<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" version="2.0">
    <channel>
        <title>Asianet News Telugu</title>
        <link>https://telugu.asianetnews.com</link>
        <description><![CDATA[Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.]]></description>
        <image>
            <url>https://static-assets.asianetnews.com/images/ogimages/OG_Telugu.jpg</url>
            <width>143</width>
            <height>100</height>
            <link>https://telugu.asianetnews.com</link>
            <title>Asianet News Telugu</title>
        </image>
        <lastBuildDate>Fri, 04 Sep 2026 12:10:29 +0530</lastBuildDate>
        <atom:link href="https://telugu.asianetnews.com/rss/business" rel="self" type="application/rss+xml"/>
        <item>
            <title><![CDATA[Gold: బంగారం కొంటే దేశానికి జరిగే నష్టం ఏంటి.? మోదీ ఎందుకు కొనొద్దని అంటున్నారు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/gold-why-is-pm-modi-asking-indians-to-avoid-unnecessary-gold-purchases-know-the-impact-on-indias-economy-3uspe4z</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/gold-why-is-pm-modi-asking-indians-to-avoid-unnecessary-gold-purchases-know-the-impact-on-indias-economy-3uspe4z</guid>
            <pubDate>Wed, 02 Sep 2026 20:46:22 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Gold: ఇటీవల దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతానికి చేరిన నేపథ్యంలో ప్రధాని మోదీ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అవసరం లేని బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని సూచించారు. బంగారం కొనకపోతే దేశానికి జరిగే ప్రయోజనం ఏంటో తెలుసా.?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1h8py1c55jze49wpmf0hqqn,imgname-gold-1788359702572.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Gold: ఇటీవల దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతానికి చేరిన నేపథ్యంలో ప్రధాని మోదీ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అవసరం లేని బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని సూచించారు. బంగారం కొనకపోతే దేశానికి జరిగే ప్రయోజనం ఏంటో తెలుసా.?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. కానీ మన దేశంలో బంగారం ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో దేశ అవసరాలకు కావాల్సిన బంగారంలో అధిక భాగాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. విదేశాల నుంచి బంగారం కొనుగోలు చేయాలంటే రూపాయల్లో కాకుండా ప్రధానంగా అమెరికన్ డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దేశంలో బంగారం డిమాండ్ పెరిగిన కొద్దీ విదేశాలకు ఎక్కువ డాలర్లు వెళ్లిపోతాయి. దీంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గితే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత్ విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకునే వస్తువుల్లో ముడి చమురు తర్వాత బంగారం కూడా కీలక స్థానంలో ఉంటుంది. బంగారం కొనుగోలు కోసం ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తే దేశ దిగుమతుల వ్యయం పెరుగుతుంది. దీని వల్ల ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం పెరిగి వాణిజ్య లోటు అధికమయ్యే అవకాశం ఉంటుంది. విదేశీ కరెన్సీపై డిమాండ్ పెరిగినప్పుడు భారత రూపాయిపై కూడా ఒత్తిడి పడుతుంది. రూపాయి విలువ తగ్గితే మరో సమస్య ఎదురవుతుంది. ముడి చమురు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర విదేశీ ఉత్పత్తుల దిగుమతులు మరింత ఖరీదవుతాయి. చివరకు వాటి ప్రభావం దేశీయ ధరలపై పడి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;చాలా మంది బంగారాన్ని పెట్టుబడిగా భావించి నగలు, నాణేలు లేదా బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేసి ఇంట్లో లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తుంటారు. అయితే ఇలా పెద్ద మొత్తంలో డబ్బు బంగారం రూపంలో నిల్వ ఉండిపోతే అది నేరుగా ఉత్పాదక రంగాల్లోకి వెళ్లదు. ఉదాహరణకు అదే డబ్బును బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, కంపెనీల షేర్లు లేదా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే ఆ నిధులు ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగపడతాయి. బ్యాంకుల్లో డబ్బు ఉంటే రుణాల రూపంలో పరిశ్రమలకు చేరుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే కొత్త కంపెనీలు ఏర్పడతాయి. పరిశ్రమలు పెరిగితే ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. కానీ బంగారం కొనుగోలు చేసి లాకర్&zwnj;లో ఉంచితే ఆ డబ్బు ఆర్థిక వ్యవస్థలో తిరుగుతూ ఉత్పత్తి, ఉపాధి కల్పించడంలో పరిమిత పాత్ర మాత్రమే పోషిస్తుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు తగ్గితే విదేశీ మారక ద్రవ్యంపై భారం తగ్గే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు దేశ బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గితే ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం దేశంలోనే ఆదా కావచ్చు. కొన్ని అంచనాల ప్రకారం బంగారం దిగుమతులు 50 శాతం వరకు తగ్గితే సుమారు 30 బిలియన్ డాలర్ల వరకు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసే అవకాశం ఉంటుంది. అంటే భారత కరెన్సీలో లక్షల కోట్ల రూపాయలకు సమానమైన మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థలోనే ఉండే అవకాశం ఉంటుంది. ఈ నిధులను మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్లు, ఆసుపత్రులు, విద్య, పరిశ్రమలు వంటి రంగాలకు ఉపయోగిస్తే దేశ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుంది. అయితే బంగారం కొనుగోలు పూర్తిగా మానేయాలనే ఉద్దేశం కాదని, అవసరం లేని దిగుమతి ఆధారిత కొనుగోళ్లను తగ్గించడమే ముఖ్యమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అంతర్జాతీయ బంగారం మార్కెట్&zwnj;లో భారత్ కీలక వినియోగదారుగా ఉంది. భారతదేశంలో డిమాండ్ పెరగడం లేదా తగ్గడం ప్రపంచ బంగారం మార్కెట్&zwnj;పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. భారత్ ప్రధానంగా స్విట్జర్లాండ్, యూఏఈ, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. భారత్&zwnj;లో కొనుగోళ్లు తగ్గితే ఈ దేశాల్లోని గోల్డ్ ట్రేడింగ్, రిఫైనింగ్ సంస్థల వ్యాపారంపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దుబాయ్, స్విట్జర్లాండ్ వంటి అంతర్జాతీయ బంగారం వ్యాపార కేంద్రాలకు భారత మార్కెట్ చాలా కీలకం. భారతీయుల కొనుగోలు శక్తి తగ్గితే ప్రపంచ మార్కెట్&zwnj;లో డిమాండ్&zwnj;పై ప్రభావం చూపడంతో పాటు ధరల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;మొత్తంగా చూస్తే, వ్యక్తిగత ఆర్థిక భద్రత కోసం కొంత బంగారం కొనుగోలు చేయడం తప్పు కాదు. కానీ భారీ స్థాయిలో విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవడం దేశ విదేశీ మారక నిల్వలు, వాణిజ్య లోటు, రూపాయి విలువపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే అవసరాన్ని బట్టి బంగారంలో పెట్టుబడి పెట్టడంతో పాటు దేశీయ ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వడం దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/gold-why-is-pm-modi-asking-indians-to-avoid-unnecessary-gold-purchases-know-the-impact-on-indias-economy-3uspe4z"/>
        </item>
        <item>
            <title><![CDATA[Jio: ఇంతింతై జియో అయ్‌.. ప‌దేళ్ల‌లో తెలుగు రాష్ట్రాల‌పై జియో సంచ‌ల‌న‌ ప్ర‌భావం]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/jio-10-years-how-reliance-jio-transformed-telecom-and-internet-usage-in-telangana-and-andhra-pradesh-4ygsq1t</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/jio-10-years-how-reliance-jio-transformed-telecom-and-internet-usage-in-telangana-and-andhra-pradesh-4ygsq1t</guid>
            <pubDate>Thu, 03 Sep 2026 15:09:00 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Jio: దేశ టెలికం రంగంలో జియోది ప్ర&zwnj;త్యేక స్థానం. ఇంతింతై వటుడింతయై అన్న&zwnj;ట్లు జియో వ్యాపార సామ్రాజ్యం విస్త&zwnj;రిస్తోంది. 2016లో జియో వాణిజ్య సేవలను ప్రారంభించిన తర్వాత భారత టెలికాం రంగంలో భారీ మార్పులు వచ్చాయి. ఈ 10 ఏళ్ల ప్ర&zwnj;స్థానంపై ఓ లుక్కేద్దాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1k9trpnmn10g2pmj4t5y0wt,imgname-jio-1788427985621.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Jio: దేశ టెలికం రంగంలో జియోది ప్ర&zwnj;త్యేక స్థానం. ఇంతింతై వటుడింతయై అన్న&zwnj;ట్లు జియో వ్యాపార సామ్రాజ్యం విస్త&zwnj;రిస్తోంది. 2016లో జియో వాణిజ్య సేవలను ప్రారంభించిన తర్వాత భారత టెలికాం రంగంలో భారీ మార్పులు వచ్చాయి. ఈ 10 ఏళ్ల ప్ర&zwnj;స్థానంపై ఓ లుక్కేద్దాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;2016లో భారతదేశంలో ఒక మొబైల్ వినియోగదారు నెలకు సగటున 0.2 జీబీ కంటే తక్కువ డేటాను మాత్రమే ఉపయోగించేవారు. అప్పట్లో ఒక జీబీ డేటాకు సుమారు రూ.228 వరకు ఖర్చయ్యేది. 4G సేవలు కూడా పెద్దగా అందుబాటులో లేవు. దేశవ్యాప్తంగా 4G నెట్&zwnj;వర్క్&zwnj;ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య 1 కోటి కంటే తక్కువగా ఉండేది. సగటు డౌన్&zwnj;లోడ్ వేగం కూడా 2.5 Mbps దాటేది కాదు. ఈ పరిస్థితుల్లో 2016 సెప్టెంబర్ 5న రిలయన్స్ జియో వాణిజ్య సేవలను ప్రారంభించింది. తక్కువ ధరలకు హైస్పీడ్ డేటాను అందించడం ద్వారా మార్కెట్&zwnj;లోకి వచ్చింది. దీంతో డేటా వినియోగంపై ప్రజల ఆలోచనా విధానమే మారిపోయింది. 2026 నాటికి ఒక జీబీ డేటా ధర సుమారు రూ.7.9కి పడిపోయింది. అంటే 2016తో పోలిస్తే దాదాపు 97 శాతం తగ్గింది. దేశంలో 4G, 5G వంటి హైస్పీడ్ సేవలను ఉపయోగించే వారి సంఖ్య సుమారు 93.8 కోట్లకు చేరింది. జియో నెట్&zwnj;వర్క్&zwnj;లో ఒక వినియోగదారు నెలకు సగటున 42.3 జీబీ డేటాను ఉపయోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపిన టెలికాం సర్కిల్&zwnj;లో జియో ఎదుగుదల మరింత ఆసక్తికరంగా ఉంది. 2016 ఆగస్టులో జియోకు ఇక్కడ ఎలాంటి యూజ&zwnj;ర్లు లేరు. వాణిజ్య సేవలు ప్రారంభించిన 2016 సెప్టెంబర్&zwnj;లోనే 12.4 లక్షల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. అక్కడి నుంచి జియో వేగంగా విస్తరించింది. 2026 జూన్ నాటికి తెలుగు రాష్ట్రాల టెలికాం సర్కిల్&zwnj;లో జియో యూజ&zwnj;ర్ల&zwnj; సంఖ్య ఏకంగా 3.258 కోట్లకు చేరింది. పదేళ్లలో 313.4 లక్షల మంది కొత్త యూజ&zwnj;ర్లు జియో నెట్&zwnj;వర్క్&zwnj;కు చేరారు. ఈ కాలంలో జియో వృద్ధి రేటు 39.9 శాతంగా నమోదైంది. 2024 జూన్&zwnj;లో జియో ఈ ప్రాంతంలో అత్యధికంగా 330.7 లక్షల మంది వినియోగదారుల స్థాయికి చేరింది. 2026 జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ సర్కిల్&zwnj;లో మొత్తం 883 లక్షల వైర్&zwnj;లెస్ కనెక్షన్లు ఉండగా, అందులో జియో వాటా 36.9 శాతంగా ఉంది. దీంతో జియో తెలుగు రాష్ట్రాల్లో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్&zwnj;గా కొనసాగుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జియో రాకతో టెలికాం మార్కెట్&zwnj;లో పోటీ తీవ్రంగా మారింది. 2016లో ఎయిర్&zwnj;టెల్, వోడాఫోన్, ఐడియా, BSNLతో పాటు పలు చిన్న సంస్థలు మార్కెట్&zwnj;లో ఉన్నాయి. అయితే తర్వాత కాలంలో చిన్న కంపెనీలు మార్కెట్ నుంచి తప్పుకోవడం, విలీనాలు జరగడం, కొంతమంది ఆపరేటర్లు సేవలను నిలిపివేయడంతో టెలికాంరంగం కొద్దిమంది పెద్ద సంస్థల చేతుల్లోకి వెళ్లింది.&lt;/p&gt;&lt;p&gt;జియో 2019 జనవరిలో వోడాఫోన్ ఐడియాను అధిగమించింది. అదే ఏడాది అక్టోబర్&zwnj;లో ఎయిర్&zwnj;టెల్&zwnj;ను కూడా అధిగమించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్&zwnj;లో కొంతకాలం అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత ఎయిర్&zwnj;టెల్ తిరిగి మొదటి స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ జియో రెండో స్థానంలో బలంగా కొన&zwnj;సాగింది. 2016 ఆగస్టులో ఎయిర్&zwnj;టెల్&zwnj;కు 241.7 లక్షల మంది యూజ&zwnj;ర్లు ఉండగా, 2026 జూన్ నాటికి ఆ సంఖ్య 394.1 లక్షలకు చేరింది. వోడాఫోన్, ఐడియా కలిపిన వినియోగదారుల సంఖ్య 228.6 లక్షల నుంచి 87.3 లక్షలకు పడిపోయింది. BSNL వినియోగదారులు 97.5 లక్షల నుంచి 75.8 లక్షలకు తగ్గారు. 2016లో 164.1 లక్షల యూజ&zwnj;ర్లు ఉన్న &lsquo;ఇతర&rsquo; చిన్న ఆపరేటర్ల విభాగం కూడా 2019 నాటికి దాదాపు పూర్తిగా కనుమరుగైంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;డేటా ధరలు తగ్గడం కేవలం మొబైల్&zwnj;లో వీడియోలు చూసే అలవాటును మాత్రమే మార్చలేదు. విద్య, వ్యాపారం, డిజిటల్ చెల్లింపులు, వినోదం వంటి అనేక రంగాలపై ప్రభావం చూపింది. తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలు, గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ వినియోగం సాధారణమైంది. విజయవాడలోని పండ్ల వ్యాపారి నుంచి వరంగల్&zwnj;లోని టీ దుకాణం వరకు చిన్న వ్యాపారులు UPI QR కోడ్&zwnj;ల ద్వారా డిజిటల్ చెల్లింపులు స్వీకరిస్తున్నారు. చిన్న పట్టణాల్లోని విద్యార్థులు ఆన్&zwnj;లైన్ తరగతులకు హాజరవుతున్నారు. ప్రాంతీయ భాషల్లో కంటెంట్ రూపొందించే క్రియేటర్లకు కూడా కోట్లాది మంది ప్రేక్షకులను చేరుకునే అవకాశం వచ్చింది.&lt;/p&gt;&lt;p&gt;చిన్న వ్యాపారాలు మొబైల్ ద్వారానే కస్టమర్లను చేరుకోవడం, ప్రకటనలు ఇవ్వడం, చెల్లింపులు తీసుకోవడం, స్టాక్&zwnj;ను నిర్వహించడం వంటి పనులు చేస్తున్నాయి. ఈ డిజిటల్ విస్తరణకు మరో ఉదాహరణ డిజిటల్ వాలెట్లు, OTT సేవల పెరుగుదల. 2016లో చాలా తక్కువగా ఉన్న డిజిటల్ వాలెట్ వినియోగదారుల సంఖ్య FY2026 నాటికి 55.6 కోట్లకు చేరింది. OTT ప్రేక్షకుల సంఖ్య కూడా 2016లో సుమారు 3 కోట్ల నుంచి FY2026 నాటికి 60.1 కోట్లకు పెరిగింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;4G తర్వాత జియో 5G సేవలపై కూడా భారీగా దృష్టి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 5G సేవలు 2019 ప్రాంతంలో ప్రారంభం కాగా, జియో 2022 చివర్లో వాణిజ్య 5G సేవలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 5G కవరేజీని కేవలం 15 నెలల్లో పూర్తి చేసినట్లు రిపోర్టులో పేర్కొంది. వాణిజ్య 5G సేవలు ప్రారంభించిన 42 నెలల్లో సుమారు 26.8 కోట్ల మంది 5G వినియోగదారులను జియో సంపాదించింది.&lt;/p&gt;&lt;p&gt;జియో తన సొంత క్లౌడ్ ఆధారిత 5G టెక్నాలజీ, నెట్&zwnj;వర్క్ వ్యవస్థలు, రేడియో సిస్టమ్స్&zwnj;ను అభివృద్ధి చేసింది. సంస్థ పరిశోధన, టెక్నాలజీ విభాగంలో 11,303 మంది పనిచేస్తున్నారని, 4G, 5G, 6G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో 6,817 పేటెంట్లు దాఖలు చేసినట్లు కథనం పేర్కొంది. ఇక ఇంటర్నెట్ సదుపాయం ఉన్నప్పటికీ ఖరీదైన స్మార్ట్&zwnj;ఫోన్ కొనలేని వారి కోసం తక్కువ ధరలో జియోభారత్ ఫీచర్ ఫోన్&zwnj;ను తీసుకొచ్చింది. UPI చెల్లింపులు, HD వాయిస్, కెమెరా, స్ట్రీమింగ్ వంటి సదుపాయాలను ఇందులో అందించింది.&lt;/p&gt;&lt;p&gt;హోమ్ బ్రాడ్&zwnj;బ్యాండ్ రంగంలోనూ జియో వేగంగా విస్తరించింది. 2026 మార్చి 31 నాటికి జియో హోమ్ బ్రాడ్&zwnj;బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 2.7 కోట్లను దాటింది. దీంతో భారత్&zwnj;లో అతిపెద్ద హోమ్ బ్రాడ్&zwnj;బ్యాండ్ ప్రొవైడర్&zwnj;గా నిలిచింది. 2026 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జియో కార్యకలాపాల ఆదాయం రూ.1,46,885 కోట్లుగా, EBITDA రూ.76,255 కోట్లుగా నమోదైంది. దేశవ్యాప్తంగా జియో యాక్టివ్ వినియోగదారుల సంఖ్య 52.44 కోట్లకు చేరింది.&lt;/p&gt;&lt;p&gt;మొత్తంగా చూస్తే 2016లో చౌకైన మొబైల్ కనెక్టివిటీతో ప్రారంభమైన జియో ప్రయాణం ఇప్పుడు 4G, 5G, ఫైబర్ బ్రాడ్&zwnj;బ్యాండ్, చౌకైన పరికరాలు, క్లౌడ్, IoT, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాలకు విస్తరించింది. ఈ మార్పు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ఇంటర్నెట్&zwnj;ను ఉపయోగించే విధానాన్ని పూర్తిగా మార్చేసింది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/jio-10-years-how-reliance-jio-transformed-telecom-and-internet-usage-in-telangana-and-andhra-pradesh-4ygsq1t"/>
