలుగు దేశాలకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవడంపై నిషేధం ఉంది&hellip; ఆ దేశాలేవో తెలుసా?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&quot;నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు&quot; అన్నట్లుంది పాకిస్థాన్, సౌదీ అరేబియా ప్రెండ్షిప్. ఇటీవలే ఈ రెండు దేశాలు ''మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్'' పై సంతకం చేశాయి... దీనిప్రకారం ఈ దేశాలు రక్షణ విషయంలో ఒకదానికొకటి సహకరించుకోనున్నాయట. భారత్ ను టార్గెట్ గా చేసుకుని పాక్ ఇలాంటి ఒప్పందం చేసుకుందని స్పష్టంగా అర్థమవుతోంది.&lt;/p&gt;&lt;p&gt;అయితే రక్షణ మాట అటుంచితే పాకిస్థాన్ ప్రజలను కనీసం మనుషులుగా గుర్తించడంలేదు సౌదీ... ఇందుకు నిదర్శనమే పాక్ అమ్మాయిలను సౌదీ అబ్బాయిలు పెళ్లాడకూడదు అనే నిబంధన. ఇలా సౌదీ అరేబియా చీ కొడుతున్నా సరే పాక్ ఆ దేశం వెంటపడిమరీ ఒప్పందాలు చేసుకుంటోంది.&lt;/p&gt;&lt;p&gt;ప్రేమకు దేశాలతో, సరిహద్దులతో సంబంధం లేదు. కానీ సౌదీ అరేబియాలో మాత్రం తమ దేశ అబ్బాయిలు ఎవరిని పడితే వారిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని అంటోంది. అక్కడి ప్రభుత్వం పెళ్లిళ్లపై కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టింది. సౌదీ యువకులు ఈ రూల్స్&zwnj;ను కచ్చితంగా పాటించాల్సిందే.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సౌదీ అరేబియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం&hellip; ఆ దేశ పౌరులు ప్రపంచంలోని ఏ దేశం అమ్మాయిలనైనా కొన్ని షరతులతో పెళ్లాడవచ్చు&hellip; కానీ ఓ నాలుగు దేశాల అమ్మాయిలను పెళ్లిచేసుకోవాలంటే మాత్రం కష్టం. ఈ నిబంధన ఇప్పుడు కొత్తగా పెట్టినవి కావు&hellip; చాలా ఏళ్లుగా అమల్లో ఉన్నాయి. సౌదీ నిషేధించిన దేశాల్లో మూడు మన పొరుగు దేశాలే కావడం గమనార్హం.&lt;/p&gt;&lt;p&gt;సౌదీ ప్రభుత్వం పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, చాద్ దేశాల అమ్మాయిలను పెళ్లి చేసుకోవడంపై నిషేధం విధించింది. విదేశీ మహిళలతో పెళ్లిళ్లను ప్రోత్సహించకూడదని&hellip; తమ దేశ అబ్బాయిలు ఇక్కడి అమ్మాయిలనే పెళ్లాడాలనే ఉద్దేశంతో ఈ నిబంధన తెచ్చారు. ఒకవేళ ఈ నాలుగు దేశాలు కాకుండా ఇతర దేశాల వారిని పెళ్లి చేసుకోవాలన్నా కొన్ని రూల్స్ పాటించాల్సిందే.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;విదేశీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనుకునే సౌదీ యువకులు కొన్ని రూల్స్ పాటించాలి. సదరు విదేశీ యువతికి సంబంధించి ప్రభుత్వం సూచించిన కొన్ని డాక్యుమెంట్లను సమర్పించి పర్మిషన్ తీసుకోవాలి. ప్రభుత్వ అధికారిక శాఖల నుంచి ప్రత్యేక అనుమతి పొందాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవు.&lt;/p&gt;&lt;p&gt;ఇప్పటికే పెళ్లైనవారు లేదా విడాకులు తీసుకున్నవారు విదేశీయులను పెళ్లి చేసుకోవాలంటే మరిన్ని నిబంధనలు పాటించాలి. పెళ్లి అనుమతి కోసం దరఖాస్తు చేశాక ఆరు నెలలు ఆగాలి. అన్నీ పరిశీలించాకే ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఈ నిబంధన ద్వారా తమ దేశంలోకి వచ్చేవారి సమాచారాన్ని సౌదీ ప్రభుత్వం నిశితంగా గమనిస్తుంది. దేశ పౌరుల రక్షణ కోసమే ఇలాంటి నిబంధనలు అమలు చేస్తున్నామని సౌదీ అరేబియా ప్రభుత్వం చెబుతోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>feature</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/saudi-arabia-bans-marriages-to-women-from-four-countries-3hyk2s8"/>
        </item>
        <item>
            <title><![CDATA[Snakes: మనుషులను కాపాడుతున్న పాములు.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/how-snakes-protect-humans-and-maintain-ecological-balance-silent-saviors-3mu0do2</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/how-snakes-protect-humans-and-maintain-ecological-balance-silent-saviors-3mu0do2</guid>
            <pubDate>Fri, 04 Sep 2026 11:26:37 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Snakes: పాములు అనగానే సాధారణంగా భయం, ఆందోళన కలగడం సహజం. అయితే, పర్యావరణ వ్యవస్థను సమతుల్యంగా ఉంచడంలోనూ, మనుషుల ఆరోగ్యాన్ని పరోక్షంగా కాపాడటంలోనూ పాములు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. పాములు మనుషులను ఎలా కాపాడుతున్నయో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1nfmjn6kp9bbgtqdkm04y5j,imgname-snakes-1788501183142.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Snakes: పాములు అనగానే సాధారణంగా భయం, ఆందోళన కలగడం సహజం. అయితే, పర్యావరణ వ్యవస్థను సమతుల్యంగా ఉంచడంలోనూ, మనుషుల ఆరోగ్యాన్ని పరోక్షంగా కాపాడటంలోనూ పాములు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. పాములు మనుషులను ఎలా కాపాడుతున్నయో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పాము అనగానే చాలామందికి ముందుగా భయమే వేస్తుంది. నివాస ప్రాంతాల వద్ద కానీ, పొలాల్లో కానీ పాము కనిపిస్తే వెంటనే దాన్ని తరిమేయడమో లేదా చంపేయడమో చేస్తుంటారు. అయితే పర్యావరణ వ్యవస్థలో పాములు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. పాములు నేరుగా మనుషులతో స్నేహం చేయకపోయినా, పరోక్షంగా మనకు ఎంతో రక్షణ కల్పిస్తాయి. పాములు లేకపోతే మానవాళికి అనేక రకాల పర్యావరణ, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఎలుకలు, ఇతర క్రిమిపురుగుల జనాభాను నియంత్రించడంలో ఇవి ప్రకృతి ప్రసాదించిన సహజ నియంత్రణ వ్యవస్థగా పనిచేస్తాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పాములకు ప్రధాన ఆహారం ఎలుకలు, కప్పలు, బల్లులు, చిన్న రకం జీవులు. ముఖ్యంగా వ్యవసాయ భూముల్లో ఎలుకల సంఖ్య విపరీతంగా పెరగకుండా పాములు అడ్డుకుంటాయి. ఒక పాము తన జీవితకాలంలో లేదా ఏడాది వ్యవధిలో వందలాది ఎలుకలను వేటాడుతుంది. పొలాల్లో పాముల సంఖ్య తగ్గితే ఎలుకలు విపరీతంగా పెరిగిపోయి పంటలను నాశనం చేస్తాయి. అంతేకాక ఇళ్లలో, గోదాముల్లో నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలను తింటూ రైతులు, వ్యాపారులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. పాములు వీటిని అరికట్టడం ద్వారా రైతులకు ఆహార భద్రతతో పాటు ఆర్థిక రక్షణను కూడా అందిస్తున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఎలుకలు కేవలం పంటలను తినడం మాత్రమే కాదు, అనేక రకాల ప్రమాదకరమైన వ్యాధికారక సూక్ష్మజీవులను, వైరస్&zwnj;లను మోసుకొస్తాయి. ఎలుకలు, ఇతర చిన్న క్షీరదాల ద్వారా ప్లేగ్, లైమ్ డిసీజ్, హాంటావైరస్, రాకీ మౌంటెన్ స్పాటెడ్ ఫీవర్ వంటి వ్యాధులు మనుషులకు సంక్రమిస్తాయి. అంతేకాక ఎలుకల శరీరంపై ఉండే టిక్స్, ఫ్లీస్ వంటి పరాన్నజీవుల వల్ల కూడా వ్యాధులు వ్యాపిస్తాయి. పరిశోధనల ప్రకారం, టింబర్ రాటిల్&zwnj;స్నేక్ వంటి పాములు ఎలుకలను వేటాడటం ద్వారా పరోక్షంగా ఏడాదికి దాదాపు 2,500 నుంచి 4,500 వరకు టిక్స్&zwnj;ను తగ్గిస్తాయి. ఈ విధంగా పాములు ఎలుకల జనాభాను అదుపులో ఉంచి ప్రజారోగ్యాన్ని కాపాడుతాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పాము విషం ప్రాణాలు తీయడమే కాదు, ప్రాణాలు కాపాడేందుకు కూడా ఉపయోగపడుతుంది. పాము కాటుకు విరుగుడుగా ఇచ్చే యాంటీ-వెనమ్ మందుల తయారీకి పాము విషాన్నే ప్రాథమికంగా ఉపయోగిస్తారు. ఇవే కాకుండా, పాము విషంలోని ప్రోటీన్లు, ఎంజైమ్&zwnj;లను ఉపయోగించి వివిధ రకాల ప్రాణాంతక వ్యాధులకు ఔషధాలను తయారు చేస్తున్నారు. ఉదాహరణకు, కాపర్&zwnj;హెడ్ పాము విషంలో ఉండే 'కంటోర్ట్రోస్టాటిన్' అనే ప్రోటీన్ క్యాన్సర్ కణాల ఎదుగుదలను ఆపడానికి, అవి శరీరంలో వ్యాపించకుండా నిరోధించడానికి పరిశోధనల్లో ఉపయోగపడుతోంది. అధిక రక్తపోటు, గుండెపోటు, హార్ట్ ఫెయిల్యూర్, పక్షవాతం, తీవ్రమైన నొప్పుల నివారణకు వాడే మందుల రూపకల్పనలో పాము విషం ప్రధాన టెంప్లేట్&zwnj;గా సహాయపడుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జీవవైవిధ్యంలో పాము ఒకే సమయంలో వేటగాడిగానూ, అలాగే గద్దలు, ముంగిసలు వంటి ఇతర జీవులకు ఆహారంగానూ పనిచేస్తుంది. పాములు తినే ఎలుకల ద్వారా విత్తనాలు వేరే ప్రాంతాల్లో విసర్జించబడటం వల్ల సెకండరీ సీడ్ డిస్పర్సల్ జరిగి మొక్కలు నాటడానికి, అడవుల విస్తరణకు పరోక్షంగా తోడ్పడతాయి. అన్ని పాములు విషపూరితమైనవి కావు. చాలా వరకు పాములు మనుషులను చూసి భయపడి దాక్కోవడానికే ప్రయత్నిస్తాయి. పాములకు ముప్పు అనిపించినప్పుడు మాత్రమే ఆత్మరక్షణ కోసం కాటు వేస్తాయి. అందుకే పాము కనిపించినప్పుడు దాన్ని చంపడానికి ప్రయత్నించకుండా, స్థానిక అటవీ శాఖ లేదా స్నేక్ రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించడం చాలా సురక్షితం.&lt;/p&gt;]]></content:encoded>
            <category>feature</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/how-snakes-protect-humans-and-maintain-ecological-balance-silent-saviors-3mu0do2"/>
        </item>
        <item>
            <title><![CDATA[Jio Smart Tag : మనుషులకే కాదు పశువులకూ స్మార్ట్ వాచ్ వచ్చేస్తోంది.. ఇది ఎలా పనిచేస్తుంది? దీనివల్ల లాభాలేంటి?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/jio-smart-cattle-technology-how-smart-tags-track-cow-health-and-fertility-531srm6</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/jio-smart-cattle-technology-how-smart-tags-track-cow-health-and-fertility-531srm6</guid>
            <pubDate>Fri, 04 Sep 2026 14:16:38 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;పశుపోషణ అనేది చాలా కష్టతరమైన పని&hellip; అందుకే డెయిరీ ఫార్మింగ్ వ్యాపారంలో చాలామంది నష్టాలను చవిచూస్తుంటారు. అయితే ఈ వ్యాపారాన్ని మరింత సులభతరం చేసి లాభాలను తెచ్చిపెట్టే టెక్నాలజీ డెవలప్ అవుతోంది. ఇందులో భాగమే పశువులకు స్మార్ట్ నెక్ ట్యాగ్.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1ns12xxzqh795r2nmrbbbaz,imgname-dairy-5-1788511030205.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;పశుపోషణ అనేది చాలా కష్టతరమైన పని&hellip; అందుకే డెయిరీ ఫార్మింగ్ వ్యాపారంలో చాలామంది నష్టాలను చవిచూస్తుంటారు. అయితే ఈ వ్యాపారాన్ని మరింత సులభతరం చేసి లాభాలను తెచ్చిపెట్టే టెక్నాలజీ డెవలప్ అవుతోంది. ఇందులో భాగమే పశువులకు స్మార్ట్ నెక్ ట్యాగ్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Smart Dairy Farming : మనిషి చేతికి స్మార్ట్ వాచ్ పెట్టుకుని గుండె వేగం, నడక, శారీరక కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న రోజులివి. మరి పశువుల ఆరోగ్యాన్ని కూడా ఇలాగే నిరంతరం పర్యవేక్షించగలిగితే? పశువు అనారోగ్యానికి గురైన తర్వాత గుర్తించడం కాకుండా.. ముందుగానే కొన్ని సంకేతాలను గుర్తిస్తే? పశువుల పెంపకంలో రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. ఇప్పుడు ఇదే దిశగా సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిలయన్స్ జియోకు చెందిన JioGauSamriddhi పశువుల మెడకు అమర్చే స్మార్ట్ నెక్ ట్యాగ్ ద్వారా వాటి కదలికలు, నెమరువేయడం, సంతానోత్పత్తి చక్రం, ఆరోగ్యానికి సంబంధించిన మార్పులను పర్యవేక్షించే వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే పశుపోషణలో ఊహించని మార్పులుంటాయని జియో జెబుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రైతులు సాధారణంగా తమ పశువుల ఆరోగ్యాన్ని వాటి ప్రవర్తన, మేత తినే విధానం, కదలికలు, పాల దిగుబడి వంటి అంశాలను గమనించడం ద్వారా అంచనా వేస్తుంటారు. అయితే ఒకేసారి పదుల సంఖ్యలో లేదా వందల సంఖ్యలో పశువులను పెంచే డెయిరీ ఫారాల్లో ప్రతి జంతువును 24 గంటలూ గమనించడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో పశువులకు ప్రవర్తనను క్షణంక్షణం పరిశీలించే సాంకేతిక పరికరాలు ఉపయోగపడతాయి.&lt;/p&gt;&lt;p&gt;JioGauSamriddhi స్మార్ట్ నెక్ ట్యాగ్&zwnj;ను పశువు మెడకు అమర్చుతారు. ఇది పశువు కదలికలు, నెమరువేసే విధానం, ప్రవర్తనా మార్పులు, సంతానోత్పత్తికి సంబంధించిన సంకేతాలను నిరంతరం గమనిస్తుంది. ఈ సమాచారం గేట్&zwnj;వే ద్వారా JioGauSamriddhi యాప్&zwnj;కు చేరుతుంది. అక్కడ డేటాను విశ్లేషించి రైతుకు అవసరమైన హెచ్చరికలు, సూచనలు అందించే విధంగా వ్యవస్థ పనిచేస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పశువుల విషయంలో ఒక ముఖ్యమైన సమస్య వ్యాధిని తొలిదశలో గుర్తించలేకపోవడం. పశువు స్పష్టంగా అనారోగ్య లక్షణాలు చూపించే సమయానికి సమస్య కొంత తీవ్రంగా ఉండొచ్చు. కానీ దాని సాధారణ ప్రవర్తనలో ముందుగానే మార్పులు రావచ్చు.&lt;/p&gt;&lt;p&gt;ఉదాహరణకు పశువు సాధారణం కంటే తక్కువగా కదలడం, నెమరువేయడంలో మార్పు రావడం, మేత తినే విధానంలో తేడా కనిపించడం వంటి విషయాలు ఆరోగ్య పరిస్థితిలో మార్పుకు సంకేతాలు కావచ్చు. స్మార్ట్ పరికరాలు ఇలాంటి ప్రవర్తనా మార్పులను నిరంతరం నమోదు చేయడం ద్వారా రైతుకు ముందస్తు హెచ్చరిక ఇవ్వగలవు. JioGauSamriddhi కూడా కదలికలు, ప్రవర్తనలో మార్పులు ఆరోగ్య సమస్యలకు సంకేతాలుగా ఉండొచ్చని, వాటి ఆధారంగా యాప్ ద్వారా అలర్ట్స్ అందించవచ్చని పేర్కొంది. అయితే ఈ హెచ్చరికను వైద్య నిర్ధారణగా భావించకూడదు. పరికరం ఒక అసాధారణ మార్పును గుర్తించినప్పుడు రైతు లేదా పశువైద్యుడు తదుపరి పరిశీలన చేయడం అవసరం.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;పశువు &ldquo;మూడ్&rdquo; కూడా తెలుస్తుందా?&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;జియో స్మార్ట్ ట్యాగ్ సాంకేతికతపై ఇక్కడే ఆసక్తి పెరుగుతోంది. పశువులు మనుషుల మాదిరిగా తమకు నొప్పి, ఒత్తిడి లేదా అసౌకర్యం ఉందని చెప్పలేవు. అయితే వాటి ప్రవర్తనలో మార్పుల ద్వారా కొన్ని సంకేతాలను గుర్తించవచ్చు. సాధారణం కంటే తక్కువ కదలడం, గుంపు నుంచి దూరంగా ఉండటం, మేత తినడంలో మార్పు, నెమరువేయడం తగ్గడం లేదా అసాధారణంగా ఎక్కువ కదలడం వంటి మార్పులను డేటా ద్వారా గుర్తించవచ్చు. అందువల్ల &ldquo;పశువు మూడ్&zwnj;ను కొలుస్తుంది&rdquo; అని చెప్పడం కంటే.. ప్రవర్తనా మార్పుల ఆధారంగా ఒత్తిడి, అసౌకర్యం లేదా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన సంకేతాలను గుర్తించే అవకాశం ఉంటుంది అని చెప్పడం సరైనది.