<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Wed, 29 Apr 2026 14:57:22 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/districts-news" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[Chicken Crisis : ఓ హైదరబాదీ... ఏమిటీ నీకీ గతి..!]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/chicken-crisis-in-hyderabad-shops-shut-across-telangana-meat-lovers-worried-0g3aggg</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/chicken-crisis-in-hyderabad-shops-shut-across-telangana-meat-lovers-worried-0g3aggg</guid>
            <pubDate>Wed, 01 Apr 2026 15:38:32 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం కారణంగా ప్రస్తుతం గ్యాస్ కొరత కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ కొరత ప్రచారం కంగారుపెడుతోంది. ఇవి చాలవన్నట్లు తెలంగాణలో ఇప్పుడు చికెన్ కొరత ఏర్పడబోతోంది.&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kd5w2e8hgxm1jxcvrtgzh3g0,imgname-chicken-biryani-1766502512913.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం కారణంగా ప్రస్తుతం గ్యాస్ కొరత కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ కొరత ప్రచారం కంగారుపెడుతోంది. ఇవి చాలవన్నట్లు తెలంగాణలో ఇప్పుడు చికెన్ కొరత ఏర్పడబోతోంది.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Hyderaba : 'ముక్క లేనిదే ముద్ద దిగదు'... ఇది తెలంగాణోళ్ల ఫుడ్ స్టైల్ గురించి చెప్పే మాట. అనాదిగా వీరి జీవితాల్లో మాంసాహారం భాగమయ్యింది. ఇక హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు... ఇక్కడి చికెన్ బిర్యానీకి ఏ స్థాయిలో డిమాండ్ ఉంటుందో అందరికీ తెలుసు. రోజూ బిర్యానీ తినే హైదరబాదీలు చాలామందే ఉంటారు... దేశంలోనే మాంసం తినేవారు అత్యధికంగా ఉన్న నగరం మనదే.&lt;/p&gt;&lt;p&gt;ఇలాంటి మాంసాహార ప్రియుల నగరంలో చికెన్ కొరత ఏర్పడితే..? ఇప్పుడు ఇదే జరగబోతోంది. ఏప్రిల్ 1 అంటే ఇవాళ్టి నుండి తెలంగాణవ్యాప్తంగా చికెన్ షాపులు మూతపడనున్నాయి. సమస్యల పరిష్కారం కోసం చికెన్ షాపులు యజమానులు నిరవధిక బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో హైదరాబాద్ తో సహా రాష్ట్రవ్యాప్తంగా చికెన్ విక్రయాలు నిలిచిపోయాయి. ఈ స్ట్రైక్ ఇలాగే కొనసాగితే నాన్ వెజ్ ప్రియుల నాలుక చప్పబడటం ఖాయం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారతదేశంలో అత్యధికంగా మాంసాహారం తినే ప్రాంతం తెలంగాణ, నగరం హైదరాబాద్. ఈ నిజాంల నగరం మాంసాహారానికి చాలా ఫేమస్. తెలంగాణ పల్లెల్లో యాట (మేక, గొర్రె మాంసం) ఎక్కువగా తింటారు... కానీ హైదరాబాద్ లో చికెన్ దే పైచేయి. అలాంటి చికెన్ విక్రయాలు నిలిచిపోతే నగరవాసులకు ఇబ్బందులు తప్పవు.&lt;/p&gt;&lt;p&gt;మేక మాంసం (మటన్) కిలో ప్రస్తుతం రూ.800-1000 వరకు ఉంది. అదే చికెన్ అయితే కిలో రూ.200 నుండి 300 వరకు ఉంటుంది. మహా అయితే రూ.400 దాటదు. ఈ ధరల వ్యత్యాసం కూడా హైదరాబాద్ లో చికెన్ వినియోగం ఎక్కువగా ఉండటానికి రీజన్. ఇప్పుడు చికెన్ బంద్ అయితే నగరవాసులు మటన్ వైపు మళ్లాలి... ఇది వారి జేబులకు చిల్లు పెట్టనుంది. నగరవాసులు జీవన వ్యయం పెరిగే అవకాశాలున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మాంసాహారానికి రుచి మరిగిన పులిని గడ్డి తినమంటే తింటుందా..? ఈ మాటలు ప్రస్తుతం తెలంగాణవారికి సరిగ్గా సరిపోతాయి. చికెన్ షాపుల బంద్ నేపథ్యంలో రోజూ చికెన్ తినేవారు కాయగూరలతో సరిపెట్టుకోవాల్సిందే. ఒకటి రెండ్రోజులు అయితే పరవాలేదు... కానీ చాలాకాలం చికెన్ దొరక్కుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇది అహార అలవాట్లపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు... ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీయవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన నగరాలతో పాటు జిల్లాల్లోనూ చికెన్ విక్రయాలు నిలిచిపోయాయి. చికెన్ సెంటర్ల యజమానులు స్వచ్ఛందంగా బంద్&zwnj;కు పిలుపునివ్వడంతో మాంసం ప్రియులకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఈ ఆకస్మిక బంద్&zwnj;కు ప్రధాన కారణం హోల్&zwnj;సేల్ వ్యాపారుల సిండికేట్&zwnj;గా మారడమేనని చిరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. చికెన్ ధరలు సామాన్యుడికి భారంగా మారడమే కాకుండా, వ్యాపారం చేయడం తమకు భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ప్రధానంగా పౌల్ట్రీ ఫారమ్ యజమానులు, బ్రాయిలర్ కంపెనీలు ధరలను నియంత్రిస్తుండటం వల్ల రిటైల్ వ్యాపారులు నష్టపోతున్నట్లు సమాచారం. ఎండల తీవ్రత పెరగడంతో కోళ్ల మరణాల రేటు పెరిగిందని, దీనివల్ల సరఫరా తగ్గి ధరలు పెరిగాయని ఉత్పత్తిదారులు చెబుతుండగా.. రిటైలర్లు మాత్రం ఇది కృత్రిమ కొరత అని వాదిస్తున్నారు. కిలో చికెన్ ధర గతంలో ఎన్నడూ లేని విధంగా పెరగడం వల్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయని, షాపుల అద్దెలు, పనివారి ఖర్చులు కూడా రావడం లేదని వ్యాపార సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలను నియంత్రించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇప్పటికే గ్యాస్ కొరతతో కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు చికెన్ షాపుల బంద్ ప్రభావం కూడా హోటల్, రెస్టారెంట్ రంగంపై తీవ్రంగా పడనుంది. చికెన్ లభ్యత లేకపోవడంతో బిర్యానీ, ఇతర మాంసాహార వంటకాల తయారీ నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో ఆదివారం వంటి కీలక రోజుల్లో కూడా హోటల్స్ కు గిరాకీ తగ్గే అవకాశాలున్నాయి. ఇలా వాటి ఆదాయం మరింత తగ్గనుంది.&lt;/p&gt;&lt;p&gt;పౌల్ట్రీ రంగంలోని సమస్యలను పరిష్కరించి, అటు వినియోగదారులకు, ఇటు చిరు వ్యాపారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రతిష్ఠంభణ మరికొన్ని రోజులు కొనసాగితే పౌల్ట్రీ రంగం మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/chicken-crisis-in-hyderabad-shops-shut-across-telangana-meat-lovers-worried-0g3aggg"/>
        </item>
        <item>
            <title><![CDATA[Hyderabad : రూ.50 లక్షల్లోనే ఇండిపెండెంట్ హౌస్.. హైదరాబాద్ లో అతితక్కువ ధరకే ఇళ్లు లభించే టాప్ 5 ప్రాంతాలివే..!]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/hyderabad/hyderabad-real-estate-top-5-areas-where-you-can-buy-independent-houses-under-rs-50-lakhs-1d96zso</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/hyderabad/hyderabad-real-estate-top-5-areas-where-you-can-buy-independent-houses-under-rs-50-lakhs-1d96zso</guid>
            <pubDate>Tue, 07 Apr 2026 09:54:30 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Hyderabad Real Estate : హైదరాబాద్ లో సొంతిల్లు మీ కలా..? అయితే అతి తక్కువ ధరకే ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్ మెంట్ ప్లాట్స్ లభించే ప్రాంతాల గురించి ఇక్కడ తెలుసుకొండి&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kmcrb61v0hqv16kv7cvg4pzp,imgname-hyderabad-1774249678907.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Hyderabad Real Estate : హైదరాబాద్ లో సొంతిల్లు మీ కలా..? అయితే అతి తక్కువ ధరకే ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్ మెంట్ ప్లాట్స్ లభించే ప్రాంతాల గురించి ఇక్కడ తెలుసుకొండి&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఐటీ రంగం విస్తరణ, మెట్రో కనెక్టివిటీ, ఔటర్ రింగ్ రోడ్ (ORR) సౌకర్యాల వల్ల గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లో సామాన్యుడు ఇల్లు కొనడం గగనమైపోతోంది. అయితే ఇప్పటికీ హైదరాబాద్, దాని శివారు ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లు లభించే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. 2026 నాటి రియల్ ఎస్టేట్ మార్కెట్ విశ్లేషణ ప్రకారం, తక్కువ ధరకే ఇళ్లు లభించే టాప్ 5 ప్రాంతాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న ఘటకేసర్ ప్రస్తుతం బడ్జెట్ ధరలో ఇళ్లు వెతికే వారికి బెస్ట్ ఛాయిస్&zwnj;గా మారింది. ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఇక్కడే ఉండటం, ఎంఎంటీఎస్ (MMTS) సౌకర్యం ఉండటం వల్ల ఈ ప్రాంతానికి డిమాండ్ పెరుగుతోంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ధరల వివరాలు : &lt;/strong&gt;ఇక్కడ అపార్ట్&zwnj;మెంట్లలో చదరపు అడుగు ధర రూ.4,000 నుండి రూ.5,500 మధ్య ఉంది. ఇండిపెండెంట్ ఇళ్లు (Independent Houses) సుమారు రూ.40 లక్షల నుండి రూ.80 లక్షల బడ్జెట్&zwnj;లో లభిస్తున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఒకప్పుడు పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న పటాన్&zwnj;చెరు ఇప్పుడు నివాస ప్రాంతంగా వేగంగా మారుతోంది. ఔటర్ రింగ్ రోడ్&zwnj;కు అతి సమీపంలో ఉండటం, గచ్చిబౌలి వంటి ఐటీ హబ్&zwnj;లకు కేవలం 20-30 నిమిషాల్లో చేరుకునే వీలుండటం ఇక్కడి ప్రత్యేకత.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ధరల వివరాలు : &lt;/strong&gt;ఇక్కడ చదరపు అడుగు ధర రూ.4,500 నుండి రూ.6,000 వరకు ఉంది. గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు కూడా నగరంతో పోలిస్తే ఇక్కడ తక్కువకే అందుబాటులో ఉన్నాయి. పటాన్ చెరు నుండి సంగారెడ్డి మధ్యలో అనేక అపార్ట్ మెంట్స్, విల్లాలు వెలుస్తున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తూర్పు హైదరాబాద్&zwnj;లో మెట్రో కనెక్టివిటీ వల్ల ఉప్పల్ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. ఉప్పల్ నుండి కొంచెం ముందుకు వెళ్తే పోచారం, మేడిపల్లి వంటి ప్రాంతాల్లో ఇంకా అందుబాటు ధరల్లోనే ఇళ్లు లభిస్తున్నాయి. ఐటీ నిపుణులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇది సరైన ప్రాంతం.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ధరల వివరాలు : &lt;/strong&gt;పోచారంలో ఫ్లాట్స్ ధర చదరపు అడుగుకు రూ.3,800 నుండి రూ.5,000 వరకు ఉంది. ఒక మోస్తరు 2BHK ఇల్లు ఇక్కడ రూ.45 లక్షల నుండి రూ.60 లక్షల లోపు దొరికే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;శంషాబాద్ ఎయిర్&zwnj;పోర్ట్&zwnj;కు సమీపంలో ఉండటంతో పాటు ఫార్మా సిటీ అభివృద్ధి చెందుతుండటంతో దక్షిణ హైదరాబాద్&zwnj;పై అందరి దృష్టి పడింది. భవిష్యత్తులో పెట్టుబడికి కూడా ఇది అద్భుతమైన ప్రాంతం. ఇక్కడ విల్లా ప్లాట్లు, చిన్నపాటి ఇళ్లు తక్కువకే లభిస్తాయి.&lt;/p&gt;&lt;p&gt;ధరల వివరాలు : ఈ ప్రాంతంలో ఫ్లాట్ల ధర చదరపు అడుగుకు రూ.4,000 నుండి రూ.5,500 వరకు పలుకుతోంది. ఓపెన్ ప్లాట్ల విషయంలో ఇంకా ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కూకట్&zwnj;పల్లి, మియాపూర్ ప్రాంతాలకు దగ్గరగా ఉంటూనే, బడ్జెట్&zwnj;లో ఇల్లు కావాలనుకునే వారికి బాచుపల్లి సరైన ఆప్షన్. ఇక్కడ విద్యా సంస్థలు ఎక్కువగా ఉండటం కుటుంబాలకు పెద్ద ప్లస్ పాయింట్. అలాగే హైటెక్ సిటీ, గచ్చచిబౌలి వంటి ఐటీ ఏరియాలకు చాలా దగ్గరగా ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ధరల వివరాలు:&lt;/strong&gt; బాచుపల్లి శివారు ప్రాంతాల్లో చదరపు అడుగు ధర రూ.4,200 నుండి రూ.5,800 మధ్య ఉంది. మియాపూర్, కెపిహెచ్బి మెట్రోలకు దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ అద్దె ఆదాయం కూడా బాగుంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్&zwnj;లో ఇల్లు కొనాలనుకునే వారు కేవలం నేటి ధరలనే కాకుండా, రాబోయే ఐదేళ్లలో అక్కడ జరిగే అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పైన పేర్కొన్న ప్రాంతాలు మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్&zwnj;లో సొంతింటి కలని నెరవేర్చుకోవడానికి ఉత్తమమైన ప్రదేశాలు. ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు చట్టపరమైన అనుమతులు (HMDA/RERA) ఉన్నాయో లేదో సరిచూసుకోవడం మర్చిపోవద్దు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/hyderabad/hyderabad-real-estate-top-5-areas-where-you-can-buy-independent-houses-under-rs-50-lakhs-1d96zso"/>
        </item>
        <item>
            <title><![CDATA[హైదరాబాద్ లో అప్పుడే నీటి కష్టాలు.. తక్కువ ధరలో వాటర్ ట్యాంకర్ బుక్ చేసుకోండిలా..]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/hyderabad-water-crisis-tanker-mafia-shortage-and-rising-demand-explained-3i1wcuf</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/hyderabad-water-crisis-tanker-mafia-shortage-and-rising-demand-explained-3i1wcuf</guid>