        </item>
        <item>
            <title><![CDATA[Gold Price Hike: యూటర్న్ తీసుకున్న బంగారం.. మోత మోగించిన పసిడి, స్వర్ణ ప్రియులకు భారీ షాక్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/gold-prices-bounce-back-after-two-days-of-decline-hyderabad-gold-rate-today-5gmq9yz</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/gold-prices-bounce-back-after-two-days-of-decline-hyderabad-gold-rate-today-5gmq9yz</guid>
            <pubDate>Thu, 03 Sep 2026 11:36:19 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Gold Price Hike: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 2 రోజులు తగ్గిన పసిడి ఇప్పుడు రివర్స్ అయింది. అంతర్జాతీయంగా పరిస్థితులు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెట్టుబడిదారులపై ప్రభావం చూపుతున్నాయి. సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు మళ్లడంతో డిమాండ్ పెరిగింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kmm4jkq2ak0j0czpxx662sp3,imgname-india-gold-price-today-26-march-2026-24k-22k-rate-delhi-mumbai-patna-gold-price-rise-oil-inflation-impact-0-1774497386210.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Gold Price Hike: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 2 రోజులు తగ్గిన పసిడి ఇప్పుడు రివర్స్ అయింది. అంతర్జాతీయంగా పరిస్థితులు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెట్టుబడిదారులపై ప్రభావం చూపుతున్నాయి. సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు మళ్లడంతో డిమాండ్ పెరిగింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. వరుసగా రెండు రోజుల పాటు తగ్గిన పసిడి రేట్లు ఇప్పుడు ఒక్కసారిగా రివర్స్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు పెట్టుబడిదారులపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మళ్లడంతో పసిడి ధరలకు మళ్లీ డిమాండ్ పెరిగింది.&lt;/p&gt;&lt;p&gt;ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు ఏ పరిణామం చోటుచేసుకుంటుందోనన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లలో రిస్క్ పెరిగిన సమయంలో సాధారణంగా సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు డబ్బును మళ్లించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే ధోరణి కనిపించడంతో గోల్డ్ రేట్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీంతో ఇటీవల కనిపించిన ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై మార్కెట్ అంచనాల్లో వచ్చిన మార్పులు కూడా బులియన్ మార్కెట్&zwnj;పై ప్రభావం చూపుతున్నాయి. ఫెడ్ పాలసీపై ఇన్వెస్టర్ల అంచనాలు మారడంతో అంతర్జాతీయంగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్&zwnj;లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు ఇప్పుడు మళ్లీ పైకి కదిలాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సెప్టెంబర్ 3న దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,350గా నమోదైంది. గత ధరతో పోలిస్తే ఇది ఏకంగా రూ.3,330 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,400గా ఉంది. దీనిపై ఒక్కరోజులో రూ.3,050 పెరుగుదల కనిపించింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి మళ్లీ ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;హైదరాబాద్&zwnj;, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,350గా, 22 క్యారెట్ల రేటు రూ.1,42,400గా కొనసాగుతోంది. బెంగళూరులోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,500గా, 22 క్యారెట్ల రేటు రూ.1,42,550గా నమోదైంది. అంతర్జాతీయ పరిణామాలు, ఫెడ్ నిర్ణయాలపై అంచనాలు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఆధారంగా రాబోయే రోజుల్లోనూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Nandini Arava</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/gold-prices-bounce-back-after-two-days-of-decline-hyderabad-gold-rate-today-5gmq9yz"/>
        </item>
        <item>
            <title><![CDATA[Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/gold-prices-crash-by-6220-rupees-in-3-days-will-gold-rise-again-6y68znw</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/gold-prices-crash-by-6220-rupees-in-3-days-will-gold-rise-again-6y68znw</guid>
            <pubDate>Wed, 02 Sep 2026 11:36:34 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Gold Crash: బంగారం ధరలు భారీగా పడిపోయాయి. మూడు రోజుల్లోనే తులం పసిడిపై రూ.6,220 తగ్గింది. ప్రస్తుతం రూ.1.52 లక్షల వద్దకు వచ్చిన బంగారం.. ఇక్కడితో ఆగుతుందా? లేక మళ్లీ రూ.1.70 లక్షల దిశగా పరుగులు పెడుతుందా? రాబోయే రోజుల్లో ధరలు ఎలా ఉండబోతున్నాయి?.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m162k7jbsjtyjsg9n9250m8c,imgname-chatgpt-image-aug-29--2026--11-43-56-am--1--1787984191050.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Gold Crash: బంగారం ధరలు భారీగా పడిపోయాయి. మూడు రోజుల్లోనే తులం పసిడిపై రూ.6,220 తగ్గింది. ప్రస్తుతం రూ.1.52 లక్షల వద్దకు వచ్చిన బంగారం.. ఇక్కడితో ఆగుతుందా? లేక మళ్లీ రూ.1.70 లక్షల దిశగా పరుగులు పెడుతుందా? రాబోయే రోజుల్లో ధరలు ఎలా ఉండబోతున్నాయి?.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బంగారం ధరల్లో వరుసగా రెండో రోజు కూడా భారీ తగ్గుదల నమోదైంది. గత కొద్దిరోజులుగా భారీగా పెరిగిన పసిడి రేట్లు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్&zwnj;లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 తగ్గి రూ.1,52,020కి చేరింది. కేవలం మూడు రోజుల్లోనే తులం ప్యూర్ గోల్డ్&zwnj;పై రూ.6,220 వరకు తగ్గింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా తగ్గింది. 10 గ్రాములపై రూ.1,900 తగ్గడంతో ప్రస్తుతం రూ.1,39,350 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న పరిస్థితులు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ వంటి అంశాలు దేశీయ బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లకు సంబంధించిన అంచనాలు కూడా మార్కెట్ కదలికలకు కారణమవుతున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అయితే బంగారం ధరలు ఇక్కడితోనే తగ్గుతాయా లేదా మళ్లీ పెరుగుతాయా అన్నదానిపై మార్కెట్ నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వెండితో పోలిస్తే బంగారానికి ప్రస్తుతం బలమైన డిమాండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ నిల్వలను పెంచుకునేందుకు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తుండటం పసిడికి ప్రధాన బలంగా మారింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;వెండి విషయంలో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. వెండికి పారిశ్రామిక రంగం నుంచి వచ్చే డిమాండ్ కీలకం కావడంతో తయారీ కార్యకలాపాల్లో మందగమనం ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా చైనాలో సోలార్ మాడ్యూల్స్ వృద్ధి నెమ్మదిస్తే వెండి డిమాండ్&zwnj;పై ఒత్తిడి పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇక 2026 చివరి నాటికి తులం బంగారం రూ.1.35 లక్షల నుంచి రూ.1.55 లక్షల పరిధిలో ఉంటుంందని అంచనా. అయితే అమెరికా లేబర్ మార్కెట్&zwnj;లో తీవ్ర బలహీనత ఏర్పడి, ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం, రియల్ ఈల్డ్స్ పడిపోవడం, సంస్థాగత పెట్టుబడులు మళ్లీ బంగారం వైపు మళ్లడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;p&gt;అలాంటి అనుకూల పరిస్థితుల్లో తులం బంగారం ధర రూ.1,70,861 వరకు చేరే అవకాశం ఉందన్న అంచనా కూడా ఉంది. అయితే ఇది ఖచ్చితమైన ధర కాదని, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా మారితే సాధ్యమయ్యే ఒక అంచనాగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Nandini Arava</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/gold-prices-crash-by-6220-rupees-in-3-days-will-gold-rise-again-6y68znw"/>
        </item>
        <item>
            <title><![CDATA[Gold Price hike: రూ.20వేలు తగ్గిన వెండి...మరోసారి పెరిగిన పసిడి...గ్రాము ఎంతంటే?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/gold-prices-rise-again-after-sharp-drop-silver-falls-5-thousand-rupees-per-kg-74n4f2c</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/gold-prices-rise-again-after-sharp-drop-silver-falls-5-thousand-rupees-per-kg-74n4f2c</guid>
            <pubDate>Tue, 01 Sep 2026 11:11:44 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Gold Price hike: బంగారం ధరల్లో మళ్లీ స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. గత వారం భారీ నుంచి దిగివచ్చిన పసిడి.. ఇప్పుడు వరుసగా కొద్దికొద్దిగా పుంజుకుంటోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మరోసారి ధరలు పెరుగుతున్నాయనే ఆందోళన మొదలైంది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01ky44s96ykrx7ksvwvy2c5nhw,imgname-chatgpt-image-jul-22--2026--10-58-45-am-1784698152158.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Gold Price hike: బంగారం ధరల్లో మళ్లీ స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. గత వారం భారీ నుంచి దిగివచ్చిన పసిడి.. ఇప్పుడు వరుసగా కొద్దికొద్దిగా పుంజుకుంటోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మరోసారి ధరలు పెరుగుతున్నాయనే ఆందోళన మొదలైంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. గత వారం భారీ స్థాయిలో తగ్గిన పసిడి ధరలు.. ఇప్పుడు వరుసగా నాలుగైదు రోజులుగా క్రమంగా పుంజుకుంటున్నాయి. ఒక దశలో తులం బంగారం ధర రూ.1.70 లక్షలకు చేరడంతో భారీగా పెరిగిన పసిడి.. ఆ తర్వాత లాభాల స్వీకరణతో గణనీయంగా తగ్గింది. ఇప్పుడు మళ్లీ కొనుగోళ్లు పెరగడంతో ధరలు పైకి ఎగబాకుతున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ.1,56,930కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర కూడా రూ.150 పెరిగి 10 గ్రాములకు రూ.1,43,850గా నమోదైంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగి 10 గ్రాములకు రూ.1,17,700 వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ధరలు తగ్గిన సమయంలో కొనుగోళ్లకు కొంత ఊరట లభించినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ రేట్లు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మరోవైపు వెండి ధరలు మాత్రం బంగారానికి భిన్నంగా భారీగా తగ్గుతున్నాయి. ఒక్కరోజే కిలో వెండిపై రూ.5,000 తగ్గుదల నమోదైంది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.55 లక్షల వద్ద ఉంది. గత నెలలో కిలో వెండి ధర సుమారు రూ.2.75 లక్షల స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం దాదాపు రూ.20 వేల మేర తగ్గింది. దీంతో వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి మాత్రం ఈ తగ్గుదల కొంత ఊరటనిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అంతర్జాతీయ మార్కెట్&zwnj;లో పసిడి ధరల కదలికలు, డాలర్ విలువ, పెట్టుబడిదారుల కొనుగోళ్లు, లాభాల స్వీకరణ వంటి అంశాలు దేశీయ బులియన్ మార్కెట్&zwnj;పై ప్రభావం చూపుతుంటాయి. అందుకే బంగారం, వెండి ధరలు రోజురోజుకూ మారుతూ ఉంటాయి. ఆభరణాలు కొనుగోలు చేసే వారు మార్కెట్&zwnj;లోని తాజా రేటుతో పాటు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Nandini Arava</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/gold-prices-rise-again-after-sharp-drop-silver-falls-5-thousand-rupees-per-kg-74n4f2c"/>
        </item>
        <item>
            <title><![CDATA[గుడ్డు పెంకును తొల‌గించే స్మార్ట్ కిచెన్ టూల్‌.. ఎలా ప‌నిచేస్తుంది? ధ‌ర ఎంతంటే.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/egg-shell-opener-smart-kitchen-tool-to-peel-boiled-eggs-easily-check-price-and-features-9v64trs</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/egg-shell-opener-smart-kitchen-tool-to-peel-boiled-eggs-easily-check-price-and-features-9v64trs</guid>