&lt;/p&gt;&lt;p&gt;పశువుల ఆరోగ్యం, ప్రవర్తనను పర్యవేక్షించేందుకు ధరించగలిగే సెన్సార్ల వినియోగంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలాంటి సాంకేతికతలు వ్యాధులను ముందుగానే గుర్తించడం, పశువుల సంక్షేమాన్ని మెరుగుపరచడం, పశువుల నిర్వహణను సమర్థంగా మార్చడం వంటి ప్రయోజనాలను అందించగలవని పరిశోధనలు సూచిస్తున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;డెయిరీ రైతులకు పశువుల ఆరోగ్యంతో పాటు సంతానోత్పత్తి నిర్వహణ కూడా చాలా ముఖ్యం. ఆవుల్లో హీట్ లేదా ఈస్ట్రస్ అంటే సంతానోత్పత్తికి సిద్ధమయ్యే దశ. ఈ సమయంలో సరైన సమయాన్ని గుర్తించి కృత్రిమ గర్భధారణ వంటి ప్రక్రియలను నిర్వహిస్తే సంతానోత్పత్తి నిర్వహణ మరింత సమర్థంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ పశువుల్లో సంతానోత్పత్తికి సంబంధించిన కొన్ని ప్రవర్తనా మార్పులు కొద్దిసేపే కనిపించవచ్చు. అందువల్ల రైతు కంటికి అవి చిక్కకపోవచ్చు. ఇక్కడ స్మార్ట్ నెక్ ట్యాగ్ ఉపయోగపడుతుంది.&lt;/p&gt;&lt;p&gt;JioGauSamriddhi ప్రకారం నెక్ ట్యాగ్ పశువుల కదలికలు, నెమరువేయడాన్ని పర్యవేక్షించి వాటి కార్యకలాపాల్లో వచ్చే మార్పులను విశ్లేషిస్తుంది. సంతానోత్పత్తికి సంబంధించిన సంకేతాలను గుర్తించినప్పుడు యాప్ ద్వారా రైతుకు హెచ్చరిక అందుతుంది. తద్వారా సంతానోత్పత్తికి సరైన సమయాన్ని నిర్ణయించుకోవడంలో రైతుకు సహాయం లభిస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఒక్కో పశువును 24 గంటలూ గమనించే టెక్నాలజీ&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఈ వ్యవస్థలో ఆసక్తికరమైన విషయం కేవలం మెడకు పరికరం అమర్చడం మాత్రమే కాదు. పరికరం &rarr; డేటా &rarr; విశ్లేషణ &rarr; హెచ్చరిక &rarr; రైతు నిర్ణయం అనే పూర్తి వ్యవస్థ పనిచేస్తుంది. నెక్ ట్యాగ్ పశువు నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ సమాచారం గేట్&zwnj;వేకు చేరుతుంది. అక్కడి నుంచి JioGauSamriddhi యాప్&zwnj;కు సమాచారం పంపబడుతుంది. రైతు తన మొబైల్&zwnj;లో పశువుల ఆరోగ్యం, కదలికలు, హీట్ సైకిల్ వంటి అంశాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అధికారిక సమాచారం ప్రకారం ఒక గేట్&zwnj;వే ఒకేసారి 500 స్మార్ట్ ట్యాగ్&zwnj;ల వరకు రియల్&zwnj;టైమ్ డేటాను సేకరించగలదు. అంటే పెద్ద డెయిరీ ఫారాల్లో ప్రతి పశువును విడిగా గమనించాల్సిన శ్రమ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పశువు ఆరోగ్యం నేరుగా రైతు ఆదాయంతో ముడిపడి ఉంటుంది. పశువు అనారోగ్యానికి గురైతే పాల ఉత్పత్తి తగ్గవచ్చు. సంతానోత్పత్తి నిర్వహణలో ఆలస్యం జరిగితే తదుపరి పాల ఉత్పత్తి చక్రంపై ప్రభావం పడవచ్చు. మేత, పోషకాహారం, విశ్రాంతి, నీటి లభ్యత, పశువుల ఆరోగ్యం వంటి అనేక అంశాలు పాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి.&lt;/p&gt;&lt;p&gt;అందుకే పశువు గురించి నిరంతరం లభించే సమాచారం రైతుకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. JioGauSamriddhi వ్యవస్థ కూడా ఆరోగ్యం, హీట్ గుర్తింపు, పాల ఉత్పత్తి రికార్డులు, పశువుల నిర్వహణ వంటి అంశాలను ఒకే డిజిటల్ ప్లాట్ పామ్ తో అనుసంధానించే లక్ష్యంతో పనిచేస్తోంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;పశువుల నిర్వహణలో &ldquo;డేటా&rdquo; ఎందుకు కీలకం?&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఇప్పటివరకు పశువుల పెంపకంలో రైతు అనుభవానికి చాలా ప్రాధాన్యం ఉండేది. ఏ పశువు ఎప్పుడు మేత తింటుంది? ఎప్పుడు సంతానోత్పత్తికి సిద్దం అవుతుంది? ఏ పశువు పాల దిగుబడి ఎంత ఉంటుంది? ఏ పశువు ప్రవర్తనలో మార్పు వచ్చింది? వంటి విషయాలను రైతు తన పరిశీలన ఆధారంగా గుర్తించేవారు.&lt;/p&gt;&lt;p&gt;ఇప్పుడు అదే పనిలో సెన్సర్లు, కృత్రిమ మేథస్సు ఆధారిత విశ్లేషణ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాంకేతికతలు ప్రవేశిస్తున్నాయి. పశువుల నుంచి నిరంతరం సేకరించే సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా అసాధారణ మార్పులను త్వరగా గుర్తించే అవకాశం ఏర్పడుతోంది. ఇదే ఖచ్చితమైన పశుపోషణ (Precision Dairy Farming) వైపు తీసుకెళ్తున్న ముఖ్యమైన అడుగు.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;వాతావరణ మార్పుల సమయంలో మరింత ఉపయోగం&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పశువుల్లో వేడి ఒత్తిడికి దారితీయవచ్చు. అధిక ఉష్ణోగ్రతలు, నీటి లభ్యత, పశువుల కొట్టంలోని గాలి ప్రసరణ, మేత విధానం వంటి అంశాలు వాటి ఆరోగ్యం, ఉత్పాదకతను ప్రభావితం చేయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పశువుల సాధారణ కార్యకలాపాల్లో వచ్చే మార్పులను నిరంతరం గమనించే సాంకేతికత రైతుకు ఉపయోగపడుతుంది. పశువు సాధారణ స్థితి నుంచి ఎప్పుడు భిన్నంగా ప్రవర్తిస్తోంది అనే విషయాన్ని డేటా ద్వారా గుర్తిస్తే, అవసరమైన చర్యలను త్వరగా తీసుకునే అవకాశం ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;భవిష్యత్తులో ప్రతి పశువుకూ డిజిటల్ రికార్డ్?&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఒక రైతు వద్ద 100 పశువులు ఉన్నాయని ఊహించుకోండి. ప్రతి పశువు రోజులో ఎంత కదిలింది? ఎంతసేపు నెమరువేసింది? ఎప్పుడు హీట్&zwnj;లోకి వచ్చింది? దాని ప్రవర్తనలో ఎప్పుడు మార్పు వచ్చింది? ఏ పశువుకు ఆరోగ్య పరీక్ష అవసరం? వంటి వివరాలన్నీ ఒకే చోట కనిపిస్తే పశువుల నిర్వహణ మరింత సులభమవుతుంది.&lt;/p&gt;&lt;p&gt;భవిష్యత్తులో ధరించగలిగే సెన్సర్లు, కృత్రిమ మేథస్సు, యంత్ర అభ్యాసం, పశువైద్య డేటా, వాతావరణ సమాచారం వంటి అంశాలు ఒకదానితో ఒకటి అనుసంధానమైతే.. ఒక్కో పశువుకు ఒక డిజిటల్ ఆరోగ్య రికార్డు లాంటి వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉంది.అయితే సాంకేతికత రైతు స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయదు. పరికరం ఇచ్చే సమాచారం ఆధారంగా రైతు, పశువైద్యుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;జియో ప్రయోగం వెనుక అసలు ఆలోచన ఇదే&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;జియో పశువుల కోసం తీసుకొస్తున్న సాంకేతికతను కేవలం ఒక &ldquo;స్మార్ట్ వాచ్&rdquo;గా చూడటం సరైంది కాదు. ఇప్పటికే ఉన్న JioGauSamriddhi వ్యవస్థలో స్మార్ట్ నెక్ ట్యాగ్, గేట్&zwnj;వే, మొబైల్ యాప్ కలిసి పనిచేస్తున్నాయి. పశువుల కదలికలు, నెమరువేయడం, హీట్ సైకిల్, ఆరోగ్యానికి సంబంధించిన మార్పులను పర్యవేక్షించి రైతుకు ఉపయోగపడే సమాచారంగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. అంటే భవిష్యత్తులో పశువుల పెంపకం కూడా కేవలం అనుభవం, పరిశీలనపై ఆధారపడకుండా.. డేటా ఆధారిత పశుపోషణ వైపు మరింతగా మారే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;p&gt;మనిషి ఆరోగ్యాన్ని స్మార్ట్ వాచ్&zwnj;తో ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లే.. పశువుల ఆరోగ్యం, ప్రవర్తన, సంతానోత్పత్తి అంశాలను కూడా సాంకేతికతతో నిరంతరం పర్యవేక్షించే రోజులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రైతు చేతిలో మొబైల్.. పశువు మెడలో స్మార్ట్ ట్యాగ్.. మధ్యలో డేటా విశ్లేషణ. రాబోయే రోజుల్లో భారత డెయిరీ రంగంలో ఈ కలయిక మరింత కీలకంగా మారే అవకాశం ఉంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>feature</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/jio-smart-cattle-technology-how-smart-tags-track-cow-health-and-fertility-531srm6"/>
        </item>
        <item>
            <title><![CDATA[School Uniforms : ఒక్కో స్కూల్ యూనిఫామ్స్ ఒక్కోలా ఉంటాయి.. ఎందుకో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/the-diverse-designs-of-indian-school-uniforms-explained-5ah95z5</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/the-diverse-designs-of-indian-school-uniforms-explained-5ah95z5</guid>
            <pubDate>Wed, 02 Sep 2026 18:07:07 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;భారతదేశంలోని ఒక్కో స్కూల్ యూనిఫామ్ ఒక్కోరకంగా ఉంటుంది&hellip; ఇలా రకరకాలుగా రంగుల్లో యూనిఫామ్స్ ఉండటానికి కారణాలేంటో తెలుసా? అన్ని స్కూళ్లకు ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఎందుకుండదు?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1h1tkte3nb184snqwxx381r,imgname-school-1788352483149.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;భారతదేశంలోని ఒక్కో స్కూల్ యూనిఫామ్ ఒక్కోరకంగా ఉంటుంది&hellip; ఇలా రకరకాలుగా రంగుల్లో యూనిఫామ్స్ ఉండటానికి కారణాలేంటో తెలుసా? అన్ని స్కూళ్లకు ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఎందుకుండదు?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మీరు ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఇంట్లోంచి బయటకు వెళితే చాలు స్కూల్&zwnj; పిల్లలు కనిపిస్తారు. ఈ సమయంలో వాళ్ల యూనిఫామ్స్ గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి స్కూల్&zwnj;కు సొంత యూనిఫామ్ ఉంటుంది&hellip; ఆ డిజైన్లు చాలా విభిన్నంగా ఉంటాయి. ఒక స్కూల్&zwnj;లో షర్ట్-ప్యాంట్ ఉంటే, మరో స్కూల్&zwnj;లో కుర్తా లేదా బ్లేజర్ ఉండొచ్చు. మరి దేశమంతటికీ ఒకే యూనిఫామ్ ఎందుకు లేదు? దీనికి ఒకటి కాదు చాలా కారణాలున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;యూనిఫామ్ వల్ల విద్యార్థులు ఏ స్కూల్&zwnj;కు చెందినవారో సులభంగా గుర్తించవచ్చు. రంగులు, బ్యాడ్జ్&zwnj;లు, ప్యాటర్న్&zwnj;ల వంటివి ఆ విద్యాసంస్థను గుర్తించడానికి, విద్యార్థుల్లో ఒక సమూహమనే భావనను పెంచడానికి ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని నేషనల్ కరికులమ్ ఫ్రేమ్&zwnj;వర్క్ (NCF) 2023 కూడా నొక్కి చెప్పింది.&lt;img&gt;&lt;p&gt;యూనిఫామ్ డిజైన్&zwnj;ను వాతావరణం బాగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు వేడి ప్రాంతాల్లోని స్కూళ్లు తేలికైన, గాలి ఆడే దుస్తులను ఎంచుకుంటాయి. అదే చల్లని ప్రాంతాల్లోని స్కూళ్లలో స్వెటర్లు, బ్లేజర్లు ధరిస్తారు. యూనిఫామ్ ఎంపికలో వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని NCF కూడా చెబుతోంది.&lt;/p&gt;&lt;img&gt;స్కూళ్లు తమ యూనిఫామ్స్&zwnj;లో, స్పోర్ట్స్&zwnj;వేర్&zwnj;లో ప్రత్యేకమైన రంగులను వాడతాయి. ఈ రంగుల ద్వారా విద్యార్థులను వేరుగా గుర్తించవచ్చు. ఇది తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, బ్రాండ్&zwnj;ను సృష్టించుకోవడానికి స్కూళ్లకు సహాయపడుతుంది.&lt;img&gt;&lt;p&gt;స్కూళ్లలో యూనిఫామ్స్ పెట్టడానికి చాలా కారణాలున్నాయి. పరిశోధనల ప్రకారం, యూనిఫామ్ ధరించడం వల్ల విద్యార్థుల మధ్య బట్టల విషయంలో కనిపించే వ్యత్యాసాలు తగ్గుతాయి. పేద, ధనిక అనే తేడా కనిపించకుండా అందరూ సమానమనే భావన కలుగుతుంది.&lt;/p&gt;&lt;p&gt;ప్రతి స్కూల్&zwnj;కు దాని సొంత చరిత్ర, సంప్రదాయాలు ఉంటాయి. ఇవి యూనిఫామ్ డిజైన్&zwnj;పై ప్రభావం చూపుతాయి. కొన్ని స్కూళ్లు ఏళ్ల తరబడి తమ పాత యూనిఫామ్ డిజైన్&zwnj;నే కొనసాగిస్తాయి. మరికొన్ని స్కూళ్లు కాలానుగుణంగా డిజైన్లను మారుస్తూ సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి.&lt;/p&gt;&lt;p&gt;యూనిఫామ్ ఫ్యాబ్రిక్, డిజైన్ ఎంపికలో ప్రాక్టికాలిటీ కూడా ఒక ముఖ్యమైన అంశం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ యూనిఫామ్&zwnj;ను కొనుగోలు చేయగలగాలి. అలాగే విద్యార్థులు రోజంతా దాన్ని సౌకర్యవంతంగా ధరించగలగాలి.&lt;/p&gt;&lt;img&gt;భారతదేశంలో భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యం చాలా ఎక్కువ. అందుకే దేశవ్యాప్తంగా ఒకే యూనిఫామ్&zwnj;ను అమలు చేయడం అసాధ్యం. ప్రతి స్కూల్&zwnj;కు దాని సొంత వాతావరణం, చరిత్ర, గుర్తింపు, ఇతర ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. అందుకే ఒక స్కూల్&zwnj;కు మరో స్కూల్&zwnj;కు యూనిఫామ్ డిజైన్లలో చాలా తేడాలు ఉంటాయి.]]></content:encoded>
            <category>feature</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/the-diverse-designs-of-indian-school-uniforms-explained-5ah95z5"/>
        </item>
        <item>
            <title><![CDATA[విద్యుత్ మీటర్లలో ఆకుపచ్చ, ఎరుపు, నీలం, పసుపు  లైట్లు ఎందుకుంటాయి? ఇవి వెలిగితే అర్థమేంటి?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/understanding-your-digital-electric-meter-light-indicators-5tmg4ti</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/understanding-your-digital-electric-meter-light-indicators-5tmg4ti</guid>
