<?xml version="1.0" encoding="UTF-8" standalone="yes"?>
<rss version="2.0" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/">
  <channel>
    <title>Asianet News Telugu</title>
    <link>https://telugu.asianetnews.com</link>
    <description>Asianet News Telugu News Portal started in October, 2016 to deliver the news from Telangana and Andhra Pradesh with an altogether a new perspective.</description>
    <image>
      <url>https://static.asianetnews.com/images/logos/telugu.asianetnews.jpg</url>
      <width>200</width>
      <height>100</height>
    </image>
    <lastBuildDate>Thu, 07 Apr 2022 11:49:06 +0530</lastBuildDate>
    <atom:link href="https://telugu.asianetnews.com/rss/agriculture" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title>సేంద్రీయ వ్యవసాయ కూరగాయలను తింటే ఎన్ని లాభాలున్నాయో..!</title>
      <link>https://telugu.asianetnews.com/agriculture/how-many-benefits-of-eating-organic-farm-vegetables-r9yhhf</link>
      <guid>https://telugu.asianetnews.com/agriculture/how-many-benefits-of-eating-organic-farm-vegetables-r9yhhf</guid>
      <pubDate>Thu, 07 Apr 2022 11:47:40 +0530</pubDate>
      <description><![CDATA[<p>ఒకప్పుడు రైతులు సేంద్రీయ వ్యవసాయ పంటలనే పండించే వారు. కానీ ఇప్పుడు ఈ వ్యవసాయం పూర్తిగా మరుగునపడింది. ఎక్కడో ఒకచోట మాత్రమే ఈ సేంద్రీయ పద్దతిలో పంటలను పండిస్తున్నారు. కెమికల్స్ వాడకానికి అలవాటు పడిన ఎంతో మంది రైతులు మాత్రం ఈ సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గుచూపడం లేదు.&nbsp;</p>  <p>కానీ కెమికల్స్ ద్వారా పండించిన పంటలు మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. వీటిని తినడం వల్ల వంద ఏండ్లు బతకాల్సిన వాడు యాబై నలబై ఏండ్లకే వివిధ రోగాలొచ్చి చనిపోతున్నారు. అందుకే ప్రభుత్వం సైతం రైతులను సేంద్రీయ వ్యవసాయం &nbsp;వైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తోంది.&nbsp;</p>  <p>సేంద్రీయ వ్యవసాయ పద్దతిలో పెద్దగా రిస్క్ ఉండదు. పంట దిగుబడి తక్కువగా వచ్చినా.. దీనివల్ల ఎన్నో లాభాలున్నాయి. అందుకే ప్రస్తుతం చాలా మంది రైతులు మళ్లీ ఈ సేంద్రీయ &nbsp;వ్యవసాయం వైపు మొగ్గుచూపుతున్నారు.&nbsp;</p>  <p>మీకు తెలుసా.. మనం కొనుగోలు చేస్తున్న కూరగాయల్లో 90 శాతం పూర్తిగా కెమికల్స్ తో నిండిపోయినవే ఉంటున్నాయి. దీనివల్ల మన ఆరోగ్యం దెబ్బతినడమే కాదు భూతల్లి సారం కూడా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.&nbsp;</p>  <p>అయితే ప్రస్తుత కాలంలో సేంద్రీయ వ్యవసాయం కాస్త వెలుగులోకి వస్తున్నప్పటికీ ఈ వ్యవసాయాన్ని ఎక్కువగా చేస్తున్నది మాత్రం ధనవంతులే. సాధారణ రైతులు మాత్రం ఈ వ్యవసాయం వైపు అడుగులు వేయడం లేదు. దీనికి కారణం వారికి ఈ వ్యవసాయంపై అవగాహన లేకపోవడం. ముఖ్యంగా ఈ పద్దతిలో పంటలను పండించడం రిస్క్ తో కూడుకున్నదని భావించడం. కాబట్టి ఈ వ్యవసాయంపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది.&nbsp;</p>  <p><span style="font-size:14px;"><strong>సేంద్రీయ కూరగాయలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..