            <pubDate>Thu, 03 Sep 2026 18:46:06 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Egg Shell Opener: ఉడికించిన గుడ్లను తినడం ఆరోగ్యానికి మంచిద&zwnj;ని తెలిసిందే. అయితే కొంద&zwnj;రు గుడ్డు పెంకును తీయ&zwnj;డానికి ఇబ్బందిప&zwnj;డుతుంటారు. అలాంటి వారి కోస&zwnj;మే అమెజాన్&zwnj;లో ఎగ్ షెల్ ఓపెన&zwnj;ర్ పేరుతో ఓ ప్రొడ&zwnj;క్ట్ అందుబాటులో ఉంది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1kk2g39h8kt1020kzkw9vtk,imgname-egg-shell-opener-1788437676137.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Egg Shell Opener: ఉడికించిన గుడ్లను తినడం ఆరోగ్యానికి మంచిద&zwnj;ని తెలిసిందే. అయితే కొంద&zwnj;రు గుడ్డు పెంకును తీయ&zwnj;డానికి ఇబ్బందిప&zwnj;డుతుంటారు. అలాంటి వారి కోస&zwnj;మే అమెజాన్&zwnj;లో ఎగ్ షెల్ ఓపెన&zwnj;ర్ పేరుతో ఓ ప్రొడ&zwnj;క్ట్ అందుబాటులో ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఎగ్ షెల్ ఓపెన&zwnj;ర్ ప్రధానంగా ఉడికించిన గుడ్ల పెంకును సులభంగా తొలగించేందుకు ఉపయోగపడుతుంది. సాధారణంగా చేతులతో పెంకును తొలగించే సమయంలో చిన్న చిన్న ముక్కలుగా పెంకు విరిగిపోతుంది. దీంతో సమయం ఎక్కువ పడుతుంది. ఈ టూల్&zwnj;లో గుడ్డును ఉంచి ఉపయోగించడం ద్వారా పెంకును త్వరగా వదులుగా చేసుకోవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;దీన్ని ఉపయోగించడం చాలా సింపుల్. ముందుగా ఉడికించిన గుడ్డును ఈ టూల్&zwnj;లో ఉంచాలి. ఆ తర్వాత మూతను సరిగ్గా పెట్టి మెల్లగా షేక్ చేయాలి. ఇలా చేయడం వల్ల గుడ్డు పెంకు పగిలి వదులవుతుంది. అనంతరం గుడ్డును బయటకు తీసి పెంకును సులభంగా తొలగించవచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా గుడ్లను పీల్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ఎగ్ పీల&zwnj;ర్&zwnj;ను పాలీప్రొపిలిన్ మెటీరియల్&zwnj;తో తయారు చేశారు. కేవలం 50 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో చేతిలో పట్టుకోవడం సులభంగా ఉంటుంది. ఎర్గోనామిక్ డిజైన్ కారణంగా సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు. ప్లాస్టిక్ బ్లేడ్&zwnj;తో రూపొందించిన ఈ టూల్&zwnj;ను రోజువారీ కిచెన్ అవసరాలకు ఉపయోగించవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జిమ్&zwnj;కు వెళ్లేవారు, ఫిట్&zwnj;నెస్&zwnj;పై శ్రద్ధ పెట్టేవారు, ప్రోటీన్ డైట్ తీసుకునేవారు తరచూ ఉడికించిన గుడ్లను ఆహారంలో తీసుకుంటుంటారు. ఒకేసారి చాలా గుడ్లను ఉడికించి వాటిని పీల్ చేయాల్సి వస్తే ఈ టూల్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉదయం హడావుడిలో బ్రేక్&zwnj;ఫాస్ట్ సిద్ధం చేసుకునే వారికి సమయాన్ని ఆదా చేసే అవకాశం ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ Egg Shell Opener పరిమాణంలో చిన్నగా, బరువు తక్కువగా ఉంటుంది. దీంతో కిచెన్&zwnj;లో ఎక్కువ స్థలం అవసరం ఉండదు. ప్రయాణాలు, పిక్నిక్&zwnj;లు, క్యాంపింగ్ వంటి సందర్భాల్లో కూడా సులభంగా వెంట తీసుకెళ్లవచ్చు. ఇంట్లోనే కాకుండా బయట కూడా ఉడికించిన గుడ్లను తినే వారికి ఇది ఒక ఉపయోగకరమైన కిచెన్ గాడ్జెట్&zwnj;గా ఉంటుంది. xinxingin బ్రాండ్&zwnj;కు చెందిన ఈ Egg Shell Opener ప్రస్తుతం అమెజాన్&zwnj;లో రూ.459 ధరకు అందుబాటులో ఉంది. ఉడికించిన గుడ్ల పెంకును సులభంగా తొలగించుకోవాలనుకునే వారికి, ముఖ్యంగా రెగ్యులర్&zwnj;గా ఎగ్స్ తినేవారికి ఈ చిన్న కిచెన్ టూల్ ఉపయోగకరంగా ఉండొచ్చు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/egg-shell-opener-smart-kitchen-tool-to-peel-boiled-eggs-easily-check-price-and-features-9v64trs"/>
        </item>
        <item>
            <title><![CDATA[Subhash Chandra: రూ. 22,000 కోట్ల బాకీ రూ. 6 కోట్లకు క్లియర్ ! జీ సుభాష్ చంద్ర కేసులో ఏం జరిగింది?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/how-subhash-chandras-rs-22006-cr-debt-settled-for-rs-6-25-cr-az5sg2v</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/how-subhash-chandras-rs-22006-cr-debt-settled-for-rs-6-25-cr-az5sg2v</guid>
            <pubDate>Tue, 01 Sep 2026 08:54:20 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Subhash Chandra: జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర రూ. 22,006 కోట్ల బాకీని రూ. 6.25 కోట్లకు రీపేమెంట్ ప్లాన్ కింద NCLT ఆమోదించింది. దేశవ్యాప్తంగా ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బ్యాంకుల వ్యతిరేకత, ప్రభుత్వ వాదనలు, అసలు కథేంటో చూద్దాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kvb0y0rp6q1r01wcq6czparj,imgname-essel-group-subhash-chandra-1781707768596.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Subhash Chandra: జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర రూ. 22,006 కోట్ల బాకీని రూ. 6.25 కోట్లకు రీపేమెంట్ ప్లాన్ కింద NCLT ఆమోదించింది. దేశవ్యాప్తంగా ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బ్యాంకుల వ్యతిరేకత, ప్రభుత్వ వాదనలు, అసలు కథేంటో చూద్దాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన పర్సనల్ ఇన్సాల్వెన్సీ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఒక సంచలన రీపేమెంట్ ప్లాన్&zwnj;కు ఆమోదం తెలిపింది. ఆయనపై నమోదైన రూ. 22,006 కోట్ల అంగీకరించిన క్లెయిమ్&zwnj;లను కేవలం రూ. 6.25 కోట్లు చెల్లించడం ద్వారా సెటిల్ చేసుకోవడానికి ట్రిబ్యునల్ అనుమతించింది.&lt;/p&gt;&lt;p&gt;ఈ నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ తీర్పుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రుణదాతలైన బ్యాంకులు ఈ ప్రతిపాదనను అంగీకరించలేమని, ఇది ఎంతమాత్రం సరికాదని అంటున్నాయి. మరోవైపు, మీడియాలో ప్రచారమవుతున్న 99.97 శాతం రుణ మాఫీ వార్తలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అసలు తనపై ఉన్న క్లెయిమ్ సైజ్ ఇంత పెద్దది కాదని సుభాష్ చంద్ర స్వయంగా వాదిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు వివరాలను ఇప్పుడు చూద్దాం.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;NCLT నిజానికి ఏమి ఆమోదించింది?&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;ఈ వివాదంపై ఢిల్లీలోని NCLT బెంచ్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. అంతకుముందు ఇద్దరు సభ్యుల బెంచ్&zwnj;లో భిన్నాభిప్రాయాలు రావడంతో, ఈ కేసును మూడో జ్యుడీషియల్ మెంబర్ నీలేష్ శర్మకు బదిలీ చేశారు. ఆయన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్&zwnj;రప్సీ కోడ్ (IBC) సెక్షన్ 114 కింద ఈ ప్లాన్&zwnj;ను క్లియర్ చేశారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ ప్లాన్ ప్రకారం, సుభాష్ చంద్ర తన వ్యక్తిగత పూచీకత్తు హోదాలో రూ. 6.25 కోట్లు చెల్లిస్తారు. దీనితో పాటు, రుణం తీసుకున్న ప్రధాన సంస్థలు విడిగా సుమారు రూ. 1,494 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 80.8 శాతం ఓటింగ్ షేర్ ఉన్న రుణదాతలు ఈ ప్లాన్&zwnj;కు సపోర్టు ఇచ్చారు. అయితే LIC హౌసింగ్ ఫైనాన్స్ (LICHFL), హెచ్&zwnj;డిఎఫ్&zwnj;సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్&zwnj;బిఎల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్&zwnj;లు మాత్రం ఈ రీపేమెంట్ ప్లాన్&zwnj;కు వ్యతిరేకంగా ఓటు వేశాయి.&lt;/p&gt;&lt;p&gt;రీజల్యూషన్ ప్రొఫెషనల్ అంచనా ప్రకారం.. సుభాష్ చంద్ర వ్యక్తిగత ఆస్తుల విలువ ఈ రీపేమెంట్ ప్లాన్ ఆఫర్ చేస్తున్న దానికంటే చాలా తక్కువగా ఉందని జ్యుడీషియల్ మెంబర్ నీలేష్ శర్మ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయనను దివాళా తీసినట్లు ప్రకటించడం వల్ల వ్యతిరేకిస్తున్న బ్యాంకులకు ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;NCLT ఆమోదం తెలపడం అంటే బ్యాంకులు రూ. 22,000 కోట్ల రుణాలను వదులుకున్నట్లు కాదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. రూ. 22,006 కోట్ల అనేది సుభాష్ చంద్ర స్వయంగా తీసుకున్న రుణం కాదని, వివిధ ఎస్సెల్/జీ సంబంధిత కంపెనీలు తీసుకున్న రుణాలకు ఆయన 'పర్సనల్ గ్యారెంటర్'గా ఇచ్చిన గ్యారెంటీ క్లెయిమ్&zwnj;ల విలువ మాత్రమేనని తెలిపారు.&lt;/p&gt;&lt;p&gt;మొత్తం రూ. 22,006 కోట్ల క్లెయిమ్&zwnj;లలో కేవలం రూ. 2,574 కోట్లకు మాత్రమే రుణం తీసుకున్న ప్రారంభ సమయంలో సుభాష్ చంద్ర పర్సనల్ గ్యారెంటీ ఇచ్చారు. మిగిలిన గ్యారెంటీలన్నీ ఆ తర్వాత అదనపు సెక్యూరిటీగా ఇచ్చినవేనని వర్గాలు వెల్లడించాయి.&lt;/p&gt;&lt;p&gt;రుణం తీసుకున్న ప్రధాన కంపెనీలు (కార్పొరేట్ బోరోయర్స్) ఇప్పటికీ తమ బాకీలను తీర్చాల్సిన బాధ్యత కలిగి ఉన్నాయి. సుభాష్ చంద్ర పర్సనల్ సెటిల్&zwnj;మెంట్&zwnj;తో సంబంధం లేకుండా, ఆ కంపెనీల ఆస్తులు, సెక్యూరిటీల నుంచి తమ బాకీలను వసూలు చేసుకునే హక్కు బ్యాంకులకు ఉంటుంది. సుభాష్ చంద్ర రూ. 22,000 కోట్లు సొంతంగా అప్పు తీసుకోలేదని, ప్రచారంలో ఉన్న హెయిర్&zwnj;కట్ అనేది కేవలం ఒక గ్యారెంటర్&zwnj;గా ఆయన నుంచి వసూలు చేసే మొత్తానికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తీర్పును వ్యతిరేకించిన ఎల్&zwnj;ఐసి హౌసింగ్ ఫైనాన్స్ (LICHFL), తనకు రావాల్సిన సుమారు రూ. 22,006 కోట్ల క్లెయిమ్&zwnj;లకుగాను కేవలం రూ. 6.25 కోట్లు మాత్రమే కేటాయించడం చట్టవిరుద్ధమని, అంగీకరించలేనిదని వాదించింది. హెచ్&zwnj;డిఎఫ్&zwnj;సి బ్యాంక్ కూడా ఈ ప్లాన్&zwnj;కు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు, తీర్పుపై అప్పీల్&zwnj;కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటన విడుదల చేసింది.&lt;/p&gt;&lt;p&gt;మరోవైపు, సుభాష్ చంద్ర వ్యక్తిగత నెట్ వర్త్ గతంలో చాలా ఎక్కువగా ఉండేదని బ్యాంకులు గుర్తు చేస్తున్నాయి. 2017లో ఆయన నికర ఆస్తుల విలువ రూ. 45,888 కోట్లుగా, 2018లో రూ. 40,562 కోట్లుగా నెట్ వర్త్ సర్టిఫికేట్లలో నమోదైంది. కానీ ఇప్పుడు ప్రకటిస్తున్న నెట్ వర్త్ కేవలం రూ. 31.79 కోట్లు మాత్రమే కావడంపై బ్యాంకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆస్తుల విలువ ఇంతగా ఎలా తగ్గిందో సమగ్రంగా విచారించాలని కోరుతున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;ఈ నేపథ్యంలో LICHFL, హెచ్&zwnj;డిఎఫ్&zwnj;సి బ్యాంక్ NCLT తీర్పును నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT)లో సవాలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. అంతేకాకుండా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) జోక్యాన్ని కూడా కోరాలని LICHFL భావిస్తోంది.&lt;/p&gt;&lt;h2&gt;&lt;strong&gt;ఈ వివాదంపై సుభాష్ చంద్ర స్పందన ఏమిటి?&lt;/strong&gt;&lt;/h2&gt;&lt;p&gt;తనపై వస్తున్న విమర్శలపై సుభాష్ చంద్ర స్పందించారు. &quot;నేను ఏ బ్యాంక్ నుంచి కూడా సొంతంగా డబ్బులు అప్పుగా తీసుకోలేదు&quot; అని అన్నారు. రీపేమెంట్ ప్లాన్&zwnj;ను వ్యతిరేకిస్తున్న బ్యాంకులు నాపై వేసిన క్లెయిమ్ విలువ కేవలం రూ. 3,992 కోట్లు మాత్రమేనని, రూ. 22,000 కోట్లు కాదని చెప్పారు.&lt;/p&gt;&lt;p&gt;ఈ రూ. 3,992 కోట్లలో ఇప్పటికే రూ. 620 కోట్లు సెటిల్ చేశామని, మరో రూ. 1,063 కోట్లు చెల్లించేందుకు రుణం తీసుకున్న కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. తాను గ్యారెంటీ ఇచ్చిన కంపెనీలు ఇప్పటివరకు రూ. 43,000 కోట్ల బాకీలను బ్యాంకులకు తిరిగి చెల్లించాయని, మిగిలిన బాకీలను కూడా ఆ కంపెనీలే చెల్లిస్తాయని సుభాష్ చంద్ర తెలిపారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సుభాష్ చంద్ర కేసు అనేది ఒక ప్రత్యేకమైన పర్సనల్ గ్యారెంటర్ రీజల్యూషన్ మాత్రమేనని, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్&zwnj;రప్సీ కోడ్ (IBC) కింద జరిగే సాధారణ కార్పొరేట్ రికవరీలకు ఇది ప్రతిబింబం కాదని పీటీఐ వర్గాలు తెలిపాయి. దేశంలో IBC చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి మార్చి 2026 నాటికి రీజల్యూషన్ ప్లాన్ల ద్వారా బ్యాంకులు రూ. 4.32 లక్షల కోట్లను రికవరీ చేసుకున్నాయి. ఇది లిక్విడేషన్ విలువలో 116.85 శాతం కాగా, ఫెయిర్ వ్యాల్యూలో 94.56 శాతంగా ఉంది.&lt;/p&gt;&lt;p&gt;అంతేకాకుండా, ఇన్సాల్వెన్సీ ప్రక్రియలు అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే దాదాపు రూ. 14 లక్షల కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన 32,000 కంటే ఎక్కువ కేసులు పరిష్కారమయ్యాయి. ఈ చట్టం ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో ఇది తెలియజేస్తోందని అధికారులు వివరించారు.&lt;/p&gt;&lt;p&gt;బ్యాంకింగ్ రంగంలో నెట్ నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ (NPAs) మార్చి 2018లో 5.94 శాతంగా ఉండగా, సెప్టెంబర్ 2025 నాటికి 0.48 శాతానికి పడిపోయాయి. నికర నిరర్థక ఆస్తులు రూ. 5.2 లక్షల కోట్ల నుంచి రూ. 94,000 కోట్లకు తగ్గాయి. ఐఐఎం అహ్మదాబాద్ అధ్యయనం ప్రకారం.. ఇన్సాల్వెన్సీ ద్వారా పునరుద్ధరించబడిన కంపెనీల సేల్స్ 76 శాతం, మొత్తం ఆస్తులు 50 శాతం, ప్రాజెక్టుల క్యాపిటల్ ఎక్స్&zwnj;పెండిచర్ 130 శాతం మేర పెరిగాయని వర్గాలు వెల్లడించాయి.&lt;/p&gt;&lt;p&gt;ఈ కేసులో నెక్ట్స్ జరిగే పరిణామాలు ఏమిటి?&lt;/p&gt;&lt;p&gt;ప్రస్తుతం ఈ కేసు NCLT ఒరిజినల్ డివిజన్ బెంచ్&zwnj;కు తిరిగి వెళ్తుంది. కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 419(5) ప్రకారం మెజారిటీ అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూ బెంచ్ అధికారిక ఉత్తర్వులను జారీ చేస్తుంది. ఆ తర్వాత LICHFL, హెచ్&zwnj;డిఎఫ్&zwnj;సి బ్యాంకులు NCLATని ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, ఎస్సెల్/జీ కంపెనీల ఆస్తులపై బ్యాంకులకు ఉన్న హక్కులు, రికవరీ ప్రక్రియలు విడిగా కొనసాగుతాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/how-subhash-chandras-rs-22006-cr-debt-settled-for-rs-6-25-cr-az5sg2v"/>
        </item>
        <item>
            <title><![CDATA[Gold: బంగారం, వెండి మాత్రమే మిమ్మల్ని కాపాడతాయి.. అసలు సంగతి చెప్పిన రాబర్ట్ కియోసాకి !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/gold-and-silver-will-save-your-wealth-rich-dad-poor-dad-author-robert-kiyosaki-warns-bcvvd9u</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/gold-and-silver-will-save-your-wealth-rich-dad-poor-dad-author-robert-kiyosaki-warns-bcvvd9u</guid>