            <pubDate>Sat, 05 Sep 2026 14:28:06 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;కరెంట్ బిల్లు ద్వారానే కాదు మన ఇంటి విద్యుత్ మీటర్లో ఉండే చిన్నచిన్న లైట్ల ద్వారా కూడా కరెంట్ వాడకం, సరఫరా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవచ్చని చాలామందికి తెలియదు. ఏ లైట్ దేనికి సంకేతమో తెలుసా?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1rbcqn67d9n1v8pynds2fe2,imgname-meter-1788597395110.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;కరెంట్ బిల్లు ద్వారానే కాదు మన ఇంటి విద్యుత్ మీటర్లో ఉండే చిన్నచిన్న లైట్ల ద్వారా కూడా కరెంట్ వాడకం, సరఫరా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవచ్చని చాలామందికి తెలియదు. ఏ లైట్ దేనికి సంకేతమో తెలుసా?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;చాలామందికి విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ బిల్లు ఇస్తేగానీ ఎన్ని యూనిట్లు వాడారో తెలియదు. బిల్లు ఎక్కువొస్తే ఎవ్వరైనా కంగారు పడతారు. కానీ విద్యుత్ మీటర్&zwnj;లోని లైట్లను గమనిస్తే కరెంట్ వాడకం గురించి తెలుసుకోవచ్చు. డిజిటల్ మీటర్లలో ఆకుపచ్చ, ఎరుపు, నీలం, పసుపు రంగు లైట్లు ఉంటాయి. ఏ లైట్ దేనికి సంకేతమో తెలుసా?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మీటర్&zwnj;లో ఆకుపచ్చ లైట్ వెలుగుతుందంటే.. మీటర్&zwnj;కు కరెంట్ సరఫరా అవుతోందని అర్థం. ఇంట్లో పవర్ ఉన్నప్పుడు ఈ లైట్ వెలిగితే కంగారు పడాల్సిన పనిలేదు. ఒకవేళ కరెంట్ లేకున్నా ఈ లైట్&zwnj; వెలుగుతున్నా, ఏదైనా తేడా కనిపించినా మీటర్&zwnj;ను చెక్ చేయించడం మంచిది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;చాలా మీటర్లలో ఎర్ర లైటుకు, ఇంట్లో వాడుతున్న కరెంట్ లోడ్&zwnj;కు సంబంధం ఉంటుంది. ఏసీ, కూలర్, ఫ్రిజ్, మోటార్ వంటివి ఒకేసారి వాడితే ఈ లైట్ వేగంగా బ్లింక్ అవుతుంది. అలా వేగంగా వెలిగితే మీటర్ పాడైందని కాదు&hellip; ఎక్కువు విద్యుత్ వినియోగిస్తున్నట్లు అర్థం. ఇలా రెడ్ లైట్ ఎక్కువగా బ్లింక్ అయితే కరెంట్ ఖర్చు పెరగడం ఖాయం.&lt;/p&gt;&lt;p&gt;ఇక కొన్ని డిజిటల్ మీటర్లలో నీలం రంగు లైట్, కరెంట్ వాడకాన్ని సూచిస్తుంది. ఇంట్లో కరెంట్ వాడుతున్నప్పుడు ఈ లైట్ వెలుగుతుంది లేదా బ్లింక్ అవుతుంది. కరెంట్ వాడకం ఎంత ఎక్కువగా ఉంటే, ఈ లైట్ అంత వేగంగా బ్లింక్ అవుతుంది.&lt;/p&gt;&lt;img&gt;చాలా మీటర్లలో పసుపు రంగు లైట్ ఒక హెచ్చరిక సిగ్నల్&zwnj;గా పనిచేస్తుంది. అంటే మీటర్&zwnj;లో ఏదో సమస్య ఉందని, దాన్ని గమనించాలని అర్థం. దీని కచ్చితమైన అర్థం మీటర్ మోడల్&zwnj;పై ఆధారపడి ఉంటుంది. ఈ లైట్ ఆగకుండా వెలుగుతుంటే, వెంటనే కరెంట్ ఆఫీస్&zwnj;కు ఫోన్ చేసి విషయం చెప్పడం మంచిది.&lt;img&gt;&lt;p&gt;కొన్ని స్మార్ట్ మీటర్లలో 'Reverse' అనే లైట్ ఉంటుంది. కరెంట్ ప్రవాహం వ్యతిరేక దిశలో వెళ్తున్నప్పుడు ఈ లైట్ వెలుగుతుంది. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ ఉన్న కనెక్షన్లలో ఇలాంటి సిగ్నల్ కనిపించవచ్చు. ఈ లైట్ వెలిగితే మీరే మీటర్ తెరవొద్దు. కరెంట్ సిబ్బందితో చెక్ చేయించడమే సురక్షితం.&lt;/p&gt;&lt;p&gt;కొన్ని మీటర్లలో 'Tamper' లేదా 'Fault' అనే లైట్ ఉంటుంది. మీటర్&zwnj;తో ఎవరైనా ట్యాంపరింగ్ చేసినా లేదా సాంకేతిక సమస్య ఉన్నా ఇది సూచిస్తుంది. ఈ లైట్ ఆగకుండా వెలుగుతున్నా, డిస్&zwnj;ప్లేపై ఏదైనా హెచ్చరిక కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే కరెంట్ ఆఫీస్ సిబ్బందితో మీటర్&zwnj;ను చెక్ చేయించాలి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>feature</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/understanding-your-digital-electric-meter-light-indicators-5tmg4ti"/>
        </item>
        <item>
            <title><![CDATA[Primary School Age In USA: అమెరికాలో పిల్లలు ఏ వయసులో బడికి వెళ్తారో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/primary-school-age-in-usa-at-what-age-do-kids-start-school-in-america-compared-to-india-8gt7nds</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/primary-school-age-in-usa-at-what-age-do-kids-start-school-in-america-compared-to-india-8gt7nds</guid>
            <pubDate>Thu, 03 Sep 2026 08:02:22 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Primary School Age In USA: భారత దేశంలో సాధారణంగా ఆరేళ్ల తర్వాత పిల్లలు ప్రైమరీ స్కూల్ లో చేరుతారు. మరి ఇతర దేశాల్లో పిల్లలు ఏ వయసులో బడిబాట పడుతున్నారో తెలుసా? అమెరికా, పాకిస్తాన్ సహా పలు దేశాల ప్రాథమిక విద్యా ప్రవేశాల డేటా వివరాలు ఇక్కడ చూద్దాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1hs31d1k57tq7cjv3s08cy9,imgname-primary-school-age-in-usa-1788376876449.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Primary School Age In USA: భారత దేశంలో సాధారణంగా ఆరేళ్ల తర్వాత పిల్లలు ప్రైమరీ స్కూల్ లో చేరుతారు. మరి ఇతర దేశాల్లో పిల్లలు ఏ వయసులో బడిబాట పడుతున్నారో తెలుసా? అమెరికా, పాకిస్తాన్ సహా పలు దేశాల ప్రాథమిక విద్యా ప్రవేశాల డేటా వివరాలు ఇక్కడ చూద్దాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పిల్లల చదువుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఒక్కో దేశంలో ఒక్కో రకమైన నిబంధనలు ఉన్నాయి. చిన్నారులు ఏ వయసులో ప్రాథమిక విద్యను ప్రారంభించాలనే దానిపై దేశాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై 'వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్' ఒక ఆసక్తికరమైన డేటాను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ రిపోర్టులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో పిల్లలు ప్రాథమిక విద్య కోసం పాఠశాలల్లో చేరే సగటు వయస్సును స్పష్టంగా వెల్లడించారు. ఈ జాబితాలో భారతదేశంతో పాటు పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, అగ్రరాజ్యాలైన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి అనేక దేశాల వివరాలు ఉన్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన ఈ జాబితాలో అత్యధిక వయసులో పిల్లలను బడికి పంపే దేశాల వివరాలు కూడా ఉన్నాయి. ఈ లిస్టులో బల్గేరియా పేరు చివర్లో ఉంది. ఇక్కడ పిల్లలు సగటున ఏడు సంవత్సరాల వయస్సులో పాఠశాలకు వెళ్తారు. కేవలం బల్గేరియా మాత్రమే కాకుండా, విద్యారంగంలో ఎంతో పేరు గాంచిన ఫిన్లాండ్ దేశంలో కూడా ఇదే విధానం ఉంది. వీటితో పాటు హంగేరీ, పోలాండ్, రష్యా వంటి దేశాలు కూడా ఈ జాబితాలోనే ఉన్నాయి. ఈ రిపోర్టు ప్రకారం ఈ దేశాలన్నింటిలోనూ పిల్లలు ప్రాథమిక బడిబాట పట్టడానికి సగటున ఏడు సంవత్సరాల వయస్సు ఉండటం విశేషం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పిల్లలను సగటున ఆరు సంవత్సరాల వయస్సులో ప్రాథమిక పాఠశాలకు పంపే దేశాల జాబితాలో అర్జెంటీనా మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాలో అనేక చిన్న, పెద్ద దేశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, ఈజిప్ట్, జర్మనీ, ఐస్&zwnj;లాండ్ వంటి దేశాలు తమ దేశాల్లోని పిల్లలను సగటున ఆరు సంవత్సరాల వయసులోనే పాఠశాలలకు పంపుతున్నాయి. విశేషమేమిటంటే భారతదేశం కూడా సరిగ్గా ఇదే జాబితాలో ఉంది. అధికారిక డేటా ప్రకారం భారతదేశంలో పిల్లలు ప్రాథమిక విద్యను ప్రారంభించే సగటు వయస్సు ఆరు సంవత్సరాలుగా ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత్&zwnj;లో ఆరు ఏళ్లు ఉంటే, పొరుగున ఉన్న పాకిస్తాన్&zwnj;లో పిల్లలు ఏ వయసులో బడికి వెళ్తారనే సందేహం రావడం సహజం. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వివరాల ప్రకారం పాకిస్తాన్&zwnj;లో పిల్లలు పాఠశాలకు వెళ్లే సగటు వయస్సు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే. అంటే అక్కడ పిల్లలు చాలా చిన్న వయసులోనే ప్రాథమిక విద్యను ప్రారంభిస్తున్నారు. ఇదే విధంగా అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం అమెరికాలో కూడా సగటు వయస్సు ఐదేళ్లే కావడం గమనార్హం. తుర్కియే, ఉక్రెయిన్, వియత్నాం, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ వంటి దేశాలు కూడా ఈ ఐదేళ్ల సగటు వయస్సు ఉన్న దేశాల జాబితాలోనే ఉన్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;దేశాల వారీగా భిన్న విద్యా విధానాలు: ప్రతి దేశంలో పిల్లల మానసిక పరిపక్వత, సామాజిక పరిస్థితులు, విద్యా ప్రణాళికలను బట్టి ప్రాథమిక పాఠశాల ప్రవేశ వయస్సును నిర్ణయిస్తారు.&lt;/p&gt;&lt;p&gt;ఆలస్యమైన ప్రవేశంతో ప్రయోజనాలు: ఫిన్లాండ్, బల్గేరియా, రష్యా వంటి దేశాల్లో 7 సంవత్సరాల వయసులో బడిలో చేర్చడం వల్ల పిల్లలకు మానసిక ఒత్తిడి తగ్గి, పాఠశాల విద్యకు మెరుగైన సిద్ధత లభిస్తుందని ఆయా దేశాల విద్యా నిపుణుల భావన.&lt;/p&gt;&lt;p&gt;ముందస్తు విద్య (5-6 ఏళ్లు): భారత్, బంగ్లాదేశ్ (6 ఏళ్లు), అమెరికా, పాకిస్తాన్ (5 ఏళ్లు) వంటి దేశాల్లో చిన్న వయసు నుంచే ప్రాథమిక అక్షరాస్యత, నైపుణ్యాల పునాది వేయడానికి ప్రాధాన్యం ఇస్తారు.&lt;/p&gt;&lt;p&gt;యునెస్కో (UNESCO), జాతీయ విద్యా మంత్రిత్వ శాఖల పాత్ర: ఈ సగటు వయస్సు లెక్కలను ఐక్యరాజ్యసమితి యునెస్కో స్టాటిస్టిక్స్ విభాగం, ప్రపంచ దేశాల విద్యా మంత్రిత్వ శాఖలు సేకరించిన అధికారిక సమాచారం.&lt;/p&gt;]]></content:encoded>
            <category>feature</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/primary-school-age-in-usa-at-what-age-do-kids-start-school-in-america-compared-to-india-8gt7nds"/>
        </item>
        <item>
            <title><![CDATA[Gold: శ్రీశైలంలో ఇనుమును బంగారంగా మార్చారా? నాగార్జునుడి గుహలో ఏం జరిగింది?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/nallamala-secrets-srisailam-alchemy-mystery-how-acharya-nagarjuna-turned-iron-into-gold-cziv6r8</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/nallamala-secrets-srisailam-alchemy-mystery-how-acharya-nagarjuna-turned-iron-into-gold-cziv6r8</guid>
            <pubDate>Fri, 04 Sep 2026 13:49:18 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Gold: ఇనుమును బంగారంగా మార్చే రసవాదం పై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మధ్యయుగంలో శ్రీశైలం కేంద్రంగా ఆచార్య నాగార్జునుడు జరిపిన రసవాద ప్రయోగాలు, పాదరసం ద్వారా ఇనుమును బంగారంగా మార్చే రహస్యాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1nqw374kzxa28z130h2fx84,imgname-srisailam-nagarjuna-iron-gold-nallamala-forests--1--1788509818083.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Gold: ఇనుమును బంగారంగా మార్చే రసవాదం పై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మధ్యయుగంలో శ్రీశైలం కేంద్రంగా ఆచార్య నాగార్జునుడు జరిపిన రసవాద ప్రయోగాలు, పాదరసం ద్వారా ఇనుమును బంగారంగా మార్చే రహస్యాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;శ్రీశైలం అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున స్వామి క్షేత్రం. అయితే ఈ పవిత్ర భూమి కేవలం ఆధ్యాత్మికతకే కాదు, మధ్యయుగ భారతదేశంలో రసవాదానికి కూడా ప్రధాన కేంద్రంగా విరాజిల్లింది. ఇక్కడే ఆచార్య సిద్ధ నాగార్జునుడు ఇనుము వంటి సాధారణ లోహాలను బంగారంగా మార్చే ప్రయోగాలు చేశాడని, పాదరసం మీద విస్తృత పరిశోధనలు జరిపాడని చరిత్ర, చారిత్రక గాథలు చెబుతాయి.&lt;/p&gt;&lt;p&gt;కృష్ణా నది ఒడ్డున, దట్టమైన నల్లమల అడవుల మధ్య ఉన్న శ్రీశైలం నాగార్జునుడి ప్రయోగాలకు అనుకూలమైన వాతావరణాన్ని ఇచ్చింది. నాగార్జునుడి ప్రయోగశాల ఉన్న ప్రాంతాన్ని 'దర్దా' అని కూడా పిలిచేవారు. పాదరసానికి 'దరద' అనే మరో పేరు ఉండడం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని స్థానికులు నమ్ముతారు. శ్రీశైలం చుట్టూ ఉన్న నల్లమల అడవుల్లో ఇప్పటికీ అనేక అరుదైన ఔషధ మొక్కలు, ఖనిజాలు దొరుకుతాయి. ఇదే పర్యావరణం ఆనాడు రసవాద సిద్ధులకు ఎంతో సహాయపడింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆచార్య నాగార్జునుడు 84 సిద్ధులలో ఒకడిగా, బౌద్ధ సన్యాసిగా, తాంత్రిక గురువుగా, రసవిద్యా నిపుణుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన రచించిన 'రసరత్నాకరం' అనే గ్రంథం సంస్కృతంలో లభించే అతి పురాతన రసవాద గ్రంథాలలో ఒకటి. నాగార్జునుడి ప్రయోగశాల శ్రీ పర్వతం అంటే శ్రీశైలం మీద ఉండేదని చారిత్రక కథనాలు వివరిస్తున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;ఇక్కడే ఆయన పాదరసం, ఇనుము, రాగి, సీసం, వెండి వంటి లోహాలతో సుదీర్ఘ ప్రయోగాలు చేశాడు. వాటిని ఔషధాలుగా, రసాయనాలుగా మార్చే వినూత్న పద్ధతులను అభివృద్ధి చేశాడు. నాగార్జునుడు కేవలం లోహాలను మార్చడమే కాకుండా, మానవ శరీరాన్ని రోగరహితంగా ఉంచే పరిశోధనలపై కూడా దృష్టి పెట్టాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రసవాద గ్రంథాల ప్రకారం నాగార్జునుడు లోహాలను బంగారంగా మార్చే ప్రక్రియలను స్పష్టంగా వివరించాడు. ఆయన పాదరసాన్ని 'లోహరాజు'గా భావించాడు. అన్ని లోహాలను తనలో కరిగించుకోగల శక్తి ద్రవ రూపంలో ఉండే పాదరసానికి మాత్రమే ఉందని చెప్పాడు. పాదరసానికి 18 రకాల శుద్ధి ప్రక్రియలు చేసి, దానిలో ఉన్న విషగుణాలను పూర్తిగా తొలగించి, ఔషధ యోగ్యంగా మార్చే పద్ధతులను కనిపెట్టాడు.&lt;/p&gt;&lt;p&gt;ఈ శుద్ధి చేసిన పాదరసాన్ని ఇనుము, రాగి, సీసం, వెండి వంటి లోహాలతో కలిపి, నిర్దిష్ట ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తే, ఆ లోహాలు బంగారంగా మారతాయని రసవాద గ్రంథాలు పేర్కొంటున్నాయి. రసజల నిధి, రసరత్నాకర గ్రంథాలలో ఇనుము పొడి, పాదరసం, గంధకం, మాక్షికం, సీసం, రాగి, వెండి వంటివాటిని కలిపి, కొన్ని పద్ధతుల ద్వారా బంగారం తయారు చేసే విధానాలు ఉన్నాయని ఆ గ్రంథాలు పేర్కొంటున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;ఒక ప్రత్యేక పద్ధతిలో ఇనుము పొడిని కొన్ని మూలికల రసంతో కలిపి, మూడు సార్లు జాగ్రత్తగా వేడి చేస్తారు. ఆ తర్వాత మాక్షికం పొడిని రాతి ఉప్పు, పులుసు రసంతో కలిపి మళ్లీ వేడి చేస్తారు. ఈ రెండు పొడులను సమానంగా కలిపి, వెండి, రాగి పొడులతో కలిపి, క్రమంగా సీసాన్ని కలుపుతూ వేడి చేస్తారు. చివరకు వెండి కరిగిపోయి, 6/16వ వంతు బంగారం కలిగిన పసుపు రంగు లోహం వస్తుందని ఆ గ్రంథాల్లో వర్ణించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నాగార్జునుడి రసవాదం కేవలం బంగారం తయారు చేయడానికి మాత్రమే పరిమితం కాలేదు. అది ప్రాణాలను కాపాడే రసౌషధుల తయారీకి ఎంతో ఉపయోగపడింది. పాదరసం, గంధకం, ఇనుము, రాగి, సీసం, వెండి, ఇతర ఖనిజాలు, మూలికలను కలిపి తయారు చేసిన ఈ రసౌషధులు అనేక వ్యాధులను నయం చేసేవని గ్రంథాలు పేర్కొంటున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;జీర్ణశక్తి లోపాలు, తీవ్రమైన జ్వరాలు, చర్మ వ్యాధులు, నరాల బలహీనత, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ సమస్యలు వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఈ మందులు వాడేవారు. నాగార్జునుడే పాదరసం, ఖర్పర వంటివాటిని మొదటిసారిగా ఔషధాలుగా వాడాడని, వాటిని విషరహితం చేసే పద్ధతులను కనిపెట్టాడని చరిత్ర చెబుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆధునిక శాస్త్ర దృష్టితో చూస్తే, సాధారణ రసాయన ప్రక్రియల ద్వారా ఇనుమును బంగారంగా మార్చడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇనుము, బంగారం వేర్వేరు మూలకాలు. ఒక మూలకాన్ని మరో మూలకంగా మార్చాలంటే అణు స్థాయి మార్పులు జరగాలి.&lt;/p&gt;&lt;p&gt;అయితే రసవాద గ్రంథాలు, స్థానిక గాథలు, సిద్ధ సంప్రదాయం దృష్టిలో నాగార్జునుడి ప్రయోగాలు కేవలం లోహాల మార్పిడి మాత్రమే కాదు. అవి ఆరోగ్యం, ఆధ్యాత్మికత, పర్యావరణం కలిసిన ఒక సమగ్ర విజ్ఞాన వ్యవస్థ. నల్లమల గుహల్లో ప్రాచీన కాలంలో జరిగిన ఈ పరిశోధనలు భారతీయ రసాయన శాస్త్ర పునాదులకు నిదర్శనంగా నిలిచాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>feature</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/nallamala-secrets-srisailam-alchemy-mystery-how-acharya-nagarjuna-turned-iron-into-gold-cziv6r8"/>