&nbsp;</strong></span></p>  <ul> 	<li>పలు అధ్యయనాల ప్రకారం.. సేంద్రీయ వ్యవసాయంలో పండించిన కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి గుండె సంబంధిత రోగాలు, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. అంతేకాదు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన రోగ నిరోధక వ్యవస్థను కూడా పెంచుతుంది. రకరకాల ఇన్ఫెక్షన్స్, రోగాల &nbsp;నుంచి మనల్ని కాపాడుతుంది.&nbsp;</li> 	<li>గుండె జబ్బులు, డయాబెటీస్ పేషెంట్లు వీటిని తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సేంద్రీయ కూరగాయలను తినడం వల్ల మధుమేహుల్లో షుగర్ లెవెల్స్ తగ్గుతాయట.&nbsp;</li> 	<li>సేంద్రీయ వ్యవసాయంలో పండించిన నారింజ పండ్లు, ఆకుపచ్చ కూరగాయలల్లో ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి,విటమిన్ బి కాంప్లెక్స్, &nbsp;కాల్షియం, జియాక్సంతిన్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి.&nbsp;</li> 	<li>ముఖ్యంగా ఆకు పచ్చ కూరగాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థ క్లీన్ అవుతుంది కూడా. విరేచనాలు, మలబద్దకం వంటి సమస్యలు ఇట్టే వదిలిపోతాయి.&nbsp;</li> 	<li>ఈ కూరగాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున వీటిని తీసుకోవడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండిని అనుభూతి కలుగుతుంది. దీంతో మీరు ఎక్కువగా తినలేరు. దీంతో మీరు సులభంగా బరువు తగ్గొచ్చు.&nbsp;</li> 	<li>ఈ కూరగాయల్లో అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మాంసాహారం తిననివారు ఈ కూరగాయలను తింటే పోషకాహార లోపం ఏర్పడదు.&nbsp;</li> 	<li>ఈ కూరగాయలు మీ ఒంట్లో ఉండే విష పదార్థాలను సులభంగా బయటకు పంపేందుకు ఎంతో సహాయపడతాయి.&nbsp;</li> 	<li>ఆకు కూరల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది టైప్ 2 మధుమేహులకు ఎంతో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఈ &nbsp;కూరలను తింటే డయాబెటీస్ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది.&nbsp;</li> 	<li>ఉల్లిగడ్డ, వెల్లుల్లిని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. అంతేకాదు వీటివల్ల ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశమే ఉండదు.&nbsp;</li> </ul>  <p><br /> &nbsp;</p> ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01frzcd5m48k21pe8w81rm10ey/images--22--jpg_760x400.jpg"/>
    </item>
    <item>
      <title>పౌష్టికాహార భద్రత కోసం బయోఫోర్టిఫైడ్ రకాల పంటలు.. రెండు నిర్దిష్ట కార్యక్రమాలను ప్రారంభించిన ఐసీఏఆర్ </title>
      <link>https://telugu.asianetnews.com/agriculture/icar-introduces-2-special-programmes-for-upscaling-biofortified-varieties-of-crops-through-kvks-r9y48x</link>
      <guid>https://telugu.asianetnews.com/agriculture/icar-introduces-2-special-programmes-for-upscaling-biofortified-varieties-of-crops-through-kvks-r9y48x</guid>
      <pubDate>Thu, 07 Apr 2022 07:01:46 +0530</pubDate>