            <pubDate>Mon, 31 Aug 2026 16:07:45 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Gold: రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ఇన్వెస్టర్ల భవిష్యత్తుపై మరోసారి కీలక హెచ్చరికలు చేశారు. రాబోయే రోజుల్లో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం తీవ్రతరమయ్యే ప్రమాదం ఉందన్నారు. బంగారం, వెండి మాత్రమే కాపాడతాయని చెప్పారు.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1bnn97b7zjtjqh0cbtd9m0v,imgname-gold-1788171953387.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Gold: రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ఇన్వెస్టర్ల భవిష్యత్తుపై మరోసారి కీలక హెచ్చరికలు చేశారు. రాబోయే రోజుల్లో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం తీవ్రతరమయ్యే ప్రమాదం ఉందన్నారు. బంగారం, వెండి మాత్రమే కాపాడతాయని చెప్పారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, ప్రపంచ ప్రఖ్యాత 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో మరోసారి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడం, కేవలం కష్టపడి పనిచేసి జీతంపై ఆధారపడటం అనే సంప్రదాయ ఆర్థిక సలహాలను ఆయన తీవ్రంగా ఖండించారు.&lt;/p&gt;&lt;p&gt;ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కాగితపు కరెన్సీని ముద్రించడం వల్ల రోజురోజుకూ డబ్బు విలువ పడిపోతోందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే రూపాయి లేదా డాలర్ వంటి కాగితపు నోట్లపై ఆధారపడకుండా, రియల్ మనీ అయిన బంగారం, వెండి వంటి విలువైన ఆస్తుల్లో పొదుపు చేయడమే అత్యంత సురక్షితమైన మార్గమని స్పష్టం చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తన సిద్ధాంతం ఎంతవరకు నిజమో నిరూపించేందుకు రాబర్ట్ కియోసాకి ఒక అద్భుతమైన ఉదాహరణను పంచుకున్నారు. తాను ఇటీవల 4.5 మిలియన్ డాలర్లు (మన భారతీయ కరెన్సీలో సుమారు ₹40 కోట్లకు పైగా) విలువ చేసే ఒక భవనాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అయితే, అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేయడానికి ఆయన రూపాయి కూడా బ్యాంకు ఖాతా నుంచి చెల్లించలేదు. ఏళ్ల తరబడి తాను పొదుపు చేసిన బంగారు నాణేలనే ఇందుకు ఉపయోగించారు. అప్పట్లో తాను కేవలం 4.5 లక్షల డాలర్లతో కొనుగోలు చేసిన బంగారంతోనే, ఇప్పుడు ఏకంగా పదింతల విలువైన 45 లక్షల డాలర్ల ఇల్లు సొంతమైందని వివరించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇది ఎలాంటి ఫోర్&zwnj;క్లోజర్&zwnj; లేదా స్పెషల్ డీల్&zwnj; కాదని, కేవలం పసిడి విలువ పెరగడం వల్లే తనకు ఈ లాభం సమకూరిందని కియోసాకి స్పష్టం చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్సుకు 45 డాలర్లు, బంగారం ఔన్సుకు 3,500 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. కానీ తాను వెండిని ఔన్సుకు కేవలం ఒక్క డాలర్&zwnj; ఉన్న సమయం నుంచే కొనుగోలు చేయడం ప్రారంభించానని గుర్తుచేశారు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలబడే శక్తి బంగారం, వెండికి మాత్రమే ఉందనడానికి ఇదే సజీవ సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అంతర్జాతీయ పరిస్థితులు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, పారిశ్రామిక డిమాండ్ కారణంగా గడిచిన పదేళ్ల కాలంలో పసిడి, వెండి ధరలు అసాధారణ రీతిలో పెరిగాయి.&lt;/p&gt;&lt;p&gt;24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం: 2016లో కేవలం ₹28,500 - ₹30,000 మధ్య ఉన్న పసిడి ధర, 2020 కోవిడ్ సమయంలో ₹50,000 మార్కును దాటింది. ఆ తర్వాత భౌగోళిక ఉద్రిక్తతల వల్ల 2024 నాటికి ₹75,000 దాటి, ప్రస్తుతం 2026లో ఏకంగా ₹1,60,000 పైచిలుకు స్థాయికి చేరుకుంది. అంటే గత పదేళ్లలో లభించిన రాబడి సుమారు 400% పైమాటే.&lt;/p&gt;&lt;p&gt;వెండి 1 కిలోగ్రాము: 2016లో ₹38,000 - ₹42,000గా ఉన్న కిలో వెండి ధర.. సోలార్, ఎలక్ట్రానిక్స్ రంగాల నుంచి డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం 2026లో ఏకంగా ₹2,60,000 మైలురాయిని తాకింది. దీనిపై గత 10 ఏళ్లలో దాదాపు 500% కి పైగా లాభం నమోదైంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;దేశవ్యాప్తంగా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు గరిష్ఠ స్థాయిల్లో కొనసాగుతున్నాయి. స్థానిక పన్నులు, రవాణా వ్యయాల ఆధారంగా తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలలో ప్రస్తుతం నమోదైన ధరలు గమనిస్తే.. హైదరాబాద్ మార్కెట్&zwnj;లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర సుమారు రూ.1,56,770 కాగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,700 గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ₹1,17,580 వద్ద ట్రేడ్ అవుతోంది.&lt;/p&gt;&lt;p&gt;అదేవిధంగా విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,770 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర ₹1,43,700గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర ₹1,20,967 గా ఉంది. మరోవైపు, పారిశ్రామిక రంగా నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటంతో రెండు నగరాల్లోనూ కిలో వెండి ధర ఏకంగా ₹2,60,000 మార్కును తాకింది. ఈ ధరలన్నీ బేస్ అంచనా మాత్రమే, వీటిపై 3% GST, జ్యువెలర్స్ మేకింగ్ ఛార్జీలు అదనంగా వర్తిస్తాయి.&lt;/p&gt;&lt;p&gt;ఫ్యూచర్ సేవింగ్స్ విషయంలో కాగితపు నోట్లపై మాత్రమే ఆధారపడకుండా, గోల్డ్, సిల్వర్ వంటి రియల్ అసెట్స్&zwnj;లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆర్థిక భద్రత సాధించవచ్చని రాబర్ట్ కియోసాకి అనుభవంతో చెప్పారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/gold-and-silver-will-save-your-wealth-rich-dad-poor-dad-author-robert-kiyosaki-warns-bcvvd9u"/>
        </item>
        <item>
            <title><![CDATA[Jio Platforms: జియో రాక‌తో దేశంలో జ‌రిగిన అద్భుతాలు ఇవే.. ఈ రంగాల్లో స‌మూల మార్పులు]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/jio-platforms-how-jio-transformed-india-in-10-years-from-cheap-data-to-5g-ai-and-digital-revolution-chrng6k</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/jio-platforms-how-jio-transformed-india-in-10-years-from-cheap-data-to-5g-ai-and-digital-revolution-chrng6k</guid>
            <pubDate>Thu, 03 Sep 2026 17:07:25 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Jio Platforms: భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన జియో ప్రారంభమై పదేళ్లు పూర్తవుతోంది. 2016 సెప్టెంబర్&zwnj;లో ప్రారంభమైన జియో.. మొబైల్ డేటాను సామాన్యులకు అందుబాటులోకి వ&zwnj;చ్చిన జియో ఎన్నో రంగాల్లో విప్ల&zwnj;వాత్మ&zwnj;క మార్పుల&zwnj;కు కార&zwnj;ణ&zwnj;మైంది&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1kgqwjvp1tv77fpr6511ntk,imgname-jio-platforms-1788435231322.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Jio Platforms: భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన జియో ప్రారంభమై పదేళ్లు పూర్తవుతోంది. 2016 సెప్టెంబర్&zwnj;లో ప్రారంభమైన జియో.. మొబైల్ డేటాను సామాన్యులకు అందుబాటులోకి వ&zwnj;చ్చిన జియో ఎన్నో రంగాల్లో విప్ల&zwnj;వాత్మ&zwnj;క మార్పుల&zwnj;కు కార&zwnj;ణ&zwnj;మైంది&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జియో 2016లో పూర్తిగా ఇంటర్నెట్ ఆధారిత నెట్&zwnj;వర్క్&zwnj;తో సేవలను ప్రారంభించింది. సంప్రదాయ వాయిస్ నెట్&zwnj;వర్క్&zwnj;కు బదులుగా డేటా కనెక్షన్ ద్వారానే కాల్స్ అందించే సాంకేతికతను ఉపయోగించింది. ప్రారంభమైన కేవలం 180 రోజుల్లోనే 10 కోట్ల మంది 4జీ వినియోగదారులను చేరుకోవడం జియో సాధించిన అరుదైన ఘనతగా నిలిచింది. జియో రాకముందు భారత్&zwnj;లో కాల్స్, డేటాకు వేర్వేరుగా ఛార్జీలు ఉండేవి. జియో ఉచిత వాయిస్ కాల్స్ అందిస్తూ డేటాను అత్యంత తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చింది. జియో ప్రారంభమైన సమయంలో ఒక జీబీ డేటా ధర సుమారు రూ.228 ఉండగా, ప్రస్తుతం అది రూ.8 కంటే తక్కువకు చేరింది. ఇదే సమయంలో దేశంలో ఇంటర్నెట్ వేగం కూడా గణనీయంగా పెరిగింది. గతంలో సగటు డౌన్&zwnj;లోడ్ స్పీడ్ 2.5 Mbps వరకు ఉండగా, ప్రస్తుతం 68 Mbpsకు పైగా చేరింది. జియో వైర్&zwnj;లెస్ నెట్&zwnj;వర్క్ ప్రస్తుతం దేశ జనాభాలో 99 శాతానికి పైగా ప్రజలకు అందుబాటులో ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మొత్తం వైర్&zwnj;లెస్ డేటా ట్రాఫిక్&zwnj;లో దాదాపు 60 శాతం జియో నెట్&zwnj;వర్క్ ద్వారానే జరిగింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల వాటా సుమారు 46 శాతంగా ఉంది. చైనా మినహా ప్రపంచంలో అత్యధిక మొబైల్ డేటా ట్రాఫిక్&zwnj;ను నిర్వహిస్తున్న నెట్&zwnj;వర్క్&zwnj;గా జియో నిలిచింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మొబైల్ ఇంటర్నెట్&zwnj;లో విప్లవం తీసుకొచ్చిన జియో.. ఆ తర్వాత హౌజ్&zwnj; బ్రాడ్&zwnj;బ్యాండ్ రంగంపైనా దృష్టి పెట్టింది. 2019లో జియో ఫైబర్&zwnj;ను ప్రారంభించి హైస్పీడ్ ఇంటర్నెట్&zwnj;ను ఇళ్లకు అందించింది. అనంతరం 2024 ఆర్థిక సంవత్సరంలో జియో ఎయిర్&zwnj;ఫైబర్&zwnj;ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో ఎయిర్&zwnj;ఫైబర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇంటి వరకు కేబుల్ వేయాల్సిన అవసరం లేకుండానే వైర్&zwnj;లెస్ టెక్నాలజీ ద్వారా గరిష్ఠంగా 1 Gbps వేగంతో ఇంటర్నెట్ అందించగలగడం.&lt;/p&gt;&lt;p&gt;దీంతో ఒకే రోజులో ఇంటికి బ్రాడ్&zwnj;బ్యాండ్ కనెక్షన్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఏర్పడింది. 2026 మార్చి నాటికి జియో ద్వారా 2.7 కోట్లకు పైగా ఇళ్లు బ్రాడ్&zwnj;బ్యాండ్ సేవలు పొందుతున్నాయి. రెండేళ్ల క్రితం ఈ సంఖ్య సుమారు 1.1 కోట్లుగా ఉండేది. జియో ఎయిర్&zwnj;ఫైబర్ ద్వారా మాత్రమే దాదాపు 1.3 కోట్ల కనెక్షన్లు అందాయి. ప్రస్తుతం భారత్&zwnj;లో అతిపెద్ద ఫిక్స్&zwnj;డ్ బ్రాడ్&zwnj;బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్&zwnj;గా జియో నిలిచింది. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశంలో కొత్తగా వచ్చిన ఫిక్స్&zwnj;డ్ బ్రాడ్&zwnj;బ్యాండ్ కనెక్షన్లలో మూడింట రెండొంతులకుపైగా జియో ఖాతాలోకే వెళ్లాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా భారీగా కొత్త కనెక్షన్లు వచ్చాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జియో కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ అందించే సంస్థగా పరిమితం కాలేదు. ఆ కనెక్షన్ ద్వారా ప్రజలు ఉపయోగించే అనేక డిజిటల్ సేవలను కూడా అభివృద్ధి చేసింది. జియో సెట్&zwnj;టాప్ బాక్స్ ద్వారా సాధారణ టెలివిజన్&zwnj;ను ఎంటర్&zwnj;టైన్&zwnj;మెంట్ హబ్&zwnj;గా, గేమింగ్ పరికరంగా, కంప్యూటర్&zwnj;గా మార్చే అవకాశం కల్పిస్తోంది. జియో టీవీ ప్లస్&zwnj;లో వెయ్యికి పైగా డిజిటల్ ఛానళ్లు, 15 స్ట్రీమింగ్ సేవలు ఒకే ప్లాట్&zwnj;ఫామ్&zwnj;లో అందుబాటులో ఉన్నాయి. భారతీయ భాషల్లో లైవ్, ఆన్&zwnj;డిమాండ్ కంటెంట్&zwnj;ను సులభంగా వెతికే సదుపాయం కూడా ఉంది. గేమింగ్ ప్రియుల కోసం జియో గేమ్స్ ద్వారా 3,400కు పైగా గేమ్స్ అందిస్తోంది. ప్రత్యేక గేమింగ్ కన్సోల్ లేకుండానే వీటిని వినియోగించుకోవచ్చు.&lt;/p&gt;&lt;p&gt;మరోవైపు జియో పీసీ ద్వారా టెలివిజన్ స్క్రీన్&zwnj;పైనే పూర్తి స్థాయి కంప్యూటర్&zwnj;ను ఉపయోగించే అవకాశం కల్పిస్తోంది. మైజియో యాప్ ద్వారా వినియోగదారులు ఎంటర్&zwnj;టైన్&zwnj;మెంట్, క్లౌడ్ స్టోరేజ్, షాపింగ్, ఆర్థిక సేవలు వంటి అనేక సదుపాయాలను పొందుతున్నారు. 2024లో ప్రారంభమైన జియో ఏఐ క్లౌడ్ ద్వారా ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను స్టోర్ చేయడమే కాకుండా ఏఐ సాయంతో వాటిని సులభంగా నిర్వహించుకోవచ్చు. 2026 మార్చితో ముగిసిన త్రైమాసికంలో జియో వినియోగదారుడు సగటున నెలకు 42 జీబీకి పైగా డేటా వినియోగించాడు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ డేటా వినియోగ దేశంగా ఎదిగింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత్&zwnj;లో యువత అవసరాలకు అనుగుణంగా డిజిటల్ సేవలు వేగంగా మారుతున్నాయి. వినోదం, విద్య, ఆన్&zwnj;లైన్ చెల్లింపులు, గేమింగ్, ఉద్యోగం.. అన్నీ చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే జరగాలని కొత్త తరం భావిస్తోంది. జియో మొబైల్ వినియోగదారుల్లో దాదాపు సగం మంది 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు వారే.&lt;/p&gt;&lt;p&gt;ఇప్పటికీ దేశంలో 26 కోట్లకు పైగా ప్రజలు 2జీ నెట్&zwnj;వర్క్&zwnj;లను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వారిని డిజిటల్ ప్రపంచంలోకి తీసుకురావడానికి జియో భారత్ ఫోన్&zwnj;ను రూపొందించింది. తక్కువ ధరలో లభించే ఈ స్మార్ట్ ఫీచర్ ఫోన్&zwnj;లో యూపీఐ చెల్లింపులు, వీడియో స్ట్రీమింగ్, సంగీతం వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్&zwnj;ను కూడా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడంపై జియో దృష్టి పెట్టింది. జియో ఏఐ క్లౌడ్ ద్వారా కుటుంబ సభ్యుల ఫొటోలను ముఖాల ఆధారంగా గుర్తించడం, సులభంగా ఎడిట్ చేయడం వంటి సేవలు అందిస్తోంది.&lt;/p&gt;&lt;p&gt;జియో తన నెట్&zwnj;వర్క్ నిర్వహణలో కూడా ఏఐని ఉపయోగిస్తోంది. జియో బ్రెయిన్ అనే సొంత ఏఐ ఇంజిన్ ద్వారా నెట్&zwnj;వర్క్&zwnj;లో సమస్యలు తలెత్తకముందే గుర్తించడం, ట్రాఫిక్&zwnj;కు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచడం, కోట్లాది యూజ&zwnj;ర్ల&zwnj;కు స్థిరమైన కనెక్షన్ అందించడం వంటి పనులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో పూర్తిస్థాయి ఏఐ ఆధారిత సంస్థగా మారడమే జియో లక్ష్యంగా పెట్టుకుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జియో సేవలు కేవలం మొబైల్ వినియోగదారులకు మాత్రమే పరిమితం కాలేదు. దేశంలోని అనేక కీలక సంస్థలు జియో టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. భారతదేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 90 శాతానికి పైగా బ్యాంకులు జియో సేవల్లో కనీసం ఒక సేవను వినియోగిస్తున్నాయి. దేశంలోని 80 శాతానికి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు జియో కనెక్టివిటీ, సెన్సార్ నెట్&zwnj;వర్క్&zwnj;లను ఉపయోగిస్తున్నాయి. దేశంలోని అనేక విమానాశ్రయాలు కూడా జియో నెట్&zwnj;వర్క్&zwnj;తో అనుసంధానమై ఉన్నాయి.&lt;/p&gt;&lt;p&gt;భారత్&zwnj;లో సుమారు 8 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు ఉన్నాయి. వీటిలో చాలావరకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో డిజిటల్ సేవలను ఉపయోగించడం ప్రారంభించలేదు. పెద్ద కంపెనీలకు అందించే టెక్నాలజీ సామర్థ్యాన్ని చిన్న దుకాణాలు, క్లినిక్&zwnj;లు, వర్క్&zwnj;షాప్&zwnj;లకు కూడా అందించాలనే లక్ష్యంతో జియో పనిచేస్తోంది.&lt;/p&gt;&lt;p&gt;దేశీయంగా టెక్నాలజీని అభివృద్ధి చేయడంపైనా జియో ప్రత్యేక దృష్టి పెట్టింది. నెట్&zwnj;వర్క్, పరికరాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్, అప్లికేషన్ల వరకు అనేక రంగాల్లో సొంత టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. 2026 మార్చి నాటికి 4జీ, 5జీ, 6జీ నెట్&zwnj;వర్క్ టెక్నాలజీతో పాటు ఏఐ ఆధారిత నెట్&zwnj;వర్క్ ఆటోమేషన్&zwnj;కు సంబంధించి 6,800కు పైగా పేటెంట్ దరఖాస్తులు చేసింది.&lt;/p&gt;&lt;p&gt;జియో 5జీ నెట్&zwnj;వర్క్ భారతదేశంలో స్టాండలోన్ ఆర్కిటెక్చర్&zwnj;పై పనిచేసిన తొలి నెట్&zwnj;వర్క్&zwnj;గా నిలిచింది. దేశీయంగా పూర్తి స్థాయి 5జీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసిన ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన భారత్ చేరడంలో జియో పాత్ర కీలకంగా ఉంది. మొత్తంగా చూస్తే జియో గత పదేళ్లలో భారత డిజిటల్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు ఖరీదైన డేటాను చౌకగా అందుబాటులోకి తెచ్చింది. నెట్&zwnj;వర్క్ లేని ప్రాంతాలకు కనెక్టివిటీని తీసుకెళ్లింది. ఇప్పుడు ఏఐ, క్లౌడ్, కంప్యూటింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలను సామాన్యుల ఇంటి వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.&lt;/p&gt;&lt;p&gt;జియో ప్రయాణం కేవలం టెలికాం కంపెనీ విజయగాథ మాత్రమే కాదు. ప్రతి భారతీయుడికి డిజిటల్ ప్రపంచాన్ని చేరువ చేసే ప్రయత్నం. గత దశాబ్దం ఇంటర్నెట్ అందుబాటు గురించి అయితే.. రాబోయే దశాబ్దం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ టెక్నాలజీల ఆధారంగా ఉండబోతోందనే సంకేతాలను జియో ఇస్తోంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/jio-platforms-how-jio-transformed-india-in-10-years-from-cheap-data-to-5g-ai-and-digital-revolution-chrng6k"/>