            <pubDate>Mon, 30 Mar 2026 18:18:23 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;సమ్మర్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో నీటికష్టాలు పెరిగిపోతాయి&hellip; ఇప్పుడు అదే పరిస్థితి. వచ్చే ఏప్రిల్ లో కేవలం జలమండలి ట్యాంకర్ల కోసమే రోజుకు 10000 బుకింగ్స జరిగే అవకాశాలున్నాయట.. ఇక ప్రైవేట్ ట్యాంకర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01jpm0zr32xqewc6bqbp40hzct,imgname-water-tanker.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;సమ్మర్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో నీటికష్టాలు పెరిగిపోతాయి&hellip; ఇప్పుడు అదే పరిస్థితి. వచ్చే ఏప్రిల్ లో కేవలం జలమండలి ట్యాంకర్ల కోసమే రోజుకు 10000 బుకింగ్స జరిగే అవకాశాలున్నాయట.. ఇక ప్రైవేట్ ట్యాంకర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్.. ప్రపంచ పటంలో ఐటీ హబ్&zwnj;గా, చారిత్రక నగరంగా వెలుగొందుతున్న మహానగరం. కానీ ప్రతి ఏటా వేసవి కాలం వస్తుందంటే చాలు, ఈ మహానగరం గొంతు ఎండుతుంది. పెరుగుతున్న జనాభా, అస్తవ్యస్తమైన పట్టణీకరణ, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల హైదరాబాద్ తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు 'సరస్సుల నగరం'గా పిలవబడిన ఈ ప్రాంతం, నేడు ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం ఆందోళనకరం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో వేసవిలో నీటి సమస్యలు ఉంటాయి. కానీ బడాబాబులు, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ వంటి ప్రాంతాల్లో నీటి సమస్య మరీ ఎక్కువ. అందుకే ఈ ప్రాంతాల్లో ట్యాంకర్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఫిబ్రవరిలోనే నీటి కొరత ప్రారంభం అయ్యింది... ఇక మార్చి, ఏప్రిల్, మే, జూన్ లలో ఇది తారాస్థాయికి చేరుతుంది. ఈ నాలుగు నెలలు ట్యాంకర్లకు ఫుల్ గిరాకి.&lt;/p&gt;&lt;p&gt;ప్రైవేట్ వ్యక్తులు చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో బోర్లు వేసి నీటి దందా సాగిస్తున్నారు. ఇలా ఒక్క ట్యాంకర్ తో అక్రమంగా నీటితో వ్యాపారం చేస్తూ వేసవిలో రోజుకు రూ.10 నుండి రూ.20 వేల వరకు సంపాదిస్తున్నారు. ఇలా కొందరు పదుల సంఖ్యలో ట్యాంకర్లను కలిగివున్నారు. వాటర్ ట్యాంకుకు రూ.2 నుండి 4 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఒక్క ట్యాంకర్ రోజుకు నాలుగైదు వాటర్ ట్యాంకులు అమ్మినా చాలు.. నెలకు లక్షల ఆదాయం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల దందా ఇలా ఉంటే జలమండలి (HMWSSB) కి కూడా బుకింగ్స్ పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజువారి వాటర్ ట్యాంకర్ బుకింగ్స్ భారీగానే ఉంటున్నాయి.. వచ్చేనెల ఏప్రిల్ లో డిమాండ్ మరింత పెరిగి ఏప్రిల్ లో రోజుకు 10,000 బుకింగ్స్ జరుగుతాయని అంచనా వేస్తున్నారు.&lt;/p&gt;&lt;p&gt;జలమండల వాటర్ ట్యాంకర్ల ద్వారా స్వచ్చమైన నీటిని సరఫరా చేస్తాం.. కాబట్టి వీటినే వాడాలని జలమండలి అధికారులు నగరవాసులను సూచిస్తున్నారు. ఈ వాటర్ ట్యాంకర్స్ ను 155313 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయడం లేదా అధికారిక వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని చెబుతున్నారు. జలమండలి మొబైల్ యాప్ ద్వారా ట్యాంకర్ బుక్ చేసుకోవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్ నీటి సమస్యకు ప్రధాన కారణం భూగర్భ జల మట్టాలు పడిపోవడం. నగరంలోని చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురై కాంక్రీట్ జంగిల్&zwnj;గా మారడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా పోయింది. దీనికి తోడు, కృష్ణా, గోదావరి నదుల నుండి నీటిని తరలించే ప్రక్రియలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు, పైపులైన్ల లీకేజీలు సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. అపార్ట్&zwnj;మెంట్ సంస్కృతి పెరగడంతో విపరీతంగా బోర్లు వేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం తగ్గడం లేదా అకాల వర్షాలు కురవడం కూడా రిజర్వాయర్లలో నీటి నిల్వపై ప్రభావం చూపుతోంది.&lt;/p&gt;&lt;p&gt;ఈ నీటి కొరత కేవలం దాహానికే పరిమితం కాకుండా సామాజిక జీవనంపై కూడా ప్రభావం చూపుతోంది. మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు నీటి ట్యాంకర్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. సమయానికి నీరు అందక గృహిణులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ సంస్థలు, ఇతర పరిశ్రమలు కూడా నీటి నిర్వహణ కోసం భారీగా వెచ్చిస్తున్నాయి. నీటి కోసం గల్లీల్లో జరిగే గొడవలు సామాజిక అశాంతికి దారితీస్తున్నాయి. ఇది పరోక్షంగా నగర ఆర్థిక వ్యవస్థపై, ప్రజల జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గత ప్రభుత్వం 'మిషన్ భగీరథ' వంటి పథకాల ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందించే ప్రయత్నం చేసింది... అయినా పెరుగుతున్న అవసరాలకు అది సరిపోవడం లేదు. నగరంలోని పురాతన చెరువులను పునరుద్ధరించడం, మూసీ నదిని శుద్ధి చేయడం వంటి చర్యలు వేగవంతం కావాలి. కేవలం ప్రభుత్వమే కాకుండా, పౌరులలో కూడా బాధ్యత పెరగాలి. ప్రతి ఇంట్లో 'వర్షపు నీటి ఇంకుడు గుంతలు' (Rainwater Harvesting) ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసుకోవాలి. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవడం ఒక సామాజిక బాధ్యతగా గుర్తించాలి.&lt;/p&gt;&lt;p&gt;నీరు ప్రాణాధారం. రాబోయే తరాలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి స్వచ్ఛమైన నీరు, పర్యావరణం. హైదరాబాద్&zwnj;ను నీటి కష్టాల నుండి గట్టెక్కించాలంటే శాస్త్రీయమైన నీటి యాజమాన్య పద్ధతులు అవసరం. రీసైక్లింగ్ చేసిన నీటిని ఉద్యానవనాలకు, పరిశ్రమలకు వాడటం ద్వారా తాగునీటిపై ఒత్తిడి తగ్గించవచ్చు. పాలకుల చిత్తశుద్ధి, ప్రజల సహకారం తోడైతేనే 'విశ్వనగరం'గా ఎదిగే క్రమంలో హైదరాబాద్ తన దాహాన్ని తీర్చుకోగలదు. మన చేతుల్లో ఉన్న నీటి చుక్కను కాపాడుకుంటేనే, రేపటి తరం సురక్షితంగా ఉంటుంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/hyderabad-water-crisis-tanker-mafia-shortage-and-rising-demand-explained-3i1wcuf"/>
        </item>
        <item>
            <title><![CDATA[హైదరాబాద్ లో చల్లచల్లని టూరిస్ట్ స్పాట్స్.. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలను తప్పకుండా తీసుకెళ్లండి]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/hyderabad-summer-travel-guide-best-tourist-places-to-visit-3zy2ybl</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/hyderabad-summer-travel-guide-best-tourist-places-to-visit-3zy2ybl</guid>
            <pubDate>Tue, 31 Mar 2026 13:12:35 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Hyderabad : వేసవిలో హైదరాబాద్ హాట్ హాట్ గా ఉంటుంది&hellip; ఎండలు మండిపోతాయి. ఇలాంటి సమయంలోనూ కొన్ని ప్రాంతాలు, కొన్ని సమయాల్లో ఆహ్లాదకరంగా ఉంటాయి. అలాంటి ప్రాంతాలేవో తెెలుసా..?&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kn1d3ke9zj6cx9pqzpcwvqd8,imgname-summer-1774942539209.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Hyderabad : వేసవిలో హైదరాబాద్ హాట్ హాట్ గా ఉంటుంది&hellip; ఎండలు మండిపోతాయి. ఇలాంటి సమయంలోనూ కొన్ని ప్రాంతాలు, కొన్ని సమయాల్లో ఆహ్లాదకరంగా ఉంటాయి. అలాంటి ప్రాంతాలేవో తెెలుసా..?&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే విద్యార్థులకు పరీక్షలు ముగియనున్నాయి. ఇదే సమయంలో ఎండలు కూడా ముదరనున్నాయి. ఈ క్రమంలో పిల్లలను ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా పేరెంట్స్ ఇబ్బందులు తప్పవు.. అలాగని పిల్లలను ఇంటికే పరిమితం చేయడం కూడా తగదు. కాబట్టి వేసవికాలంలోనూ కాస్త చల్లని వాతావరణం ఉండేవి, సాయంత్రం సమయంలో సరదాగా వెళ్లివచ్చే టూరిస్ట్ స్పాట్స్ హైదరాబాద్ లో అనేకం ఉన్నాయి. వాటిగురించి ఇక్కడ తెలసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్ లోని చారిత్రక కట్టడాలు, సహజ అందాలు, సరస్సులు, వినోద ప్రదేశాలు పిల్లలకే కాదు ప్రతి వయసు వారికి ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగినా, సరైన ప్రదేశాలను ఎంచుకుంటే సేదతీరే అవకాశాలు ఉన్నాయి. ఇలా తెల్లవారుజామున లేదంటే సాయంత్రం వేళ సరదాగా వెళ్లివచ్చే ప్రాంతం చార్మినార్. నగరం మధ్యలో ఠీవీగా నిలిచిన ఈ చారిత్రక కట్టడం సందర్శకులను వెంటనే ఆకర్షిస్తుంది. పురాతన నిర్మాణ శైలితో కూడిన ఈ ప్రాంతం కేవలం ఫోటోలకే కాదు చరిత్రను అర్థం చేసుకునే అవకాశం ఇస్తుంది. సమీపంలోని లాడ్ బజార్ ప్రాంతంలో సంప్రదాయ వస్తువులు కనిపిస్తాయి. వేసవిలో ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే వేడి తక్కువగా ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గోల్కొండ కోట మరో ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడి నిర్మాణంలో ఉపయోగించిన శబ్ద ప్రతిధ్వని వ్యవస్థ ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. కోట పైభాగానికి చేరుకున్నప్పుడు నగర దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. సాయంత్రం జరిగే లైట్ అండ్ సౌండ్ షో సందర్శకులకు ప్రత్యేక అనుభూతి ఇస్తుంది. ఉదయం ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది.... ఈ సమయంలో కోటను సందర్శించవచ్చు... రాత్రి సమయంలో లైట్ ఆండ్ సౌండ్ షో లో కోట అందాలు రెట్టింపు అవుతాయి... దీన్ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వేసవిలో చల్లదనం కోసం ప్రజలు ఎక్కువగా సరస్సులు, పార్కులు వైపు మొగ్గు చూపుతారు. ఇలా వేసవి వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగర నడిబొడ్డున గల హుస్సేన్ సాగర్ కు జనాలు తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఉదయం లేదా సాయంత్రం సమయంలో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్, నెక్లెస్ రోడ్ లో నడక అద్భుతంగా ఉంటుంది. నీటి మధ్యలో నిలిచిన బుద్ధ విగ్రహానికి దగ్గరగా సూర్యుడు... ఆ సన్నివేశం కనువిందు చేస్తుంది. పడవ ప్రయాణం ద్వారా సరస్సు మధ్యకు వెళ్లడం ఒక మధుర అనుభవం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కేబీఆర్ నేషనల్ పార్క్ ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైన ప్రదేశం. నగరంలో ఉన్నప్పటికీ ఇది అడవి వాతావరణాన్ని అందిస్తుంది. చెట్ల నీడలో నడక చేస్తూ వేడిని కొంతవరకు తప్పించుకోవచ్చు. పక్షుల కిలకిలలు, ప్రశాంత వాతావరణం ఇక్కడి ప్రధాన ఆకర్షణలు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అనంతగిరి కొండలు నగరానికి కొంత దూరంలో ఉన్నప్పటికీ వేసవిలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాల్లో ఒకటి. ఎత్తైన ప్రదేశం కావడంతో ఇక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అడవి మార్గాల్లో ట్రెక్కింగ్ చేసే అవకాశం కూడా ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వేసవిలో కుటుంబంతో కలిసి వెళ్లే ప్రదేశాలు కూడా హైదరాబాద్&zwnj;లో బాగానే ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోగా గుర్తింపు పొందింది. ఇక్కడ సినిమాల షూటింగ్ సెట్లు మాత్రమే కాకుండా వినోద కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉంటాయి. రోజంతా గడిపేలా వివిధ థీమ్ పార్కులు, షోలు ఏర్పాటు చేశారు.&lt;/p&gt;&lt;p&gt;ఓషన్ పార్క్, వండర్లా వంటి వాటర్ పార్కులు వేసవిలో ఎక్కువగా సందర్శకులను ఆకర్షిస్తాయి. నీటిలో ఆటలు, స్లైడ్లు, స్విమ్మింగ్ పూల్స్ వేడిని తగ్గించడంలో సహాయపడతాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ అనుకూలమైన వినోదం ఇక్కడ లభిస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;నెహ్రూ జూలాజికల్ పార్క్ కూడా కుటుంబాలతో వెళ్లేందుకు సరైన ప్రదేశం. వివిధ జంతువులను దగ్గరగా చూసే అవకాశం పిల్లలకు ప్రత్యేకంగా ఉంటుంది. అయితే వేడి ఎక్కువగా ఉండే సమయాలను తప్పించి ఉదయం వేళల్లో సందర్శించడం మంచిది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/hyderabad-summer-travel-guide-best-tourist-places-to-visit-3zy2ybl"/>
        </item>
        <item>
            <title><![CDATA[Hyderabad : వీడెవడండీ బాబు..! హైదరాబాద్ నడిబొడ్డున గంజాయి సాగు చేస్తున్నాడు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/software-engineer-arrested-for-growing-cannabis-at-home-in-hyderabad-6tm2mul</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/software-engineer-arrested-for-growing-cannabis-at-home-in-hyderabad-6tm2mul</guid>
            <pubDate>Wed, 22 Apr 2026 14:38:25 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Hyderabad : మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవారు ఎంతకైనా తెగిస్తారు అనడానికి పర్పెక్ట్ ఉదాహరణ ఈ ఘటన. హైదరాబాద్ కు చెందిన ఓ సాప్ట్ వేర్ గంజాయి కోసం ఏం చేశాడో తెలుసా..?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kpt6m99rbq319wxxqjast5ks,imgname-ganja-1776848348472.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Hyderabad : మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవారు ఎంతకైనా తెగిస్తారు అనడానికి పర్పెక్ట్ ఉదాహరణ ఈ ఘటన. హైదరాబాద్ కు చెందిన ఓ సాప్ట్ వేర్ గంజాయి కోసం ఏం చేశాడో తెలుసా..?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Hyderabad : మత్తు పదార్థాలు యువత జీవితాలను చిత్తుచేస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా మాదకద్రవ్యాల వాడకం ఆగడంలేదు. ఇవి ఎంత ప్రమాదకరమో తెలిసిన చదువుకున్నవారే వీటికి బానిసలు అవుతున్నారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో జల్సాలకు అలవాటుపడ్డ ధనవంతుల బిడ్డలు, బాగా సంపాదించే సాప్ట్ వేర్ ఇంజనీర్లు మాదకద్రవ్యాలను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఎక్సైజ్ లెక్కలు చెబుతున్నారు. ఇలా గంజాయికి అలవాటుపడ్డ ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి ఏకంగా నగర నడిబొడ్డున ఇంట్లోనే గంజాయి పెంచుతూ పట్టుబడ్డాడు. ఈ ఘటన సంచలనంగా మారింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన సిహెచ్. శశిధర్ అనే యువకుడు బాగా చదువకున్నాడు... దీంతో ఓ సాఫ్ట్&zwnj;వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం లభించింది. ఇలా మంచి ఉద్యోగం, హాయిగా జీవించడానికి సరిపడా జీతం వస్తుండటంతో అతడిలో జల్సారాయుడు మేల్కొన్నాడు. సహచర ఉద్యోగులో లేక స్నేహితుల వల్లనో అతడికి గంజాయి తాగడం అలవాటయ్యింది&hellip; కొన్నాళ్లకే ఇది అతడికి వ్యసనంగా మారింది. గంజాయి కొట్టకుండా ఉండలేకపోయాడు.. దీంతో శాలరీ మొత్తం దీనికోసమే ఖర్చు చేసేవాడు.&lt;/p&gt;&lt;p&gt;ఇలా పూర్తిగా గంజాయికి అలవాటుపడ్డ అతడు సరిగ్గా పని చేయలేకపోయేవాడు. దీంతో అతడిని భరించలేక సదరు సాప్ట్ వేర్ కంపెనీ ఇంటికి పంపించింది. ఉద్యోగం లేక ఆదాయం కోల్పోయినా అతడి గంజాయి అలవాటు మాత్రం ఆగలేదు. గంజాయి కొనడానికి డబ్బులు లేకపోవడంతో అతడిలోని క్రిమినల్ బయటకు వచ్చాడు. ''గంజాయి కొనడం ఎందుకు... ఇంట్లోనే సొంతంగా సాగుచేసుకుంటే పోలా...'' అనే ఆలోచన వచ్చినట్లుంది. వెంటనే గంజాయి సాగుకు ఇంటి టెర్రస్ పై సెటప్ చేసుకుని మొక్కలను తెచ్చి పెంచసాగాడు. ఇలా అతడు గంజాయి తాగే స్థాయినుండి దాన్ని సాగుచేసే స్థాయికి చేరుకున్నాడు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;శశిధర్ గంజాయి సాగుపై పక్కా సమాచారం అందడంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేశాడు. రంగారెడ్డి ఎన్&zwnj;ఫోర్స్&zwnj;మెంట్ టీం సర్కిల్ ఇన్&zwnj;స్పెక్టర్ బాలరాజ్ నేతృత్వంలో నాచారంలోని శశిధర్ ఇంటిపై తనిఖీ చేశారు. ఈ క్రమంలో బాగా పెరిగిన 17 భారీ గంజాయి మొక్కలు లభించాయి. కొన్ని మొక్కలు ఏకంగా మూడు మీటర్ల ఎత్తు పెరిగి ఉండటం చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. వీటి ద్వారా సుమారు 10 కిలోల గంజాయి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు శశిధర్ ను అరెస్ట్ చేశారు. అతడిని ఘట్&zwnj;కేసర్ పోలీసులకు అప్పగించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నగరంలో విద్యార్థులు, సాఫ్ట్&zwnj;వేర్ నిపుణులు ఇలా మాధక ద్రవ్యాల ఊబిలో కూరుకుపోవడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుండి నగరవ్యాప్తంగా మత్తు పదార్ధాల నిరోధక చర్యలను ఎక్సైజ్ శాఖ ముమ్మరం చేసింది. కేవలం వినియోగదారులనే కాకుండా, సరఫరా చేసే నెట్&zwnj;వర్క్ మొత్తాన్ని వేటాడతామని... మాధకద్రవ్యాలు వాడినా లేదా అమ్మినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/software-engineer-arrested-for-growing-cannabis-at-home-in-hyderabad-6tm2mul"/>