        </item>
        <item>
            <title><![CDATA[పిల్లి అడ్డొస్తే నిజంగానే అపశకునమా? ఈ నమ్మకం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణం ఏంటో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/facts-is-it-bad-luck-if-a-cat-crosses-your-path-the-interesting-story-behind-this-ancient-belief-dkc2a9g</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/facts-is-it-bad-luck-if-a-cat-crosses-your-path-the-interesting-story-behind-this-ancient-belief-dkc2a9g</guid>
            <pubDate>Sat, 05 Sep 2026 08:22:28 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Facts: పిల్లి ఎదురుగా వస్తే చాలామంది ఒక్కసారిగా ఆగిపోతారు. కొందరు కాసేపు నిలబడి మళ్లీ ప్రయాణం ప్రారంభిస్తారు.టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ ఈ నమ్మకాన్ని పాటిస్తున్నారు. అయితే పిల్లి అడ్డొస్తే మంచిది కాదనే భావన ఎలా వచ్చిందో తెలుసా.?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1pn8mzqvkpas8hr2fg1dwct,imgname-facts--7--1788540638199.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Facts: పిల్లి ఎదురుగా వస్తే చాలామంది ఒక్కసారిగా ఆగిపోతారు. కొందరు కాసేపు నిలబడి మళ్లీ ప్రయాణం ప్రారంభిస్తారు.టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ ఈ నమ్మకాన్ని పాటిస్తున్నారు. అయితే పిల్లి అడ్డొస్తే మంచిది కాదనే భావన ఎలా వచ్చిందో తెలుసా.?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పిల్లి ఎదురుగా వెళ్లడాన్ని చాలామంది అపశకునంగా భావిస్తుంటారు. ముఖ్యంగా ఇంటి నుంచి ఏదైనా పని కోసం బయలుదేరిన సమయంలో పిల్లి అడ్డొస్తే వెంటనే ప్రయాణాన్ని కొనసాగించకుండా కాసేపు ఆగిపోతారు. కొందరు నీళ్లు తాగి లేదా కూర్చొని లేచి మళ్లీ బయలుదేరుతుంటారు. కానీ ఈ ఆచారం మొదట్లో మూఢనమ్మకంతో పుట్టలేదని చెబుతుంటారు. అప్పటి పరిస్థితులు, ప్రయాణ మార్గాలు, అడవుల్లో ఉండే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని పెద్దలు ఒక జాగ్రత్తగా దీనిని పాటించడం ప్రారంభించారని ప్రచారంలో ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పూర్వకాలంలో ఇప్పటిలా కార్లు, బస్సులు, రైళ్లు ఉండేవి కావు. విశాలమైన రహదారులు, వీధి దీపాలు కూడా అందుబాటులో ఉండేవి కావు. ఎక్కువ మంది అడవులు, చెట్లు, పొదల మధ్య ఉన్న మార్గాల్లో కాలి నడకన లేదా ఎడ్లబండ్లపై ప్రయాణించేవారు. ముఖ్యంగా నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరం. అడవి జంతువులు, విషసర్పాలు లేదా ఇతర ప్రమాదాలు ఎప్పుడు ఎదురవుతాయో చెప్పలేని పరిస్థితి ఉండేది. అందుకే ప్రయాణించే సమయంలో చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం అయ్యేది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సాధారణంగా పిల్లులు చాలా అప్రమత్తంగా ఉండే జంతువులు. చిన్నపాటి శబ్దాన్ని కూడా త్వరగా గుర్తించగలవు. తమకు ఏదైనా ప్రమాదం ఉందని అనిపించినా వెంటనే స్పందిస్తాయి. చుట్టుపక్కల ఏదైనా జంతువు కదలిక ఉన్నా వాటి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఈ లక్షణాన్ని పూర్వకాలంలో ప్రజలు జాగ్రత్తగా గమనించేవారని చెబుతారు. పిల్లి సాధారణంగా నడుస్తూ కాకుండా అకస్మాత్తుగా భయంతో ఒక వైపు నుంచి మరో వైపుకు పరుగెత్తితే, సమీపంలో ఏదైనా ప్రమాదకరమైన జంతువు ఉండవచ్చని భావించేవారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అడవులు, నిర్మానుష్య మార్గాల్లో ప్రయాణించే సమయంలో పిల్లి హఠాత్తుగా పరుగెత్తడం వెనుక ఏదో కారణం ఉండవచ్చని పెద్దలు భావించేవారు. అక్కడ క్రూర జంతువు ఉండటం, పాము సంచరించడం లేదా ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఉండే అవకాశం ఉందని అనుమానించేవారు. అందుకే పిల్లి అడ్డొచ్చిన వెంటనే ప్రయాణాన్ని కొనసాగించకుండా కొద్దిసేపు ఆగేవారు. అవసరమైతే ఎడ్లబండి దిగి చుట్టుపక్కల పరిస్థితులను పరిశీలించేవారు. మార్గం సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే మళ్లీ ప్రయాణం సాగించేవారు. అంటే ఇది భయంతో తీసుకున్న నిర్ణయం కాదు.. అప్రమత్తతతో తీసుకున్న జాగ్రత్తగా భావించవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కాలం మారడంతో ప్రయాణ పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. అడవుల మధ్య ప్రయాణాలు తగ్గాయి. రహదారులు, వాహనాలు, సాంకేతిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే పిల్లి అడ్డొస్తే కాసేపు ఆగాలనే ఆచారం మాత్రం కొనసాగుతూ వచ్చింది. క్రమంగా ఈ ఆచారం వెనుక ఉన్న అసలు కారణాన్ని చాలామంది మరిచిపోయారు. దీంతో పిల్లి అడ్డొస్తే ఏదో చెడు జరుగుతుందనే నమ్మకం బలపడింది. ఇలా ఒకప్పుడు ప్రయాణికుల భద్రత కోసం పాటించిన జాగ్రత్త, కాలక్రమేణా అపశకునం అనే సెంటిమెంట్&zwnj;గా మారిపోయిందని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే, పిల్లి అడ్డొస్తే అపశకునం అని శాస్త్రీయంగా నిర్ధారించే ఆధారాలు లేవు. పూర్వకాల పరిస్థితుల్లో జంతువుల ప్రవర్తనను గమనించి అప్రమత్తంగా ఉండేందుకు ఏర్పడిన ఒక ఆచారం, కాలక్రమేణా మూఢనమ్మకంగా మారిపోయి ఉండవచ్చని ఈ ప్రచారంలో ఉన్న కథనం చెబుతోంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;గ&zwnj;మ&zwnj;నిక&zwnj;: పైన తెలిపిన విష&zwnj;యాల&zwnj;ను ఇంట&zwnj;ర్నెట్&zwnj;లో అందుబాటులో ఉన్న స&zwnj;మాచారం ఆధారంగా అందించ&zwnj;డ&zwnj;మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ&zwnj;ని రీడ&zwnj;ర్స్ గ&zwnj;మ&zwnj;నించాలి.&lt;/strong&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>feature</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/facts-is-it-bad-luck-if-a-cat-crosses-your-path-the-interesting-story-behind-this-ancient-belief-dkc2a9g"/>
        </item>
        <item>
            <title><![CDATA[సౌదీ అబ్బాయిలు ఈ 4 దేశాల అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదట, ఎందుకో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/do-you-know-why-saudi-boys-shouldnt-marry-girls-from-these-4-countries-fki5b25</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/do-you-know-why-saudi-boys-shouldnt-marry-girls-from-these-4-countries-fki5b25</guid>
            <pubDate>Fri, 04 Sep 2026 12:25:59 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;సౌదీ అరేబియాలో అబ్బాయిలు ఏ దేశం పడితే ఆ దేశానికి చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదు. తమ దేశ పౌరుల పెళ్లిళ్లపై కఠిన నిబంధనలు పెట్టింది ఆ ప్రభుత్వం. ఒకవేళ వేరే దేశం అమ్మాయిని చేసుకోవాలంటే, కచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1kz0xgdg2j0w89jqg5wn0gn,imgname-saudi-arabia-couple--4--1788450207245.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;సౌదీ అరేబియాలో అబ్బాయిలు ఏ దేశం పడితే ఆ దేశానికి చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదు. తమ దేశ పౌరుల పెళ్లిళ్లపై కఠిన నిబంధనలు పెట్టింది ఆ ప్రభుత్వం. ఒకవేళ వేరే దేశం అమ్మాయిని చేసుకోవాలంటే, కచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రేమకు దేశం, భాష, ప్రాంతం వంటి హద్దులు ఉండవని అంటారు. కానీ సౌదీ అరేబియాలో మాత్రం పెళ్లి విషయంలో కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అక్కడి యువకులు ఈ రూల్స్&zwnj;ను తప్పనిసరిగా పాటించాల్సిందే.&lt;/p&gt;&lt;p&gt;సౌదీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం, అక్కడి అబ్బాయిలు నాలుగు దేశాలకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదు. ఈ రూల్ చాలా ఏళ్లుగా అమల్లో ఉంది. మన పొరుగు దేశాల్లోని మూడు దేశాలు ఈ లిస్ట్&zwnj;లో ఉండటం గమనార్హం.&lt;/p&gt;&lt;img&gt;ఆ నిషేధిత దేశాలు పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్, చాద్. పాకిస్థాన్, బంగ్లాదేశ్ ముస్లిం దేశాలైనప్పటికీ, సౌదీ ప్రభుత్వం ఈ నిషేధం విధించింది. విదేశీ మహిళలతో పెళ్లిళ్లను నిరుత్సాహపరచడమే ఈ రూల్ ముఖ్య ఉద్దేశం.&lt;img&gt;&lt;p&gt;ఒకవేళ సౌదీ అబ్బాయిలు వేరే దేశాల అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనుకుంటే, ముందుగా ప్రభుత్వానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ఇచ్చి అనుమతి తీసుకోవాలి. ఈ పర్మిషన్ అధికారిక శాఖల నుంచే పొందాలి. రూల్స్ అతిక్రమిస్తే కఠిన శిక్షలు ఉంటాయి.&lt;/p&gt;&lt;p&gt;ఇప్పటికే పెళ్లైన వారు లేదా విడాకులు తీసుకున్న వారు విదేశీయులను పెళ్లి చేసుకోవాలంటే మరిన్ని కఠిన నిబంధనలు పాటించాలి. పెళ్లి అనుమతి కోసం అప్లై చేశాక ఆరు నెలలు ఆగాలి. ఆ తర్వాతే ప్రభుత్వం అన్నీ పరిశీలించి అనుమతి ఇస్తుంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>feature</category>
            <dc:creator>Haritha Chappa</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/do-you-know-why-saudi-boys-shouldnt-marry-girls-from-these-4-countries-fki5b25"/>
        </item>
        <item>
            <title><![CDATA[మొఘల్ చక్రవర్తులకు ఇరానీ మహిళలంటే ఎందుకంత ఇష్టం?]]></title>
            <link>https://telugu.asianetnews.com/webstories/feature/beauty-and-brains-why-mughals-married-iranian-women-g26aoyc</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/webstories/feature/beauty-and-brains-why-mughals-married-iranian-women-g26aoyc</guid>
            <pubDate>Fri, 04 Sep 2026 17:09:44 +0530</pubDate>
            <description><![CDATA[మొఘల్ చరిత్రలో ఇరాన్&zwnj;కు చెందిన మహిళలకు ప్రత్యేక స్థానం ఉండేది. వాళ్ల అందం, తెలివితేటలే దీనికి కారణం. మొఘల్ చక్రవర్తులు వాళ్లను ఎందుకు అంతగా ఇష్టపడ్డారో ఇక్కడ తెలుసుకుందాం.]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01knhetr8qsfwsj4kb3kmfbree,imgname-untitled-design--76--1775481217303.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <category>feature</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/webstories/feature/beauty-and-brains-why-mughals-married-iranian-women-g26aoyc"/>
        </item>
        <item>
            <title><![CDATA[World Highest Railway Bridge: ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన.. భారతీయ రైల్వేల ఇంజనీరింగ్ అద్భుతం ఇది !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/world-s-highest-railway-bridge-in-india-chenab-bridge-height-features-and-engineering-marvel-iiggoes</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/world-s-highest-railway-bridge-in-india-chenab-bridge-height-features-and-engineering-marvel-iiggoes</guid>
            <pubDate>Fri, 04 Sep 2026 14:34:08 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;World Highest Railway Bridge: ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన ఇండియాలోనే ఉంది. పారిస్ ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనది. జమ్మూకశ్మీర్&zwnj;లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1nt8r2g2dkvbqsj2jva0240,imgname-chenab-bridge--3--1788512329808.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;World Highest Railway Bridge: ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన ఇండియాలోనే ఉంది. పారిస్ ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనది. జమ్మూకశ్మీర్&zwnj;లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జమ్మూకశ్మీర్&zwnj;లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించిన చీనాబ్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్&zwnj;గా రికార్డు సృష్టించింది. నది అడుగు నుంచి ఏకంగా 359 మీటర్ల (1,178 అడుగులు) ఎత్తులో ఈ వంతెన ఉంది. ఈ ఎత్తు ఎంతంటే, పారిస్&zwnj;లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ కంటే ఇది 35 మీటర్లు ఎక్కువ ఎత్తులో నిలిచింది.&lt;/p&gt;&lt;p&gt;ఈ ఉక్కు వంతెన కశ్మీర్ లోయను భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడంలో ప్రధాన భూమిక పోషిస్తోంది. హిమాలయాల అందాల మధ్య, లోతైన లోయ పైభాగంలో నిలిచిన ఈ నిర్మాణం భారత ఇంజనీరింగ్ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా మారింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;చీనాబ్ రైల్ బ్రిడ్జ్ మొత్తం పొడవు 1,315 మీటర్లు (4,314 అడుగులు). ఇది పూర్తిగా స్టీల్, కాంక్రీట్ నిర్మాణంతో కూడిన ఆర్చ్ బ్రిడ్జ్. లోయకు అటువైపు, ఇటువైపు ఉన్న కొండల మధ్య విస్తరించిన ప్రధాన ఆర్చ్ పొడవు 467 మీటర్లు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ఆర్చ్&zwnj;లలో ఒకటిగా గుర్తింపు పొందింది.&lt;/p&gt;&lt;p&gt;వంతెనకు మొత్తం 17 స్పాన్&zwnj;లు ఉన్నాయి. ప్రధాన ఆర్చ్&zwnj;కు రెండు వైపులా 130 మీటర్ల ఎత్తు ఉన్న భారీ పైలాన్&zwnj;లతో సపోర్ట్ ఇచ్చారు. ఈ నిర్మాణం కోసం ఏకంగా 27,000 టన్నుల స్టీల్, 66,000 ఘన మీటర్ల కాంక్రీట్&zwnj;ను ఉపయోగించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కఠినమైన హిమాలయ భూభాగంలో ఈ వంతెనను నిర్మించడం ఇంజనీర్లకు అసాధారణమైన సవాలుగా మారింది. ప్రారంభంలో నిర్మాణ ప్రాంతానికి యంత్రాలు తీసుకెళ్లడానికి దారులు లేవు. నిర్మాణ సామగ్రిని కేవలం గుర్రాలు, మనుషులు మోసుకుపోవడం ద్వారా మాత్రమే రవాణా చేయాల్సి వచ్చింది.