        </item>
        <item>
            <title><![CDATA[Cheapest Gold : ఇండియాలో అత్యంత చౌకగా బంగారం దొరికే సిటీ ఏది? ఇక్కడ ఎందుకంత తక్కువ ధర?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/thrissur-the-city-in-india-with-the-cheapest-gold-prices-eptxlzg</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/thrissur-the-city-in-india-with-the-cheapest-gold-prices-eptxlzg</guid>
            <pubDate>Mon, 31 Aug 2026 15:20:34 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;భారతదేశంలోనే అత్యంత తక్కువ ధరకు బంగారం లభించే నగరం ఏది? అక్కడ రేటు ఎందుకంత తక్కువగా ఉంటుంది? బంగారం అత్యధిక ధర ఉండే సిటీ ఏది? ఇందుకు కారణమేంటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1bjd91zx121qe9cxmk9xbmy,imgname-gold-price-1788168545343.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;భారతదేశంలోనే అత్యంత తక్కువ ధరకు బంగారం లభించే నగరం ఏది? అక్కడ రేటు ఎందుకంత తక్కువగా ఉంటుంది? బంగారం అత్యధిక ధర ఉండే సిటీ ఏది? ఇందుకు కారణమేంటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మనం రోజూ బంగారం ధర పెరిగిందనో లేక తగ్గిందనో వింటుంటాం&hellip; ఈ ధర దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటుందని అనుకుంటాం. కానీ ఇది నిజం కాదు&hellip; ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా బంగారం ధర ఉంటుంది. మన హైదరాబాద్ లో ఒకలా, ఆర్థిక రాజధాని ముంబైలో మరోలా ధరలు ఉంటాయి. రవాణా ఖర్చులు, స్థానిక పన్నులు, హ్యాండ్లింగ్ ఛార్జీల వల్ల ఒక్కో నగరంలో బంగారం ధర ఒక్కోలా ఉంటుంది. మరి ఇండియాలో అత్యంత చౌకగా బంగారం దొరికే నగరం ఏదో తెలుసా?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారతదేశ 'గోల్డ్ క్యాపిటల్' గా కేరళలోని &lsquo;త్రిస్సూర్&rsquo; నగరం పేరుగాంచింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈ త్రిస్సూర్ లో బంగారం ధర తక్కువగా ఉంటుంది&hellip; ఇందుకు కొన్ని కీలక ఆర్థిక కారణాలున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;మొదటిది రవాణా ఖర్చులు (లాజిస్టిక్స్) తక్కువగా ఉండటం. విదేశాల నుంచి దిగుమతి అయ్యే బంగారం సముద్ర మార్గంలో కేరళలోని కొచ్చి పోర్ట్&zwnj;కు చేరుకుంటుంది. ఈ త్రిస్సూర్ నగరం కొచ్చికి చాలా దగ్గరగా ఉండటంతో రవాణా, నిర్వహణ ఖర్చులు బాగా తగ్గుతాయి. ఈ ప్రయోజనం నేరుగా కస్టమర్లకు అందుతుంది&hellip; అందుకే ధర తగ్గుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;త్రిస్సూర్ బంగారు వ్యాపారానికి ఒక గ్లోబల్ సెంటర్&zwnj;గా ఉంది. ఇక్కడ భారీ స్థాయిలో గోల్డ్ ట్రేడింగ్ జరుగుతుంది. పెద్ద హోల్&zwnj;సేల్ మార్కెట్ ఉండటంతో వ్యాపారుల మధ్య పోటీ ఎక్కువ. కాబట్టి వ్యాపారులు తక్కువ లాభాలతో (Low margins) ఎక్కువ మొత్తంలో బంగారం అమ్మడానికి ముందుకొస్తారు. ఇది కూడా త్రిస్సూర్ బంగారం ధరలు తక్కువగా ఉండటానికి కారణం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలపై జీఎస్&zwnj;టీ ఒకేలా ఉన్నప్పటికీ వివిధ రాష్ట్రాలు విధించే స్థానిక సెస్సులు, హ్యాండ్లింగ్ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. అయితే కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బంగారంపై విధించే పన్నులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి&hellip;అందుకే కస్టమర్లకు తక్కువ ధరకే బంగారం లభిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మరోవైపు దేశంలోనే అత్యధిక ధరకు బంగారం అమ్ముడయ్యే నగరాల్లో ఢిల్లీ ముందుంది. రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండటం, మెట్రో నగర నిర్వహణ వ్యయాలు, స్థానిక అదనపు పన్నుల కారణంగా డిల్లీలో బంగారం రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో బంగారం ధరలు కాస్త తక్కువగానే ఉంటాయి&hellip; హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి తెలుగు నగరాల్లో బంగారం ధరలు తక్కువే.&lt;/p&gt;&lt;p&gt;మీరు పెద్ద మొత్తంలో బంగారం కొనాలని ప్లాన్ చేస్తుంటే లేదా పెట్టుబడి కోసం బంగారం కొనాలనుకుంటే త్రిస్సూర్ అత్యంత అనుకూలమైన, లాభదాయకమైన మార్కెట్ అని నిపుణులు చెబుతున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Arun Kumar P</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/thrissur-the-city-in-india-with-the-cheapest-gold-prices-eptxlzg"/>
        </item>
        <item>
            <title><![CDATA[Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/currency-notes-animal-fat-in-polymer-currency-notes-know-which-countries-faced-controversy-l7f14dt</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/currency-notes-animal-fat-in-polymer-currency-notes-know-which-countries-faced-controversy-l7f14dt</guid>
            <pubDate>Wed, 02 Sep 2026 15:53:05 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Currency Notes: ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ప్లాస్టిక్&zwnj; లేదా పాలిమర్&zwnj; కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల ఈ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు ఉప&zwnj;యోగించిన&zwnj;ట్లు కొన్ని వివ&zwnj;దాలు త&zwnj;లెత్తాయి. ఆ దేశాలు ఏంటి.? వివాదం ఏంటంటే.?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1gf6gt97ht6cdce6h55bdr3,imgname-currency-notes-1788332950344.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Currency Notes: ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ప్లాస్టిక్&zwnj; లేదా పాలిమర్&zwnj; కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల ఈ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు ఉప&zwnj;యోగించిన&zwnj;ట్లు కొన్ని వివ&zwnj;దాలు త&zwnj;లెత్తాయి. ఆ దేశాలు ఏంటి.? వివాదం ఏంటంటే.?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రపంచంలో పాలిమర్&zwnj; నోట్లను ఉపయోగిస్తున్న దేశాల్లో బ్రిటన్&zwnj; కూడా ఒకటి. 2016లో బ్యాంక్&zwnj; ఆఫ్&zwnj; ఇంగ్లండ్&zwnj; కొత్తగా 5, 10 పౌండ్ల పాలిమర్&zwnj; నోట్లను విడుదల చేసింది. అయితే వాటి తయారీలో ఉపయోగించిన పదార్థాల్లో టాలో (Tallow)కు సంబంధించిన అంశాలు ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. టాలో అంటే సాధారణంగా మాంసం, ముఖ్యంగా పశువుల కొవ్వు నుంచి లభించే కొవ్వు పదార్థం. ఈ విషయం బయటకు రావడంతో బ్రిటన్&zwnj;లోని కొన్ని శాఖాహార సంఘాలు, హిందూ, సిక్కు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో కరెన్సీ నోట్ల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలపై పెద్ద చర్చ జరిగింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పాలిమర్&zwnj; నోట్లను తొలిసారిగా పెద్ద స్థాయిలో ప్రవేశపెట్టిన దేశాల్లో ఆస్ట్రేలియా ముందుంది. 1988లో అక్కడ పాలిమర్&zwnj; కరెన్సీ నోట్ల వినియోగం ప్రారంభమైంది. ప్రారంభ దశలో వాటి తయారీకి ఉపయోగించిన కొన్ని పదార్థాల్లో జంతువుల నుంచి లభించే కొవ్వు ఆధారిత సమ్మేళనాలు ఉన్నట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. కెనడా, న్యూజిలాండ్&zwnj; వంటి దేశాల్లో కూడా పాలిమర్&zwnj; కరెన్సీ తయారీలో ఉపయోగించే పదార్థాల్లో జంతువుల కొవ్వు ఆధారిత పదార్థాల ఉనికిపై చర్చ జరిగింది. అయితే నోట్లలో నేరుగా జంతువుల కొవ్వును కలుపుతారని అర్థం చేసుకోవడం సరికాదు. తయారీ ప్రక్రియలో ఉపయోగించే కొన్ని రసాయన పదార్థాల్లో జంతువుల కొవ్వు నుంచి వచ్చిన భాగాలు ఉండే అవకాశం ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పాలిమర్&zwnj; నోట్ల తయారీలో పలుచటి ప్లాస్టిక్&zwnj; షీట్లను ఉపయోగిస్తారు. ఈ షీట్లకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండటంతో అవి ఒకదానికొకటి అతుక్కోవడం, స్టాటిక్&zwnj; ఎలక్ట్రిసిటీ ఏర్పడటం వంటి సమస్యలు రావచ్చు. వీటిని నియంత్రించేందుకు తయారీ ప్రక్రియలో కొన్ని రకాల స్లిప్&zwnj; ఏజెంట్లు, యాంటీ స్టాటిక్&zwnj; ఏజెంట్లు ఉపయోగిస్తారు. వీటిలో స్టియరిక్&zwnj; యాసిడ్&zwnj; వంటి పదార్థాలు ఉండొచ్చు. స్టియరిక్&zwnj; యాసిడ్&zwnj; వివిధ వనరుల నుంచి తయారవుతుంది. కొన్ని సందర్భాల్లో దీనిని జంతువుల కొవ్వు నుంచి కూడా ఉత్పత్తి చేస్తారు. అందుకే కొన్ని పాలిమర్&zwnj; కరెన్సీల ముడి పదార్థాల్లో జంతు ఆధారిత పదార్థాల ఆనవాళ్లు ఉన్నాయనే చర్చ జరిగింది. అయితే ఇది నోట్లలో ఉద్దేశపూర్వకంగా జంతువుల కొవ్వు కలపడం అనే అర్థం కాదు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత్&zwnj;లో రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్&zwnj; నోట్లను ప్రవేశపెట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రారంభ దశలో పెద్ద మొత్తంలో పాలిమర్&zwnj; సబ్&zwnj;స్ట్రేట్&zwnj; షీట్లను కొనుగోలు చేయడానికి సంబంధించిన ప్రక్రియ చేపట్టినట్లు సమాచారం. అంచనాల ప్రకారం రూ.10 నోట్ల కోసం 34 వేల రిమ్స్, రూ.20 నోట్ల కోసం మరో 34 వేల రిమ్స్ అవసరమవుతాయి. ఒక రిమ్&zwnj;లో 500 షీట్లు ఉంటే మొత్తంగా సుమారు 3.4 కోట్ల పాలిమర్&zwnj; షీట్లు అవసరం అవుతాయి. అయితే ఇది ప్రారంభ అంచనా మాత్రమే. అవసరాన్ని బట్టి ఈ సంఖ్యలో మార్పులు ఉండొచ్చు. పాలిమర్&zwnj; నోట్లకు కాగితపు నోట్ల కంటే ఎక్కువ మన్నిక ఉంటుందని భావిస్తున్నారు. ఇవి తేమకు, సాధారణ వినియోగంలో చిరిగిపోవడానికి కొంత ఎక్కువగా నిరోధకత కలిగి ఉంటాయి. దీంతో తరచూ నోట్లను ముద్రించి మార్చాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పాలిమర్&zwnj; నోట్లలో ఆధునిక భద్రతా లక్షణాలను అమర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పారదర్శక విండో, ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లు, రంగు మారే ఇంక్&zwnj;, మాగ్నెటిక్&zwnj; అంశాలు వంటి వాటిని ఉపయోగించవచ్చు. దీంతో నకిలీ నోట్ల తయారీని మరింత కష్టతరం చేయవచ్చని భావిస్తున్నారు. అంతేకాదు.. భారత్&zwnj;లో తయారు చేసే పాలిమర్&zwnj; షీట్ల విషయంలో జంతువుల కొవ్వు లేదా జంతువుల DNA ఉండకూడదనే నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. సరఫరాదారులు తాము అందించే షీట్లు ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని ధ్రువీకరించాల్సి ఉంటుంది. అంటే ఇతర దేశాల్లో పాలిమర్&zwnj; నోట్ల విషయంలో ఎదురైన వివాదాలను దృష్టిలో పెట్టుకుని భారత్&zwnj; ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పొచ్చు. అయితే పాలిమర్&zwnj; నోట్లను విస్తృతంగా చలామణిలోకి తీసుకురావడంపై తుది నిర్ణయం, అమలు విధానం సంబంధిత అధికారిక ప్రకటనలపై ఆధారపడి ఉంటుంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/currency-notes-animal-fat-in-polymer-currency-notes-know-which-countries-faced-controversy-l7f14dt"/>
        </item>
        <item>
            <title><![CDATA[మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/reliance-mukesh-ambanis-reliance-enters-ice-cream-market-bombay-creamery-launches-products-ns258rb</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/reliance-mukesh-ambanis-reliance-enters-ice-cream-market-bombay-creamery-launches-products-ns258rb</guid>