      <description><![CDATA[<p>ఢిల్లీ : భారతదేశం వ్యవసాయాధారిత దేశం. అయితే రకరకాల అననుకూల పరిస్థితులు.. వ్యవసాయం నష్టాలనే మిగులుస్తుండడం... చీడపీడలు, తెగుళ్లు.. సకాలంలో వానలు కురవకపోవడం.. పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు ముంచెత్తడం.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడం... ఇలాంటి అననుకూల పరిస్థితులతో రైతులు వ్యవసాయం నుంచి తిరుగుముఖం పడుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అందుబాటులోకి తెస్తున్నాయి.&nbsp;</p>  <p>అందులో భాగంగానే nutritional security కోసం కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా biofortified varieties పంటలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ICAR రెండు నిర్దిష్ట కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి Kailash Choudhary మంగళవారం లోక్‌సభలో తెలిపారు.</p>  <p><strong>ఆ రెండు కార్యక్రమాలు ఏంటంటే..&nbsp;</strong><br /> ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) రెండు కార్యక్రమాలను రూపొందించింది : న్యూట్రి-సెన్సిటివ్ అగ్రికల్చరల్ రిసోర్సెస్ అండ్ ఇన్నోవేషన్స్ (NARI), వ్యవసాయంలో విలువ జోడింపు, సాంకేతికత ఇంక్యుబేషన్ సెంటర్లు (వాటికా). వ్యవసాయంలో మహిళలపై ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద, ICAR "పోషకాహార భద్రత కోసం స్థిరమైన విధానాలు", "పోషక భద్రత వ్యవసాయ కుటుంబాల ఆరోగ్య ప్రమోషన్" వంటి కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది.</p>  <p>లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో, వ్యవసాయాభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కార్యక్రమాలలో భాగంగా పాఠశాలలు, సంఘాలలో న్యూట్రి-గార్డెన్‌లను నిర్మించామని, అక్కడ పోషకాహార విద్యపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఆయన తెలిపారు.</p>  <p><strong>రకరకాల పంటలు..&nbsp;</strong><br /> ఇంకా దీనిమీద మంత్రి సమాచారం ఇస్తూ.. ICAR వరి, గోధుమ, మొక్కజొన్న, మినుములు, కందులు, వేరుశెనగ, లిన్సీడ్, ఆవాలు, సోయాబీన్‌లలో 79 పోషకాలు అధికంగా ఉండే బయోఫోర్టిఫైడ్ రకాలను అభివృద్ధి చేసింది అని తెలిపారు. కాలీఫ్లవర్, బంగాళదుంప, చిలగడదుంప, గ్రేటర్ యామ్, దానిమ్మ, అదనంగా ఎనిమిది బయోఫోర్టిఫైడ్ ఉద్యాన పంటల రకాలు, వివిధ మాస్ కమ్యూనికేషన్ మాధ్యమాలను కలుపుకొని శిక్షణలు, ప్రదర్శనల ద్వారా రైతులలో ప్రాచుర్యం పొందుతున్నాయి.</p>  <p>ఐరన్, జింక్, కాల్షియం, ప్రొటీన్, విటమిన్ సి, ప్రొవిటమిన్ ఎ, ఒలేయిక్ యాసిడ్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఈ సాగులో మెరుగయ్యాయని మంత్రి అభిప్రాయంగా చెప్పుకొచ్చారు..</p>  <p><strong>ICAR గురించి...</strong><br /> ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) అనేది భారతదేశంలో వ్యవసాయ విద్య, పరిశోధనలను సమన్వయం చేసే స్వయం-పాలన సంస్థ. ఇది వ్యవసాయ మంత్రిత్వ శాఖలోని వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖకు నివేదిస్తుంది. దీని అధ్యక్షుడు కేంద్ర వ్యవసాయ మంత్రి. ఇది ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన వ్యవసాయ పరిశోధన, బోధనా సంస్థల నెట్‌వర్క్. NARI కార్యక్రమం పోషకాహార భద్రతను పెంపొందించడానికి వ్యవసాయాన్ని పోషకాహారం, న్యూట్రి-స్మార్ట్ గ్రామాలతో అనుసంధానం చేస్తూ కుటుంబ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది.</p> ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01emr0tq2q1frhxz55p1fdpndg/whatsapp-image-2020-10-16-at-11-43-01-am-jpeg_760x400.jpg"/>
    </item>
    <item>
      <title>సేంద్రియ సాగు విధానంలో కీలక విషయాలు.. ఎరువుల తయారీ, నీటి వాడకం వివరాలు</title>
      <link>https://telugu.asianetnews.com/agriculture/key-points-in-organic-farming-from-making-natural-fertilisers-to-water-distribution-r9xgzi</link>