&lt;/p&gt;&lt;p&gt;ఆ తర్వాత ఆర్చ్ నిర్మాణం కోసం ప్రపంచంలోనే అతి ఎత్తైన క్రాస్&zwnj;బార్ కేబుల్ క్రేన్&zwnj;లు, ప్రత్యేక బరువైన యంత్రాలను రప్పించి ఉపయోగించారు. ఆర్చ్ నిర్మాణానికి కంటిలెవర్ పద్ధతిని వాడారు. రెండు కొండల ఒడ్డుల నుంచి క్రమంగా ఆర్చ్&zwnj;ను నిర్మిస్తూ వచ్చి, 2021 ఏప్రిల్&zwnj;లో మధ్యభాగంలో విజయవంతంగా కలిపారు. ఇది నిర్మాణ బృందానికి ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భౌగోళికంగా ఈ ప్రాంతం క్లిష్టమైనది కావడం వల్ల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రచండ గాలులను తట్టుకునేలా దీనిని డిజైన్ చేశారు. అలాగే రిక్టర్ స్కేలుపై 8 తీవ్రత గల భారీ భూకంపాలను, &minus;20&deg;C అత్యంత తీవ్రమైన మంచు ఉష్ణోగ్రతలను కూడా ఈ బ్రిడ్జ్ సులభంగా తట్టుకోగలదు.&lt;/p&gt;&lt;p&gt;ఈ వంతెనను ప్రత్యేకంగా బ్లాస్ట్ లోడ్&zwnj;కు కూడా తట్టుకునేలా రూపొందించారు. క్లిష్టమైన నిర్మాణ భాగాలు అత్యల్ప సామర్థ్యం వద్ద కూడా సురక్షితంగా పనిచేసేలా అదనపు రిడండన్సీతో నిర్మించారు. వంతెనకు సంబంధించిన ప్రతీ స్టీల్ నిర్మాణాన్ని త్రీడీ టెక్లా సాఫ్ట్&zwnj;వేర్&zwnj;తో మోడల్ చేసి, ఫిట్టింగ్ లోపాలు లేకుండా జాగ్రత్తపడ్డారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;చీనాబ్ బ్రిడ్జ్ 'ఉధంపూర్&ndash;శ్రీనగర్&ndash;బారాముల్లా రైల్ లింక్' (USBRL) ప్రాజెక్ట్&zwnj;లో అత్యంత కీలకమైన భాగం. ఇది కశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ రైలు మార్గం ద్వారా నిరంతరాయంగా కలుపుతుంది. ఈ బ్రిడ్జ్&zwnj;పై వందే భారత్ ఎక్స్&zwnj;ప్రెస్ రైళ్లు కూడా నడుస్తాయి, దీనివల్ల కత్రా నుంచి శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.&lt;/p&gt;&lt;p&gt;సుమారు 20 ఏళ్లకు పైగా కాలం పట్టి పూర్తయిన ఈ భారీ ప్రాజెక్ట్ భారతీయ దృఢ సంకల్పానికి నిదర్శనం. 2025 జూన్&zwnj;లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ బ్రిడ్జ్&zwnj;ను అధికారికంగా ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెనగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన చీనాబ్ బ్రిడ్జ్, భారత్&zwnj; సాధించిన ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిపోయింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>feature</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/world-s-highest-railway-bridge-in-india-chenab-bridge-height-features-and-engineering-marvel-iiggoes"/>
        </item>
        <item>
            <title><![CDATA[క్షమించడం అంటే ఓడిపోవడం కాదు, బ‌ల‌హీన‌త అస‌లే కాదు.. మ‌రెంటో తెలుసా.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/motivational-story-forgiveness-is-not-weakness-a-powerful-motivational-story-about-letting-go-and-finding-peace-k449emv</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/motivational-story-forgiveness-is-not-weakness-a-powerful-motivational-story-about-letting-go-and-finding-peace-k449emv</guid>
            <pubDate>Sat, 05 Sep 2026 21:32:53 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Motivational Story: మన జీవితంలో మనల్ని బాధపెట్టిన వ్యక్తులు తప్పకుండా ఉంటారు. అలాంటి సందర్భాల్లో కోపం, బాధ, పగ మనసులో పేరుకుపోతాయి. అయితే వారిని క్షమించడం అంటే ఓడిన&zwnj;ట్లు కాదని చాటి చెప్పే ఒక మంచి క&zwnj;థ ఇప్పుడు తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1s0h13tvpcj8ht29pc6ees4,imgname-motivational-story--7--1788619555962.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Motivational Story: మన జీవితంలో మనల్ని బాధపెట్టిన వ్యక్తులు తప్పకుండా ఉంటారు. అలాంటి సందర్భాల్లో కోపం, బాధ, పగ మనసులో పేరుకుపోతాయి. అయితే వారిని క్షమించడం అంటే ఓడిన&zwnj;ట్లు కాదని చాటి చెప్పే ఒక మంచి క&zwnj;థ ఇప్పుడు తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్య&zwnj;క్తి ఉండేవాడు. అతనికి సొంతంగా కొద్దిపాటి పొలం ఉండేది. ఆ పొలమే అతని జీవనాధారం. ప్రతిరోజూ పొలానికి వెళ్లి కష్టపడేవాడు. రామయ్యకు పక్క పొలంలో శేఖర్ అనే యువకుడు ఉండేవాడు. ఒకసారి పొలాల మధ్య ఉన్న నీటి కాలువ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంలో శేఖర్ రామయ్యను అందరి ముందు అవమానించాడు. రామయ్యకు ఆ మాటలు చాలా బాధ కలిగించాయి. ఆ రోజు నుంచి శేఖర్&zwnj;తో మాట్లాడటం పూర్తిగా మానేశాడు. రోజులు గడిచాయి. గొడవ జరిగిన విషయం చిన్నదే అయినా.. రామయ్య మనసులో మాత్రం అది పెద్ద గాయంగా మారింది. ప్రతిరోజూ పొలానికి వెళ్లినప్పుడు శేఖర్ కనిపిస్తే అతనిపై కోపం వచ్చేది. తనను బాధపెట్టిన వ్యక్తి గురించి ఆలోచిస్తూ తన ప్రశాంతతను తానే కోల్పోతున్నాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఒక వర్షాకాల రాత్రి గ్రామంలో భారీ వర్షం కురిసింది. వాగు పొంగి పొలాల వైపు నీరు రావడం మొదలైంది. శేఖర్ పొలం మొత్తం నీటిలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అది చూసిన రామయ్య ఇంట్లో కూర్చుని ఉండిపోయాడు. &ldquo;అతను నన్ను అవమానించాడు. ఇప్పుడు అతని సమస్య అతనే చూసుకోవాలి&rdquo; అని అనుకున్నాడు. కానీ కొద్దిసేపటికే అతని మనసులో మరో ఆలోచన వచ్చింది. &ldquo;అతను నాకు అన్యాయం చేశాడు. కానీ అతని కుటుంబం ఏ తప్పు చేసింది?&rdquo; అంతే.. రామయ్య వెంటనే బయటకు వచ్చాడు. గ్రామంలోని మరికొందరితో కలిసి శేఖర్ పొలానికి వెళ్లి నీరు వెళ్లేందుకు కాలువను తెరిచాడు. గంటల తరబడి శ్రమించి అతని పొలాన్ని కాపాడాడు. శేఖర్ అది చూసి ఆశ్చర్యపోయాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మరుసటి రోజు ఉదయం శేఖర్ రామయ్య ఇంటికి వెళ్లాడు. కళ్లలో నీళ్లతో నిలబడి.. &ldquo;రామ&zwnj;య్యా.. నేను మిమ్మల్ని అవమానించిన విషయం ఇప్పటికీ గుర్తుంది. మీరు నాపై కోపంగా ఉంటారని అనుకున్నాను. కానీ నిన్న నా పొలాన్ని కాపాడారు. నన్ను క్షమించండి&rdquo; అని చెప్పాడు. రామయ్య కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత చిరునవ్వుతో ఇలా అన్నాడు.. &ldquo;నువ్వు చేసిన తప్పును నేను మర్చిపోలేదు. కానీ ఆ తప్పును ప్రతిరోజూ గుర్తు చేసుకుంటూ నా మనసును నేను ఎందుకు బాధపెట్టుకోవాలి? నిన్ను క్షమించడం నీ కోసం కాదు.. నా మనశ్శాంతి కోసం.&rdquo; ఆ మాటలు శేఖర్ మనసును కదిలించాయి. ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య ఉన్న పాత గొడవ ముగిసిపోయింది. కానీ అంతకంటే ముఖ్యంగా.. రామయ్య తన మనసులో ఎన్నాళ్లుగా మోస్తున్న భారాన్ని దించుకున్నాడు.క్షమించడం అంటే జరిగినదాన్ని మర్చిపోవడం కాదు&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;క్షమించడం అంటే అవతలి వ్యక్తి చేసిన తప్పు సరైనదని అంగీకరించడం కాదు. క్షమించడం అంటే జరిగిన బాధను నిరాకరించడం కూడా కాదు. ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు దాని గురించి బాధపడటం సహజం. కానీ ఆ బాధను జీవితాంతం మోస్తూ ఉండాల్సిన అవసరం లేదు. క్షమించడం అంటే.. పగను వదిలేయడం, ప్రతీకారం గురించి ఆలోచించడం ఆపడం, గతం మన వర్తమానాన్ని నియంత్రించకుండా చూసుకోవడం, మనశ్శాంతికి ప్రాధాన్యం ఇవ్వడం, అవసరమైతే దూరం పాటిస్తూనే మనసులోని కోపాన్ని విడిచిపెట్టడం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మనల్ని బాధపెట్టిన వ్యక్తిని మనం మర్చిపోలేకపోవచ్చు. జరిగిన సంఘటన కూడా జీవితాంతం గుర్తుండొచ్చు. కానీ ఒక దశలో మనం మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. &ldquo;ఈ వ్యక్తి చేసిన తప్పుకు నేను ఇంకెంతకాలం నా ప్రశాంతతను త్యాగం చేయాలి?&rdquo; అక్కడే క్షమించడం మొదలవుతుంది. ఎవరినైనా క్షమించడం అంటే వాళ్లకు మరో అవకాశం ఇవ్వడం మాత్రమే కాదు. మనకు మనమే మరో ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చుకోవడం. పగ మనసును గతంలోనే ఉంచుతుంది. క్షమించడం మనల్ని భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. అందుకే జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా మనల్ని బాధపెడితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనల్ని బాధపెట్టిన వ్యక్తి మన జీవితంలో ఒక అధ్యాయం కావచ్చు. కానీ ఆ వ్యక్తి కారణంగా మన జీవితమంతా బాధగా మారాల్సిన అవసరం లేదు. ఆ అధ్యాయాన్ని మూసి.. కొత్త పేజీ తెరవడం కూడా మన చేతుల్లోనే ఉంటుందని గుర్తించాలి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>feature</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/motivational-story-forgiveness-is-not-weakness-a-powerful-motivational-story-about-letting-go-and-finding-peace-k449emv"/>
        </item>
        <item>
            <title><![CDATA[పుట్టుక నుంచే బ‌తుకు పోరాటం, జీవిత‌మంతా క‌ష్టాల‌మ‌యం.. అయినా కృష్ణుడు భ‌గ‌వంతుడు ఎలా అయ్యాడు?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/krishnashtami-from-birth-struggles-to-divine-greatness-life-lessons-from-lord-krishna-kg0lc9o</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/krishnashtami-from-birth-struggles-to-divine-greatness-life-lessons-from-lord-krishna-kg0lc9o</guid>
            <pubDate>Fri, 04 Sep 2026 11:05:04 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;krishnashtami: కృష్ణుడు అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది చిరునవ్వుతో కూడిన ముఖం, వేణుగానం, గోపికలతో ఆటపాటలు. కానీ ఆ చిరునవ్వు వెనుక ఎంతటి వేదన ఉందో ఒక్కసారి శ్రీకృష్ణుడి జీవితాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1necabgwg6qwcz2hkb1mg76,imgname-krishnashtami-1788499863920.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;krishnashtami: కృష్ణుడు అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది చిరునవ్వుతో కూడిన ముఖం, వేణుగానం, గోపికలతో ఆటపాటలు. కానీ ఆ చిరునవ్వు వెనుక ఎంతటి వేదన ఉందో ఒక్కసారి శ్రీకృష్ణుడి జీవితాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;శ్రీకృష్ణుడి జీవితంలో మొదటి నుంచే కష్టాలే ఎదురయ్యాయి. ఆయన జన్మించకముందే కంసుడి భయం దేవకీ, వసుదేవులను వెంటాడింది. దేవకీకి పుట్టే ఎనిమిదో సంతానం తన మరణానికి కారణమవుతుందని తెలిసిన కంసుడు ఆమె పిల్లలను ఒక్కొక్కరిని హతమార్చాడు. అలాంటి భయానక పరిస్థితుల్లో చెరసాలలో కృష్ణుడు జన్మించాడు. సాధారణంగా పుట్టిన బిడ్డకు తల్లి ఒడే మొదటి ప్రపంచం. కానీ కృష్ణుడికి ఆ అదృష్టం కూడా ఎక్కువసేపు దక్కలేదు. పుట్టిన కొద్దిసేపటికే తల్లిదండ్రులకు దూరమై గోకులానికి వెళ్లాల్సి వచ్చింది.&lt;/p&gt;&lt;p&gt;ఇక్కడి నుంచే మనకు ఒక గొప్ప సందేశం కనిపిస్తుంది. మనం జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులను ఎంచుకోలేం. ఎక్కడ పుడతామో, ఎలాంటి కుటుంబంలో పెరుగుతామో, ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ప్రతిసారీ మన చేతుల్లో ఉండదు. కానీ ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్నది మాత్రం మన నిర్ణయం. కృష్ణుడి మొదటి పాఠం ఇదే... పరిస్థితులు మన జీవితాన్ని నిర్ణయించవు. వాటిని ఎదుర్కొనే మన ధైర్యమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మనకు బాల్యం అంటే ఆనందం, ఆటలు, చదువు, స్నేహితులు గుర్తుకు వస్తాయి. కానీ శ్రీకృష్ణుడి బాల్యం మాత్రం నిరంతర ప్రమాదాల మధ్య సాగింది. పూతన విషం ఇచ్చి చంపేందుకు ప్రయత్నించింది. శకటాసురుడు, తృణావర్తుడు, బకాసురుడు, అఘాసురుడు, కేశి వంటి అనేక శక్తులు ఆయన ప్రాణాలనే లక్ష్యంగా చేసుకున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;ప్రతి దశలో ఒక కొత్త ప్రమాదం ఎదురైంది. ఒక సమస్య ముగిసిందని ఊపిరి పీల్చుకునేలోపే మరో సమస్య సిద్ధంగా ఉండేది. అయినా కృష్ణుడు ఎప్పుడూ జీవితంపై విసుగు చెందలేదు. నేటి పరిస్థితులను చూస్తే చిన్న సమస్య వచ్చినా చాలామంది మానసికంగా కుంగిపోతున్నారు. పరీక్షలో మార్కులు తగ్గినా బాధ, ఉద్యోగం రాకపోయినా నిరాశ, ప్రేమలో విఫలమైనా జీవితం ముగిసిపోయిందనే భావన, వ్యాపారంలో నష్టం వచ్చినా ఇక అంతా అయిపోయిందనే భయం. కానీ కృష్ణుడి జీవితం ఒకటే చెబుతోంది. సమస్యలు రావడం సాధార&zwnj;ణం. సమస్యలు వచ్చినప్పుడు నిలబడటం అసలైన విజయం. జీవితంలో ప్రతి కష్టం మనల్ని బలహీనులను చేయడానికి రాదు. మనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి వస్తుంది. కృష్ణుడి బాల్యం ఇదే విషయాన్ని గుర్తు చేస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కంసుడిని సంహరించిన తర్వాత కృష్ణుడి జీవితం ప్రశాంతంగా మారిందని అనుకుంటే పొరపాటే. ఒక శత్రువు ముగిసిన తర్వాత మరో సవాలు ఎదురైంది. జరాసంధుడితో పదేపదే యుద్ధాలు చేయాల్సి వచ్చింది. కాలయవనుడు వంటి శక్తివంతమైన శత్రువులను ఎదుర్కొన్నాడు. జీవితంలో గెలిచిన తర్వాత కూడా కొత్త పరీక్షలు వస్తాయని కృష్ణుడి ప్రయాణం చెబుతుంది. మనం చాలాసార్లు ఒక లక్ష్యం చేరుకుంటే ఇక సమస్యలు ఉండవని అనుకుంటాం. ఉద్యోగం వస్తే జీవితం సెటిల్ అవుతుందని, పెళ్లి అయితే అన్నీ బాగుంటాయని, డబ్బు సంపాదిస్తే బాధలు ఉండవని భావిస్తాం. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక సమస్య పరిష్కారమైతే మరో బాధ్యత ఎదురవుతుంది. ఒక లక్ష్యం సాధిస్తే మరో లక్ష్యం కనిపిస్తుంది. ఇదే జీవిత స్వభావం. శ్రీకృష్ణుడు ఎన్నో యుద్ధాలు గెలిచినా గర్వపడలేదు. సమస్యలు ఎదురైనా అలసిపోలేదు. అవసరమైనప్పుడు వ్యూహం మార్చుకున్నాడు. ప్రజల రక్షణ కోసం మధుర నుంచి ద్వారకకు రాజధానిని మార్చాడు. ఇది నేటి యువతకు చాలా ముఖ్యమైన పాఠం. ప్రతి సమస్యను బలంతోనే గెలవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు తెలివితో, ఓర్పుతో, సరైన నిర్ణయంతో గెలవాలి. పరిస్థితులకు అనుగుణంగా మారడం కూడా జీవితంలో గొప్ప విజయం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జీవితంలో కృష్ణుడు కేవలం యుద్ధాలనే ఎదుర్కోలేదు. ఆయనపై నిందలు కూడా వచ్చాయి. శమంతకమణి విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేటి రోజుల్లో మనపై ఎవరైనా చిన్న విమర్శ చేసినా మనం తీవ్రంగా బాధపడతాం. సోషల్ మీడియాలో ఎవరో ఒక కామెంట్ పెట్టినా ఆందోళన చెందుతాం. మన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కోపంతో ఊగిపోతాం. కానీ కృష్ణుడి జీవితం వేరే మార్గం చూపిస్తుంది. ప్రతి ఆరోపణకు ఆవేశంతో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సమయం, నిజం, మన ప్రవర్తనే కొన్నిసార్లు ఉత్తమ సమాధానం అవుతాయి. కుటుంబ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కృష్ణుడు సమతుల్యతను కోల్పోలేదు. ఎవరి స్వభావాన్ని వారు అర్థం చేసుకునేలా వ్యవహరించాడు. కోపంతో నిర్ణయాలు తీసుకోలేదు. ఇది మన కుటుంబ జీవితాలకు కూడా అవసరమైన గొప్ప పాఠం. ప్రతి ఇంట్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి. ప్రతి సంబంధంలో సమస్యలు ఉంటాయి. వాటిని కోపంతో పరిష్కరించలేం. ఓర్పు, అవగాహన, సంయమనం ఉంటేనే సంబంధాలు నిలబడతాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కురుక్షేత్ర యుద్ధం తర్వాత కృష్ణుడి కష్టాలు ముగిసిపోలేదు. తనను నమ్ముకున్న పాండవులకు మార్గదర్శకుడిగా నిలిచాడు. యుద్ధంలో ఆయుధం పట్టకూడదనే తన నిర్ణయాన్ని పాటించాడు. ఎన్నో అవమానాలు, బాధలు, గాయాలు ఎదురైనా తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. యుద్ధం ముగిసిన తర్వాత గాంధారి శాపం ఎదురైంది. అనంతరం యాదవ వంశం నాశనం కావడం కృష్ణుడి జీవితంలో అత్యంత విషాదకరమైన ఘట్టం. తన కళ్ల ముందే సొంత బంధువులు ఒకరినొకరు కోల్పోతున్న పరిస్థితిని చూశాడు. సోదరుడు బలరాముడు దేహత్యాగం చేయడాన్ని చూశాడు.&lt;/p&gt;&lt;p&gt;మనకు ఇష్టమైన వ్యక్తి కొద్దిసేపు మాట్లాడకపోతేనే మనసు బాధపడుతుంది. చిన్న ఆస్తి నష్టం వచ్చినా కుంగిపోతాం. మనకు నచ్చినది జరగకపోతే దేవుడినే ప్రశ్నిస్తాం. కానీ కృష్ణుడు తన జీవితంలో ఊహించలేనన్ని విషాదాలను చూసినా విధిని నిందించలేదు. తన బాధను ప్రపంచంపై చూపించలేదు. ఇదే ఆయన జీవితంలో అత్యంత గొప్ప సందేశం. మన చేతుల్లో లేని విషయాల కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మార్చగలిగేది మార్చాలి. మార్చలేనిదాన్ని ధైర్యంగా స్వీకరించాలి.&lt;/p&gt;&lt;h2&gt;నేటి తరానికి కృష్ణుడి సందేశం ఇదే..&lt;/h2&gt;&lt;p&gt;ఈరోజు మన జీవితంలో సమస్యలు వచ్చిన వెంటనే మనం ప్రశ్నించే మొదటి మాట.. &quot;నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?&quot; అని. కానీ శ్రీకృష్ణుడి జీవితం చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. గొప్ప వ్యక్తులకు కష్టాలు ఉండవని కాదు. గొప్ప వ్యక్తులు కష్టాలను గొప్పగా ఎదుర్కొంటారని. కృష్ణుడు ఎప్పుడూ సమస్యలు లేని జీవితం గడపలేదు. కానీ సమస్యల ముందు ఓడిపోయిన జీవితం కూడా గడపలేదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఆశను వదలకూడదు. ప్రతి సమస్యకు భయపడకుండా పరిష్కారం వెతకాలి. విజయం వచ్చినా అహంకారం ఉండ&zwnj;కూడ&zwnj;దు. విమర్శలు వచ్చినప్పుడు ఆవేశంతో కాకుండా వివేకంతో స్పందించాలి. మన చేతుల్లో లేని విషయాలను ధైర్యంగా స్వీకరించి ముందుకు సాగాలి. ఈ కృష్ణాష్టమి రోజున మనం కేవలం ఉట్టికొట్టడం, పూజలు చేయడం మాత్రమే కాదు.. కృష్ణుడి జీవితంలోని ధైర్యాన్ని కూడా నేర్చుకోవాలి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>feature</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/krishnashtami-from-birth-struggles-to-divine-greatness-life-lessons-from-lord-krishna-kg0lc9o"/>
        </item>
        <item>
            <title><![CDATA[ర‌మ్ వ‌ర్సెస్ విస్కీ... ఈ రెండింటి మ‌ధ్య అస‌లు తేడా ఏంటో తెలుసా.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/rum-vs-whiskey-what-is-the-difference-between-rum-and-whisky-explained-mo4rngf</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/rum-vs-whiskey-what-is-the-difference-between-rum-and-whisky-explained-mo4rngf</guid>
            <pubDate>Fri, 04 Sep 2026 21:45:29 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Rum vs Whiskey: ఆల్కహాల్ రకాలు ఎన్నో ఉన్నప్పటికీ రమ్, విస్కీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన స్పిరిట్స్&zwnj;లో ముఖ్యమైనవి. చాలామందికి ఈ రెండూ ఆల్కహాలిక్ డ్రింక్స్ అనే విషయం తెలుసు. కానీ ఈ రెండింటి మ&zwnj;ధ్య ఎన్నో తేడాలు ఉన్నాయి. అవేంటంటే.?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1phe1k9fjcsb2rr995vd7as,imgname-rum-vs-whiskey-1788536620649.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Rum vs Whiskey: ఆల్కహాల్ రకాలు ఎన్నో ఉన్నప్పటికీ రమ్, విస్కీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన స్పిరిట్స్&zwnj;లో ముఖ్యమైనవి. చాలామందికి ఈ రెండూ ఆల్కహాలిక్ డ్రింక్స్ అనే విషయం తెలుసు. కానీ ఈ రెండింటి మ&zwnj;ధ్య ఎన్నో తేడాలు ఉన్నాయి. అవేంటంటే.?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల స్పిరిట్స్ అందుబాటులో ఉన్నాయి. బ్రాందీని సాధారణంగా వైన్&zwnj;ను డిస్టిల్ చేసి తయారు చేస్తారు. వోడ్కాను ధాన్యాలు, బంగాళదుంపలు లేదా ఇతర పదార్థాలతో తయారు చేస్తారు. టేకిలా తయారీలో బ్లూ అగావే మొక్క ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే జిన్&zwnj;లో వివిధ రకాల వృక్ష సంబంధ పదార్థాలను కలుపుతారు. ముఖ్యంగా జూనిపర్ ఫ్లేవర్ దీనికి ప్రత్యేక గుర్తింపు. ఈ విభిన్న రకాల ఆల్కహాల్స్ లో రమ్, విస్కీ రెండూ వాటి ప్రత్యేకమైన రుచి, తయారీ విధానం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయి.&lt;/p&gt;&lt;p&gt;రమ్, విస్కీ తయారీకి ఉపయోగించే పదార్థాల్లో తేడా&lt;/p&gt;&lt;p&gt;రమ్, విస్కీ మధ్య ప్రధాన వ్యత్యాసం వాటి తయారీకి ఉపయోగించే ముడి పదార్థమే. రమ్&zwnj;ను ప్రధానంగా చెరకు రసం లేదా చెరకు నుంచి తయారయ్యే మొలాసిస్&zwnj;తో తయారు చేస్తారు. అందుకే కొన్ని రకాల రమ్&zwnj;లో సహజమైన తీపి రుచి కనిపిస్తుంది. మరోవైపు విస్కీ తయారీకి ధాన్యాలను ఉపయోగిస్తారు. బార్లీ, మొక్కజొన్న, రై, గోధుమ వంటి ధాన్యాలను పులియబెట్టి విస్కీని తయారు చేస్తారు. ఏ ధాన్యాన్ని ఎంత మోతాదులో ఉపయోగిస్తున్నారనే దానిపై విస్కీ రుచి ఆధారపడి ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;ఏజింగ్ ప్రక్రియలోనూ ప్రత్యేకత&lt;/p&gt;&lt;p&gt;తయారైన తర్వాత రమ్&zwnj;ను వివిధ రకాల బ్యారెళ్లలో నిల్వ చేసి పరిపక్వం చెందేలా చేస్తారు. ముఖ్యంగా ఓక్ చెక్క బ్యారెళ్లను ఉపయోగించడం సాధారణం. ఎంతకాలం నిల్వ ఉంచారనే దానిపై రమ్ రంగు, వాసన, రుచి మారుతాయి. విస్కీని కూడా ప్రధానంగా చెక్క బ్యారెళ్లలోనే నిల్వ చేస్తారు. ఓక్ బ్యారెల్&zwnj;లో ఎక్కువ కాలం పరిపక్వం చెందడం వల్ల విస్కీకి ప్రత్యేకమైన రంగు, ఘాటైన రుచి వస్తాయి. కొన్ని విస్కీలు కొన్ని సంవత్సరాలు, మరికొన్ని దశాబ్దాల పాటు కూడా ఏజింగ్ ప్రక్రియలో ఉంటాయి.&lt;/p&gt;&lt;p&gt;రుచిలో కనిపించే ప్రధాన తేడాలు ఇవే&lt;/p&gt;&lt;p&gt;రమ్&zwnj;లో సాధారణంగా తేలికపాటి, పండ్ల రుచి నుంచి ఘాటైన, మసాలా రుచి వరకు అనేక రకాల ఫ్లేవర్లు ఉంటాయి. దీనికి ఉపయోగించే చెరకు పదార్థం, బ్యారెల్ రకం, నిల్వ కాలం వంటివి రుచిని ప్రభావితం చేస్తాయి. విస్కీలో మాత్రం మరింత సంక్లిష్టమైన రుచులు కనిపిస్తాయి. స్కాచ్ విస్కీలో పొగ వాసన, స్మోకీ ఫ్లేవర్ ఉండవచ్చు. బోర్బన్&zwnj;లో కొంత తీపి, ఘాటైన రుచి ఉంటుంది. రై విస్కీలో మసాలా తరహా రుచి ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల విస్కీ రకాన్ని బట్టి దాని ఫ్లేవర్ పూర్తిగా మారిపోతుంది.&lt;/p&gt;&lt;p&gt;రమ్, విస్కీ ఎక్కడ ఎక్కువగా తయారవుతాయి?&lt;/p&gt;&lt;p&gt;రమ్ తయారీ ముఖ్యంగా కరేబియన్ దేశాలు, లాటిన్ అమెరికా ప్రాంతాలు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా జరుగుతుంది. ఆయా ప్రాంతాల వాతావరణం, తయారీ పద్ధతులను బట్టి రమ్ రుచి, నాణ్యతలో మార్పులు కనిపిస్తాయి. విస్కీకి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. స్కాట్లాండ్&zwnj;కు చెందిన స్కాచ్ విస్కీ, అమెరికాలో తయారయ్యే బోర్బన్, ఐర్లాండ్&zwnj;కు చెందిన ఐరిష్ విస్కీ వంటి రకాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఒక్కో దేశం తనదైన సంప్రదాయ తయారీ పద్ధతులను అనుసరించడం వల్ల విస్కీ రుచిలో వైవిధ్యం కనిపిస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;మొత్తానికి రమ్, విస్కీ రెండూ డిస్టిల్ చేసిన ఆల్కహాలిక్ పానీయాలే అయినప్పటికీ వాటి మూల పదార్థాలు పూర్తిగా వేరు. రమ్&zwnj;కు చెరకు ప్రధాన ఆధారం కాగా, విస్కీ తయారీలో ధాన్యాలను ఉపయోగిస్తారు. తయారీ విధానం, ఏజింగ్, రుచి, ఉత్పత్తి ప్రాంతం వంటి అంశాల్లోనూ రెండింటికీ స్పష్టమైన తేడా ఉంది. ఈ ప్రత్యేకతలే రమ్, విస్కీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>feature</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/rum-vs-whiskey-what-is-the-difference-between-rum-and-whisky-explained-mo4rngf"/>
        </item>
        <item>
            <title><![CDATA[Jail Timings : ఫుడ్ నుండి బెడ్ వరకు... జైల్లో ఖైదీల దినచర్య ఎలా ఉంటుంది? 24 గంటల టైమ్ టేబుల్ ఇదే]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/jail-timings-what-is-a-prisoners-daily-routine-from-food-to-bed-n94a8xy</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/jail-timings-what-is-a-prisoners-daily-routine-from-food-to-bed-n94a8xy</guid>
            <pubDate>Fri, 04 Sep 2026 11:43:22 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;జైల్లో ఖైదీల దినచర్య ఎలా ఉంటుంది? ఉదయం నిద్రలేచింది మొదలు తిరిగి రాత్రి పడుకునే వరకు వాళ్ళు ఏ టైమ్ లో ఏం చేస్తారు? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1ng54ea8qesemzna39wpvx0,imgname-prison-1788501725642.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;జైల్లో ఖైదీల దినచర్య ఎలా ఉంటుంది? ఉదయం నిద్రలేచింది మొదలు తిరిగి రాత్రి పడుకునే వరకు వాళ్ళు ఏ టైమ్ లో ఏం చేస్తారు? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Jail Timings : జైలు అంటే శిక్ష అనుభవించే ప్రదేశం మాత్రమే కాదు... తప్పుచేసిన ఖైదీలలో మార్పు తీసుకువచ్చేందుకు ఏర్పాటుచేసిన తాత్కాలిక నివాసం. ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం, తిరిగి సమాజంలో జీవించేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించడం కూడా ఈ జైలు వ్యవస్థలో భాగమే. అందుకే ఖైదీల రోజువారీ జైలు జీవితంలో వ్యాయామం, విద్య, కౌన్సెలింగ్, క్రీడలు, భోజనం, విశ్రాంతి, వినోదం వంటి అంశాలు భాగం అవుతాయి. అంటే జైలులో కఠిన నిబంధనలే కాదు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేలా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి.&lt;/p&gt;&lt;p&gt;అయితే ఖైదీల రోజువారీ షెడ్యూల్ అన్ని జైళ్లలో ఒకేలా ఉండదు. రాష్ట్రం, జైలు నిబంధనలు, జైలు రకం, భద్రతా అవసరాలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను బట్టి సమయాల్లో మార్పులు ఉండొచ్చు. భారత కేంద్ర హోంశాఖ కూడా జైలు సంస్కరణలకు సంబంధించి Model Prison Manual 2016 ను రాష్ట్రాలకు మార్గదర్శకంగా అందించింది. దీని ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని జైళ్లలో ఖైదీల టైమ్ టేబుల్ ఎలా ఉంటుంది? ఉదయం నిద్ర లేచినప్పటి నుండి తిరిగి రాత్రి నిద్రపోయేవరకు ఖైదీలు ఏం చేస్తారు? అనే ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;ఉదయం 6 గంటలకే బ్యారక్&zwnj;లు ఓపెన్&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఖైదీల రోజు సాధారణంగా ఉదయం 6AM నుంచే ప్రారంభమవుతుంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య బ్యారక్&zwnj;లు లేదా ఖైదీలు ఉండే గదులను తెరుస్తారు. ఈ గంట సమయంలో ఖైదీలు కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి శుభ్రంగా రెడీ అవ్వాల్సి ఉంటుంది. ఈ సమయంలో టీ, పాలు వంటివి కూడా అందిస్తారు. ఉదయం వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన పనులు పూర్తిచేసుకున్న తర్వాత ఖైదీలు తదుపరి కార్యక్రమాలకు సిద్ధమవుతారు.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;7AM నుంచి 8AM వరకు వ్యాయామం, యోగా&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు PT (Physical Training) ఉంటుంది. ఇందులో శారీరక వ్యాయామాలు అంటే పరేడ్, ఫిట్&zwnj;నెస్&zwnj; వంటివి చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో యోగా, ఇతర శారీరక, మానసిక ఆరోగ్య కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. ఖైదీల శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ పెంపొందించడంలో ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. ప్రతి ఒక్క ఖైదీ జైల్లో ఉన్నంతకాలం ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;8AM నుంచి 9AM వరకు అల్పాహారం, పరిశుభ్రత&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఫిజికల్ ట్రైనింగ్ ముగిసిన తర్వాత ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) అందిస్తారు. ఇదే సమయంలో స్నానం చేయడం, దుస్తులు ఉతుక్కోవడం, వ్యక్తిగత వస్తువులను శుభ్రం చేసుకోవడం వంటి పనులు కూడా పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది. జైలు జీవితంలో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. పెద్ద సంఖ్యలో ఖైదీలు ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల పారిశుద్ధ్య నిర్వహణ కూడా కీలకంగా మారుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;9AM నుంచి 11AM వరకు చదువు, కౌన్సెలింగ్&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు చదువుకు సంబంధించిన తరగతులు (Education Classes) నిర్వహిస్తారు. చదువు కొనసాగించాలనుకునే ఖైదీలకు వారి విద్యా స్థాయిని బట్టి వివిధ క్లాసులకు అందుబాటులో ఉండొచ్చు. జైళ్లలో విద్యను అందించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఖైదీలకు కొత్త అవకాశాలు కల్పించడం, సమాజంలోకి తిరిగి వెళ్లిన తర్వాత మెరుగైన జీవితాన్ని నిర్మించుకునేలా చేయడం.