            <pubDate>Tue, 01 Sep 2026 18:34:26 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Reliance: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్&zwnj;కు చెందిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ భారత ఐస్&zwnj;క్రీమ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. కంపెనీ తాజాగా &lsquo;బాంబే క్రీమరీ&rsquo; పేరుతో కొత్త ఐస్&zwnj;క్రీమ్ బ్రాండ్&zwnj;ను ప్రారంభించింది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1egwybymk5brrv5fss45tcv,imgname-reliance-1788267624829.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Reliance: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్&zwnj;కు చెందిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ భారత ఐస్&zwnj;క్రీమ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. కంపెనీ తాజాగా &lsquo;బాంబే క్రీమరీ&rsquo; పేరుతో కొత్త ఐస్&zwnj;క్రీమ్ బ్రాండ్&zwnj;ను ప్రారంభించింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బాంబే క్రీమరీ ఐస్&zwnj;క్రీమ్&zwnj;ల ధరలను సామాన్య వినియోగదారులకు అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. ఈ ఉత్పత్తుల ప్రారంభ ధర కేవలం రూ.10గా నిర్ణ&zwnj;యించారు. కోన్స్, కప్స్, టబ్స్, బార్స్, స్టిక్స్ వంటి పలు రకాల ఫార్మాట్లలో ఐస్&zwnj;క్రీమ్&zwnj;లు అందుబాటులోకి రానున్నాయి. ప్రీమియం నాణ్యతతో పాటు తక్కువ ధరలో ఉత్పత్తులను అందించాలనే రిలయన్స్ వ్యూహంలో భాగంగానే ఈ బ్రాండ్&zwnj;ను రూపొందించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బాంబే క్రీమరీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో నిజమైన డెయిరీ క్రీమ్&zwnj;ను ఉపయోగిస్తున్నట్లు RCPL తెలిపింది. ఐస్&zwnj;క్రీమ్ తయారీలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అసలైన పాల పదార్థాలతో ఉత్పత్తులను తయారు చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. RCPL డైరెక్టర్ టీ. కృష్ణకుమార్ మాట్లాడుతూ.. డెయిరీ ఉత్పత్తుల్లో షార్ట్&zwnj;కట్స్ ఉండకూడదనే ఆలోచనతో ఈ బ్రాండ్&zwnj;ను రూపొందించామని చెప్పారు. ప్రతి భారతీయ కుటుంబం కొనుగోలు చేయగల ధరలో అసలైన ఐస్&zwnj;క్రీమ్ రుచిని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బాంబే క్రీమరీ ఉత్పత్తులను తొలుత పశ్చిమ భారతదేశంలోని మార్కెట్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించాలని RCPL ప్రణాళికలు సిద్ధం చేసింది. రిలయన్స్&zwnj;కు ఇప్పటికే దేశవ్యాప్తంగా బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్&zwnj;వర్క్, భారీ రిటైల్ వ్యవస్థ ఉంది. దీంతో కొత్త ఐస్&zwnj;క్రీమ్ బ్రాండ్&zwnj;ను వేగంగా వినియోగదారులకు చేరవేయడం కంపెనీకి సులభం కానుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇప్పటికే ఆహారం, పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ, గృహ వినియోగ ఉత్పత్తుల రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా కాంపా ద్వారా డ్రింక్స్&zwnj; మార్కెట్లో రిలయన్స్ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. ఇండిపెండెన్స్ బ్రాండ్ ద్వారా వంట నూనెలు, పిండి, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వంటి ఉత్పత్తులను విక్రయిస్తోంది. అలాగే పప్పులు, బియ్యం, నూడుల్స్, సాస్&zwnj;లు, బిస్కెట్లు, సబ్బులు, హెయిర్ కేర్, డిటర్జెంట్లు, క్లీనింగ్ ఉత్పత్తులు వంటి అనేక విభాగాల్లో కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించింది. ఇప్పుడు ఐస్&zwnj;క్రీమ్ మార్కెట్లోకి అడుగుపెట్టడం ద్వారా FMCG రంగంలో రిలయన్స్ పోర్ట్&zwnj;ఫోలియో మరింత విస్తరించనుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;భారత ఐస్&zwnj;క్రీమ్ మార్కెట్లోకి రావడం తాత్కాలిక నిర్ణయం కాదని RCPL స్పష్టం చేసింది. ఈ విభాగంలో దీర్ఘకాలికంగా వ్యాపారాన్ని విస్తరించాలనే లక్ష్యంతోనే బాంబే క్రీమరీని ప్రారంభించినట్లు తెలిపింది. ఇప్పటికే రిలయన్స్ తన భారీ రిటైల్ నెట్&zwnj;వర్క్&zwnj;తో దేశవ్యాప్తంగా కోట్లాది వినియోగదారులను చేరుకుంటోంది. అదే బలాన్ని ఉపయోగించి ఐస్&zwnj;క్రీమ్ రంగంలో కూడా ప్రధాన బ్రాండ్&zwnj;గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాణ్యమైన డెయిరీ పదార్థాలు, అందుబాటు ధరలు, విస్తృత పంపిణీ వ్యవస్థతో బాంబే క్రీమరీ భారత ఐస్&zwnj;క్రీమ్ మార్కెట్లో కొత్త పోటీకి తెరలేపే అవకాశం ఉంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/reliance-mukesh-ambanis-reliance-enters-ice-cream-market-bombay-creamery-launches-products-ns258rb"/>
        </item>
        <item>
            <title><![CDATA[లోన్ సెటిల్‌మెంట్ అంటే ఏంటి.? త‌క్కువ డ‌బ్బు చెల్లించినా బ్యాంకులు ఎందుకు ఒప్పుకుంటాయి?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/loan-settlement-explained-why-do-banks-accept-less-money-to-close-your-loan-qdeerfo</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/loan-settlement-explained-why-do-banks-accept-less-money-to-close-your-loan-qdeerfo</guid>
            <pubDate>Thu, 03 Sep 2026 22:05:21 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Loan Settlement: లోన్ చెల్లించ&zwnj;లేని ప&zwnj;రిస్థితుల్లో బ్యాంకులు కొంత తక్కువ మొత్తాన్ని తీసుకుని లోన్ అకౌంట్&zwnj;ను క్లోజ్ చేసేందుకు అంగీకరిస్తాయి. దీనినే లోన్ సెటిల్&zwnj;మెంట్ లేదా వన్&zwnj;టైమ్ సెటిల్&zwnj;మెంట్ అంటారు. బ్యాంకులు ఈ విధానానికి ఎందుకు ఒప్పుకుంటాయో తెలుసా.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m16w90ga22barqtqdmpe3kxt,imgname-loan-settlement-1788011119114.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Loan Settlement: లోన్ చెల్లించ&zwnj;లేని ప&zwnj;రిస్థితుల్లో బ్యాంకులు కొంత తక్కువ మొత్తాన్ని తీసుకుని లోన్ అకౌంట్&zwnj;ను క్లోజ్ చేసేందుకు అంగీకరిస్తాయి. దీనినే లోన్ సెటిల్&zwnj;మెంట్ లేదా వన్&zwnj;టైమ్ సెటిల్&zwnj;మెంట్ అంటారు. బ్యాంకులు ఈ విధానానికి ఎందుకు ఒప్పుకుంటాయో తెలుసా.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;లోన్ తీసుకున్న వ్యక్తి చెల్లించాల్సిన మొత్తం బకాయిలో కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని రుణాన్ని ముగించేందుకు బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ అంగీకరించడాన్ని లోన్ సెటిల్&zwnj;మెంట్ అంటారు. ఇందులో అసలు రుణం, వడ్డీ, పెనాల్టీలు లేదా ఇతర ఛార్జీలలో కొంత మొత్తాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి బ్యాంకులో రూ.10 లక్షల బకాయి ఉందనుకుందాం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతను మొత్తం చెల్లించే పరిస్థితిలో లేకపోతే, బ్యాంకు పరిస్థితులను పరిశీలించి రూ.6 లేదా రూ.7 లక్షలకు సెటిల్ చేసుకునేందుకు అంగీకరించవచ్చు. నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించిన తర్వాత ఖాతాను సెటిల్ చేసినట్లుగా నమోదు చేస్తారు. అయితే ఇది లోన్ పూర్తిగా క్లియర్ చేయడం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పూర్తి బకాయిని చెల్లిస్తే 'క్లోజ్డ్'గా నమోదు అవుతుంది. సెటిల్&zwnj;మెంట్&zwnj;లో మాత్రం 'సెటిల్డ్'గా కనిపించే అవకాశం ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మొదటి చూపులో భారీ బకాయి ఉన్నప్పుడు అందులో కొంత మొత్తాన్ని వదులుకోవడం బ్యాంకుకు నష్టంలా కనిపిస్తుంది. కానీ బ్యాంకులు దీర్ఘకాలిక రికవరీ ప్రక్రియను కూడా లెక్కలోకి తీసుకుంటాయి. రుణగ్రహీత నుంచి మొత్తం డబ్బు తిరిగి వచ్చే అవకాశం లేకపోతే, ఏళ్ల తరబడి కోర్టులు, నోటీసులు, రికవరీ ప్రక్రియల కోసం ప్రయత్నించడం కంటే ప్రస్తుతం కొంత మొత్తమైనా వసూలు చేసుకోవడం మంచిదని భావించవచ్చు. అంటే రూ.10 లక్షలు బకాయి ఉండి, మొత్తం రికవరీ అవుతుందనే హామీ లేకపోతే.. ప్రస్తుతం రూ.6 లక్షలు వస్తున్నాయంటే బ్యాంకు ఆ ప్రతిపాదనను పరిశీలించే అవకాశం ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;సాధారణంగా రుణగ్రహీత నిర్ణీత గడువులో వాయిదాలు చెల్లించకపోతే ఆ ఖాతా నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (NPA)గా మారే అవకాశం ఉంటుంది. ఒకసారి రుణం మొండి బకాయిగా మారితే దాన్ని తిరిగి వసూలు చేయడం మరింత కష్టంగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో బ్యాంకులకు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి ఏళ్ల తరబడి రికవరీ కోసం ప్రయత్నించడం, రెండోది కొంత మొత్తాన్ని వెంటనే తీసుకుని ఖాతాను పరిష్కరించడం. కోర్టు కేసులు, న్యాయవాదుల ఫీజులు, రికవరీ ఏజెన్సీల ఖర్చులు, నోటీసులు వంటి ప్రక్రియలకు సమయం, డబ్బు రెండూ అవసరం అవుతాయి. సెటిల్&zwnj;మెంట్ ద్వారా కొంత మొత్తమైనా త్వరగా రికవర్ చేసుకోవచ్చని బ్యాంకులు భావిస్తాయి. అదే సమయంలో తమ బ్యాడ్ లోన్ల భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;రుణగ్రహీత నిజంగా తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉన్నాడా లేదా అనేది కూడా సెటిల్&zwnj;మెంట్ సమయంలో కీలకంగా మారుతుంది. ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో భారీ నష్టాలు రావడం, ఆదాయం పూర్తిగా తగ్గిపోవడం వంటి పరిస్థితుల కారణంగా కొందరు మొత్తం రుణాన్ని చెల్లించలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో రుణగ్రహీత ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన తర్వాత బ్యాంకు కొంత తగ్గింపుతో సెటిల్&zwnj;మెంట్&zwnj;కు అంగీకరించే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికీ సెటిల్&zwnj;మెంట్ అవకాశం ఉంటుందని భావించకూడదు. రుణం రకం, బకాయి మొత్తం, చెల్లింపుల చరిత్ర, రుణగ్రహీత ఆర్థిక పరిస్థితి వంటి అంశాలను బట్టి బ్యాంకు నిర్ణయం తీసుకుంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;లోన్ సెటిల్&zwnj;మెంట్ ద్వారా తక్షణ ఆర్థిక ఒత్తిడి తగ్గినప్పటికీ, భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్&zwnj;పై ప్రభావం పడవచ్చు. క్రెడిట్ రిపోర్టులో రుణం పూర్తిగా చెల్లించినట్లు కాకుండా 'సెటిల్డ్'గా నమోదు కావచ్చు. దీన్ని భవిష్యత్తులో ఇతర బ్యాంకులు రుణం ఇచ్చే సమయంలో ప్రతికూల అంశంగా పరిగణించే అవకాశం ఉంటుంది. దీని వల్ల కొత్త పర్సనల్ లోన్ పొందడం కష్టమవచ్చు. హోమ్ లోన్, వెహికల్ లోన్&zwnj;కు ఇబ్బందులు ఎదురుకావచ్చు. క్రెడిట్ కార్డు పొందడం కష్టమయ్యే అవకాశం ఉంటుంది. క్రెడిట్ లిమిట్ పెంపు రిజ&zwnj;క్ట్ అవ్వొచ్చు. కొత్త రుణంపై అధిక వడ్డీ రేటు విధించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, రుణానికి కో-బారోవర్ లేదా గ్యారంటర్ ఉన్నట్లయితే వారికి కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఖాతాను ఎలా రిపోర్ట్ చేశారు, బ్యాంకు ఎలాంటి చర్యలు తీసుకుంది అనే అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/loan-settlement-explained-why-do-banks-accept-less-money-to-close-your-loan-qdeerfo"/>
        </item>
        <item>
            <title><![CDATA[Gold Price Hike: జన్మాష్టమి వేళ పసిడి జోరు.. రూ.4,640 పెరిగిన బంగారం.. ఎప్పుడు దిగొస్తుంది?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/gold-rate-hike-festive-demand-and-global-factors-push-prices-higher-r99oxu7</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/gold-rate-hike-festive-demand-and-global-factors-push-prices-higher-r99oxu7</guid>
            <pubDate>Fri, 04 Sep 2026 12:10:27 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Gold Price Hike: జన్మాష్టమి వేళ బంగారం షాకిచ్చింది. మార్కెట్&zwnj;లో బంగారం రేట్లు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్&zwnj; పరిణామాలతో దేశీయంగా ధరలపై ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్&zwnj; వర్గాలు చెబుతున్నాయి.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1nhtfgv3hmc3tn1gj6qfcx0,imgname-chatgpt-image-sep-4--2026--12-00-33-pm-1788503473691.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Gold Price Hike: జన్మాష్టమి వేళ బంగారం షాకిచ్చింది. మార్కెట్&zwnj;లో బంగారం రేట్లు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్&zwnj; పరిణామాలతో దేశీయంగా ధరలపై ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్&zwnj; వర్గాలు చెబుతున్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పండుగల సీజన్ మొదలైన వేళ బంగారం మార్కెట్&zwnj;లో మళ్లీ ధరల మంట మొదలైంది. సాధారణంగా పండుగలు, శుభకార్యాల సమయంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతుంటాయి. కానీ ఈసారి కొనుగోలు చేయాలనుకునే వారికి పెరుగుతున్న ధరలు మాత్రం గట్టి షాక్ ఇస్తున్నాయి.&amp;nbsp;24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల ధర ఒక్కరోజే రూ.1,310 పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ.1,56,660కు చేరుకుంది. మరోవైపు ఆభరణాల తయారీలో ఎక్కువగా వినియోగించే 22 క్యారెట్ల బంగారం కూడా భారీగా పెరిగింది. పది గ్రాములపై రూ.1,200 పెరగడంతో 22 క్యారెట్ల గోల్డ్&zwnj; ధర రూ.1,43,600గా నమోదైంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అయితే ఒక్కరోజు పెరుగుదల కంటే గత రెండు రోజుల పరిణామమే కొనుగోలుదారులను ఎక్కువగా కలవరపెడుతోంది. కేవలం రెండు రోజుల్లోనే పది గ్రాముల బంగారం ధర రూ.4,640 వరకు పెరిగింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్&zwnj; సమీపిస్తున్న సమయంలో ధరలు ఇలా ఒక్కసారిగా పెరగడంతో బంగారం కొనుగోలుకు సిద్ధమవుతున్న కుటుంబాల బడ్జెట్&zwnj;పై అదనపు భారం పడనుంది. ముఖ్యంగా ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు బంగారం ధరతో పాటు మేకింగ్&zwnj; ఛార్జీలు, జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉండటంతో తుది బిల్లు మరింత పెరిగే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;బంగారం ధరల పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్లలోని పరిస్థితులు, డాలర్&zwnj; విలువలో మార్పులు, పెట్టుబడిదారుల సెంటిమెంట్&zwnj; వంటి అంశాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల పసిడికి డిమాండ్&zwnj; పెరుగుతుంది. ఇదే సమయంలో దేశీయంగా పండుగలు, వివాహాల సీజన్&zwnj; కారణంగా ఆభరణాల డిమాండ్&zwnj; కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు మరింతగా పెరుగుతాయా? లేక త్వరలో కొంత ఉపశమనం లభిస్తుందా? అనేది రానున్న రోజుల్లో కీలకంగా మారనుంది.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Nandini Arava</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/gold-rate-hike-festive-demand-and-global-factors-push-prices-higher-r99oxu7"/>
        </item>
        <item>
            <title><![CDATA[ఆపిల్ కొత్త సీఈఓ జాన్ టర్నస్ vs సుందర్ పిచాయ్: ఎవరి జీతం ఎక్కువ? మైండ్ బ్లాక్ అయ్యే లెక్కలు ఇవే !]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/apple-ceo-john-ternus-vs-google-ceo-sundar-pichai-salary-net-worth-comparison-full-details-ru9g4tq</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/apple-ceo-john-ternus-vs-google-ceo-sundar-pichai-salary-net-worth-comparison-full-details-ru9g4tq</guid>