        </item>
        <item>
            <title><![CDATA[TRS Party :''ఓ బిడ్డా.. ఈ బిస్లెరీ లాంటిదే నీ పార్టీ''... కవితకు కేసీఆర్ మాస్ మసాలా కౌంటర్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/kcr-gives-strong-counter-to-kavitha-amid-trs-controversy-72rc9b7</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/kcr-gives-strong-counter-to-kavitha-amid-trs-controversy-72rc9b7</guid>
            <pubDate>Sat, 25 Apr 2026 15:25:30 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;TRS Party&hellip; ఈ పేరు కోసం కల్వకుంట్ల కుటుంబం రాజకీయ రచ్చకెక్కింది. ఈ పేరుతో కవిత కొత్తపార్టీ పెట్టగా&hellip; కేసీఆర్ ఊహించని రియాక్షన్ ఇచ్చారు. ఇంతకు టీఆర్ఎస్ కూతురిదా&hellip; కొడుకుదా..? కేసీఆర్ సపోర్ట్ ఎవరికి..?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01hs2kxyrd5h6arhg6q57m2ydg,imgname-kvita.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;TRS Party&hellip; ఈ పేరు కోసం కల్వకుంట్ల కుటుంబం రాజకీయ రచ్చకెక్కింది. ఈ పేరుతో కవిత కొత్తపార్టీ పెట్టగా&hellip; కేసీఆర్ ఊహించని రియాక్షన్ ఇచ్చారు. ఇంతకు టీఆర్ఎస్ కూతురిదా&hellip; కొడుకుదా..? కేసీఆర్ సపోర్ట్ ఎవరికి..?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;TRS Party : తెలంగాణ రాజకీయాలు కల్వకుంట్ల కుటుంబంలో అగ్గి రాజేశాయి&hellip; ఇంకా చెప్పాలంటే పచ్చని కుటుంబంలో చిచ్చుపెట్టాయి. తండ్రి కూతురుని, అన్నా చెల్లిని వేరు చేశాయనే చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసత్వం కోసం ఆయన బిడ్డలు కేటీఆర్, కవిత పోటీ పడుతున్నారు... ఈ క్రమంలో ఒకే కడుపున పుట్టిన ఈ అన్నాచెల్లి రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఆసక్తికర విషయం ఏంటంటే కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ఇటీవల బిఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) గా మారింది... ఈ BRS కేటీఆర్ కు దక్కింది. దీంతో తండ్రి మొదట స్థాపించిన TRS పేరు కలిసివచ్చేలా కవిత కొత్త పార్టీ పెట్టుకుంది... అదే తెలంగాణ రా ష్ట్ర సేన.&lt;/p&gt;&lt;p&gt;ఇవాళ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించింది... అయితే పార్టీపేరు 'TRS' అని కలిసివచ్చేలా పెట్టడంపై బిఆర్ఎస్ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. బిఆర్ఎస్ అధికారిక ఎక్స్ ఖాతాలో కవిత పార్టీపై ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అధికారక ఖాతాలో పోస్ట్ కాబట్టి ఇది ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రియాక్షన్ గానే పరిగణించాలి. ఇంతకూ ఈ ఎక్స్ పోస్ట్ లో ఏముందో తెలుసా...?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కవిత 'తెలంగాణ రాష్ట్ర సేన' పార్టీ నకిలీది... 'తెలంగాణ రాష్ట్ర సమితి'' యే అసలైన టీఆర్ఎస్ అనేలా బిఆర్ఎస్ పోస్ట్ ఉంది. ఇందుకు ఉదాహరణగా ఒరిజినల్ కోల్ గేట్ టూత్ పేస్ట్, బిస్లెరి వాటర్ బాటిల్ ఫోటోలకు పక్కనే వాటిని అచ్చుగుద్దినట్లు ఉండే నకిలీ వాటి పోటీలను పెట్టారు. దీనికి ''ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే!'' అనే క్యాప్షన్ పెట్టారు. అంటే ఒరిజినల్ TRS తమదే... కవితది నకిలీ టీఆర్ఎస్ అంటోంది బిఆర్ఎస్.&lt;/p&gt;&lt;p&gt;ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే! pic.twitter.com/YBlx20tlRf&lt;/p&gt;&lt;p&gt;&mdash; BRS Party (@BRSparty) April 25, 2026&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పార్టీ ఆవిర్భావ సభలో కల్వకుంట్ల కవిత సొంత తండ్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగాయి. ఆయనపై గౌరవం ఉందంటూనే చేయాల్సిన విమర్శలు చేశారు. కేసీఆర్ రాజకీయ పరిణతి కోల్పోయారని... రాష్ట్రంలో పీకి కట్టలు కట్టామన్నట్లు టీఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారని విమర్శించారు. ఇలా డైరెక్ట్ గా కేసీఆర్ నే టార్గెట్ చేసి కవిత ప్రసంగం సాగింది.&lt;/p&gt;&lt;p&gt;''ఆనాటి కేసీఆర్ వేరు.. ఇప్పటి కేసీఆర్ వేరు&lt;/p&gt;&lt;p&gt;హైడ్రాలో ఇళ్లు కూలిపోతుంటే అన్నా ఎక్కడున్నావ్ రా... అంటే వచ్చిండ్రా..&lt;/p&gt;&lt;p&gt;వర్షబీభత్సంతో రైతుల పొలాలు మునిగిపోతే... వచ్చిండ్రా&lt;/p&gt;&lt;p&gt;ఆ సారు... ఇక రారు&lt;/p&gt;&lt;p&gt;గుంటనక్కలు, తోడేళ్ల చేతిలో ఖైదీ అయిన మనిషి మన మనిషి కాదు...&lt;/p&gt;&lt;p&gt;ఆయన మన కేసీఆర్ కాదు... మారిన కేసీఆర్.. మరబొమ్మ లాంటి కేసీఆర్'' అంటూ కవితాత్మకంగా తండ్రిపై కవిత విమర్శలు గుప్పించారు.&lt;/p&gt;&lt;p&gt;ఆనాటి కేసీఆర్ వేరు ఇప్పటి కేసీఆర్ వేరు.. ఇప్పుడున్న కేసీఆర్ తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉంటే రారు ఆయన మన మనిషి కాదు మర మనిషి.#TRSparty #TRS pic.twitter.com/E56JHVYAbz&lt;/p&gt;&lt;p&gt;&mdash; Kavitha Kalvakuntla (@RaoKavitha) April 25, 2026&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కొత్త పార్టీ ఆవిర్భావ సభలో కవిత ప్రజలకు ఎమోషనల్ టచ్ ఇచ్చేలా మాట్లాడారు. ఈ రాష్ట్రంలోని మూడున్నర కోట్ల మందికి అమ్మలా పరిణితి చెందాలనుకుంటున్నానని అన్నారు. అమ్మతనంతో పరిపాలన జరగాలి... అమ్మలా పాలిస్తా, బిడ్డలను బాగా చూసుకుంటానని అన్నారు. మన ప్రభుత్వం... మీ అమ్మ ప్రభుత్వం తప్పకుండా వస్తుందన్నారు. ''అమ్మ జేబు చూడదు.. కడుపు చూస్తది'' అంటూ ప్రజలు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా మాట్లాడారు.&lt;/p&gt;&lt;p&gt;ఇక TRS పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య అందిస్తామని కవిత హామీ ఇచ్చారు. ''రూపాయి ఖర్చు లేకుండా ప్రతి తెలంగాణ బిడ్డ ఉచిత విద్య పొందుతారు. కేవలం ప్రభుత్వ విద్య కాదు ప్రైవేట్ విద్య కూడా భారం కాకుండా చూస్తా.. డాక్టర్లు, ఇంజనీర్లు కాదు రాకెట్ సైన్సులు చదివే తెలంగాణ బిడ్డలకు రూపాయి ఖర్చు లేకుండా చూస్తా... పేద, మధ్యతరగతి వారిపై ఇక చదువుల భారం ఉండదు. మీరు ఎంత చదువుకున్నా సరే తెలంగాణ రాష్ట్ర సేన చూసుకుంటుంది... మీ అమ్మ ప్రభుత్వమే మిమ్మల్ని చదివిస్తుంది..'' అని కవిత హామీ ఇచ్చారు.&lt;/p&gt;&lt;p&gt;తెలంగాణ బిడ్డలు ఎంతవరకు చదువంటే అంతవరకు ఉచిత విద్యను అందించే బాధ్యత నాది.. అది ఈ అమ్మ ప్రభుత్వంలో జరగబోతుంది.#TRSparty #TRS pic.twitter.com/nTRAqinhAX&lt;/p&gt;&lt;p&gt;&mdash; Telangana Rashtra Sena (@TRS__Party) April 25, 2026&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/kcr-gives-strong-counter-to-kavitha-amid-trs-controversy-72rc9b7"/>
        </item>
        <item>
            <title><![CDATA[Hyderabad Haunted House : నగర నడిబొడ్డున దెయ్యాల నివాసం.. కుందన్‌బాగ్‌ బంగ్లా అసలు కథ ఇదే..!]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/hyderabad-haunted-house-the-real-story-behind-kundanbagh-ghost-bungalow-98nd0fv</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/hyderabad-haunted-house-the-real-story-behind-kundanbagh-ghost-bungalow-98nd0fv</guid>
            <pubDate>Wed, 29 Apr 2026 14:47:19 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;హైదరాబాద్&zwnj;లో ఓ బంగ్లా పేరు చెబితే చాలు చాలామంది భయంతో వణికిపోతారు. దేశంలోనే అత్యంత భయానకమైన, రహస్యమైన ప్రదేశాల్లో ఇదీ ఒకటి. నగర నడిబొడ్డున గల ఈ ''దెయ్యాల కోట'' గురించి మీకు తెలుసా..?&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01hy5pg8qxdgm13z7jf2dw4vd5,imgname-Ghost-Marriage-in-India--1716030808829.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;హైదరాబాద్&zwnj;లో ఓ బంగ్లా పేరు చెబితే చాలు చాలామంది భయంతో వణికిపోతారు. దేశంలోనే అత్యంత భయానకమైన, రహస్యమైన ప్రదేశాల్లో ఇదీ ఒకటి. నగర నడిబొడ్డున గల ఈ ''దెయ్యాల కోట'' గురించి మీకు తెలుసా..?&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్ నడిబొడ్డున గల ప్రాంతం కుందన్ బాగ్. బేగంపేట పరిధిలోని ఈ ప్రాంతంలో ఓ పురాతన బంగ్లాలో దెయ్యాలున్నాయని ఈ టెక్ జమానాలో కూడా చాలామంది నమ్ముతున్నారు అందుకే ఈ కుందన్&zwnj;బాగ్&zwnj; బంగ్లాను దేశంలోనే అత్యంత భయానకమైన, రహస్యమైన ప్రదేశాలలో ఒకటిగా మారింది.&lt;/p&gt;&lt;p&gt;ఈ కుందన్ బాగ్ బంగ్లా చుట్టూ కొవ్వొత్తులు పట్టుకున్న ఆత్మలు తిరుగుతాయని&hellip; రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు కూడా చెబుతుంటారు. దీంతో దెయ్యాలున్నాయనే నమ్మకం మరింత పెరిగింది. ఇక్కడ అనేక అతీంద్రియ సంఘటనలు జరిగాయని, అందుకే సూర్యాస్తమయం తర్వాత ఈ ప్రాంతానికి వెళ్లడానికి జనం భయపడతారు. కుందన్&zwnj;బాగ్&zwnj; బంగ్లా కథ ఇప్పటికీ ప్రజలను వణికిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్&zwnj;లోని ఖరీదైన ప్రాంతంలో ఉన్న కుందన్&zwnj;బాగ్&zwnj; హౌస్ కథ కేవలం కట్టుకథ కాదు, ఇది భయంకరమైన నిజం. 2002లో ఈ కథ వెలుగులోకి వచ్చింది. రెండంతస్తుల బంగ్లాలో నివసించే ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెల వింత ప్రవర్తన ఇరుగుపొరుగు వారిని భయపెట్టడం ప్రారంభించింది.&lt;/p&gt;&lt;p&gt;స్థానికుల కథనం ప్రకారం&hellip; ఆ మహిళ, ఆమె కూతుళ్లు రాత్రిపూట నల్ల బట్టలు ధరించి, కొవ్వొత్తులు పట్టుకుని తమ ఇంటి బాల్కనీలో తిరిగేవారు. కొన్నిసార్లు ఇంటి బయట ఉన్న చెత్తకుండీలలో రక్తంతో నిండిన సీసాలు విసిరేస్తూ వింత శబ్దాలు చేసేవారు. దీంతో వారు చేతబడి చేస్తున్నారనే వదంతులు వ్యాపించాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ కథలో అసలు మలుపు ఓ దొంగ ఆ ఇంట్లోకి దొంగతనం చేయడానికి వెళ్లినప్పుడు వచ్చింది. ఇంట్లోకి రహస్యంగా వెళ్లిన అతను, భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగెత్తుకొచ్చాడు. పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, వారికి భయంకరమైన దృశ్యం కనిపించింది. తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెల కుళ్లిన మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయి.&lt;/p&gt;&lt;p&gt;అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆ ముగ్గురూ దాదాపు ఆరు నెలల క్రితమే చనిపోయారని తేలింది. కానీ చనిపోయిన తర్వాత కూడా చాలా నెలల పాటు ఆ మహిళలు బాల్కనీలో కొవ్వొత్తులు వెలిగించడం చూశామని ఇరుగుపొరుగు వారు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇప్పటికీ ఆ కుందన్ బాగ్ బంగ్లా పాడుబడిన స్థితిలోనే ఉంది. ఇందులోంచి రాత్రిపూట కేకలు వినిపిస్తాయని, మసక కొవ్వొత్తి వెలుగు కనిపిస్తుందని స్థానికులు చెబుతుంటారు. కుందన్&zwnj;బాగ్&zwnj; ఇంటికి సంబంధించిన ఈ రహస్యం ఇప్పటికీ వీడలేదు.&lt;/p&gt;&lt;p&gt;అయితే ఇటీవల చాలామంది ''గోస్ట్ హంటింగ్'' పేరుతో ఈ కుందర్ బాగ్ బంగ్లా వద్ద వీడియోలు తీస్తున్నారు... గ్రాఫిక్స్ యాడ్ చేసి నిజంగానే దెయ్యాలను చూసినట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి స్థానికులకు మరింత భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇలా భయపెట్టేలా కుందన్ బాగ్ బంగ్లా వీడియోలను పోస్ట్ చేసిన 35 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ భవనం వద్ద వీడియోలు తీసేవారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా సోషల్ మీడియా వీడియోలతో కుందన్ బాగ్ బంగ్లా వార్తల్లో నిలిచింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/hyderabad-haunted-house-the-real-story-behind-kundanbagh-ghost-bungalow-98nd0fv"/>
        </item>
        <item>
            <title><![CDATA[Hyderabad : ఐఏఎస్, ఐపిఎస్ లే కుళ్లుకునేలా.. ఓ ఛాయ్ హోటల్ ఉద్యోగికి నెెలకు రూ.5 లక్షల జీతమే..!!]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/hyderabad-cafe-employee-earns-rs-60-lakh-salary-at-cafe-niloufer-dz6i8aq</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/hyderabad-cafe-employee-earns-rs-60-lakh-salary-at-cafe-niloufer-dz6i8aq</guid>