&lt;/p&gt;&lt;p&gt;ఇదే సమయంలో అవసరాన్ని బట్టి సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తారు. జైలు జీవితం, కుటుంబానికి దూరంగా ఉండటం, కేసులు, భవిష్యత్తుపై ఆందోళన వంటి అంశాలు ఖైదీల మానసిక స్థితిపై ప్రభావం చూపవచ్చు. అందుకే మానసిక ఆరోగ్యం, ప్రవర్తనా మార్పు, పునరావాసం వంటి అంశాలకు జైలు సంస్కరణల్లో ప్రాధాన్యం ఉంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;11 గంటలకు లంచ్.. ఆ తర్వాత ఖైదీల లెక్కింపు&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఉదయం కార్యక్రమాల తర్వాత 11 గంటల నుంచి 11:45 గంటల వరకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. భోజనం పూర్తయిన తర్వాత 11:45 నుంచి 12:15 గంటల వరకు ఖైదీల లెక్కింపు జరుగుతుంది. జైలు భద్రతలో ఖైదీల లెక్కింపు అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. ఎవరు తమ నిర్దేశిత ప్రదేశంలో ఉన్నారు, ఎవరైనా గైర్హాజరయ్యారా వంటి విషయాలను సిబ్బంది పరిశీలిస్తారు.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;మధ్యాహ్నం విశ్రాంతి, టీ&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;12:15 నుంచి 1 గంటల వరకు ఖైదీలకు విశ్రాంతి సమయం ఉంటుంది. ఈ సమయంలో కొంత సేపు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ విరామ సమయంలో మరోసారి టీ అందిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;1PM నుంచి 3PM వరకు మళ్లీ విద్యా కార్యక్రమాలు&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు మరోసారి విద్యా తరగతులు, కౌన్సెలింగ్ కార్యక్రమాలు కొనసాగుతాయి. జైలు వ్యవస్థలో విద్య, వృత్తి శిక్షణ, ప్రవర్తనా మార్పు వంటి కార్యక్రమాలు ఖైదీల పునరావాసంలో కీలకమైనవిగా పరిగణిస్తారు. భారతదేశంలోని జైలు సంస్కరణల మార్గదర్శకాల్లో కూడా ఖైదీల సంక్షేమం, విద్య, వృత్తి నైపుణ్యాలు, పునరావాసానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఉంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;3PM నుంచి 4PM వరకు వ్యక్తిత్వ వికాస క్లాసులు&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;3 గంటల నుంచి 4 గంటల వరకు వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో గెస్ట్ లెక్చరర్లు లేదా సైకాలజీ నిపుణులు ఖైదీలకు క్లాసెస్ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో ప్రొజెక్టర్ ద్వారా విద్యా, సామాజిక అంశాలపై షార్ట్ ఫిల్మ్స్ లేదా ఇతర కార్యక్రమాలు చూపిస్తారు.&lt;/p&gt;&lt;p&gt;ఇలాంటి కార్యక్రమాల ఉద్దేశం ఖైదీలలో ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడం, తప్పు ప్రవర్తనకు దారితీసిన అంశాలను అర్థం చేసుకోవడం, భవిష్యత్తులో సమాజంలో బాధ్యతాయుతంగా జీవించేందుకు అవసరమైన విలువలను పెంపొందించడం. జైళ్లలో సాంస్కృతిక, వినోద, విద్యా కార్యక్రమాలు ఖైదీల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఉపయోగపడే పునరావాస కార్యక్రమాలుగా Model Prison Manual లో కూడా ప్రస్తావించబడ్డాయి.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;సాయంత్రం 4PM నుంచి 4:45PM వరకు ఆటలు&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;రోజంతా తరగతులు, ఇతర కార్యక్రమాలతో గడిపిన తర్వాత 4 గంటల నుంచి 4:45 గంటల వరకు స్పోర్ట్స్, గేమ్స్&zwnj;కు సమయం కేటాయిస్తారు. జైలు పరిస్థితులను బట్టి క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి ఆటలతో పాటు ఇండోర్ గేమ్స్&zwnj;కు కూడా అవకాశం ఉండొచ్చు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో, క్రమశిక్షణ, టీమ్&zwnj;వర్క్ వంటి లక్షణాలను పెంపొందించడంలో సహాయపడతాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;సాయంత్రం 5 గంటలకే డిన్నర్&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;సాయంత్రం 5 గంటల నుంచి 5:45 గంటల వరకు రాత్రి భోజనం అందిస్తారు. ఇతర కార్యక్రమాలతో పోలిస్తే డిన్నర్ సమయం ముందుగానే ఉండటం జైలు దినచర్యలో కనిపించే ప్రత్యేకతల్లో ఒకటి. ఖైదీ నిద్రపోయేలోపే తిన్న అహారమంతా అరిగిపోవాలనే ఇలా తొందరగా డిన్నర్ అందిస్తారు. ఇలా రాత్రి భోజనం పూర్తయిన తర్వాత ఖైదీలను తిరిగి వారివారి బ్యారక్ లేదా సెల్&zwnj;లకు పంపించే ప్రక్రియ ప్రారంభమవుతుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;5:45 తర్వాత బ్యారక్స్ క్లోజ్&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;5:45 నుంచి 6 గంటల మధ్య ఖైదీలను తిరిగి బ్యారక్ లేదా సెల్&zwnj;లలోకి పంపిస్తారు. దీనితో బయట నిర్వహించే రోజువారీ కార్యక్రమాలు ముగుస్తాయి. ఆ తర్వాత జైలు సిబ్బంది భద్రతా తనిఖీలు, లెక్కింపు వంటి ప్రక్రియలను నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు. జైలు వ్యవస్థలో ఖైదీల కదలికలపై క్రమబద్ధమైన పర్యవేక్షణ భద్రతలో ముఖ్యమైన భాగం.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;రాత్రి టీవీ చూసే సమయం కూడా ఉంటుంది&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఖైదీలు పూర్తిగా రోజంతా ఒకే రకమైన నియంత్రిత వాతావరణంలో ఉండకుండా కొంత వినోదం పొందేందుకు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు టీవీ సమయం కూడా ఉంటుంది. వార్తలు, విద్యా కార్యక్రమాలు లేదా జైలు నిబంధనలకు అనుగుణంగా ఇతర కార్యక్రమాలను వీక్షించే అవకాశం ఉంటుంది. Model Prison Manual లో కూడా వార్తాపత్రికలు, పుస్తకాలు, రేడియో, టీవీ, సినిమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను జైలు పునరావాస వ్యవస్థలో భాగంగా ఉపయోగించవచ్చని పేర్కొంది. ఆ తర్వాత ఎవరి బ్యారక్ లో వాళ్ళు పడుకుంటారు... తిరిగి ఉదయం 6 గంటల నుండి మళ్ళీ రోజు ప్రారంభం అవుతుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;జైల్లో జీవితం కేవలం శిక్షతోనే పరిమితం కాదు&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఖైదీల రోజువారీ దినచర్యలో ప్రతి పనికీ ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. ఉదయం లేవడం నుంచి రాత్రి విశ్రాంతి వరకు వ్యాయామం, భోజనం, పరిశుభ్రత, విద్య, కౌన్సెలింగ్, వ్యక్తిత్వ వికాసం, క్రీడలు, వినోదం ఇలా అనేక కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఆధునిక జైలు వ్యవస్థలో శిక్షతో పాటు సంస్కరణ, పునరావాసం, నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.&lt;/p&gt;&lt;p&gt;అయితే ఈ టైమ్&zwnj;టేబుల్&zwnj;ను దేశంలోని ప్రతి జైలుకు వర్తించే ఒకే విధమైన షెడ్యూల్&zwnj;గా చూడకూడదు. జైళ్లు భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల పరిధిలోని అంశం కావడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, జైలు శాఖలు తమ నిబంధనలు, భద్రతా అవసరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రోజువారీ కార్యక్రమాల్లో మార్పులు చేయవచ్చు. తెలంగాణలో కూడా సెంట్రల్ జైళ్లు, జిల్లా జైళ్లు, ఓపెన్ జైళ్లు, మహిళా ప్రత్యేక జైలు, సబ్ జైళ్లు వంటి వివిధ రకాల జైలు సంస్థలు ఉన్నాయి.&lt;/p&gt;&lt;p&gt;అందువల్ల జైల్లో ఖైదీ జీవితం బయట నుంచి చూస్తే కేవలం నాలుగు గోడల మధ్య బంధించబడినట్టుగా అనిపించినా.. వాస్తవానికి ప్రతి రోజూ నిర్ణీత సమయానికి జరిగే అనేక కార్యక్రమాలతో కూడిన క్రమబద్ధమైన దినచర్యగా ఉంటుంది. ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం శిక్షను అనుభవిస్తున్న వ్యక్తిలో మార్పు తీసుకురావడం, అతడిని లేదా ఆమెను భవిష్యత్తులో సమాజంలో బాధ్యతాయుతమైన జీవితానికి సిద్ధం చేయడమే.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;6.00 AM TO 7.00 AM - ఖైదీలు ఉండే జైలు గది (బ్యారక్) ని ఓపెన్ చేస్తారు. ఫ్రెష్ అప్, టీ సమయం&lt;/p&gt;&lt;p&gt;7.00 AM TO 8.00 AM - P.T (Physical Training), పరేడ్/యోగా&lt;/p&gt;&lt;p&gt;8.00 AM TO 9.00 AM - బ్రేక్ ఫాస్ట్, క్లీనింగ్ ఆండ్ బాతింగ్&lt;/p&gt;&lt;p&gt;9.00 AM TO 11.00 AM - ఎడ్యుకేషన్ క్లాసెస్ (విద్యాదానం), సైకలాజికల్ కౌన్సెల్సింగ్ (ఉన్నతి)&lt;/p&gt;&lt;p&gt;11.00 AM TO 11.45 AM - లంచ్ (మధ్యాహ్న భోజనం)&lt;/p&gt;&lt;p&gt;11.45 AM TO 12.15 PM - ఖైదీల లెక్కింపు&lt;/p&gt;&lt;p&gt;12.15 PM TO 1.00 PM - విశ్రాంతి, టీ టైమ్&lt;/p&gt;&lt;p&gt;1.00 PM TO 3.00 PM - ఎడ్యుకేషన్ క్లాసెస్ (విద్యాదానం), సైకలాజికల్ కౌన్సెల్సింగ్ (ఉన్నతి)&lt;/p&gt;&lt;p&gt;3.00 PM TO 4.00 PM - నైతిక విలువల క్లాసెస్, గెస్ట్ లెక్చరర్స్ లేదా సైకాలజీ నిపుణులతో క్లాస్ లేదంటే ప్రొజెక్టర్ ద్వారా షార్ట్ ఫిల్మ్స్&lt;/p&gt;&lt;p&gt;4.00 PM TO 4.45 PM - స్పోర్ట్స్ ఆండ్ గేమ్స్&lt;/p&gt;&lt;p&gt;5.00 PM TO 5.45 PM - డిన్నర్ (రాత్రి భోజనం)&lt;/p&gt;&lt;p&gt;5.45 PM TO 6.00 PM - తిరిగి బ్యారక్ లేదా సెల్ లోకి పంపిస్తారు&lt;/p&gt;&lt;p&gt;7.00 PM TO 8.00 PM - టివి సమయం&lt;/p&gt;]]></content:encoded>
            <category>feature</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/jail-timings-what-is-a-prisoners-daily-routine-from-food-to-bed-n94a8xy"/>
        </item>
        <item>
            <title><![CDATA[Hotel Secrets : హోటల్ రూమ్‌లో గోడ గడియారం ఎందుకుండదు?  దీనివెనక ఇంతపెద్ద బిజినెస్ ట్రిక్ దాగుందా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/the-real-reason-hotel-rooms-never-have-wall-clocks-on83yqg</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/the-real-reason-hotel-rooms-never-have-wall-clocks-on83yqg</guid>
            <pubDate>Sat, 05 Sep 2026 12:28:17 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ఫైవ్ స్టార్ హోటల్ అయినా, మామూలు లాడ్జ్ అయినా... గదిలో గోడ గడియారం అస్సలు కనిపించదు. దీని వెనుక ఓ బలమైన సైకలాజికల్, బిజినెస్ ట్రిక్ దాగుంది&hellip; అందేంటో తెలుసా?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1r5mshhxz27fket8w148r2r,imgname-hotel-1788591367729.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ఫైవ్ స్టార్ హోటల్ అయినా, మామూలు లాడ్జ్ అయినా... గదిలో గోడ గడియారం అస్సలు కనిపించదు. దీని వెనుక ఓ బలమైన సైకలాజికల్, బిజినెస్ ట్రిక్ దాగుంది&hellip; అందేంటో తెలుసా?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మనం హోటల్&zwnj;కు వెళ్లినప్పుడు రూమ్&zwnj;లోకి అడుగుపెట్టగానే అక్కడ ఏమేం వస్తువులు ఉన్నాయో చూస్తాం. ఇలా గోడలవైపు చూస్తే అంతా ఖాళీగా ఉంటుంది&hellip; ఒక్క గడియారం కూడా కనిపించదు. రూం అందం దెబ్బతింటుందనో లేక హోటల్ వాళ్లు మర్చిపోయారేమో అనుకుంటే పొరబడినట్లే&hellip; కావాలనే గోడ గడియారం పెట్టరు. దీని వెనుక మూడు ముఖ్యమైన కారణాలున్నాయి. మన మంచికోసమే ఇవి తెలుసుకోవడం బెటర్&hellip; లేదంటే నష్టపోయేది మనమే.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మీరు సమయం గురించి అస్సలు పట్టించుకోకూడదనే హోటళ్లు కోరుకుంటాయి. గడియారం చూస్తే, 'అయ్యో, చెక్-అవుట్ టైమ్ అయిపోతోంది'. వెంటనే బయల్దేరాలి' అనే టెన్షన్ మొదలవుతుంది. గడియారం లేకపోతే మీరు రిలాక్స్&zwnj;గా ఉంటారు. హోటల్&zwnj;లో ఎంత ఎక్కువ సేపు ఉంటే, అంతగా రూమ్ సర్వీస్, స్పా, బార్, రెస్టారెంట్లలో ఖర్చు చేస్తారు. దీన్నే 'క్యాసినో స్ట్రాటజీ' అంటారు. హోటల్లో మాదిరిగానే క్యాసినోలలో కూడా గడియారాలు ఉండవు&hellip; దీనివెనక కూడా ఇదే స్ట్రాటజీ దాగుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గదిలో గడియారం ఉంటే ఉదయం 10 గంటలకే చెక్-అవుట్ చేయడానికి తొందరపడతారు. గడియారం లేకపోవడం వల్ల, మీరు ఫోన్&zwnj;లో టైమ్ చూసుకుంటారు లేదా రిసెప్షన్&zwnj;కు ఫోన్ చేసి అడుగుతారు. అప్పుడు హోటల్ సిబ్బంది, 'సార్, మరికొంత సేపు ఉండండి, లేట్ చెక్-అవుట్ ఆఫర్ ఉంది' అని చెబుతారు. దీనికి వాళ్లు అదనంగా డబ్బు వసూలు చేస్తారు. ఇదే వాళ్ల వ్యాపార ట్రిక్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇప్పుడు అందరి దగ్గరా మొబైల్, ల్యాప్&zwnj;టాప్ ఉంటున్నాయి. వాటిలోనే టైమ్ చూసుకోవచ్చు. అలాంటప్పుడు ప్రత్యేకంగా గోడ గడియారం పెట్టి, దానికి బ్యాటరీలు మార్చి, మెయింటెయిన్ చేయడం అంతా హోటల్&zwnj;కు అనవసరమైన ఖర్చు. కొన్నిసార్లు గెస్టులు గడియారాలను పగలగొట్టడం లేదా తీసుకెళ్లిపోవడం వంటివి చేస్తుంటారు. అందుకే ఈ తలనొప్పి ఎందుకని హోటల్ యాజమాన్యాలు గడియారాలు పెట్టడం మానేశాయి.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇప్పుడు చాలా హోటళ్లలో బెడ్&zwnj; పక్కన డిజిటల్ అలారం క్లాక్ పెడుతున్నారు. లేదంటేటీవీ స్క్రీన్&zwnj;పైనే సమయం కనిపిస్తుంది. రిసెప్షన్&zwnj;కు ఫోన్ చేసినా టైమ్ చెబుతారు. కాబట్టి, నెక్స్ట్ టైమ్ హోటల్&zwnj;కు వెళ్లినప్పుడు గోడపై గడియారం లేకపోతే ఆశ్చర్యపోకండి. మిమ్మల్ని మరికొంత సేపు అక్కడే ఉంచి, డబ్బు సంపాదించడానికే ఈ స్మార్ట్ ట్రిక్ అని అర్థం చేసుకోండి.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;]]></content:encoded>
            <category>feature</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/the-real-reason-hotel-rooms-never-have-wall-clocks-on83yqg"/>
        </item>
        <item>
            <title><![CDATA[విమానంలో కొబ్బరికాయను ఎందుకు తీసుకెళ్లనివ్వరు? కారణం తెలిస్తే అవాక్కవుతారు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/why-arent-you-allowed-to-carry-coconuts-on-a-plane-youll-be-surprised-if-you-know-the-reason-uyvg98x</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/why-arent-you-allowed-to-carry-coconuts-on-a-plane-youll-be-surprised-if-you-know-the-reason-uyvg98x</guid>