      <guid>https://telugu.asianetnews.com/agriculture/key-points-in-organic-farming-from-making-natural-fertilisers-to-water-distribution-r9xgzi</guid>
      <pubDate>Wed, 06 Apr 2022 22:39:19 +0530</pubDate>
      <description><![CDATA[<p>హైదరాబాద్: సేంద్రియ వ్యవసాయంపై ఇప్పుడిప్పుడే చాలా మందికి సానుకూల దృక్పథం ఏర్పడుతున్నది. రైతులు ఈ విధానం గురించి తెలుసుకోవడం, వీలైతే అమలు చేయడం చేస్తున్నారు. రైతులతోపాటు ఇతరుల్లోనూ సేంద్రియ విధానంపై మక్కువ పెరిగింది., ఆ విధానంలో పండించిన పంటను, కూరగాయలను, ఇతరత్రాలను కొనుగోలు చేయడానికీ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే సేంద్రియ వ్యవసాయం గురించి కొన్ని కీలక విషయాలు తెలుసుకుందాం.</p>  <p>సేంద్రియ విధానంలో రసాయనాలను వాడరు. భూమిని రసాయనాలు లేకుండానే సజీవంగా మార్చి అంటే.. పంటకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇందులో భూమిని సేంద్రియ సాగుకు సిద్ధం చేయడం, పంట వేసిన తర్వాత అందుకు అవసరమైన ఎరువును రసాయనాలు లేకుండా తయారు చేసుకోవడం చాలా కీలకమైన అంశాలు. ఆ తర్వాత వాటికి నీటిని పారించడం కూడా ముఖ్యమైన అంశమే.</p>  <p>సేంద్రియ వ్యవసాయంలో సాధారణంగా కెమికల్స్ లేకుండా ప్రకృతి సిద్ధమైన సహజ పదార్థాలను తీసుకుని ఎరువులు సిద్ధం చేస్తుంటారు. ఉదాహరణకు వేపపిండి.</p>  <p>ఇందులోనూ కెమికల్స్ ఎరువుల కంటే కూడా తక్కువ ఖర్చులోనే ఈ ఎరువులను తయారు చేసుకోవడం మరింత మంచి నిర్ణయం,. సాధారణంగా సేంద్రియ సాగు కోసం తయారు చేసే ఎరువుల్లో ఆవు పేడ, మూత్రం, శనగపిండి, బెల్లం, పుట్టమన్ను వంటి వాటిని వినియోగిస్తారు. ఈ పదార్థాలను అన్నింటిని కలిపి వారం రోజుల పాటు నిల్వ ఉంచుతారు. ఇదే జీవామృతంగా తయారు అవుతుంది. &nbsp;ఈ జీవామృతం అదే.. ఈ నీటిని మొక్కల మొదల్లో పోయాలి. ఇది పంట సమృద్ధిగా పండటానికి దోహదపడుతుంది. మొక్కల్లోనూ పుష్టిని నింపుతుంది. ఇలా చేయడం వల్ల దిగుబడి ఎక్కవ వస్తుంది. అంతేకాదు, రసాయన ఎరువులతో పోల్చితే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది.</p>  <p>ఈ సేంద్రియ ఎరువుల్లోనూ రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఎండపెట్టిన ఆవు పేడ, గేదె పేడ, ఆకు తొక్క, వర్మీ కంపోస్తు, వేప పిండి పదార్థాలను మంచి కలియబెట్టాలి. ఆ పేస్టును నేరుగా మొక్కలకు అందించాలి. మరొకటి, పైన చెప్పుకున్నట్టుగా ఆ సహజ రసాన్ని మొక్కల మొదళ్లకు అందించాలి.</p>  <p>ఏ పంటకైనా భూమి సిద్ధం చేయడం ప్రాథమిక అంశం. సేంద్రియ విధానంలోనూ దుక్కి దున్నడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భూమిని ఎక్కువ లోతులో దుక్కి చేయరాదు. ఎందుకంటే ఎక్కువ లోతు దుక్కి దున్నితే నేల కోత ఏర్పడుతుంది. ఇది నేలలోని సూక్ష్మజీవులు, ఇతర ప్లవకాలను తగ్గిస్తుంది. తద్వార పంట నష్టం వాటిల్లుతుంది. కాబట్టి నేలను దున్నేటప్పుడు రెండు మూడు సార్లు మాత్రమే 15 సెంటిమీటర్లకు మించకుండా దున్నేసుకోవాలి.</p>  <p>అలాగే, సేంద్రియ విధానంలో పంట మార్పిడి కూడా మంచి నిర్ణయమే. పంట మార్పిడి చేయడం వల్ల నేలలోనూ సూక్ష్మజీవులు బలవర్థకంగా మారుతాయి. ఇవి పంటకు ఉపకరిస్తుంది.&nbsp;</p>  <p>సేంద్రియ సాగు విధానంలో నీటి అవసరమైన మేరకు మాత్రమే అందించడం చాలా ముఖ్యం. అది కూడా సరైన పద్ధతిలో అందిస్తే ఫలితాలు మంచిగా వస్తాయి. నీటిని ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఎక్కువగా ఉంటే.. ఇతర సమస్యలు వచ్చి పంట నష్టపోతుంది. కాబట్టి, ఈ విధానంలో సరిపడా నీటిని మాత్రమే పారించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.</p> ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01e5q4pzf7pwzdgaq58xz3b3tc/mysuru-organic-farming-jpg2--jpg_760x400.jpg"/>