            <pubDate>Mon, 20 Apr 2026 13:32:02 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Cafe Niloufer : ఓ ఛాయ్ హోటల్లో పనిచేసే ఉద్యోగికి సాధారణంగా ఎంత శాలరీ ఉంటుంది.. రూ.5,000 లేదంటే రూ.10,000. మహా అయితే రూ.20,000. కానీ ఓ హోటల్లో ఏకంగా నెలకు రూ.5 జీతం తీసుకునే ఉద్యోగులు ఉన్నారట&hellip; ఇంతకీ ఆ హోటల్ ఏదో తెలుసా..?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kpmy4r3ahns36pc0qcxs97hr,imgname-hyderabad-1776671678569.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Cafe Niloufer : ఓ ఛాయ్ హోటల్లో పనిచేసే ఉద్యోగికి సాధారణంగా ఎంత శాలరీ ఉంటుంది.. రూ.5,000 లేదంటే రూ.10,000. మహా అయితే రూ.20,000. కానీ ఓ హోటల్లో ఏకంగా నెలకు రూ.5 జీతం తీసుకునే ఉద్యోగులు ఉన్నారట&hellip; ఇంతకీ ఆ హోటల్ ఏదో తెలుసా..?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Cafe Niloufer : హైదరాబాద్ అనగానే ఒకప్పుడు ఛార్మినార్, తర్వాత హుస్సేస్ సాగర్ లో బుద్దుడి విగ్రహం, హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ గుర్తుకువచ్చేవి. మరి ఇప్పుడో కేఫ్ నీలోఫర్ గుర్తుకువచ్చేలా పరిస్థితి మారిపోయింది. రూ.250 కి సింగిల్ ఛాయ్... రూ.1000 ఖరీదైన ఛాయ్ కూడా ఇక్కడ లభిస్తుంది. ఓ కుటుంబం సరదాగా ఈ కేఫ్ నీలోఫర్ కి వెళ్లిందో... నాలుగైదు వేల ఖర్చు ఖాయం.&lt;/p&gt;&lt;p&gt;బయట పది ఇరవై రూపాయలకు అమ్మే ఛాయ్ ఈ కేఫ్ నీలోఫర్ లో వందలు, వేలలో అమ్ముతున్నారు. ఇంత ఖరీదైన టీ షాప్ లో ధరలే ఇలా ఉన్నాయంటే పనిచేసేవారి శాలరీలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. తాజాగా కేఫ్ నీలోఫర్ యజమాని అనుముల బాబురావు తనయుడు శశాంక్ ఓ కార్యక్రమంలో ఉద్యోగుల జీతాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన మాటలు వింటే ఛాయ్ షాపులో ఇంత జీతాలా..! ఐఏఎస్, ఐపిఎస్ లకు కూడా రావే అని ఆశ్చర్యపోవడం ఖాయం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సాధారణంగా మీరు రోడ్డుపక్కన టీ షాప్ లో పనిచేసేవారిని మీ జీతమెంత అని అడగండి... ఏ ఐదువేలో, పదివేలో అని చెబుతారు. ఇక పెద్దపెద్ద కాఫీ షాప్ లలో ఉద్యోగులకు నెలకు రూ.15 వేల నుండి రూ.25 వరకు శాలరీ ఉంటాయి. మహా అయితే నెలకు రూ.50,000... ఇంతకంటే ఎక్కువ ఉండవు. కానీ హైదరాబాద్ లోని కేఫ్ నీలోఫర్ లో అత్యధిక శాలరీ రూ.60 లక్షలట... మీరు చూస్తున్నది నిజమే. ఏడాదికి అక్షరాలా అరవై లక్షల రూపాయలట... అంటే నెలకు దాదాపు 5 లక్షల శాలరీ. ఒక కెెఫే ఇంత శాలరీ ఇవ్వగలదా అని ఆశ్చర్యపోవడం మనవంతు.&lt;/p&gt;&lt;p&gt;ఇలా ఐఏఎస్, ఐపిఎల్ లు కాదు టాప్ సాప్ట్ వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ శాలరీని కేఫ్ నీలోఫర్ లో కొందరు ఉద్యోగులు పొందుతున్నారన్నమాట. ఇంతింత శాలరీలు ఇస్తున్నారంటే ఈ కేఫ్ ఆదాయం ఇంకే స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే కేఫ్ నీలో ఫర్ ఓ ఛాయ్ దుకాణం కాదు... కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే బిగ్ బిజినెస్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కేఫ్ నీలోఫర్ లో శాలరీల గురించి తెలిసి మీరుకూడా అందులో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే ఎలాంటి ఉద్యోగానికైనా కనీస విద్యార్హతలు అవసరమే. మేనేజ్మెంట్ స్థాయిలో ఉద్యోగాలకు ఎంబిఏ, బిటెక్ వంటి ఉన్నత చదువుల వారిని ఎంపికచేస్తారు. వీరికే లక్షల్లో శాలరీలు ఉండేది. ఇక సర్వీస్, క్యాషియర్, కిచెన్ విభాగాల్లో కూడా ఉద్యోగాలుంటాయి... హోటల్ మేనేజ్మెంట్, డిగ్రీలు చేసినవారికి అవకాశం కల్పిస్తారు. వీరికి నెలకు రూ.20 నుండి రూ.30 వేల శాలరీలే ఉంటాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కేఫ్ నీలోఫర్ అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఫేమస్. కేవలం ఛాయ్ అమ్ముతూనే కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. ఈ బిజినెస్ ను ఇంత సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న అనుముల బాబురావు అసలు చదువన్నదే ఎరగరు. ఎక్కడో మారుమూల పల్లెటూళ్లో పుట్టిపెరిగిన ఆయన బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చి ఓ ఛాయ్ హోటల్లో టేబుల్ క్లీనర్ గా పనిచేశారు... ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి 1978 లక్డికపూల్ లో కేఫ్ నీలోఫర్ ప్రారంభించాడు. అంచెలంచెలుగా దీన్ని డెవలప్ చేస్తూ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేశారు.&lt;/p&gt;&lt;p&gt;ప్రస్తుతం కేఫ్ నీలోఫర్ ఇరానీ ఛాయ్ తో పాటు బేకరీ ఉత్పత్తులను అమ్ముతున్నారు. లక్డికపూల్ (ప్రధాన శాఖ) తో పాటు హిమాయత్ నగర్, బంజారాహిల్స్, హైటెక్ సిటీలో బ్రాంచ్ లు ఉన్నాయి. ఇలా సాధారణ ప్రజలకే కాదు ధనవంతులకు అందుబాటులో ఉండే కేఫేలను బాబురావు ఏర్పాటుచేశారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/hyderabad-cafe-employee-earns-rs-60-lakh-salary-at-cafe-niloufer-dz6i8aq"/>
        </item>
        <item>
            <title><![CDATA[హైదరాబాద్ మామిడి పళ్లలో ఎంత విషం ఉంటుందో తెలుసా..? తిన్నారో అంతే సంగతి..]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/food-life/are-mangoes-poisoned-shocking-truth-about-chemical-ripening-gc8kklw</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/food-life/are-mangoes-poisoned-shocking-truth-about-chemical-ripening-gc8kklw</guid>
            <pubDate>Sat, 04 Apr 2026 18:43:32 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;హైదరాబాద్ లో తాజాగా పోలీసులు, ఫుడ్ సెప్టీ అధికారులు పండ్ల గోదాంలపై జరిపిన దాడుల్లో సంచలన విషయాలు బైటపడ్డాయి. తియ్యతియ్యని మామిడిపళ్ల వెనక ఎంతటి విషం దాగుందో తేలిపోయింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01knc9q23mm77enzxbsvp2jx0h,imgname-mango-1775308081268.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;హైదరాబాద్ లో తాజాగా పోలీసులు, ఫుడ్ సెప్టీ అధికారులు పండ్ల గోదాంలపై జరిపిన దాడుల్లో సంచలన విషయాలు బైటపడ్డాయి. తియ్యతియ్యని మామిడిపళ్ల వెనక ఎంతటి విషం దాగుందో తేలిపోయింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వేసవి వచ్చిందంటే చాలు.. నోరూరించే మామిడి పండ్ల కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే ప్రతి పండు సహజంగా పండినది కాదని మీకు తెలుసా..? అధిక లాభాల కోసం వ్యాపారులు రసాయనాలను ఉపయోగించి మామిడి కాయలను బలవంతంగా పండిస్తున్నారు. ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ వాడకంపై నిషేధం ఉన్నప్పటికీ విపరీతంగా వాడుతున్నారు. ఇలా తియ్యతియ్యని మామిడిపండ్లను స్వలాభం కోసం విషంలా మార్చేస్తున్నారు... తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ప్రమాదకమైన దందా బయటపడింది.&lt;/p&gt;&lt;p&gt;ప్రస్తుతం మామిడి కాయల సీజన్ కొనసాగుతోంది... కానీ హైదరాబాద్ లో మామిడి పండ్ల అమ్మకాలు మొదలయ్యాయి. ఇది ఎలా సాధ్యమో తెలుసుకునేందుకు ఫుడ్ సెప్టీ అధికారులతో కలిసి పోలీసులు పలు పండ్ల గోడౌన్లపై దాడి చేశారు. ఈ క్రమంలోనే ప్రమాదకరమైన కెమికల్స్ ని ఉపయోగించి కాయలు మంచి రంగుతో పక్వానికి వచ్చేలా చేస్తున్నారని గుర్తించారు. ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ప్రమాదకరంగా పండ్లను మార్కెట్లోకి తోస్తున్న గోడౌన్స్ ను సీజ్ చేశారు.&lt;/p&gt;&lt;p&gt;కేవలం కార్బైడ్ మాత్రమే కాదు అనేక రసాయనాలను మామిడి కాయలను త్వరగా పండించేందుకు వాడతారు. ఇలాంటి పళ్లను తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. కృత్రిమంగా పక్వానికి వచ్చేలా వాడే రసాయనాలేవి..? ఇలాంటి పళ్లను ఎలా గుర్తించాలి..? తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;కాల్షియం కార్బైడ్ (Calcium Carbide) :&lt;/strong&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;దీనిని సాధారణంగా 'కార్బైడ్' అని పిలుస్తారు. ఇది ఎసిటిలీన్ గ్యాస్&zwnj;ను విడుదల చేయడం ద్వారా కాయను త్వరగా పండించేలా చేస్తుంది. ఇందులో ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి ప్రమాదకర లోహాలు ఉంటాయి.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఇథిలీన్ గ్యాస్/ ఎథెఫోన్ (Ethephon) :&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఇది ద్రవ రూపంలో లభిస్తుంది. పండ్లపై దీనిని స్ప్రే చేయడం ద్వారా లేదా గదుల్లో గ్యాస్ వదలడం ద్వారా పండ్లు పసుపు రంగులోకి మారేలా చేస్తారు. పరిమితి కంటే ఎక్కువ వాడటం వల్ల ఇది విషపూరితంగా మారుతుంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఇతర స్ప్రేలు :&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;పండ్లు నిగనిగలాడుతూ కనిపించడానికి కొన్ని రకాల మైనం (Wax) పూతలు, కృత్రిమ రంగులను కూడా ఉపయోగిస్తుంటారు. ఇవి చూసేందుకు బాగుంటాయి... కానీ లోపల పాడైపోయి ఉంటాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రసాయనాలతో పండిన పండ్లను తినడం వల్ల తక్షణ, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;నాడీ వ్యవస్థపై ప్రభావం :&lt;/strong&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;కాల్షియం కార్బైడ్&zwnj;లోని ఆర్సెనిక్, ఫాస్పరస్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, తల తిరగడం, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;జీర్ణకోశ వ్యాధులు :&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఈ పండ్లను తినడం వల్ల కడుపులో మంట, వికారం, వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;చర్మ, శ్వాసకోశ సమస్యలు :&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;రసాయనాల ప్రభావంతో చర్మంపై దద్దుర్లు రావడం, గొంతులో మంట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;క్యాన్సర్ ముప్పు :&lt;/strong&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;దీర్ఘకాలంలో ఇలాంటి కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాల వ్యాధులతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;రంగు :&lt;/strong&gt;&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;పండు మొత్తం ఒకే రకమైన పసుపు రంగులో ఉండి, లోపల మాత్రం పుల్లగా లేదా పచ్చిగా ఉంటే అది రసాయనాలతో పండినదిగా భావించాలి.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;రుచి :&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;కృత్రిమంగా పండిన పండులో సహజమైన తీపి ఉండదు. తిన్నప్పుడు నోటిలో స్వల్పంగా మంట అనిపించవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;నీటిలో పరీక్ష :&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;&lt;p&gt;ఒక బకెట్ నీటిలో మామిడి పండ్లను వేయండి. సహజంగా పండిన పండు నీటిలో మునుగుతుంది. రసాయనాలతో పండించినవి నీటిపై తేలుతాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మామిడి పండ్లను తినేముందు కనీసం గంటసేపు నీటిలో నానబెట్టి, ఆపై బాగా కడిగి తొక్క తీసి తినడం వల్ల రసాయనాల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. వీలైనంత వరకు విశ్వసనీయమైన రైతుల వద్ద లేదా సేంద్రీయ (Organic) పండ్లను కొనుగోలు చేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.&lt;/p&gt;&lt;p&gt;రుచి కంటే ఆరోగ్యం మిన్న. తళతళలాడే పండ్లను చూసి మోసపోకుండా, జాగ్రత్తలు పాటించి వేసవి మజాను ఆస్వాదించండి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/food-life/are-mangoes-poisoned-shocking-truth-about-chemical-ripening-gc8kklw"/>
        </item>
        <item>
            <title><![CDATA[Hyderabad లో బైక్ ఉంటే చాలు... నెలనెలా ఈజీగా రూ.60,000 సంపాదించవచ్చు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/earn-rs-60000-per-month-with-your-bike-in-hyderabad-best-income-ideas-in-2026-glo9ewo</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/earn-rs-60000-per-month-with-your-bike-in-hyderabad-best-income-ideas-in-2026-glo9ewo</guid>