            <pubDate>Thu, 03 Sep 2026 10:08:29 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;John Ternus vs Sundar Pichai: టెక్ దిగ్గజ సంస్థలైన ఆపిల్, గూగుల్ బాస్ ల జీతభత్యాలు, ఆస్తుల వివరాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఆపిల్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జాన్ టర్నస్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వేతనాలు, నెట్ వర్త్ వివరాలు ఇక్కడ చూద్దాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1jrxgcabtynz8egy0m2n3dv,imgname-john-ternus-vs-sundar-pichai-1788410249610.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;John Ternus vs Sundar Pichai: టెక్ దిగ్గజ సంస్థలైన ఆపిల్, గూగుల్ బాస్ ల జీతభత్యాలు, ఆస్తుల వివరాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఆపిల్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జాన్ టర్నస్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వేతనాలు, నెట్ వర్త్ వివరాలు ఇక్కడ చూద్దాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆపిల్ సంస్థ కొత్త సీఈఓగా జాన్ టర్నస్ సెప్టెంబర్ 1 నుంచి బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 15 ఏళ్ల పాటు ఆపిల్ సీఈఓగా సేవలు అందించిన టిమ్ కుక్ స్థానంలో ఆయన ఈ పగ్గాలు చేపట్టారు. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జాన్ టర్నస్ కొత్త పే-ప్యాకేజ్ వివరాలను ఆపిల్ కంపెనీ అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫైలింగ్&zwnj;లో వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆపిల్ కొత్త సీఈఓ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ శాలరీల మధ్య పోలిక ఆసక్తికరంగా మారింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆపిల్ SEC ఫైలింగ్ ప్రకారం జాన్ టర్నస్ ఇయర్ బేసిక్ శాలరీ 30 లక్షల డాలర్లుగా నిర్ణయించారు. మన భారతీయ రూపాయిల్లో ఇది ఏటా రూ. 28.5 కోట్లు కాగా, నెలకు దాదాపు రూ. 2.37 కోట్లు వస్తుంది. అయితే టర్నస్ అసలు సంపాదన కేవలం బేస్ శాలరీ తో ముగిసిపోదు. ఆపిల్ కంపెనీ ఆర్థిక సంవత్సరం 2027 కోసం ఆయనకు 5.5 కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ. 522.5 కోట్ల టార్గెట్ ఈక్విటీ అవార్డును ఖరారు చేసింది. ఈ రెండింటినీ కలిపితే ఆయన టార్గెట్ కాంపెన్సేషన్ ఏకంగా 5.8 కోట్ల డాలర్లు అంటే రూ. 551 కోట్లుగా ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఆల్ఫాబెట్ 2026 SEC ఫైలింగ్ ప్రకారం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వార్షిక బేస్ శాలరీ 20 లక్షల డాలర్లు. భారతీయ కరెన్సీలో ఇది సంవత్సరానికి రూ. 19 కోట్లు కాగా, నెలకు రూ. 1.58 కోట్లుగా ఉంటుంది. 2020 నుంచి పిచాయ్ బేస్ శాలరీలో ఎలాంటి మార్పు లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పిచాయ్&zwnj;కు ఎలాంటి వార్షిక బోనస్ పొందే అర్హత లేదు. 2025లో సుందర్ పిచాయ్ మొత్తం కాంపెన్సేషన్ 10.91 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 103.6 కోట్లుగా ఉంది. ఇందులో రూ. 20.08 లక్షల డాలర్ల శాలరీ తో పాటు రూ. 88.98 లక్షల డాలర్ల ఇతర కాంపెన్సేషన్ ఉంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కేవలం బేస్ శాలరీని చూస్తే జాన్ టర్నస్ స్పష్టంగా ముందున్నారు. ఆయన వార్షిక ప్రాథమిక వేతనం పిచాయ్ కంటే రూ. 10 కోట్లు ఎక్కువ. టోటల్ కాంపెన్సేషన్&zwnj;లో చూసుకున్నా ఆపిల్ నిర్దేశించిన రూ. 551 కోట్ల టార్గెట్ ప్యాకేజ్ వల్ల టర్నస్ ముందంజలో ఉన్నారు. అయితే టర్నస్ పొందే 55 మిలియన్ డాలర్ల ఈక్విటీ అవార్డులో 75 శాతం పర్ఫార్మెన్స్ ఆధారిత RSUలు ఉంటాయి. అంటే ఆపిల్ షేర్ పర్ఫార్మెన్స్ ఆధారంగానే ఆయనకు అధిక భాగం అందుతుంది. మిగిలిన 25 శాతం టైమ్-బేస్డ్ RSUలుగా నాలుగేళ్లలో విడతలవారీగా ఇస్తారు. ఇవి కాకుండా 2026 ఆర్థిక సంవత్సరానికి టర్నస్&zwnj;కు దాదాపు 25 లక్షల డాలర్లు (రూ. 23.75 కోట్లు) ప్రో-రేటెడ్ RSU అవార్డు కూడా దక్కుతుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జీతంలో టర్నస్ ముందున్నా, మొత్తం నెట్&zwnj;వర్త్ చూస్తే మాత్రం సుందర్ పిచాయ్ చాలా ముందంజలో ఉన్నారు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం 1 సెప్టెంబర్ 2026 నాటికి సుందర్ పిచాయ్ అంచనా నెట్&zwnj;వర్త్ 1.6 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 15,200 కోట్లు. మరోవైపు జాన్ టర్నస్ నెట్&zwnj;వర్త్ గురించిన అధికారిక రిపోర్టులు బయటకు రాలేదు. సెలబ్రిటీ నెట్&zwnj;వర్త్, ఇతర బిజినెస్ రిపోర్టుల ప్రకారం ఆయన ఆస్తి సుమారు 7.5 కోట్ల డాలర్లు అంటే రూ. 712 కోట్లుగా అంచనా వేశారు. బేస్ శాలరీ, కాంపెన్సేషన్&zwnj;లో జాన్ టర్నస్ భారీ ప్యాకేజ్ కలిగి ఉన్నప్పటికీ, మొత్తం ఆస్తుల పరంగా మాత్రం సుందర్ పిచాయ్ చాలా ఎత్తులో ఉన్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/apple-ceo-john-ternus-vs-google-ceo-sundar-pichai-salary-net-worth-comparison-full-details-ru9g4tq"/>
        </item>
        <item>
            <title><![CDATA[7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/7th-vs-8th-pay-commission-salary-da-pension-changes-detailed-comparison-wuvdduw</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/7th-vs-8th-pay-commission-salary-da-pension-changes-detailed-comparison-wuvdduw</guid>
            <pubDate>Tue, 01 Sep 2026 13:47:27 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్&zwnj;తో ఉద్యోగుల జీతాలు మారనున్నాయి. 7వ, 8వ పే కమిషన్ల మధ్య తేడాలు, ఫిట్&zwnj;మెంట్ ఫ్యాక్టర్, కనీస వేతనం, డీఏ, హెచ్&zwnj;ఆర్&zwnj;ఏ, యూపీఎస్ పింఛన్ మార్పుల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kypzvgrnq868764sstqb8syr,imgname-8th-pay-commission-1785330516756.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్&zwnj;తో ఉద్యోగుల జీతాలు మారనున్నాయి. 7వ, 8వ పే కమిషన్ల మధ్య తేడాలు, ఫిట్&zwnj;మెంట్ ఫ్యాక్టర్, కనీస వేతనం, డీఏ, హెచ్&zwnj;ఆర్&zwnj;ఏ, యూపీఎస్ పింఛన్ మార్పుల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలను సవరించేందుకు కొత్త పే కమిషన్లు ఏర్పాటవుతుంటాయి. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ పే కమిషన్&zwnj;కు, రాబోతున్న 8వ పే కమిషన్&zwnj;కు మధ్య ప్రధాన తేడాలు ఏమిటి? ఫిట్&zwnj;మెంట్ ఫ్యాక్టర్, కనీస వేతనం, డీఏ, , ఇంటి అద్దె భత్యం, పింఛన్ విధానాలలో ఎలాంటి మార్పులు రానున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;7వ పే కమిషన్&zwnj;ను కేంద్ర ప్రభుత్వం 2014 ఫిబ్రవరిలో ఏర్పాటు చేయగా, అది 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. కమిషన్ 21 నెలల్లో తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. ఇక 8వ పే కమిషన్&zwnj;ను 2025 నవంబర్ 3న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ఏర్పాటు చేశారు. 8వ పే కమిషన్ ఏర్పాటైన తేదీ నుంచి 18 నెలల్లోగా, అంటే 2027 మే నాటికి తన తుది రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;7వ పే కమిషన్&zwnj;కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ నాయకత్వం వహించారు. 8వ పే కమిషన్&zwnj;కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షత వహిస్తున్నారు. 7వ పే కమిషన్ అమలుకు రెఫరెన్స్ తేదీగా 2016 జనవరి 1ని నిర్ణయించారు. అదేవిధంగా, 8వ పే కమిషన్&zwnj; ద్వారా జరిగే జీతాల సవరణకు కూడా రెఫరెన్స్ తేదీగా 2026 జనవరి 1ని నిర్ణయించారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;జీతాల పెంపును నిర్ణయించేది ఫిట్&zwnj;మెంట్ ఫ్యాక్టర్. 7వ పే కమిషన్&zwnj;లో ఫిట్&zwnj;మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. 8వ పే కమిషన్&zwnj;లో ఇది ఇంకా ఖరారు కాలేదు. అయితే నిపుణుల అంచనాల ప్రకారం ఇది 1.92 నుంచి 2.86 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం 2.28 నుంచి 2.46 వరకు ఉండే అవకాశం ఉంది.&lt;/p&gt;&lt;p&gt;7వ పే కమిషన్&zwnj;లో కనీస బేసిక్ పే రూ.7,000 నుంచి రూ.18,000కు పెరిగింది. 8వ పే కమిషన్&zwnj;లో ఖరారయ్యే ఫిట్&zwnj;మెంట్ ఫ్యాక్టర్&zwnj;ను బట్టి కనీస బేసిక్ పే రూ.34,560 నుంచి రూ.51,480 వరకు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;7వ పే కమిషన్ నిబంధనల ప్రకారం ప్రస్తుతం కరవు భత్యం (DA) 60%కి చేరింది. 8వ పే కమిషన్ అమల్లోకి వచ్చే సమయానికి డీఏను సున్నా (0%) చేస్తారు. పాత డీఏ మొత్తాన్ని బేసిక్ పేలో విలీనం చేస్తారు. 7వ పే కమిషన్&zwnj;లో డీఏ 50% దాటడంతో X, Y, Z కేటగిరీ నగరాల్లో HRA వరుసగా 30%, 20%, 10%గా మారింది. 8వ పే కమిషన్&zwnj;లో డీఏను బేసిక్ పేతో కలిపిన తర్వాత, హెచ్&zwnj;ఆర్&zwnj;ఏను మళ్లీ కొత్తగా లెక్కిస్తారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;7వ పే కమిషన్&zwnj;లో 2004 తర్వాత చేరిన ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వర్తించింది. 8వ పే కమిషన్&zwnj;లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఏకీకృత పింఛన్ పథకం (UPS), ఎన్&zwnj;పీఎస్ సంస్కరణలను చేర్చనున్నారు. 7వ పే కమిషన్&zwnj;లో కనీస పింఛన్ రూ.3,500 నుంచి రూ.9,000కు పెరిగింది. 8వ పే కమిషన్&zwnj;లో పింఛనుదారులకు కూడా దామాషా ప్రకారం పెరుగుదల ఉంటుంది.&lt;/p&gt;&lt;p&gt;8వ పే కమిషన్ రిపోర్టు 2026-27లో వచ్చే అవకాశం ఉన్నందున, 2027 కంటే ముందు ఇది అమల్లోకి రావడం సాధ్యం కాదు. 7వ పే కమిషన్ ద్వారా 47 లక్షల మంది ఉద్యోగులు, 52 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందగా, 8వ పే కమిషన్ వల్ల సుమారు 48.62 లక్షల మంది ఉద్యోగులు, 67.85 లక్షల మంది పింఛనుదారులు లబ్ధి పొందుతారని అంచనా వేస్తున్నారు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Mahesh Rajamoni</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/7th-vs-8th-pay-commission-salary-da-pension-changes-detailed-comparison-wuvdduw"/>
        </item>
        <item>
            <title><![CDATA[పెట్టుబ‌డి పెట్టే వారికి పండ‌గ‌లాంటి వార్త‌.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన బ్యాంకులు..]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/fd-interest-rates-hike-hdfc-bank-and-federal-bank-offer-up-to-7-percentage-interest-for-senior-citizens-wv09ctk</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/fd-interest-rates-hike-hdfc-bank-and-federal-bank-offer-up-to-7-percentage-interest-for-senior-citizens-wv09ctk</guid>
            <pubDate>Wed, 02 Sep 2026 22:07:16 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;FD Interest Rates: ఫిక్స్&zwnj;డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టే వారికి శుభవార్త. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు ఎంపిక చేసిన కాలపరిమితులపై FD వడ్డీ రేట్లను పెంచాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ ప్రయోజనం లభిస్తోంది. ఇంత&zwnj;కీ ఆ బ్యాంకులు ఏంటంటే.?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m18adbn61nvxscrarap4v8yr,imgname-fd-interest-rates-1788059496102.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;FD Interest Rates: ఫిక్స్&zwnj;డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టే వారికి శుభవార్త. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు ఎంపిక చేసిన కాలపరిమితులపై FD వడ్డీ రేట్లను పెంచాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ ప్రయోజనం లభిస్తోంది. ఇంత&zwnj;కీ ఆ బ్యాంకులు ఏంటంటే.?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;HDFC బ్యాంక్ రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే ఫిక్స్&zwnj;డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా వడ్డీ రేటును పెంచింది. 3 సంవత్సరాల 1 రోజు నుంచి 4 సంవత్సరాల 7 నెలల లోపు కాలపరిమితి ఉన్న FDలపై వడ్డీని 0.10 శాతం పెంచింది. గతంలో ఈ కాలపరిమితిలో సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీ లభించేది. ఇప్పుడు దానిని 7.10 శాతానికి పెంచారు. ఈ కొత్త రేట్లు ఆగస్టు 19 నుంచి అమల్లోకి వచ్చినట్లు సమాచారం.&lt;/p&gt;&lt;p&gt;HDFC బ్యాంక్&zwnj;లో సీనియర్ సిటిజన్లకు FD కాలపరిమితిని బట్టి 3.25 శాతం నుంచి గరిష్టంగా 7.10 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. అలాగే 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న FDలపై 6.65 శాతం వడ్డీ అందుతోంది. సాధారణ కస్టమర్లకు గరిష్టంగా 6.50 శాతం వరకు వడ్డీ లభిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఫెడరల్ బ్యాంక్ కూడా రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే ఫిక్స్&zwnj;డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. కొత్త రేట్ల ప్రకారం సీనియర్ సిటిజన్లకు కాలపరిమితిని బట్టి 3.50 శాతం నుంచి గరిష్టంగా 7.20 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఫెడరల్ బ్యాంక్&zwnj;లో సీనియర్ సిటిజన్లకు అందుతున్న కొన్ని ముఖ్యమైన FD వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 7 నుంచి 29 రోజులకు 3.50%గా ఉండ&zwnj;గా, 30 నుంచి 45 రోజులు 3.75%, 46 నుంచి 90 రోజులకు 4.75%, 91 నుంచి 180 రోజులకు 5%, 181 రోజులకు 6.50%, ఏడాదికి 6.75%, 1 సంవత్సరం కంటే ఎక్కువ నుంచి 15 నెలల లోపు 6.90%, 15 నెలలకు గాను 7.15%, 15 నుంచి 24 నెలలకు 6.90%, 24 నెలల కంటే ఎక్కువ నుంచి 48 నెలల లోపు పెట్టుబ&zwnj;డికి 7%, 48 నెలలకు 7.20% వ&zwnj;డ్డీ ల&zwnj;భిస్తుంది. అదే 48 నెలల కంటే ఎక్కువ నుంచి 10 సంవత్సరాల వ&zwnj;ర&zwnj;కు 6.90% వ&zwnj;డ్డీ ల&zwnj;భిస్తుంది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఆగస్టు 17 నుంచి అమల్లోకి వచ్చినట్లు సమాచారం.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ప్రస్తుతం ఫెడరల్ బ్యాంక్&zwnj;లో సీనియర్ సిటిజన్లకు 48 నెలల FDపై అత్యధికంగా 7.20 శాతం వడ్డీ లభిస్తోంది. మరోవైపు HDFC బ్యాంక్&zwnj;లో 3 సంవత్సరాల 1 రోజు నుంచి 4 సంవత్సరాల 7 నెలల లోపు FDపై 7.10 శాతం వడ్డీ అందుతోంది. అయితే కేవలం అత్యధిక వడ్డీ రేటు ఉందని చూసి పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాకపోవచ్చు. మనకు ఆ డబ్బు ఎప్పుడు అవసరం అవుతుంది, ఎంతకాలం పెట్టుబడి పెట్టగలం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. FDలో పెట్టుబడి పెట్టే ముందు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి చూసుకోవడం మంచిది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు తమ అవసరాలకు తగ్గ కాలపరిమితిని ఎంచుకోవాలి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;కొత్తగా వడ్డీ రేట్లు పెరిగాయని చూసి ఇప్పటికే ఉన్న FDని వెంటనే రద్దు చేయడం ఎప్పుడూ సరైన నిర్ణయం కాదు. FDని గడువు ముగియకముందే రద్దు చేస్తే బ్యాంకులు పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది. దీంతో పెరిగిన వడ్డీ రేటు వల్ల వచ్చే అదనపు ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ కావచ్చు. పాత FDని రద్దు చేసే ముందు కొన్ని విషయాలను తప్పనిసరిగా లెక్కించాలి. ప్రస్తుతం మీ FDపై ఎంత వడ్డీ వస్తోంది? FD మెచ్యూరిటీకి ఇంకా ఎంత సమయం ఉంది? కొత్త FDపై ఎంత అదనపు వడ్డీ లభిస్తుంది? ముందుగానే FD రద్దు చేస్తే ఎంత పెనాల్టీ పడుతుంది? వడ్డీ ద్వారా వచ్చే ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది? ఈ వివరాలన్నీ పరిశీలించిన తర్వాతే పాత FDని రద్దు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;FDలు సురక్షిత పెట్టుబడి సాధనాల్లో ఒకటిగా భావించినప్పటికీ సరైన కాలపరిమితిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే డబ్బును ఎక్కువ కాలం FDలో పెట్టకుండా ఉండటం మంచిది.&lt;/p&gt;&lt;p&gt;అలాగే ఒకేసారి మొత్తం డబ్బును ఒకే FDలో పెట్టడం కంటే, అవసరాలను బట్టి వేర్వేరు కాలపరిమితుల్లో FDలు చేయడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల అవసరమైన సమయంలో మొత్తం FDని రద్దు చేయాల్సిన అవసరం ఉండదు.&lt;/p&gt;&lt;p&gt;మొత్తానికి, HDFC బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ తాజా వడ్డీ రేట్ల పెంపు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ప్రయోజనకరంగా మారింది. అయితే కేవలం ఎక్కువ వడ్డీ వస్తుందనే కారణంతో నిర్ణయం తీసుకోకుండా, కాలపరిమితి, ముందస్తు విత్&zwnj;డ్రా ఛార్జీలు, పన్ను ప్రభావం వంటి అంశాలను పరిశీలించి FDలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/fd-interest-rates-hike-hdfc-bank-and-federal-bank-offer-up-to-7-percentage-interest-for-senior-citizens-wv09ctk"/>