    </item>
    <item>
      <title>ఆరుతడి పంటలతో అనూహ్య లాభాలు.. మిర్చితో మూడు నెలల్లో రూ. 6 లక్షల ఆదాయం.. ఈ రైతు సక్సెస్ స్టోరీ ఇదే</title>
      <link>https://telugu.asianetnews.com/agriculture/nizamabad-chillies-farmer-success-story-by-chillies-cultivation-he-gain-lakhs-r9xf61</link>
      <guid>https://telugu.asianetnews.com/agriculture/nizamabad-chillies-farmer-success-story-by-chillies-cultivation-he-gain-lakhs-r9xf61</guid>
      <pubDate>Wed, 06 Apr 2022 22:00:01 +0530</pubDate>
      <description><![CDATA[<p>హైదరాబాద్: రైతులూ మార్కెట్‌నూ అంచనా వేస్తూ ఎప్పుడూ వేసే పంటనే కాకుండా తరుచూ మార్చుతూ ఆరుతడి పంటలు వేస్తే అనూహ్య లాభాలు గడించవచ్చు. ప్రణాళికాబద్దంగా సాగు చేస్తే లక్షలు సంపాదించడం సాధ్యమే. ఇందుకు నిజామాబాద్‌కు చెందిన శంకర్ అనే ఆదర్శ రైతే ఉదాహరణ. ఆయన అందుబాటులో ఉన్న టెక్నిక్‌లు, మెలకువలను అమలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కేవలం మూడు నెలల్లోనే ఆరు లక్షల రూపాయలు సంపాదించాడు.</p>  <p>నిజామాబాద్ కోటగిరి మండలం పొతంగల్ గ్రామానికి చెందిన వర్ని శంకర్ అనే రైతుకు పది ఎకరాల భూమి ఉన్నది. మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకుని తన ప్రణాళిక ప్రకారం పంట వేశాడు. ఐదు ఎకరాల్లో మిరప పంట, మూడున్నర ఎకరాల్లో టమాట, ఐదెకరాల్లో పొద్దు తిరుగుడు, రెండు ఎకరాల్లో వరి పంట వేశాడు. ఆయన 20 ఏళ్లుగా మార్చి మార్చి పంటలు వేస్తున్నాడు. ఈ యేడు మిరపలో ఆధునిక దప్ధతిలో హౌబ్రీడ్ రకం నారు పోశాడు. నారు పెరిగిన తర్వాత పంట పొలంలో గెనెలు కొట్టి నాటారు. ఆ తర్వాత పాలిథీన్ కవర్ వేశాడు. దీంతో మిరప మొక్కకు చీడలు, పీడలను ఇది చాలా వరకు నివారించగలిగింది.</p>  <p>మిరప పంటను సాగు చేస్తే ఎకరానికి రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు పెట్టుకుంటే ఎకరానికి 35 నుంచి 40 టన్నుల దిగుబడి కూడా వస్తుంది.</p>  <p>ఈ పంట కాలం ఆరు నుంచి ఏడు నెలలు. బిందు సేద్యం ద్వారా నీరు అందిస్తూ సస్యరక్షణ చేస్తే మంచి దిగుబడిద వస్తుంది. శంకర్ గతేడాది అక్టోబర్‌లో మిరప పంట వేశాడు. కేవలం రెండు నెలల్లోనే అంటే డిసెంబర్‌లో పచ్చి మిర్చి కోతకు వచ్చింది. ఎకరాకు ఇప్పటి వరకు 15 టన్నుల దిగుబడి వచ్చింది. ఈ సారి కొంచెం ఎక్కువగా తెగుళ్లు సోకడంతో నష్టం జరిగింది. అయినప్పటికీ మార్కెట్‌లో పచ్చి మిర్చికి మంచి డిమాండ్ వచ్చింది., దీంతో వ్యాపారుల ఏకంగా తన వ్యవసాయ క్షేత్రానికే వచ్చి కిలోకు రూ. 50 చొప్పున వెచ్చించి పంటను తీసుకెళ్లారు. అంటే కేవలం మూడు నెలల్లోనే రూ. 6 లక్షల ఆదాయం వచ్చిందని శంకర్ వివరించాడు.</p>  <p>పచ్చి మిర్చి తెంపేందుకు ప్రతి రోజు ఆరుగురు కూలీలు అవసరం అవుతారు. మరో మూడు నెలల కాలం మిరప పంట కాస్తుంది. దీంతో ఇంకా 20 నుంచి 25 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నదని శంకర్ వివరించాడు. గత సంవత్సరం మే నెలలో మిర్చి వేయగా ఎకరానికి 25 టన్నుల దిగుబడి వచ్చింది. అప్పటి మార్కెట్ ప్రకారం కిలోకు రూ. 25 నుంచి రూ. 30 పలుకింది. దీంతో పెట్టుబడులు పోను రూ. 5 లక్షల లాభం వచ్చినట్టు వివరించాడు.</p>  <p>శంకర్ 20 ఏళ్లుగా ఆరుతడి పంటలు వేస్తున్నాడు. వీటితో మంచి దిగుబడి.. రాబడి పొందుతున్నాడు. ప్రతియేటా మిర్చి, టమాట, పుచ్చకాయ, దోస, కీరదోస, బొప్పాయి పండిస్తున్నాడు. శంకర్‌ను 2016లో రాష్ట్రప్రభుత్వం ఉత్తమ రైతుగా గుర్తించింది.</p> ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/86a461e9-5e12-4434-8359-895a7f2ebec3/image_760x400.jpg"/>