            <pubDate>Mon, 30 Mar 2026 12:32:14 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;బైక్&zwnj;ను కేవలం వ్యక్తిగత రవాణాకే కాదు పెట్టుబడిగా కూడా వాడుకుని డబ్బులు సంపాదించచ్చు. సరైన ప్లానింగ్&zwnj;తో బైక్ మీకు మంచి ఆదాయ మార్గంగా మారుతుంది. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01keye1s269a05rabbskjbc2a3,imgname-4-1768400413766.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;బైక్&zwnj;ను కేవలం వ్యక్తిగత రవాణాకే కాదు పెట్టుబడిగా కూడా వాడుకుని డబ్బులు సంపాదించచ్చు. సరైన ప్లానింగ్&zwnj;తో బైక్ మీకు మంచి ఆదాయ మార్గంగా మారుతుంది. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ జమానాలో బైక్ కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు, అదొక పెట్టుబడి. మీ దగ్గర ఒక బైక్, చేతిలో స్మార్ట్&zwnj;ఫోన్ ఉంటే చాలు... మీరే బాస్&zwnj;గా మారి మంచి ఆదాయం సంపాదించవచ్చు. ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ, ఇ-కామర్స్ సర్వీసుల ద్వారా నెలకు రూ.40,000 నుంచి రూ.60,000 వరకు పొందవచ్చు.. కమిట్మెంట్ తో పనిచేసుకుంటూ ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నవారు ఉన్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇది చాలా పాపులర్, వెంటనే డబ్బు సంపాదించే మార్గం. Swiggy, Zomato, Zepto, Dunzo, Blinkit లాంటి కంపెనీలు 24 గంటలూ పనిచేస్తాయి. ప్రతి డెలివరీకి డబ్బుతో పాటు, వారం వారం ఇన్సెంటివ్&zwnj;లు కూడా ఇస్తాయి. మధ్యాహ్నం (12 PM - 3 PM), రాత్రి (7 PM - 11 PM) వేళల్లో పనిచేస్తే 'సర్జ్' ఫీజుతో అదనపు ఆదాయం వస్తుంది. వర్షాకాలం, పండగ రోజుల్లో బోనస్ రెట్టింపు అవుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;నగరాల్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండటంతో, ప్రజలు కార్ల కన్నా బైక్&zwnj;లనే ఇష్టపడుతున్నారు. Rapido, Ola, Uber లాంటి యాప్స్ దీనికి బాగా ఉపయోగపడతాయి. ఫుడ్ డెలివరీలా హోటల్ దగ్గర వేచి చూడాల్సిన పనిలేదు. ఒకరిని ఎక్కించుకుని, మరోచోట దింపడం చాలా సులభం. పీక్ అవర్స్&zwnj;లో (ఆఫీస్ వేళలు), సాయంత్రం పూట ఎక్కువ బుకింగ్స్ వస్తాయి. రోజుకు 15-20 రైడ్లు చేస్తే మంచి లాభం చూడొచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Amazon, Flipkart, Delhivery లాంటి కంపెనీలు రోజూ లక్షల కొద్దీ పార్శిళ్లను డెలివరీ చేస్తాయి. ఉదయాన్నే మీ ఏరియాకు సంబంధించిన పార్శిళ్లను తీసుకుని, ఆ రోజులోగా డెలివరీ చేయాలి. ఒకే ఏరియాలో పనిచేయడం వల్ల పెట్రోల్ ఖర్చు ఆదా అవుతుంది. ప్రతి పార్శిల్&zwnj;కు కొంత మొత్తం డబ్బు వస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;స్థానిక దుకాణాలు, మందుల షాపులు, చిన్న రెస్టారెంట్లతో మీరే నేరుగా ఒప్పందం చేసుకోవచ్చు. కొన్ని ఏరియాలోని ఫార్మసీ లేదా బట్టల షాపు వాళ్లు తమ కస్టమర్లకు హోమ్ డెలివరీ చేయడానికి బైక్ రైడర్ కోసం చూస్తుంటారు. మీరు 5 నుంచి 10 షాపులతో టై-అప్ అయితే, వాళ్లకు అవసరమైనప్పుడు పార్శిళ్లు డెలివరీ చేస్తూ నెలకు స్థిరమైన ఆదాయం పొందవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మీ బైక్ వెనుక లేదా పక్కన కంపెనీల యాడ్ బోర్డులు/బాక్సులు పెట్టుకోవడం ద్వారా పాసివ్ ఇన్&zwnj;కమ్ (Passive Income) సంపాదించవచ్చు. కొన్ని స్టార్టప్ కంపెనీలు తమ యాడ్స్&zwnj;ను జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లడానికి బైక్ ఓనర్లకు డబ్బు ఇస్తాయి. మీరు రోజూలాగే బైక్ నడుపుతున్నా, ఈ యాడ్స్ ద్వారా నెలకు అదనంగా ₹2,000 - ₹5,000 వరకు వస్తాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకోవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఉదయం (7 AM - 11 AM):&lt;/strong&gt; బైక్ ట్యాక్సీ లేదా పాలు/కిరాణా డెలివరీ (Zepto/Blinkit).&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;మధ్యాహ్నం (12 PM - 4 PM):&lt;/strong&gt; ఇ-కామర్స్ పార్శిల్ డెలివరీ (Amazon/Flipkart).&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;రాత్రి (7 PM - 11 PM): &lt;/strong&gt;ఫుడ్ డెలివరీ (Swiggy/Zomato).&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;&lt;strong&gt;వాహన నిర్వహణ (Vehicle Maintenance):&lt;/strong&gt; బైక్&zwnj;ను సరిగ్గా సర్వీసింగ్ చేయించడం ముఖ్యం. లేదంటే మెయింటెనెన్స్ ఖర్చులే మీ ఆదాయాన్ని తినేస్తాయి.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఇన్సూరెన్స్ (Insurance): &lt;/strong&gt;కమర్షియల్ అవసరాలకు కావాల్సిన ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;భద్రత (Safety): &lt;/strong&gt;ఎప్పుడూ హెల్మెట్ పెట్టుకుని, నిదానంగా నడపడం మీ ప్రాణాలకే కాదు, మీ సంపాదనకు కూడా రక్షణ.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఇంధన ఆదా (Fuel Efficiency)&lt;/strong&gt;: ఎలక్ట్రిక్ బైక్ (EV) ఉంటే పెట్రోల్ ఖర్చు ఆదా అవుతుంది. దీనివల్ల మీ లాభం 30% వరకు పెరుగుతుంది.&lt;/p&gt;&lt;p&gt;బైక్ కేవలం ఇనుప యంత్రం కాదు, కష్టపడేవారికి అదొక బంగారు గని. టైమ్ మేనేజ్&zwnj;మెంట్, పట్టుదల ఉంటే.. ఏ ఆఫీస్ ఉద్యోగం ఇవ్వలేని స్వేచ్ఛను, ఆదాయాన్ని మీ బైక్ మీకు అందిస్తుంది..!&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/earn-rs-60000-per-month-with-your-bike-in-hyderabad-best-income-ideas-in-2026-glo9ewo"/>
        </item>
        <item>
            <title><![CDATA[Holiday : ఈసారి లాంగ్ వీకెండ్.. వరుసగా మూడ్రోజులు సెలవులే.. ఎందుకో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/long-weekend-alert-3-days-holiday-for-telangana-employees-due-to-basava-jayanti-hhfyf6v</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/long-weekend-alert-3-days-holiday-for-telangana-employees-due-to-basava-jayanti-hhfyf6v</guid>
            <pubDate>Fri, 17 Apr 2026 15:27:16 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Holiday : తెలంగాణలో కొందరు ఉద్యోగులకు వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి. అంటే ఈ వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారనుంది. ఈ సోమవారం ఎందుకు సెలవో తెలుసా..?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01k2y51pq638g4fnvejzgs9w44,imgname-fotojet---2025-08-18t133522.421-1755506072294.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Holiday : తెలంగాణలో కొందరు ఉద్యోగులకు వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి. అంటే ఈ వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారనుంది. ఈ సోమవారం ఎందుకు సెలవో తెలుసా..?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Holidays : తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్... ఈ సారి లాంగ్ వీకెండ్ వస్తోంది. కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి వీకెండ్ లో శని, ఆదివారం రెండ్రోజులు సెలవు ఉంటుంది. ఇలాంటివారు ఈవారం మరో సెలవు అదనంగా పొందవచ్చు... అంటే వరుసగా మూడ్రోజులు సెలవు తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఎక్స్ట్రా సెలవు ఎందుకో తెలుసా..?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఏప్రిల్ 20 అంటే వచ్చే సోమవారం బసవ జయంతి ఉంది... అంటే కర్ణాటకకు చెందిన గొప్ప సంఘసంస్కర్త బసవేశ్వరుడి జన్మదినం. ఆయనను కర్ణాటక ప్రజలే కాదు తెలంగాణ, మహారాష్ట్రలోని వీరశైవ లింగాయత్ లు దేవుడిలా పూజిస్తారు... కాబట్టి ఆయజ జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ రాష్ట్రాల్లో బసవ జయంతికి అధికారిక సెలవు ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;ఈ ఏప్రిల్ 20న బసవ జయంతి ఉంది.. దీంతో తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే ఇది ఐచ్చిక సెలవు... అంటే ముందస్తుగా అనుమతి తీసుకుని వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. ఇలా ఈ సెలవు అందరికి కాదు.. కొందరికి మాత్రమే... కాబట్టి సెలవు పొందేవారికి వరుస సెలవులు కలిసిరానున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు వీకెండ్ లో రెండ్రోజులు (శని, ఆది) సెలవు ఉంటుంది. ఇలాంటివారు సోమవారం కూడా ఆప్షనల్ హాలిడే తీసుకుంటే వరుసగా మూడ్రోజులు సెలవులు కలిసివస్తాయి. ఇలా బసవ జయంతి ఆప్షనల్ హాలిడే తెలంగాణ ఉద్యోగులకు కలిసివస్తుంది.&lt;/p&gt;&lt;p&gt;ఇప్పటికే తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్, టెన్త్ పరీక్షలు ముగియడంతో ఆ క్లాసుల విద్యార్థులు సెలవుల్లో ఉన్నారు. ఇలాంటి పిల్లలుండే పేరెంట్స్ ఈ మూడ్రోజుల సెలవులను బాగా వాడుకోవచ్చు... సరదాగా కుటుంబంతో చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కర్ణాటకలోని బాగేవాడిలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు బసవేశ్వరుడు... చిన్నతనం నుంచే సమాజంలో ఉన్న అసమానతలను ప్రశ్నించారు. జంద్యం ధరించడానికి నిరాకరించి, భక్తి మార్గమే పరమార్థమని నమ్మి కూడల సంగమదేవుని భక్తుడిగా మారారు. కళ్యాణ రాజ్యానికి (నేటి బీదర్ జిల్లా) మంత్రిగా సేవలందిస్తూనే, ఆధ్యాత్మిక విప్లవాన్ని నడిపారు. ఈయన బోధనలతో ఆకర్షితులైనవారే నేటి వీరిశైవ లింగాయతులు.&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/long-weekend-alert-3-days-holiday-for-telangana-employees-due-to-basava-jayanti-hhfyf6v"/>
        </item>
        <item>
            <title><![CDATA[Mangli : సింగర్ మంగ్లీ అరెస్ట్ ఖాయమేనా..?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/folk-singer-mangli-in-trouble-big-scam-allegations-surface-in-hyderabad-nnosu2c</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/folk-singer-mangli-in-trouble-big-scam-allegations-surface-in-hyderabad-nnosu2c</guid>
            <pubDate>Thu, 16 Apr 2026 13:11:14 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్ మంగ్లీ అరెస్ట్ అవుతారా..? &amp;nbsp;అంటే అవుననే ప్రచారం సాగుతోంది. ప్రజలనుండి డబ్బులు వసూలుచేసిన స్కాం వ్యవహారంలో దూకుడు పెంచిన CID విచారణ వేగవంతం చేసింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kpajqa1gftc956rp2ywm5arv,imgname-mangli-1776324159535.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్ మంగ్లీ అరెస్ట్ అవుతారా..? &amp;nbsp;అంటే అవుననే ప్రచారం సాగుతోంది. ప్రజలనుండి డబ్బులు వసూలుచేసిన స్కాం వ్యవహారంలో దూకుడు పెంచిన CID విచారణ వేగవంతం చేసింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Mangli Arrest : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సింగర్ సత్యవతి అలియాస్ మంగ్లీ వ్యవహారం సంచలనంగా మారింది. తెలంగాణ జానపద పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని సినిమా పాటలు పాడే స్థాయికి చేరుకుంది మంగ్లీ. ఇలా సెలబ్రిటీగా మారిన ఆమె తన పేరును అడ్డం పెట్టుకుని భారీ స్కాంకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి... ఆమెపై హైదరాబాద్ లో కేసు కూడా నమోదయ్యింది. ఈ క్రమంలోనే ఏ క్షణంలో అయినా మంగ్లీ అరెస్ట్ అవుతారంటూ ప్రచారం జరుగుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మంగ్లీపై వచ్చిన ఆర్థిక మోసాల ఆరోపణలు వంద కోట్లకు సంబంధించినవి కావడంతో ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఈ కేసు విచారణను CID కి అప్పగించింది. దీంతో ఆరోపణలు వస్తున్నట్లు స్వయంగా ఈ స్కాంలో మంగ్లీ పాల్గొన్నారా..? తెరవెనక ఉండి నడిపించారా..? అనేది తేల్చే పనిలో పడింది సిఐడి. అంతేకాదు ప్రధాన నిందితుడు మధు పరారీలో ఉండగా అతడి కోసం గాలిస్తున్నారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ కేసులో సిఐడి దూకుడుగా ముందుకు వెళుతోంది. ప్రజలను మోసం చేసినట్లు ఏ చిన్న క్లూ దొరికినా మంగ్లీని అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆమెను అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు సేకరిస్తేనే ఈ కేసు విచారణ ఓ కొలిక్కి వస్తుందని CID భావిస్తోంది... అందుకే ఆమె అరెస్ట్ ఖాయమనే ప్రచారం సాగుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సిమెంట్ కంపెనీలో పెట్టుబడులు పెడితే లాబాల్లో వాటా ఇస్తామని చెప్పి హైదరాబాద్ కు చెందిన కొందరు మోసాలకు తెరతీశారు. ఇలా హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్ తో మంగ్లీకి సంబంధాలు ఉన్నాయనేది ప్రధాన ఆరోపణ. ఈ స్కాంలో కీలకమైన రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ పరారీలో ఉన్నారు.&lt;/p&gt;&lt;p&gt;మధు గ్యాంగ్ ప్రజల నుండి రూ.10 కోట్ల నుండి రూ.150 కోట్ల వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్కాంలో మంగ్లీ ప్రమేయం ఉందంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల తరపున హైదరాబాద్ లాయర్ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సింగర్ మంగ్లీతో పాటు ఆమె తమ్ముడు శివ పేరుచెప్పి కొందరు వ్యక్తులు బాధితులను పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించినట్లు సుబ్బారావు ఆరోపిస్తున్నారు. ఇలా అధిక లాభాలు వస్తాయని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేశారంటున్నారు. ఇప్పుడు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బాధితులను బెదిరిస్తున్నారని సుబ్బారావు పోలీసులకు తెలిపారు. అయితే ఈ స్కామ్ ఏ 10, 20 కోట్లది కాదు... ఏకంగా రూ.150 కోట్లదని ప్రచారం జరుగుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తనపై వచ్చిన ఆర్థిక నేరాల ఆరోపణలపై మంగ్లీ కూడా స్పందించారు. పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన ఆమె కౌంటర్ ఫిర్యాదు దాాఖలుచేశారు. ఈ సమయంలో ఆమె మాట్లాడుతూ.. తాను కేవలం పాటలు పాడుకుంటూ కష్టపడి ఈ స్థాయికి వచ్చానని... ఎవరినీ మోసం చేయలేదని చెప్పుకొచ్చారు. కొందరు కావాలనే తనపై బురద చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.&lt;/p&gt;&lt;p&gt;తనపై పోలీసులకు ఫిర్యాదుచేసిన న్యాయవాది సుబ్బారావు రూ.10 లక్షలు డిమాండ్ చేశారని.. డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానని బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో డబ్బు కట్టలతో తన తమ్ముడు ఉన్నట్లుగా ఓ ఫోటో వైరల్ అవుతోంది.. కానీ అందులో ఉన్నది తన తమ్ముడు కాదన్నారు. ఫోటోలను మార్ఫింగ్ చేసి, తప్పుగా చిత్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ స్కాంలో తాను నిందితురాలిని కాదు బాధితురాలినే అంటోంది మంగ్లీ. తన పేరును వాడుకుని ఎవరో మోసాలు చేస్తే తనకేం సంబంధమని అంటున్నారు. నిజానికి తన పేరు చెడగొడుతున్నందుకు తానే బాధితురాలిని అని ఆమె వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. తనకు ఏ స్కాంతో సంబంధాలు లేవన్నారు మంగ్లీ.&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/folk-singer-mangli-in-trouble-big-scam-allegations-surface-in-hyderabad-nnosu2c"/>
        </item>
        <item>