            <pubDate>Wed, 02 Sep 2026 19:21:28 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;విమాన ప్రయాణాలు చేసే వారు ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు బ్యాగుల్లో పెట్టి తీసుకెళ్లకూడదు. అలా తీసుకెళ్లకూడని వాటిలో కొబ్బరికాయ కూడా ఒకటి. అసలు విమానంలోకి కొబ్బరికాయను ఎందుకు అనుమతించరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1h61epdrt7rqmanhyn0h4es,imgname-why-arent-you-allowed-to-carry-coconuts-on-a-plane-youll-be-surprised-if-you-know-the-reason-1788356901581.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;విమాన ప్రయాణాలు చేసే వారు ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు బ్యాగుల్లో పెట్టి తీసుకెళ్లకూడదు. అలా తీసుకెళ్లకూడని వాటిలో కొబ్బరికాయ కూడా ఒకటి. అసలు విమానంలోకి కొబ్బరికాయను ఎందుకు అనుమతించరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;విమానయాన సంస్థల ప్రకారం, ఎండిన కొబ్బరి, అంటే కొబ్బరి చిప్పలు (కొబ్బరి) చాలా ప్రమాదకరం. వీటిలో నూనె శాతం ఎక్కువగా ఉండటం వల్ల, వాటంతట అవే మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే విమానం లగేజీలో ఉంచినప్పుడు, అక్కడి వేడికి ఇది అగ్ని ప్రమాదానికి దారితీయొచ్చు.&lt;/p&gt;&lt;p&gt;ఎండిన కొబ్బరిని చెక్-ఇన్ బ్యాగేజీలో తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. హ్యాండ్ బ్యాగ్ లేదా చెక్-ఇన్ బ్యాగ్.. దేనిలోనూ కొబ్బరి చిప్పలను తీసుకెళ్లలేరు. అది పచ్చి కొబ్బరికాయ అయినా, ఎండిన కొబ్బరికాయ అయినా సరే, పూర్తిగా తీసుకెళ్లకూడదు. స్పైస్&zwnj;జెట్ వంటి కొన్ని విమానయాన సంస్థలు కొబ్బరికాయను అనుమతిస్తాయి. కానీ, అది కొబ్బరి చిప్పలు అయి ఉండకూడదు. కొబ్బరికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, సరిగ్గా ప్యాక్ చేసి చెక్-ఇన్ లగేజీలో తీసుకెళ్లవచ్చు. అయితే, సరైన ప్యాకింగ్ చాలా ముఖ్యం. ఆధ్యాత్మికం: అన్ని సమస్యలను దూరం చేసే కొబ్బరికాయ పూజ! డబ్బును ఆకర్షించే పరిహారం ఇదే!&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;విమానం లగేజీ ఉంచే కార్గో ప్రాంతంలో గాలి, వెలుతురు సరిగా ఉండవు. కొబ్బరి చిప్పల నుంచి వెలువడే వేడి అగ్ని ప్రమాదానికి దారితీయొచ్చు. ఒకవేళ మంటలు అంటుకుంటే, విమానం ఎత్తులో ఉండటం, పరిమిత సౌకర్యాలు ఉండటం వల్ల దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. కొబ్బరి బోండాలను కూడా మీరు క్యాబిన్ బ్యాగ్&zwnj;లో తీసుకెళ్లలేరు. దీనికి విమానయాన సంస్థలు అనుమతి ఇవ్వవు. భద్రతా నిబంధనల ప్రకారం, నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువ ద్రవ పదార్థాలను తీసుకెళ్లడంపై నిషేధం ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఒకవేళ మీరు నిషేధాన్ని ఉల్లంఘించి విమానంలో కొబ్బరికాయ తీసుకెళ్తే, ఎయిర్&zwnj;పోర్ట్ భద్రతా సిబ్బంది లగేజీ తనిఖీల్లో దాన్ని స్వాధీనం చేసుకుంటారు. కస్టమ్స్ నిబంధనల ప్రకారం మీకు హెచ్చరిక జారీ చేయవచ్చు లేదా జరిమానా విధించవచ్చు. నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ తీసుకెళ్లలేరు. బిర్యానీ వంటి వండిన ఆహార పదార్థాలకు కూడా అనుమతి లేదు. స్పాంజ్ కేక్, స్వీట్లు, బేకరీ ఐటమ్స్, పచ్చి చేపలు లేదా మాంసం, ఊరగాయలు వంటివి కూడా తీసుకెళ్లకూడదు. పొడి లేదా పూర్తి మసాలా దినుసులపై కూడా నిషేధం ఉంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>feature</category>
            <dc:creator>Haritha Chappa</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/why-arent-you-allowed-to-carry-coconuts-on-a-plane-youll-be-surprised-if-you-know-the-reason-uyvg98x"/>
        </item>
        <item>
            <title><![CDATA[Nepal Floods: వర్షం పడకుండానే నేపాల్‌లోని నదికి వరదలు ఎందుకు వచ్చాయి? అసలు ఏం జరిగింది?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/why-did-the-river-in-nepal-flood-without-any-rain-what-actually-happened-x5p0ogm</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/why-did-the-river-in-nepal-flood-without-any-rain-what-actually-happened-x5p0ogm</guid>
            <pubDate>Sat, 05 Sep 2026 10:20:47 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Nepal Floods: వానలు పడితే నదులు ఉప్పొంగి వరదలు రావడం సహజం. కానీ నేపాల్ లో పరస్థితి వేరు. వానలు పడకుండా నదికి వరదలు వచ్చాయి. అసలు నేపాల్ లో ఏం జరిగింది? ఎందుకలా హఠాత్తుగా వరదలు వచ్చిపడ్డాయి?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1qyey3a1nqnz6ckf6r2pjbx,imgname-why-did-the-river-in-nepal-flood-without-any-rain-what-actually-happened-1788583835754.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Nepal Floods: వానలు పడితే నదులు ఉప్పొంగి వరదలు రావడం సహజం. కానీ నేపాల్ లో పరస్థితి వేరు. వానలు పడకుండా నదికి వరదలు వచ్చాయి. అసలు నేపాల్ లో ఏం జరిగింది? ఎందుకలా హఠాత్తుగా వరదలు వచ్చిపడ్డాయి?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నేపాల్&zwnj;లో ఇటీవల సంభవించిన ఘోర వరదలకు వర్షాలు కారణం కాదు. సాధారణంగా భారీ వర్షాలు లేదా వరద హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తమవుతారు. కానీ ఇక్కడ చుక్క వర్షం పడకుండానే నదులు ఉగ్రరూపం దాల్చి ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తాయి. ఈ విచిత్ర విపత్తు వెనుక దాగి ఉన్న అసలు సూత్రధారి ఆకాశం కాదు.. హిమాలయాల ఎత్తైన శిఖరాల్లో చోటుచేసుకున్న భారీ భౌగోళిక మార్పు. దాదాపు ఐదు వేల మీటర్ల ఎత్తులో ఉన్న లాంగ్&zwnj;టాంగ్ పర్వత శ్రేణుల్లో ఒక భారీ గ్లేసియర్ (హిమానీనదం) దానికి ఆనుకుని ఉన్న కొండచరియలతో సహా ఒక్కసారిగా నిలువునా విరిగిపడింది. ఈ శిథిలాలు ఎంత వేగంగా, ఎంత భారీ మొత్తంలో పడ్డాయంటే భూకంప మాపకాల్లో ప్రకంపనలు సైతం నమోదయ్యాయి. కొండలు విరిగి నదీ పరీవాహక ప్రాంతాల్లో పడటంతో ఈ అనూహ్య విలయం మొదలైంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కొండపై నుంచి విరిగిపడిన వేలాది టన్నుల మంచు దిబ్బలు, బండరాళ్లు, మట్టి ముద్దలు లోయలో ప్రవహించే నదిపై పడి క్షణాల్లో నీటి ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకున్నాయి. దీనివల్ల నదికి సహజసిద్ధంగా ఒక తాత్కాలిక ఆనకట్టలా ఏర్పడింది. ఎగువ నుంచి వస్తున్న నీరు నిమిషాల వ్యవధిలోనే భారీ జలాశయంగా మారి విపరీతమైన ఒత్తిడిని పెంచింది. నీటి ఉధృతికి ఆ మట్టి, రాళ్ల కట్ట ఒక్కసారిగా పేలిపోవడంతో ఆకస్మిక సునామీ వంటి బురద ప్రవాహం కిందకు దూసుకొచ్చింది. కేవలం అరగంట వ్యవధిలోనే నదీ మట్టం దాదాపు పది మీటర్ల మేర పెరిగిపోయింది. నదీ తీరంలో ఉన్న ఇళ్లు, వంతెనలు, స్థానిక నిర్మాణాలు ఏవీ ఈ ఉధృతికి నిలబడలేక కొట్టుకుపోయాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే గ్రామాలు బురదమయంగా మారాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ విపత్తుకు అసలైన మూలకారణం గ్లోబల్ వార్మింగ్ అని పర్యావరణ నిపుణులు తేల్చి చెబుతున్నారు. హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వేల ఏళ్లుగా బండరాళ్లను ఒక జిగురులా గట్టిగా పట్టి ఉంచుతున్న శాశ్వత మంచు పొరలు (పెర్మాఫ్రాస్ట్) కరిగిపోతున్నాయి. దీంతో పర్వతాల పటుత్వం తగ్గి, పైన ఉన్న గ్లేసియర్లు ఏ క్షణానైనా జారిపడేంత అస్థిరంగా మారుతున్నాయి. వర్షం రాకపోయినా కేవలం వేడి పెరిగి పర్వతాల అంతర్భాగం బలహీనపడటం వల్లే ఈ భారీ ప్రళయం సంభవించింది. భవిష్యత్తులో వర్షాలు లేకపోయినా హిమాలయ ప్రాంతాల్లో ఇలాంటి ఆకస్మిక విపత్తులు తప్పవని ఈ సంఘటన తీవ్ర హెచ్చరిక జారీ చేస్తోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>feature</category>
            <dc:creator>Haritha Chappa</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/why-did-the-river-in-nepal-flood-without-any-rain-what-actually-happened-x5p0ogm"/>
        </item>
        <item>
            <title><![CDATA[బొగ్గు నుంచి కరెంట్ ఎలా తయారవుతుందో తెలుసా.? ప్రాసెస్ తెలిస్తే వావ్ అనాల్సిందే]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/feature/power-production-how-is-electricity-generated-from-coal-amazing-journey-from-coal-mining-to-power-ydy2pnr</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/feature/power-production-how-is-electricity-generated-from-coal-amazing-journey-from-coal-mining-to-power-ydy2pnr</guid>
            <pubDate>Fri, 04 Sep 2026 19:33:49 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Power Production: మనం ప్రతిరోజూ ఉపయోగించే ఈ విద్యుత్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది.? ముఖ్యంగా బొగ్గు నుంచి కరెంట్ ఎలా తయారవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? దీని వెన&zwnj;కాల ఉన్న&zwnj; ఆసక్తికరమైన ప్రయాణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1pbe96btb8rt3dcmc465a4b,imgname-power-production-1788530336970.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Power Production: మనం ప్రతిరోజూ ఉపయోగించే ఈ విద్యుత్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది.? ముఖ్యంగా బొగ్గు నుంచి కరెంట్ ఎలా తయారవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? దీని వెన&zwnj;కాల ఉన్న&zwnj; ఆసక్తికరమైన ప్రయాణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;విద్యుత్ తయారీ ప్రక్రియలో మొదటి అడుగు బొగ్గు మైనింగ్&zwnj;తో ప్రారంభమవుతుంది. భూమి లోపల ఉండే బొగ్గును మైనింగ్ ద్వారా బయటకు తీస్తారు. ఇలా సేకరించిన బొగ్గును భారీ వాహనాల సహాయంతో బయటకు తరలిస్తారు. అనంతరం పెద్ద మొత్తంలో బొగ్గును రైళ్లలో లోడ్ చేసి థర్మల్ పవర్ ప్లాంట్లకు పంపిస్తారు. ఒక విద్యుత్ ప్లాంట్ నిరంతరం పనిచేయాలంటే భారీ స్థాయిలో బొగ్గు అవసరం ఉంటుంది. అందుకే గనుల నుంచి పవర్ ప్లాంట్ల వరకు ప్రత్యేక రవాణా వ్యవస్థ ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రైళ్ల ద్వారా పవర్ ప్లాంట్&zwnj;కు చేరుకున్న బొగ్గును అక్కడి నుంచి కన్వేయర్ బెల్ట్&zwnj;ల ద్వారా లోపలికి తరలిస్తారు. భారీ బెల్ట్&zwnj;లపై నిరంతరం ప్రయాణించే బొగ్గు తదుపరి దశలో క్రషర్ల వద్దకు చేరుతుంది. ఇక్కడే పెద్ద యంత్రాలు బొగ్గు ముక్కలను చిన్న చిన్న కణాలుగా చేస్తాయి. చివరకు అది దాదాపు మెత్తటి పౌడర్&zwnj;లా మారుతుంది. ఇలా బొగ్గును పొడిగా మార్చడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. చిన్న కణాలుగా ఉన్న బొగ్గు త్వరగా, బాగా మండుతుంది. దీంతో ఎక్కువ వేడి ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది. ఈ బొగ్గు పొడిని ప్రత్యేక పైపుల ద్వారా ఫర్నెస్&zwnj;లోకి పంపిస్తారు. అక్కడే అసలు విద్యుత్ తయారీ ప్రక్రియకు కీలకమైన దశ ప్రారంభమవుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఫర్నెస్&zwnj;లో బొగ్గు పొడిని మండించడంతో విపరీతమైన వేడి ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ వేడితో నేరుగా కరెంట్ తయారు కాదు. ముందుగా ఈ ఉష్ణశక్తిని ఉపయోగించి నీటిని అత్యంత వేడిగా ఉన్న ఆవిరిగా మార్చుతారు. ఫర్నెస్ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాయిలర్ పైపుల్లో నీరు ఉంటుంది. బొగ్గు మండడం వల్ల ఉత్పత్తి అయ్యే భారీ వేడి ఈ నీటిని అత్యధిక ఉష్ణోగ్రతకు చేరుస్తుంది. దీంతో నీరు సాధారణ ఆవిరిగా కాకుండా అత్యధిక పీడనంతో కూడిన హై ప్రెజర్ స్టీమ్&zwnj;గా మారుతుంది. ఇదే ఆవిరి విద్యుత్ ఉత్పత్తిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఈ హై ప్రెజర్ స్టీమ్&zwnj;లో అపారమైన శక్తి ఉంటుంది. తదుపరి దశలో ఈ శక్తిని టర్బైన్లను తిప్పడానికి ఉపయోగిస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బాయిలర్&zwnj;లో తయారైన అధిక పీడన ఆవిరిని భారీ పైపుల ద్వారా టర్బైన్&zwnj;లోకి పంపిస్తారు. అత్యంత వేగంతో దూసుకువచ్చే స్టీమ్ టర్బైన్&zwnj;లోని బ్లేడ్లను బలంగా తాకుతుంది. దీంతో టర్బైన్ చాలా వేగంగా తిరగడం ప్రారంభిస్తుంది. ఈ దశలో బొగ్గు ద్వారా వచ్చిన ఉష్ణశక్తి మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. అంటే.. బొగ్గు మంట నుంచి వచ్చిన వేడి ఇప్పుడు టర్బైన్&zwnj;ను తిప్పే శక్తిగా రూపాంతరం చెందుతుంది. టర్బైన్&zwnj;కు ఒక జనరేటర్ అనుసంధానమై ఉంటుంది. టర్బైన్ తిరిగిన వెంటనే జనరేటర్ కూడా పనిచేయడం ప్రారంభిస్తుంది. జనరేటర్&zwnj;లో అయస్కాంతాలు, రాగి తీగల మధ్య జరిగే కదలికల కారణంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడే మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. అంటే బొగ్గు నుంచి వచ్చిన శక్తి.. వేడిగా, ఆవిరిగా, టర్బైన్ కదలికగా మారి చివరకు మనం ఉపయోగించే విద్యుత్&zwnj;గా రూపాంతరం చెందుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జనరేటర్&zwnj;లో తయారైన విద్యుత్&zwnj;ను నేరుగా ఇళ్లకు పంపరు. ఎందుకంటే ఎక్కువ దూరాలకు విద్యుత్&zwnj;ను సమర్థంగా తరలించాలంటే అధిక వోల్టేజీ అవసరం. అందుకే పవర్ ప్లాంట్&zwnj;లోని ట్రాన్స్&zwnj;ఫార్మర్ల ద్వారా విద్యుత్ వోల్టేజీని భారీ స్థాయికి పెంచుతారు. అధిక వోల్టేజీతో ఉన్న విద్యుత్&zwnj;ను ట్రాన్స్&zwnj;మిషన్ లైన్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పవర్ గ్రిడ్&zwnj;కు పంపిస్తారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాల్లోని సబ్&zwnj;స్టేషన్లకు విద్యుత్ చేరుతుంది.&lt;/p&gt;&lt;p&gt;సబ్&zwnj;స్టేషన్లలో ట్రాన్స్&zwnj;ఫార్మర్ల సహాయంతో వోల్టేజీని దశలవారీగా తగ్గిస్తారు. చివరకు మన ఇళ్లు, కార్యాలయాలు, పరిశ్రమలకు ఉపయోగపడే స్థాయికి తీసుకొచ్చి విద్యుత్ సరఫరా చేస్తారు. సింపుల్&zwnj;గా చెప్పాలంటే.. బొగ్గు &rarr; వేడి &rarr; ఆవిరి &rarr; టర్బైన్ కదలిక &rarr; జనరేటర్ &rarr; విద్యుత్ &rarr; ట్రాన్స్&zwnj;ఫార్మర్ &rarr; గ్రిడ్ &rarr; మన ఇల్లు.. ఇదే బొగ్గు నుంచి కరెంట్ తయారై మన ఇంటికి చేరే పూర్తి ప్రక్రియ.&lt;/p&gt;&lt;p&gt;అయితే బొగ్గును మండించడం వల్ల కార్బన్ డైఆక్సైడ్&zwnj;తో పాటు ఇతర కాలుష్య కారకాలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. పర్యావరణంపై ప్రభావం తగ్గించేందుకు ప్రపంచ దేశాలు ఇప్పుడు సోలార్ పవర్, విండ్ పవర్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల విద్యుత్ అవసరాలను తీర్చడంలో థర్మల్ పవర్ ప్లాంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>feature</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/feature/power-production-how-is-electricity-generated-from-coal-amazing-journey-from-coal-mining-to-power-ydy2pnr"/>
        </item>
    </channel>
</rss>