    </item>
    <item>
      <title>ప్రకృతి వ్యవసాయంతో విజయగాథలు లిఖిస్తున్న హిమాచల్ మహిళలు..</title>
      <link>https://telugu.asianetnews.com/agriculture/himachal-pradesh-women-farmers-are-scripting-success-stories-in-sustainable-farming-r9x5u8</link>
      <guid>https://telugu.asianetnews.com/agriculture/himachal-pradesh-women-farmers-are-scripting-success-stories-in-sustainable-farming-r9x5u8</guid>
      <pubDate>Wed, 06 Apr 2022 18:38:34 +0530</pubDate>
      <description><![CDATA[<p>వ్యవసాయాన్ని రసాయన ప్రయోగశాల నుంచి బయటకు తేవాలని 2021 డిసెంబర్‌లో Natural Farmingపై జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వ్యవసాయాన్ని ప్రకృతికి గల సొంత ప్రయోగశాలకు అనుసంధానించాలని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించాలని&nbsp;<br /> రైతులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని రైతులకే కేంద్ర ప్రభుత్వం సూచించడం ఇదే మొదటిసారి కాదు. రైతులకు వివిధ ప్రోత్సాహకాలను అందిస్తూ దేశంలోని రైతులను ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించబడుతున్నారు. మార్చి 2021 నాటికి దాదాపు 5,00,000 మంది రైతులు 2,16,000 హెక్టార్ల భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.</p>  <p>ఇలా ప్రకృతి వ్యవసాయంలో దూసుకుపోతున్నారు హిమాచల్ ప్రదేశ్‌లోని మహిళ రైతులు. వారు సహజ పద్దతుల్లో వ్యవసాయం చేపట్టేలా మార్పుకు నాయకత్వం వహిస్తున్నారు. శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే వర్క్‌షాప్‌ల ద్వారా పొందిన జ్ఞానంతో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మహిళలు.. రసాయన రహిత, వాతావరణాన్ని తట్టుకునే ప్రకృతి వ్యవసాయం విధానాలను అవలంబిస్తూ విజయగాథలు లిఖిస్తున్నారు. అంతేకాకుండా తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేస్తున్నారు.&nbsp;</p>  <p>హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి కృషి ఖుషల్ కిసాన్ యోజన తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు ప్రకృతి వ్యవసాయం చేయడానికి &nbsp;ప్రోత్సహకాలు అందజేస్తుంది. దీంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం రైతుల సంఖ్యలో సగం మంది సహజ వ్యవసాయ పద్ధతిని అవలంబించారు. ముఖ్యంగా మహిళలు ఈ స్థిరమైన వ్యవసాయ పద్ధతిని అవలంబించడంలో తమ సంఘాన్ని బలోపేతం చేసే పనిని చేపట్టారు.</p>  <p>అధికారిక సమాచారం ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్‌లో సహజ వ్యవసాయాన్ని అభ్యసిస్తున్న 1.68 లక్షల మంది రైతుల్లో.. 90,000 మంది మహిళలు ఉన్నారు. ఈ సంఖ్య జీవవైవిధ్యంతో అనుబంధం, ఆహార భద్రత వైపు కదలికలో మార్పును సూచించే విధంగా ఉంది. ప్రకృతి వ్యవసాయంతో మహిళా రైతుల స్ఫూర్తిదాయక విజయాలను అందుకుంటున్నారు. అందులో 50 ఏళ్ల సత్యాదేవి ఒక్కరు. ఆమె గురించి వ్యవసాయ శాఖ ఒక కథనాన్ని కూడా ప్రచురించింది.