            <title><![CDATA[Snack Tourism : ఈ స్నాక్ టూరిజం ఏమిటి..?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/international/exploring-global-cultures-through-supermarket-snacks-nvxmddg</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/international/exploring-global-cultures-through-supermarket-snacks-nvxmddg</guid>
            <pubDate>Sat, 04 Apr 2026 22:13:06 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ట్రావెల్&zwnj;లో ఇప్పుడు 'స్నాక్ టూరిజం' అనే కొత్త ట్రెండ్ నడుస్తోంది. జపాన్ నుంచి యూకే వరకు, టూరిస్టులు ఇప్పుడు అక్కడి సూపర్ మార్కెట్లకు వెళ్లి స్థానికులు రోజూ తినే ప్యాకేజ్డ్ స్నాక్స్&zwnj;ను టేస్ట్ చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసా..?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kbcy3kb0rdt2k4h5zh78mrfq,imgname-if-you-shop-at-dmart-like-this-you-can-buy-more-things-for-less-money-1764592045408.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ట్రావెల్&zwnj;లో ఇప్పుడు 'స్నాక్ టూరిజం' అనే కొత్త ట్రెండ్ నడుస్తోంది. జపాన్ నుంచి యూకే వరకు, టూరిస్టులు ఇప్పుడు అక్కడి సూపర్ మార్కెట్లకు వెళ్లి స్థానికులు రోజూ తినే ప్యాకేజ్డ్ స్నాక్స్&zwnj;ను టేస్ట్ చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసా..?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ట్రావెల్ అంటే ఇప్పుడు ఫేమస్ ప్రదేశాలు చూడటం, పెద్ద రెస్టారెంట్లలో తినడం మాత్రమే కాదు. 'స్నాక్ టూరిజం' అనే కొత్త ట్రెండ్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. టూరిస్టులు ఇప్పుడు సూపర్ మార్కెట్లు, కన్వీనియన్స్ స్టోర్లకు వెళ్లి, అక్కడి స్థానికులు రోజూ ఏం తింటారో తెలుసుకుంటున్నారు. రెడీ-టు-ఈట్ మీల్స్ నుంచి ప్యాకేజ్డ్ స్నాక్స్ వరకు, ఈ సూపర్ మార్కెట్లే ఆ దేశపు అసలైన ఫుడ్ కల్చర్&zwnj;ను చూపిస్తున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జపాన్&zwnj;లోని కన్వీనియన్స్ స్టోర్ల కల్చర్ వేరే లెవెల్. 7-ఎలెవెన్, లాసన్ లాంటి స్టోర్లు వాటి హై-క్వాలిటీ రెడీ మీల్స్, యూనిక్ స్నాక్స్&zwnj;కు చాలా ఫేమస్.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;**ఏం ట్రై చేయాలి:** ఒనిగిరి, మచా డెజర్ట్స్, సీజనల్ కిట్&zwnj;క్యాట్స్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సౌత్ కొరియా సూపర్ మార్కెట్లు రంగురంగుల, కొత్తరకం స్నాక్స్&zwnj;కు పెట్టింది పేరు. CU, GS25 లాంటి చెయిన్ స్టోర్లు వైరల్ ఫుడ్ ట్రెండ్స్&zwnj;కు హాట్&zwnj;స్పాట్లుగా మారాయి.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;**ఏం ట్రై చేయాలి:** హనీ బటర్ చిప్స్, ఇన్&zwnj;స్టంట్ రామెన్, బనానా మిల్క్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికాలోని సూపర్ మార్కెట్లు రకరకాల కల్చర్లు, ఫుడ్ ప్రిఫరెన్స్&zwnj;లను చూపిస్తాయి. ట్రేడర్ జోస్, హోల్ ఫుడ్స్ మార్కెట్ లాంటి స్టోర్లలో ఆర్గానిక్ స్నాక్స్ నుంచి టేస్టీ ట్రీట్స్ వరకు అన్నీ దొరుకుతాయి.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;**ఏం ట్రై చేయాలి:** గౌర్మెట్ కుకీస్, ఫ్లేవర్డ్ నట్స్, ప్రోటీన్ స్నాక్స్, చిప్స్, క్రాకర్స్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;యునైటెడ్ కింగ్&zwnj;డమ్&zwnj;లోని సూపర్ మార్కెట్లు సంప్రదాయ రుచులను, ఆధునిక కన్వీనియన్స్ ఫుడ్స్&zwnj;ను కలిపి అందిస్తాయి. టెక్సో, మార్క్స్ &amp;amp; స్పెన్సర్ లాంటివి టూరిస్టులకు పాపులర్ స్టాప్స్.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;**ఏం ట్రై చేయాలి:** షార్ట్&zwnj;బ్రెడ్, క్రిస్ప్స్, మీల్ డీల్ స్నాక్స్, ప్రాన్ కాక్&zwnj;టెయిల్ క్రిస్ప్స్, స్కాంపీ ఫ్రైస్, ఫ్రాజిల్స్, ట్విగ్లెట్స్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;థాయ్&zwnj;లాండ్&zwnj;లో ఘాటైన, ప్రత్యేకమైన రుచులతో కూడిన ప్యాకేజ్డ్ స్నాక్స్ చాలా దొరుకుతాయి. బిగ్ సి, లోటస్'స్ లాంటి చెయిన్ స్టోర్లు ఆ దేశ ఫుడ్ కల్చర్&zwnj;ను ప్రతిబింబించే ఎన్నో ఆప్షన్స్&zwnj;తో నిండి ఉంటాయి.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;**ఏం ట్రై చేయాలి:** స్పైసీ చిప్స్, డ్రైడ్ ఫ్రూట్స్, కొబ్బరి స్నాక్స్.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సూపర్ మార్కెట్ స్నాక్ టూరిజం చాలా చవకైనది, సులభమైనది. ఇది టూరిస్టులకు అక్కడి డైనింగ్ ఎక్స్&zwnj;పీరియన్స్&zwnj;ల కన్నా, రోజూవారీ ఫుడ్ కల్చర్&zwnj;ను దగ్గరగా చూపిస్తుంది. అంతేకాదు, లోకల్ ఫేవరెట్ స్నాక్స్&zwnj;ను కొని, జ్ఞాపికగా ఇంటికి తీసుకెళ్లడం కూడా సులభం. నెక్స్ట్ టైమ్ మీరు టూర్&zwnj;కు వెళ్లినప్పుడు, ఓ సూపర్ మార్కెట్&zwnj;లోకి అడుగుపెట్టండి. బహుశా మీరు ఆ ప్రదేశం గురించి వేరే ఎక్కడా తెలుసుకోలేని విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/international/exploring-global-cultures-through-supermarket-snacks-nvxmddg"/>
        </item>
        <item>
            <title><![CDATA[RTC Strike : ఆర్టిసి ఉద్యోగుల సమ్మెకు ప్రధాన కారణాలివే.. ఈ స్ట్రైక్ ఎప్పుడు ముగుస్తుంది..?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/telangana-rtc-strike-2026-key-reasons-employees-demands-and-when-will-the-strike-end-p64gnh6</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/telangana-rtc-strike-2026-key-reasons-employees-demands-and-when-will-the-strike-end-p64gnh6</guid>
            <pubDate>Wed, 22 Apr 2026 10:19:58 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులు, కార్మికుల సమ్మె అర్థరాత్రి నుండి మొదలయ్యింది. అయితే ఈ సమ్మెకు కారణాలేంటి..? ఇది ఎప్పుడు ముగిసే అవకాశాలున్నాయి..? అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాాం.&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kpsr311yecbbm808kf6w2cdx,imgname-rtc-strike-1776833102909.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులు, కార్మికుల సమ్మె అర్థరాత్రి నుండి మొదలయ్యింది. అయితే ఈ సమ్మెకు కారణాలేంటి..? ఇది ఎప్పుడు ముగిసే అవకాశాలున్నాయి..? అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాాం.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Telangana RTC Strike : తెలంగాణలో ఆర్టిసి బస్సులు ఎక్కడిక్కడ ఆగిపోయాయి... ఇవాళ (ఏప్రిల్ 22, బుధవారం) ఉదయం నుండి డిపోలకే పరిమితం అయ్యాయి. ఆర్టిసి ఉద్యోగులు, కార్మికులు అర్థరాత్రి నుండి సమ్మెకు దిగడంతో బస్సులు కదలక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉదయమే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగాలు, పనులకు వెళ్లే కార్మికులు అవస్థలు పడుతున్నారు. సమ్మె గురించి తెలియని ప్రయాణికులు బస్టాండ్&zwnj;లకు చేరుకుని పడిగాపులు కాస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) లో వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం వీళ్లంతా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపబడటం లేదు. ఆర్టిసి ప్రభుత్వ రంగ రవాణా సంస్ధే అయినప్పటికి ఇందులో పనిచేసేవారిని మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడమే తాజా సమ్మెకు ప్రధాన కారణం.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని... తమకు అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే సౌకర్యాలు కల్పించాలని ఆర్టిసి ఉద్యోగులు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆర్టిసి ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది.. కానీ ఇప్పటివరకు ఈ హామీ నెరవేరలేదు. దీంతో ఆర్టిసిని వెంటనే ప్రభుత్వంలో కలిపేయాలనే ప్రధాన డిమాండ్ తో ఉద్యోగులు సమ్మెబాట పట్టారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులు ప్రభుత్వం ముందు 32 డిమాండ్లు ఉంచారు. వీటన్నింటికి అంగీకరిస్తేనే సమ్మెను విరమిస్తామని తేల్చి చెబుతున్నారు. ఇందులో ప్రధానమైనది ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్. మిగతా డిమాండ్లు ఇవే...&lt;/p&gt;&lt;ul&gt; &lt;li&gt;వేతన సవరణ చేపట్టాలి. అంటే ప్రస్తుతం జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో అందుకు తగినట్లుగా శాలరీలు పెంచాలని ఆర్టిసి ఉద్యోగులు కోరుతున్నారు. ఇతర విభాగాల్లోని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకు అలవెన్సులు, ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.&lt;/li&gt; &lt;li&gt;పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి. గతంలో ఇచ్చిన హామీల మేరకు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని... ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.&lt;/li&gt; &lt;li&gt;తెలంగాణ ఆర్టిసిలో ప్రస్తుతం భారీగా ఖాళీలున్నాయి... వాటిని వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రతి ఏడాది భారీగా ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు.. అందుకు తగినట్లుగా నియామకాలు మాత్రం జరగడం లేదు అనేది ఉద్యోగుల వాదన. దీంతో ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని అంటున్నారు. కాబట్టి వెంటనే ఖాళీలను భర్తీ చేసి ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారు.&lt;/li&gt; &lt;li&gt;కారుణ్య నియామకాలు చేపట్టాలి. ఆర్టిసి ఉద్యోగులు విధుల్లో ఉండగా మరణిస్తే వారి కుటుంబసభ్యులకు యాజమాన్యం అండగా ఉండాలని కోరుతున్నారు. ఆర్థిక సాయంతో పాటు కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరుతున్నారు.&lt;/li&gt; &lt;li&gt;కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ చేయాలి, కేవలం 8 గంటల పనిని అమలుచేయాలి, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి, అద్దె బస్సులను తగ్గించి సొంత బస్సులనే నడపాలి, మహాలక్ష్మి పథకం బకాయిలను వెంటవెంటనే అందివ్వాలి... ఇలా అనేక డిమాండ్లతో ఆర్టిసి ఉద్యోగులు సమ్మె చేపట్టారు.&lt;/li&gt;&lt;/ul&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులు సమ్మె విరమించాలని ప్రభుత్వం కోరుతోంది... వారి అన్ని డిమాండ్లకు సానుకూలంగానే ఉన్నామంటోంది. అయితే ఉద్యోగులు మాత్రం తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంలేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రతినిధులు, ఆర్టిసి ఉద్యోగులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి... అందువల్లే ఇవాళ అర్థరాత్రి నుండి సమ్మె ప్రారంభమయ్యింది... ఆర్టిసి బస్సులు నిలిచిపోయాయి.&lt;/p&gt;&lt;p&gt;అయితే ఆర్టిసి ఉద్యోగులకు చర్చించేందుకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఆర్టిసి జేఏపి నాయకులతో ఇవాళ (ఏప్రిల్ 22న) మరోసారి చర్చలు జరపనుంది. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించినా... ప్రభుత్వ హామీలకు ఉద్యోగులు సానుకూలంగా స్పందించినా సమ్మె ముగుస్తుంది. కానీ ఈసారి కూడా చర్చలు విఫలమైతే మాత్రం సమ్మె కొనసాగుతుంది... అలాంటప్పుడు ఎన్నిరోజులు ఆర్టిసి బస్సులు డిపోలకే పరిమితం అవుతాయో చెప్పలేం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆర్టిసి ఉద్యోగుల సమ్మెతో బస్సులు నడవకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది... అద్దె బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ లోని ప్రధాన బస్టాండ్ల నుండి ఈ బస్సులు నడుస్తున్నాయి. అయితే ఈ అద్దె బస్సులను ఆర్టీసీ జేఏసీ అడ్డుకోకుండా భారీగా పోలీసులను మోహరించింది. అంతేకాదు ప్రధాన బస్టాండ్ల వద్ద ఆర్టిసి కార్మికులు చేపడుతున్న ఆందోళనలు అవాంఛనీయ ఘటనలకు దారితీయకుండా పోలిస్ బందోబస్తు చేపట్టింది.&lt;/p&gt;&lt;p&gt;ఆర్టిసి సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ రవాణా వాహనాలను డిమాండ్ పెరిగింది. దీంతో సెట్విన్ బస్సులు, ఆటో డ్రైవర్లు ప్రయాణికుల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక ర్యాపిడో, ఓలా, ఊబర్ వంటి ఆన్లైన్ ట్యాక్సీ ల డిమాండ్ పెరగడంతో ఆటోమెటిగ్గా ధరలు కూడా పెరిగాయి. మెట్రో, ఎంఎంటిఎస్ రైళ్లలో రద్దీ పెరిగింది. ఆర్టిసి సమ్మె ముగిసేవరకు ప్రయాణికులు ఈ తిప్పలు తప్పవు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/telangana-rtc-strike-2026-key-reasons-employees-demands-and-when-will-the-strike-end-p64gnh6"/>
        </item>
        <item>
            <title><![CDATA[Railway Jobs : తెలుగు యువతకు బంపరాఫర్... పదో తరగతి పాసైతే చాలు ప్రభుత్వ ఉద్యోగం]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/jobs/rrb-alp-notification-2026-apply-for-11127-assistant-loco-pilot-posts-qgiwdn9</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/jobs/rrb-alp-notification-2026-apply-for-11127-assistant-loco-pilot-posts-qgiwdn9</guid>