        </item>
        <item>
            <title><![CDATA[Recharge plan: రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/recharge-plan-bsnl-get-2gb-daily-data-unlimited-calls-and-72-days-validity-y5xa4ap</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/recharge-plan-bsnl-get-2gb-daily-data-unlimited-calls-and-72-days-validity-y5xa4ap</guid>
            <pubDate>Sun, 30 Aug 2026 14:50:16 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Recharge plan: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తక్కువ ధరలో ఎక్కువ కాలం వ్యాలిడిటీతో పలు రీచార్జ్ ప్లాన్&zwnj;లను అందిస్తోంది. వీటిలో రూ.485 ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్&zwnj;లో రోజుకు 2GB డేటాతో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలు ఉన్నాయి.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kdce2a6d29yer2r8jzdxvff4,imgname-recharge-plan-1766722709709.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Recharge plan: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తక్కువ ధరలో ఎక్కువ కాలం వ్యాలిడిటీతో పలు రీచార్జ్ ప్లాన్&zwnj;లను అందిస్తోంది. వీటిలో రూ.485 ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్&zwnj;లో రోజుకు 2GB డేటాతో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలు ఉన్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;BSNL అధికారిక వెబ్&zwnj;సైట్ ప్రకారం రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్ 72 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా ఏ నెట్&zwnj;వర్క్&zwnj;కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. నేషనల్ రోమింగ్ కూడా ఉచితంగా అందుబాటులో ఉంటుంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఈ ప్లాన్&zwnj;లో వినియోగదారులకు రోజుకు 2GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. 72 రోజుల వ్యాలిడిటీని లెక్కిస్తే మొత్తం 144జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. దీంతో సోషల్ మీడియా, వీడియోలు, ఆన్&zwnj;లైన్ సేవలు వంటి వాటిని ఉపయోగించే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజూ 100 ఉచిత SMS కూడా లభిస్తాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా BSNL రూ.1 ప్రీపెయిడ్ ఆఫర్&zwnj;ను కూడా తిరిగి తీసుకొచ్చిన విష&zwnj;యం తెలిసిందే. ఈ ఆఫర్ 2026 సెప్టెంబర్ 12 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ముఖ్యంగా కొత్త BSNL వినియోగదారులను ఆకర్షించేలా ఈ ఆఫర్&zwnj;ను రూపొందించారు. ఈ రూ.1 ప్లాన్&zwnj;లో 24 రోజుల వ్యాలిడిటీతో పాటు దేశవ్యాప్తంగా అపరిమిత కాలింగ్, ఉచిత నేషనల్ రోమింగ్, రోజుకు 100 SMS, రోజుకు 1GB డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;గత ఏడాది అందించిన రూ.1 ప్లాన్&zwnj;లో 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా ఉండేది. తాజాగా తీసుకొచ్చిన ఆఫర్&zwnj;లో వ్యాలిడిటీని 24 రోజులకు, రోజువారీ డేటాను 1GBకి తగ్గించారు. అంటే గత ఆఫర్&zwnj;తో పోలిస్తే ఈసారి వినియోగదారులకు లభించే వ్యాలిడిటీ, డేటా ప్రయోజనాల్లో మార్పులు చేశారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;BSNL మరో ఫ్రీడమ్ ఆఫర్&zwnj;ను కూడా ప్రకటించింది. రూ.2,399 వార్షిక రీచార్జ్ ప్లాన్&zwnj;పై అదనంగా 47 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. సాధారణంగా ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఆఫర్&zwnj;లో భాగంగా మొత్తం వ్యాలిడిటీ 412 రోజులకు పెరుగుతుంది. ఈ అదనపు వ్యాలిడిటీ కాలంలోనూ ప్లాన్&zwnj;కు సంబంధించిన ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ఎక్కువ కాలం ఒకే రీచార్జ్&zwnj;తో కొనసాగాలనుకునే BSNL వినియోగదారులకు ఇది ఉపయోగకరమైన ఆఫర్&zwnj;గా చెప్పవచ్చు.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/recharge-plan-bsnl-get-2gb-daily-data-unlimited-calls-and-72-days-validity-y5xa4ap"/>
        </item>
        <item>
            <title><![CDATA[Gold Price Crash: మళ్లీ పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధం..పాతాళానికి పడిపోతున్న పసిడి, సిల్వర్]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/gold-price-update-gold-rates-continue-to-decline-amid-global-market-uncertainty-y9zzhng</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/gold-price-update-gold-rates-continue-to-decline-amid-global-market-uncertainty-y9zzhng</guid>
            <pubDate>Mon, 31 Aug 2026 11:40:42 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Gold Price Crash: గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా దిగొస్తున్నాయి. వరుసగా రెండు రోజుల నుంచి పసిడి ధరల్లో తగ్గుదల నమోదవుతుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభిస్తోంది.&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01kzzd3c9rhk33bcvtv91yqw0f,imgname-chatgpt-image-aug-14--2026--11-19-10-am-1786686583096.png" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Gold Price Crash: గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా దిగొస్తున్నాయి. వరుసగా రెండు రోజుల నుంచి పసిడి ధరల్లో తగ్గుదల నమోదవుతుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ బలపడటం విలువైన లోహాలపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్&zwnj;లో బంగారం ధరలు డాలర్లలో నిర్ణయించబడుతుండటంతో డాలర్ బలపడిన సమయంలో పసిడికి డిమాండ్&zwnj;పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీంతో గత నాలుగైదు రోజులుగా బంగారం, వెండి ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి.&lt;/p&gt;&lt;p&gt;ముఖ్యంగా శ్రావణమాసం, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం ఆభరణాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి తాజా ధరల తగ్గుదల కలిసొస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే తులం బంగారం ధర దాదాపు రూ.7,500 వరకు తగ్గడం మార్కెట్&zwnj;లో చర్చనీయాంశంగా మారింది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;తాజా ధరలను పరిశీలిస్తే గత రెండు రోజుల వ్యవధిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,470 మేర తగ్గింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,350, 18 క్యారెట్ల బంగారం ధర రూ.830 వరకు దిగొచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్&zwnj;లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,56,770 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,700 వద్ద ఉంది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,17,850 వద్ద ట్రేడ్ అవుతోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరగడం, హర్మూజ్ జలసంధి పరిసరాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రపంచ వాణిజ్యంపై ఆందోళన కలిగిస్తున్నాయి. కీలక సముద్ర రవాణా మార్గాల్లో భద్రతకు సంబంధించిన పరిణామాలు చమురు ధరలు, డాలర్ కదలికలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్&zwnj;ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ అంశాల ప్రభావం బంగారం, వెండి మార్కెట్&zwnj;పైనా కనిపిస్తోంది.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;మరోవైపు ప్రస్తుతం శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో ఆభరణాలకు డిమాండ్ పూర్తిగా తగ్గలేదు. ధరలు కొంత దిగిరావడంతో ఇంతకాలం కొనుగోళ్లను వాయిదా వేసుకున్న వినియోగదారులు ఇప్పుడు మళ్లీ జ్యువెలరీ షాపుల వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రిటైల్ మార్కెట్&zwnj;లో కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ధరలు మరింత తగ్గితే కొనుగోలు చేయాలనే ఆలోచనలో మరికొందరు ఎదురుచూస్తున్నారు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;అయితే బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లలో ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే ధరలపై కొంతకాలం ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం, అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ బలం, రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, యుద్ధ ఉద్రిక్తతలు వంటి అనేక అంశాలు పసిడి ధరల దిశను నిర్ణయిస్తాయి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Nandini Arava</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/gold-price-update-gold-rates-continue-to-decline-amid-global-market-uncertainty-y9zzhng"/>
        </item>
        <item>
            <title><![CDATA[Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే]]></title>
            <link>https://telugu.asianetnews.com/gallery/business/facts-why-do-we-write-only-at-the-end-of-the-amount-on-a-cheque-know-the-real-reason-zuslzrs</link>
            <guid isPermaLink="true">https://telugu.asianetnews.com/gallery/business/facts-why-do-we-write-only-at-the-end-of-the-amount-on-a-cheque-know-the-real-reason-zuslzrs</guid>
            <pubDate>Tue, 01 Sep 2026 14:54:17 +0530</pubDate>
            <description><![CDATA[&lt;p&gt;Facts: చెక్ లేదా బ్యాంక్ డిపాజిట్, విత్&zwnj;డ్రా ఫామ్&zwnj;ల&zwnj;పై అంకెల&zwnj;తో పాటు ప&zwnj;దాల్లో కూడా అమౌంట్ రాస్తామ&zwnj;ని తెలిసిందే. అయితే పదాల్లో రాసిన మొత్తానికి చివర్లో ఓన్లీ పదాన్ని కూడా చాలామంది తప్పకుండా రాస్తారు. ఇంత&zwnj;కీ ఇలా రాయ&zwnj;డం వెన&zwnj;కాల అసలు కార&zwnj;ణం ఏంటో తెలుసా.?&lt;/p&gt;]]></description>
            <media:content url="https://static.asianetnews.com/images/w-1280,h-720,format-jpg,imgid-01m1e4cq8ypwvbqp0mvnkqeepy,imgname-facts--6--1788254510366.jpg" type="image/jpeg" height="390" width="690"/>
            <content:encoded><![CDATA[&lt;p&gt;Facts: చెక్ లేదా బ్యాంక్ డిపాజిట్, విత్&zwnj;డ్రా ఫామ్&zwnj;ల&zwnj;పై అంకెల&zwnj;తో పాటు ప&zwnj;దాల్లో కూడా అమౌంట్ రాస్తామ&zwnj;ని తెలిసిందే. అయితే పదాల్లో రాసిన మొత్తానికి చివర్లో ఓన్లీ పదాన్ని కూడా చాలామంది తప్పకుండా రాస్తారు. ఇంత&zwnj;కీ ఇలా రాయ&zwnj;డం వెన&zwnj;కాల అసలు కార&zwnj;ణం ఏంటో తెలుసా.?&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;చెక్&zwnj;పై మొత్తాన్ని పదాల్లో రాసిన తర్వాత ఖాళీ స్థలం ఉంటే.. దానిని ఉపయోగించి ఎవరైనా అదనపు పదాలను చేర్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు &ldquo;Ten Thousand&rdquo; అని మాత్రమే రాసి.. ఆ తర్వాత ఎక్కువ ఖాళీ స్థలం వదిలితే, అందులో అదనపు పదాలు చేర్చేందుకు ప్రయత్నించవచ్చు. దీంతో అమౌంట్ మొత్తం పెరిగే అవ&zwnj;కాశం ఉంటుంది. అందుకే మొత్తాన్ని పదాల్లో రాసిన వెంటనే &lsquo;Only&rsquo; అని రాస్తారు. దీనివల్ల ఆ మొత్తానికి సంబంధించిన వాక్యం అక్కడితో పూర్తయిందని స్పష్టమవుతుంది. అదనపు పదాలు చేర్చే అవకాశం ఉండ&zwnj;దు.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;చెక్&zwnj;పై &lsquo;Only&rsquo; రాయకపోతే చెక్ చెల్లదు అని కాదు. ప్రతి చెక్&zwnj;పై &lsquo;Only&rsquo; రాయాలని RBI ప్రత్యేకంగా తప్పనిసరి చేసిన నిబంధన అంటూ ఏం లేదు. అయితే చెక్&zwnj;లో మొత్తాన్ని స్పష్టంగా రాయడం, ఎలాంటి ఖాళీలు వదలకుండా జాగ్రత్త పడటం వంటి భద్రతా సూచనలు చాలా ముఖ్యమైనవి. అందుకే బ్యాంకులు కూడా చెక్ రాసేటప్పుడు మొత్తాన్ని పదాల్లో రాసిన తర్వాత &lsquo;Only&rsquo; చేర్చాలని సాధారణంగా సూచిస్తుంటాయి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;చెక్&zwnj;లో మొత్తాన్ని సాధారణంగా రెండు విధాలుగా రాస్తారు. ఒకటి అంకెల్లో, మరొకటి పదాల్లో. ఈ రెండు చోట్ల ఉన్న మొత్తం తప్పనిసరిగా ఒకేలా ఉండాలి. ఉదాహరణకు రూ.5,000 చెల్లించాలంటే అంకెల్లో రూ. 5,000 అని రాసి.. పదాల్లో &ldquo;ఐదు వేల రూపాయాలు మాత్ర&zwnj;మే&rdquo; అని రాయాలి. అంకెల్లో ఒక మొత్తం, పదాల్లో మరో మొత్తం ఉంటే చెక్ ప్రాసెసింగ్ సమయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చెక్ ఇచ్చే ముందు రెండు చోట్ల రాసిన మొత్తాన్ని ఒకసారి కచ్చితంగా పరిశీలించాలి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;చెక్ నింపేటప్పుడు కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే మోసాల అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. మొత్తాన్ని పదాల్లో రాసిన తర్వాత చివర &lsquo;Only&rsquo; రాయడం మంచిది. మొత్తాన్ని రాసే సమయంలో అవసరం లేని ఖాళీ స్థలం వదలకండి. అంకెల్లో, పదాల్లో ఉన్న మొత్తం ఒకేలా ఉందో చూడండి. చెక్&zwnj;పై ఉన్న పేరు, తేదీ, మొత్తం సరిగ్గా ఉన్నాయో చెక్&zwnj; చేయండి. మొత్తాన్ని నిర్ణయించిన బాక్స్&zwnj;లో స్పష్టంగా రాయండి. చెక్&zwnj;పై ఓవర్&zwnj;రైటింగ్ లేదా అనధికారిక మార్పులు చేయకండి. సంతకం చేసే ముందు చెక్&zwnj;లోని అన్ని వివరాలను మరోసారి పరిశీలించండి.&lt;/p&gt;&lt;img&gt;&lt;p&gt;చెక్&zwnj;పై &lsquo;Only&rsquo; రాయడం వల్ల ప్రధానంగా రాసిన మొత్తానికి తర్వాత అదనపు పదాలు చేర్చే అవకాశాన్ని తగ్గించవచ్చు. ఇది చెక్ భద్రతకు ఉపయోగపడే ఒక సాధారణ జాగ్రత్త. అయితే &lsquo;Only&rsquo; రాయడం ఒక్కటే సరిపోదు. చెక్&zwnj;లోని పేరు, తేదీ, అంకెల్లో ఉన్న మొత్తం, పదాల్లో ఉన్న మొత్తం, సంతకం వంటి అన్ని వివరాలు సరిగ్గా ఉండాలి.&lt;/p&gt;]]></content:encoded>
            <category>business</category>
            <dc:creator>Narender Vaitla</dc:creator>
            <atom:link href="https://telugu.asianetnews.com/gallery/business/facts-why-do-we-write-only-at-the-end-of-the-amount-on-a-cheque-know-the-real-reason-zuslzrs"/>
        </item>
    </channel>
</rss>