&nbsp;</p>  <p>అందులో ఆమె రసాయనాలు, స్ప్రేలు, ఎరువులు ఉపయోగించే సాంప్రదాయ వ్యవసాయ కార్యకలాపాల నుంచి జీరో బడ్జెట్ సహజ వ్యవసాయానికి ఎలా మారారనే విషయాన్ని వివరించారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అనేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించిన డ్రైవ్. &nbsp;వాణిజ్య పంటలు, పండ్లను పండించడంలో రసాయనాల వినియోగాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో దీనిని తీసుకొచ్చారు. ఈ &nbsp;జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌తో సత్య దేవి స్థిరమైన వ్యవసాయం(పర్యావరణ సూత్రాలు పాటించి) కొనసాగించడంతో విజయం సాధించారు.&nbsp;</p>  <p>సంవత్సరాలుగా అమలు చేస్తున్న జీరో బడ్జెట్ వ్యవసాయ వ్యూహం చాలా మంచి ఆదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు కూడా రాష్ట్ర రైతుల నుండి చిట్కాలను పొందడానికి హిమాచల్ ప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి మహిళలు ప్రకృతి వ్యవసాయానికి బ్రాండ్ అంబాసిండర్‌లుగా మారారు. వ్యవసాయ సంబంధిత కార్యకలాపాల కోసం గ్రామీణ మహిళలను ‘కృషి సఖీలు’ (కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌లు)గా ఎంపిక చేశారు. ఆదాయం, పర్యావరణం, పోషకాహారం దృష్టిలో ఉంచుకుని.. హిమాచల్ ప్రదేశ్ ప్రకృతిక్ ఖుషాల్ యోజన ద్వారా సహజ వ్యవసాయ సాంకేతికతలో శిక్షణ, గ్రామ సంస్థ స్థాయిలో కాన్సెప్ట్ సీడింగ్, పర్యావరణ పద్ధతుల శిక్షణ, ప్రచారం, అగ్రి-న్యూట్రి ఉద్యానవనం మరియు విత్తన బ్యాంకుల నిర్వహణపై మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఇది వారి ఆలోచనలను మారుస్తోంది. డిసెంబర్ 2021 వరకు.. హిమాచల్ ప్రదేశ్‌లోని 12 జిల్లాల్లో 502 ‘కృషి సఖి’లకు 23 శిక్షణా సమావేశాలు నిర్వహించబడ్డాయి.</p>  <p>2022-23 బడ్జెట్ ప్రసంగంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్.. 50,000 ఎకరాలను సహజ వ్యవసాయం కిందకు తీసుకువస్తామని ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ రైతులు నమోదు చేయబడతారని.. వారిని సహజ రైతులుగా ధృవీకరించబడతారని చెప్పారు. వ్యవసాయ శాఖ ప్రకారం.. సంప్రదాయ వ్యవసాయానికి హెక్టారుకు దాదాపు రూ. 2.30 లక్షలు ఖర్చు అవుతుండగా.. సహజ వ్యవసాయానికి హెక్టారుకు సుమారు రూ. లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది.</p> ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01fzzfnd7c204kz1h71je01xvx/natural-farming-jpg_760x400.jpg"/>
    </item>
    <item>
      <title>వేసవిలో కూరగాయల సాగుతో లాభాలు.. ఈ కూరగాయలు పండించడం ఉత్తమం</title>
      <link>https://telugu.asianetnews.com/agriculture/these-vegetable-farming-will-bring-profits-in-summer-r84j23</link>
      <guid>https://telugu.asianetnews.com/agriculture/these-vegetable-farming-will-bring-profits-in-summer-r84j23</guid>
      <pubDate>Wed, 02 Mar 2022 21:00:04 +0530</pubDate>