            <pubDate>Sat, 28 Mar 2026 14:10:33 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;రైల్వే రిక్రూట్&zwnj;మెంట్ బోర్డ్ (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 11,127 ఖాళీలను భర్తీ చేయనుంది. పదో తరగతి పాసై, ఐటీఐ లేదా డిప్లొమా చేసిన 18-30 ఏళ్ల యువత ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01k6pz83f5r8ben7ph7h12tyk9,imgname-rrb-alp-dv-medical-exam-date-2025-1759560076773.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;రైల్వే రిక్రూట్&zwnj;మెంట్ బోర్డ్ (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 11,127 ఖాళీలను భర్తీ చేయనుంది. పదో తరగతి పాసై, ఐటీఐ లేదా డిప్లొమా చేసిన 18-30 ఏళ్ల యువత ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;RRB Notification 2026 : భారతీయ రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే తెలుగు యువతకు ఇది బంపర్ ఆఫర్. రైల్వే రిక్రూట్&zwnj;మెంట్ బోర్డ్ (RRB) ఏకంగా 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పలు జోన్లలో ఈ నియామకాలు జరగనున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ రిక్రూట్&zwnj;మెంట్&zwnj;ను దేశంలోని 21 రైల్వే జోన్లలో చేపట్టనున్నారు. మన సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో కూడి 674 పోస్టులు ఉన్నయి. అలాగే చెన్నై, బెంగళూరుతో పాటు ముంబై వంటి నగరాల్లో కూడా వందలాది పోస్టులు ఉన్నాయి. ఖాళీలు ఎక్కువగా ఉండటంతో, పోటీ ఉన్నప్పటికీ ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ పోస్టులకు అప్లై చేయాలంటే కనీసం పదో తరగతి పాసై ఉండాలి. దానితో పాటు సంబంధిత ట్రేడ్&zwnj;లో ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అప్లికేషన్ ప్రక్రియ మొత్తం ఆన్&zwnj;లైన్&zwnj;లోనే ఉంటుంది. మే 15న దరఖాస్తులు మొదలవుతాయి, జూన్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ప్రారంభంలో నెలకు రూ.19,900 జీతం ఇస్తారు. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సెలక్షన్ ప్రాసెస్&zwnj;లో పలు దశలు ఉంటాయి. ముందుగా CBT-1, CBT-2 అనే రెండు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటాయి. ఈ అన్ని దశల్లో పాసైన వారిని ఫైనల్&zwnj;గా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు త్వరలో వెలువడే అధికారిక నోటిఫికేషన్&zwnj;లో ఉంటాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/jobs/rrb-alp-notification-2026-apply-for-11127-assistant-loco-pilot-posts-qgiwdn9"/>
        </item>
        <item>
            <title><![CDATA[Heat Wave Alert : ఈ ఎండలు ట్రైలర్ మాత్రమే... ఇకపైనే అసలు సినిమా.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/red-alert-in-telangana-scorching-temperatures-to-hit-45-degrees-in-these-districts-t6a762p</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/red-alert-in-telangana-scorching-temperatures-to-hit-45-degrees-in-these-districts-t6a762p</guid>
            <pubDate>Thu, 23 Apr 2026 11:19:33 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Telangana Weather : తెలంగాణలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి.. అయితే ఏప్రిల్ 24 నుండి ఇవి పీక్స్ కు చేరుకుంటాయని వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు&hellip; కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kpwdvqzpzbdsdzxwcbxnrha9,imgname-summer-1776923041782.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Telangana Weather : తెలంగాణలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి.. అయితే ఏప్రిల్ 24 నుండి ఇవి పీక్స్ కు చేరుకుంటాయని వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు&hellip; కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;Heat Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. అన్నిచోట్లా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... ఈ ఎండలు, వడగాలులు, ఉక్కపోత తెలుగు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే ఈ ఎండలు కేవలం ట్రైలర్ మాత్రమే... అసలుసిసలైన వేసవి సినిమా ముందుంది అనేలా తెలంగాణ వెదర్ మ్యాన్ కీలక ప్రకటన చేశారు. రేపట్నుంచి అంటే ఏప్రిల్ 24 (శుక్రవారం) నుండి భానుడి భగభగలు మరింత పెరుగుతాయంటూ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణలో ఎండలు మరింత ముదరనున్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. ముఖ్యంగా ఏప్రిల్ 24 నుండి 29 వరకు ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుందని... ఈ వేసవిలో ఇప్పటివరకు నమోదుకాని అత్యధిక ఉష్ణోగ్రతలుంటాయని హెచ్చరించారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలు అగ్నిగుండంలా మారే అవకాశాలున్నాయి... కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.&lt;/p&gt;&lt;p&gt;తెలంగాణ వెదర్ మ్యాన్ టెంపరేచర్స్ ఆధారంగా మూడు అలర్ట్ జారీ చేశారు. 43-45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రలు నమోదయ్యే జిల్లాలకు రెడ్ అలర్ట్... 42 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్... కాస్త తక్కువగా అంటే 41 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాలపై సూర్యుడి ప్రతాపం కొనసాగుతోంది. రేపట్నుంచి ఈ ఎండలు తారాస్ధాయికి చేరతాయట. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, గద్వాల, వనపర్తి జిల్లాల్లో 43 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయంటున్నారు వెదర్ మ్యాన్. అందుకే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వెదర్ మ్యాన్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు... అంటే ఇక్కడ 42 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నమాట. ఇలా కామారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఎండలు మండిపోతాయని హెచ్చరించారు. ఈ జిల్లాల ప్రజలు ఎండలు, వడగాలుల భారీనుండి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రాజధాని హైదరాబాద్ తో పాటు పశ్చిమ తెలంగాణ జిల్లాలకు ఈ ఎండలు కాస్త ఊరటనివ్వనున్నాయని వెదర్ మ్యాన్ చెబుతున్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే ఉంటాయి... 41 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెదర్ మ్యాన్ తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.&lt;/p&gt;&lt;p&gt;RED ALERT FOR NORTH TELANGANA ⚠️Dear people of Telangana, get ready for SEVERE HEATWAVE 2.0 from tomorrow with temperatures to touch 45&deg;C in RED MARKED districts during April 24-29 ⚠️Orange marked districts temperatures to cross 43-44&deg;C during mentioned periodHyderabad&hellip; pic.twitter.com/6AYdwOyKS7&lt;/p&gt;&lt;p&gt;&mdash; Telangana Weatherman (@balaji25_t) April 23, 2026&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణలో ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియజేసే సమాచారాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ (ఏప్రిల్ 23, గురువారం) ఉదయమే ఆదిలాబాద్ లో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక నిజామాబాద్ లో 41.8, రామగుండంలో 41.2, మెదక్ లో 40.9, ఖమ్మంలో 40.8, మహబూబ్ నగర్ లో 40.6, భద్రాచలంలో 40.6 . నల్గొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ హకీంపేటలో 39.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.&lt;/p&gt;&lt;p&gt;REALISED WEATHER OVER TELANGANA DATED: 23.04.2026 pic.twitter.com/nqn7qACyHh&lt;/p&gt;&lt;p&gt;&mdash; Meteorological Centre, Hyderabad (@metcentrehyd) April 23, 2026&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/red-alert-in-telangana-scorching-temperatures-to-hit-45-degrees-in-these-districts-t6a762p"/>
        </item>
        <item>
            <title><![CDATA[KIMS Hospital : ఒకటి రెండు కాదు మూడుసార్లు గుండె ఆగింది.. అయినా ప్రాణాలతో బయటపడ్డ మహిళ]]></title>
            <link>https://telugu.asianetnews.com/andhra-pradesh/kims-hospital-miracle-woman-survives-three-cardiac-arrests-in-visakhapatnam-articleshow-tpy68xk</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/andhra-pradesh/kims-hospital-miracle-woman-survives-three-cardiac-arrests-in-visakhapatnam-articleshow-tpy68xk</guid>
            <pubDate>Fri, 10 Apr 2026 14:40:38 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు గుండె ఆగిపోయింది&hellip; అయినప్పటికీ ఆ మహిళ ప్రాణాలు కాపాడారు కిమ్స్ వైద్యులు. ఈ ఘటనతో విశాఖపట్నం కిమ్స్ హాస్పిటల్, అక్కడి వైద్యులు వార్తల్లో నిలిచారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01knvadga1bjjxwrtf4zq0t5qb,imgname-nursing-1775812133181.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;విశాఖపట్నం సీతమ్మధారలోని కిమ్స్ (KIMS) ఆసుపత్రి వైద్యులు అసాధారణమైన ఆపరేషన్ చేశారు. చికిత్స పొందుతున్న సమయంలో మూడుసార్లు కార్డియాక్ అరెస్ట్ కు గురైన 62 ఏళ్ల వృద్ధురాలిని అత్యవసర వైద్యం, నిరంతర పర్యవేక్షణతో ప్రాణాపాయం నుండి తప్పించారు. ఐసీయూ నిపుణులు, మల్టీడిసిప్లినరీ వైద్య బృందం సమన్వయంతో ఈ అరుదైన విజయం సాధ్యమైంది.&lt;/p&gt;&lt;p&gt;ఐసీయూ చీఫ్ డాక్టర్ ఐ. రామకృష్ణ, ఫిజీషియన్ డాక్టర్ బి.వి.ఎన్. రావు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంకు చెందిన ఒక మధుమేహ రోగి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విరేచనాలు, ఆహారం తీసుకోలేకపోవడం వంటి సమస్యలతో జనవరి 21న ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆసుపత్రికి వచ్చే సమయానికే 'షాక్' స్థితిలో ఉండటంతో వెంటనే 'నొరాడ్రినలిన్' సపోర్ట్ అందించారు.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;వైద్య పరీక్షలు :&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;హిమోగ్లోబిన్ : 6.4 g/dL&lt;/p&gt;&lt;p&gt;క్రియేటినిన్ : 3.2 mg/dL&lt;/p&gt;&lt;p&gt;NT-proBNP : 30,000 కంటే ఎక్కువ&lt;/p&gt;&lt;p&gt;2D ఎకో : గుండె కండరాల కదలికల్లో లోపాలు, ఎజెక్షన్ ఫ్రాక్షన్ (EF) సుమారు 47% గా నమోదైంది.&lt;/p&gt;&lt;p&gt;సుమారు 48 గంటల నిలకడ తర్వాత రక్తపోటు మెరుగుపడటంతో అసలు సమస్యను గుర్తించడానికి వైద్యులు ఎండోస్కోపీ నిర్వహించారు. అయితే ఆ సమయంలో ఆమెకు 'వెంట్రిక్యులర్ టాచీకార్డియా' (VT) ఏర్పడి ఒక్కసారిగా గుండె ఆగిపోయింది. వైద్యులు వెంటనే సీపీఆర్ (CPR), డిఫిబ్రిలేషన్ ద్వారా ఆమెను కాపాడారు.&lt;/p&gt;&lt;p&gt;అయితే కష్టాలు అక్కడితో ఆగలేదు. ఐసీయూకి తరలించిన తర్వాత ఆమెకు రెండోసారి కార్డియాక్ అరెస్ట్ అయ్యింది, అప్పుడు కూడా వైద్యులు ఆమెను కాపాడారు. రెండు రోజుల తర్వాత మూడోసారి కూడా గుండె ఆగిపోగా, ఎమర్జెన్సీ షాక్ ట్రీట్&zwnj;మెంట్ ఇచ్చి ఆమె పరిస్థితిని నిలకడగా మార్చారు.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;చికిత్సలో సవాళ్లు..&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;ఇన్నిసార్లు గుండె ఆగిపోయినా సదరు మహిళ స్పృహతో ఉండటం, వైద్యుల సూచనలకు స్పందించడం అసాధారణమని వైద్యులు పేర్కొన్నారు. వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉన్న సమయంలో ఆమెకు కిడ్నీ పనితీరు దెబ్బతినడంతో డయాలసిస్ చేయాల్సి వచ్చింది. అలాగే ఎడమ ఊపిరితిత్తులు కుచించుకుపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.&lt;/p&gt;&lt;p&gt;శ్వాస తీసుకోవడం సులభతరం చేసేందుకు వైద్యులు 'ట్రాకియోస్టమీ' నిర్వహించారు. ఆ తర్వాత శ్వాసకోశ కండరాలకు వ్యాయామం, ఇన్&zwnj;ఫెక్షన్ నియంత్రణ చర్యల ద్వారా క్రమంగా ఆమె వెంటిలేటర్ సాయం లేకుండా సొంతంగా శ్వాస తీసుకునేలా చేశారు. పరిస్థితి పూర్తిగా మెరుగుపడిన తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు.&lt;/p&gt;&lt;p&gt;&quot;పట్టుదల, టీమ్ వర్క్, సరైన సమయంలో స్పందించడం వల్లనే ఈ విజయం సాధ్యమైంది. ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ వైద్య సిబ్బంది సానుకూల ఫలితం కోసం కృషి చేశారు&quot; అని వైద్యులు తెలిపారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ చికిత్సలో కార్డియాలజిస్ట్ డాక్టర్ మహేష్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు డాక్టర్ చలపతిరావు, డాక్టర్ శ్రీనివాస్, నెఫ్రాలజిస్టులు డాక్టర్ ఆర్.కె. మహేష్, డాక్టర్ చరణ్, పల్మనాలజిస్ట్ డాక్టర్ భరత్, ఈఎన్టీ సర్జన్ డాక్టర్ దిలీప్, న్యూరాలజిస్ట్ డాక్టర్ రోహిత్, ఐసీయూ వైద్యులు డాక్టర్ గంగాధర్, డాక్టర్ కౌసల్య, డాక్టర్ రమ్య, డాక్టర్ మోహన్ సాయి, అనస్థీషియా బృందం పాల్గొన్నారు.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/andhra-pradesh/kims-hospital-miracle-woman-survives-three-cardiac-arrests-in-visakhapatnam-articleshow-tpy68xk"/>
        </item>
        <item>
            <title><![CDATA[Amaravati or Amaravathi : ఏపీ రాజధాని పేరును ఇంగ్లీష్ లో ఎలా రాయాలో తెలుసా..?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/amaravati-or-amaravathi-ap-government-clarifies-official-capital-spelling-u8h4bc1</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/amaravati-or-amaravathi-ap-government-clarifies-official-capital-spelling-u8h4bc1</guid>
            <pubDate>Wed, 15 Apr 2026 16:26:55 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పేరును ఇంగ్లీష్ లో ఎలా రాయాలి&hellip;? తాజాగా కూటమి ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. Amaravati or Amaravathi&hellip; ఏది కరెక్టో తెలుసా..? &amp;nbsp;&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01dz8tbh4kj0qxk7v99d20q029,imgname-amarava-jpg.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పేరును ఇంగ్లీష్ లో ఎలా రాయాలి&hellip;? తాజాగా కూటమి ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. Amaravati or Amaravathi&hellip; ఏది కరెక్టో తెలుసా..? &amp;nbsp;&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రజల్లో చాలా అనుమానాలున్నాయి... అన్నింటిపై క్లారిటీ ఇస్తోంది కూటమి ప్రభుత్వం. గత వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల పేరిట హడావిడి చేసిన నేపథ్యంలో ప్రజల్లో ఓ కన్ఫ్యూజన్ మొదలయ్యింది. మళ్లీ వైసిపి అధికారంలోకి వస్తే ఎక్కడ రాజధానిని మారుస్తుందో అనే అనుమానాలున్నాయి. దీనిపై క్లారిటీ ఇస్తూ అమరావతికి చట్టబద్దత కల్పించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... పార్లమెంట్ ఆమోదం, గెజిట్ విడుదలతో రాజధాని అమరావతికి చట్టబద్దత లభించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇలా రాజధాని నిర్మాణంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన కూటమి తాజాగా అమరావతి పేరుపైనా క్లారిటీ ఇచ్చింది. తెలుగులో ఓకే కానీ ఇంగ్లీష్ లో అమరావతి పేరు రాసేటప్పుడు కన్ఫ్యూజన్ ఉంటోంది... దీంతో అధికారిక వ్యవహారాల్లోనే కొన్నిసార్లు Amaravati అని... మరికొన్నిసార్లు Amaravathi అని పేర్కొంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ను తాజాగా ఫుల్ స్టాప్ పెట్టేసింది సర్కారు.&lt;/p&gt;&lt;p&gt;ఇకపై రాజధాని పేరును ఇంగ్లీష్ లో Amaravati అని మాత్రమే పేర్కొనాలని కూటమి ప్రభుత్వం సూచిస్తోంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక ప్రభుత్వం పైళ్లు, జీవోలు, అధికారిక పత్రాల్లో కచ్చితంగా 'Amaravati' అని మాత్రమే పేర్కొనాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఆదేశించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన అనంతరం హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా మారిపోయింది. ఏపీ నూతన రాజధానిని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విజయవాడ, గుంటూరు సమీపంలో కొత్తగా ఓ నగరాన్నే నిర్మిస్తోంది ప్రభుత్వం... కృష్ణా నది ఒడ్డునగల ఈ నగరానికి దేవతల రాజధాని అమరావతి పేరు పెట్టారు.&lt;/p&gt;&lt;p&gt;రాజధాని అమరావతి నిర్మాణం కోసం 29 గ్రామాలకు చెందిన దాదాపు 28 వేల మంది రైతులు తమ 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చారు. ఇది ప్రపంచ చరిత్రలోనే భూసేకరణలో అతిపెద్ద స్వచ్ఛంద ఉద్యమంగా నిలిచింది. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా ఎదగనుందని టిడిపి, జనసేన, బిజెపి నాయకులు చెబుతున్నారు. పర్యాటక రంగంలోనూ ఆంధ్రప్రదేశ్&zwnj;కు కొత్త గుర్తింపును తీసుకువస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఏపీ నూతన రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు.. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ఒక వినూత్న 'పీపుల్స్ క్యాపిటల్'. కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా థీమ్ నగరాలుగా విభజించారు. అవి..&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;నాలెడ్జ్ సిటీ :&lt;/strong&gt; విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాల కోసం.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;జస్టిస్ సిటీ&lt;/strong&gt; : హైకోర్టు, న్యాయ సంబంధిత సంస్థల కోసం.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;ఫైనాన్షియల్ సిటీ &lt;/strong&gt;: బ్యాంకింగ్, వాణిజ్య కేంద్రంగా.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;హెల్త్ సిటీ :&lt;/strong&gt; అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రుల కోసం.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;గవర్నమెంట్ సిటీ&lt;/strong&gt; : సచివాలయం, అసెంబ్లీ, రాజ్&zwnj;భవన్ కోసం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమరావతిలో కొన్ని నిర్మాణాలు ప్రపంచ స్థాయి ఆకర్షణలుగా నిలవనున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;అసెంబ్లీ భవనం &lt;/strong&gt;: బౌద్ధ స్తూపాన్ని పోలి ఉండే విధంగా, ఆకాశాన్ని తాకే శిఖరంతో దీని డిజైన్ రూపొందించబడింది.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;హైకోర్టు :&lt;/strong&gt; బౌద్ధ చైతన్యాన్ని ప్రతిబింబిస్తూ 'డైమండ్' ఆకారంలో దీనిని డిజైన్ చేశారు.&lt;/p&gt;&lt;p&gt;&lt;strong&gt;సెక్రటేరియట్ టవర్స్ &lt;/strong&gt;: అత్యాధునిక సాంకేతికతతో, గాలి పటాల ఆకారంలో ఎత్తైన భవనాలను నిర్మిస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/andhra-pradesh/amaravati-or-amaravathi-ap-government-clarifies-official-capital-spelling-u8h4bc1"/>
        </item>
        <item>
            <title><![CDATA[IMD Rain Alert : ఈ వీకెండ్ హైదరాబాద్ లో కూల్ కూల్ వెదర్.. ఈ జిల్లాల్లో రెండుమూడు రోజులు వర్షాలే]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/telangana/imd-rain-alert-weekend-showers-to-cool-hyderabad-rain-likely-for-3-days-in-telangana-uggpmqg</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/telangana/imd-rain-alert-weekend-showers-to-cool-hyderabad-rain-likely-for-3-days-in-telangana-uggpmqg</guid>
            <pubDate>Fri, 17 Apr 2026 10:18:18 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Weather Updates : తెలంగాణ ప్రజలకు ఎండలనుండి ఉపశమనం లభించనుంది. రాబోయే రెండుమూడు రోజులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01knds8w34zxderfy8e77w0egc,imgname-delhi-ncr-weather-alert-rain-hailstorm-thunderstorm-western-disturbance-imd-warning-wind-speed-storm-india-4-1775357948004.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Weather Updates : తెలంగాణ ప్రజలకు ఎండలనుండి ఉపశమనం లభించనుంది. రాబోయే రెండుమూడు రోజులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;IMD Rain Alert : తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ప్రస్తుతం ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి... ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ఏ స్థాయిలో ఎండలున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎండలకు వడగాలులు, ఉక్కపోత తోడవడంతో ప్రజలు మరింత ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి సమయంలో వర్షాలు కురిస్తే... వాతావరణం చల్లబడి ఎండల నుండి ఉపశమనం లభించనుంది. రేపట్నుంచి (ఏప్రిల్ 18, శనివారం) ఇదే జరగనుంది అంటున్నారు వాతావరణ నిపుణులు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణలో ఏప్రిల్ 18 నుండి వర్షాలు మొదలవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా ప్రకారం... ఏప్రిల్ 18 లేదా 19న హైదరాబాద్ శివారుజిల్లాలు రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ లో వర్షాలు కురుస్తాయట. ఈ వర్షాలు క్రమంగా తెలంగాణవ్యాప్తంగా విస్తరిస్తాయని... ఏప్రిల్ 20-24 వరకు కొనసాగుతాయని ప్రకటించారు. సాయంత్రం, రాత్రి సమయాల్లో వర్షాలు కురిసి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ తెలిపారు. నగరంలో ఏప్రిల్ 19 నుండి 23 వరకు వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు తెలిపారు. ఈ వర్షాల కారణంగా మధ్యాహ్నం ఎండల తీవ్రత కూడా కాస్త తగ్గుతాయట... అంటే నగరవాసులకు కూడా ఎండల నుండి కాస్త ఉపశమనం లభించనుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఏప్రిల్ 20 (సోమవారం) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం,వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాల సమయంలో ఈదురుగాలులు, పిడుగుల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి.. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తెలంగాణలో ఈ రెండ్రోజులు అంటే శుక్ర, శనివారం (ఏప్రిల్ 17,18) పొడి వాతావరణమే ఉంటుందని... ఎండలు మండిపోతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్నిచోట్ల 41 నుండి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. అయితే వర్షాలు మొదలయితే ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి ఎండల నుండి ఉపశమనం లభించనుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఇవాళ (శుక్రవారం) మండుటెండలు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠంగా 43&deg;C - 44.5&deg;C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందంట. మొత్తంగా 28 మండలాల్లో ఇవాళ తీవ్ర వడగాలులు, 37 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;ఈ మండుటెండలు, వడగాలుల కారణంగా వడదెబ్బ తగిలే అవకాశాలుంటాయి.. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటపుడు టోపీ ధరించడం, గొడుగు వాడటం మంచిది... మంచినీరు ఎక్కువగా తాగి శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/telangana/imd-rain-alert-weekend-showers-to-cool-hyderabad-rain-likely-for-3-days-in-telangana-uggpmqg"/>
        </item>
        <item>
            <title><![CDATA[Gas Cylinder : ఇక బుకింగ్ లేకుండానే గ్యాస్ సిలిండర్.. మీరు నేరుగా వెళ్లి తెచ్చుకోవచ్చు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/national/indian-oil-launches-chhotu-5kg-cylinder-for-instant-purchase-without-booking-w58ldci</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/national/indian-oil-launches-chhotu-5kg-cylinder-for-instant-purchase-without-booking-w58ldci</guid>
            <pubDate>Tue, 31 Mar 2026 14:53:16 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన చమురు, గ్యాస్ సంక్షోభంగా నిపుణులు భావిస్తున్నారు. భారతదేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత కొనసాగుతోంది.. దీనికి పరిష్కారం ఏంటో తెలుసా..?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kn1gy2kyzck85rbw0jq6exae,imgname-gas-1774946552446.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన చమురు, గ్యాస్ సంక్షోభంగా నిపుణులు భావిస్తున్నారు. భారతదేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత కొనసాగుతోంది.. దీనికి పరిష్కారం ఏంటో తెలుసా..?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరాను దెబ్బతీసింది. దీనివల్ల భారత్&zwnj;లో ఎల్పీజీ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎందుకంటే భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 60% దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 90% హార్ముజ్ జలసంధి నుంచే వస్తుంది. అయితే హార్ముజ్ జలసంధిలో నౌకల రవాణా నిలిచిపోవడంతో, సరఫరా వ్యవస్థ దెబ్బతింది. దీంతో దేశంలోని చాలా నగరాల్లో ఎల్పీజీ కొరత ఏర్పడి, గ్యాస్ ఏజెన్సీల ముందు జనం బారులు తీరుతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇలా ఇంటి అవసరాలకు ఎలాంటి గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ఒక సులభమైన పరిష్కారాన్ని ముందుకు తెచ్చింది. ఎల్పీజీ సిలిండర్ల కోసం ఇబ్బంది పడుతున్న వారి కోసం 5 కిలోల చిన్న సిలిండర్&zwnj;ను అందుబాటులోకి తెచ్చింది. దీనికి ఎలాంటి ముందస్తు బుకింగ్ అవసరం లేదు, ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పని కూడా లేదు. నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి సులభంగా కొనుక్కోవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఐఓసీ (IOC) తన సోషల్ మీడియా పోస్ట్&zwnj;లో ఇలా పేర్కొంది: &ldquo;వెంటనే, వెయిటింగ్ లేకుండా ఎల్పీజీ కావాలా? అయితే చోటూని కలవండి. ఇండేన్ 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్, మీకు దగ్గర్లోని ఏ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలోనైనా లభిస్తుంది. ఇది చిన్నది, సౌకర్యవంతమైనది, సులభంగా దొరుకుతుంది. ఆలస్యం లేకుండా వంట చేసుకోవడానికి ఇది నమ్మకమైన తోడుగా ఉంటుంది. సైజులో చిన్నది, కానీ సౌకర్యంలో పెద్దది&rdquo; అని తెలిపింది.&lt;/p&gt;&lt;p&gt;Need a quick LPG solution without the wait?Meet Chhotu &mdash; the handy 5 kg free trade LPG cylinder from Indane, available at Indane Gas Agencies near you. Compact, convenient, and easy to access, it is designed for moments when you need a dependable cooking companion without&hellip; pic.twitter.com/SjFqUqNDLO&lt;/p&gt;&lt;p&gt;&mdash; Indian Oil Corp Ltd (@IndianOilcl) March 30, 2026&lt;/p&gt;&lt;img&gt;&lt;ul&gt; &lt;li&gt;చోటూ సిలిండర్&zwnj;కు ముందస్తు బుకింగ్ అవసరం లేదు.&lt;/li&gt; &lt;li&gt;5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలలో అందుబాటులో ఉంటుంది.&lt;/li&gt; &lt;li&gt;చిరునామా ప్రూఫ్ అవసరం లేదు, గుర్తింపు కార్డు ఉంటే చాలు.&lt;/li&gt; &lt;li&gt;కిరాణా దుకాణాలు, అధీకృత విక్రయ కేంద్రాల్లో కూడా రీఫిల్ చేసుకోవచ్చు.&lt;/li&gt;&lt;/ul&gt;&lt;p&gt;చోటూ సిలిండర్ 'ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ' (FTL) విభాగంలోకి వస్తుందని కంపెనీ చెబుతోంది. సాధారణ గృహ వినియోగ కనెక్షన్లతో ఉన్న ఇబ్బందులను ఇది పరిష్కరిస్తుంది. ఈ సిలిండర్ కొనడానికి కేవలం గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. చిరునామా ప్రూఫ్ అడగరు. అంతేకాదు, రీఫిల్ కోసం ఒకే డిస్ట్రిబ్యూటర్&zwnj; వద్దకు వెళ్లాల్సిన నియమం కూడా లేదు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ సిలిండర్&zwnj;ను మీరు ఎక్కడైనా రీఫిల్ చేయించుకోవచ్చు. ఇండేన్ డిస్ట్రిబ్యూటర్లు, కిరాణా దుకాణాలు, అధీకృత విక్రయ కేంద్రాల్లో దీన్ని రీఫిల్ చేసుకోవచ్చు. దీనికి బుకింగ్ అవసరం లేదు. నేరుగా దుకాణానికి వెళ్లి నింపించుకుంటే సరిపోతుంది. ప్రజలకు ఎల్పీజీని సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే పెద్ద ప్రయత్నంలో 'చోటూ' సిలిండర్ ఒక భాగమని కంపెనీ పేర్కొంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>districts-news</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/national/indian-oil-launches-chhotu-5kg-cylinder-for-instant-purchase-without-booking-w58ldci"/>
        </item>
    </channel>
</rss>