      <description><![CDATA[<p>హైదరాబాద్: కూరగాయల (Vegetable) సాగు (Cultivation) లాభసాటిగా ఉంటుంది. నీటి సదుపాయం, మార్కెట్ అందుబాటులో ఉంటే.. కూరగాయల&nbsp;సాగు సరైన ఆప్షన్. కూరగాయలను పండించి మంచి లాభాలను ఆర్జించవచ్చు. నీటి సదుపాయం తక్కువగా ఉన్న&nbsp;లాభసాటిగా ఉండే కూరగాయలను పండించడం(Agriculture) మంచిది. ఎందుకంటే వేసవిలో నీటి లభ్యత అన్ని చోట్లా తగ్గిపోతుంది.&nbsp;కాబట్టి, నీటి లభ్యత తక్కువగా ఉన్నా.. మంచి పంట వచ్చే కూరగాయల గురించి తెలుసుకుందాం.&nbsp;</p>  <p>నీటి లభ్యత తక్కువగా ఉండటం వల్ల కూరగాయలు పండించే విస్తీర్ణం కూడా తగ్గిపోతుంది. తద్వార మార్కెట్‌కు వచ్చే పంట&nbsp;దిగుబడి కూడా తగ్గిపోతుంది. పంట తగ్గడం మూలంగా కూరగాయల ధరలూ పెరుగుతాయి. అయితే, రైతులు తమకు ఉన్న&nbsp;పరిమిత వనరులు, నీటితో సరైన ఆకు కూరలు వేసుకుంటే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆదాయాలు పొందవచ్చు. పాలకూర,&nbsp;కొత్తిమీర, చుక్కకూర మినహా మిగతా ఆకు కూరలన్నీ వేసవిలో సాగు చేసి లాభాలు ఆర్జించవచ్చు.</p>  <p>ఎండకాలం ఎక్కువగా తీగజాతి కూరగాయలను సాగు చేయడం ఉత్తమం అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. దోస,&nbsp;గుమ్మడి, బూడిద గుమ్మడి, బీర, కాకర, సోరకాయ, పొట్టకాయ, దొండ పంటలు వేడి వాతావరణంలో మంచిగా పెరుగుతాయి.&nbsp;చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, శీతాకాలంలో ఈ పంటల ఎదుగుదల ఆశించినట్టుగా ఉండదు. బీర, కాకర పంటలను చలి&nbsp;ఎక్కువగా ఉండే కాలంలో, ప్రాంతాల్లో సాగు చేయటం కొంచెం కష్టమే. కానీ, మిగతా తీగజాతి కూరగాయలను నీటి&nbsp;సదుపాయం ఉంటే ఏడాది పొడుగునా పండించుకోవచ్చు. ఈ పంటలను సాధారణంగా గ్రామాల్లో ఇంటి పరిసరాల్లో కూడా&nbsp;పండిస్తుంటారు. చాలా మంది ఇంటి పందిళ్లు, నీళ్ల ట్యాంకుల దగ్గర పెంచుతుంటారు. అయితే, సాగు భూమిలోనూ ప్రత్యేకంగా&nbsp;పందిళ్లు వేసి వీటి సాగు ద్వారా లాభాలను మంచిగా ఆర్జించవచ్చు. ఈ పంటలను ఖరీఫ్, రబీ అనే తేడా లేకుండా వేసవి&nbsp;కాలాల్లోనూ పండించుకోవచ్చు. దొండ పంట మూడు నాలుగు ఏళ్లపాటు ఏడాది పొడుగునా కాపునిస్తుంది.</p>  <p>అయితే, కరివేపాకు సాగు కూడా మంచి లాభాలను ఇస్తుంది. ఈ పంట ఎక్కువ ఉష్ణోగ్రతల్లోనూ దిగుబడి వస్తుంది. అవే&nbsp;ఉష్ణోగ్రతలు భారీగా తగ్గితే పెరుగుదల ఆగిపోయే ముప్పు ఉంటుంది. కానీ, ఈ పంటకు నీటి సౌకర్యం ఎక్కువగా ఉండాలి. ఈ&nbsp;పంటను నాటిన ఆరు నెలల తర్వాత కోతకు వస్తుంది. ఈ పంటను సరిగ్గా వేసుకుంటే ప్రతి మూడు నెలలకు ఒక సారి కోతకు&nbsp;వస్తుంది.</p>  <p>వీటితోపాటు వేసవిలో కాకుండా శీతాకాలంలోనైతే బంగాళా దుంపను పండించవచ్చు. ఇది శీతాకాలపు పంట. బంగాళా దుంపను సాగు చేయాలంటే చల్లని వాతావరణం అవసరం. ఎందుకంటే ఈ పంట ఎక్కువ టెంపరేచర్ ఉన్న చోట్ల పెరగదు. ఒక వేళ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే భూమి లోపల దుంపలు బలవర్ధకం కాకుండా ఉపరితలంపై ఉండే శాఖలు పెరుగుతాయి. బంగాళ దుంప మొక్కల కొమ్మలు, ఆకులు పెరిగితే లాభం లేదు. కానీ, భూమి లోపల వేర్లు పెరగడం అవసరం.</p> ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01dqf4rb7hdmad2hbqj432ert9/nasa1-jpg_760x400.jpg"/>
    </item>
    <item>
      <title>వెదురు సాగుతో అదిరే లాభాలు.. ఎకరాకు రూ. 20వేల పెట్టుబడి.. ఏడాదికి రూ. 2 లక్షల రాబడి</title>
      <link>https://telugu.asianetnews.com/agriculture/bamboo-cultivation-is-a-profitable-option-in-agriculture-r84hhm</link>
      <guid>https://telugu.asianetnews.com/agriculture/bamboo-cultivation-is-a-profitable-option-in-agriculture-r84hhm</guid>
      <pubDate>Wed, 02 Mar 2022 20:26:10 +0530</pubDate>
      <description><![CDATA[<p>హైదరాబాద్: వాణిజ్య పంటలతో రాబడి అధికంగా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న&nbsp;ముడిసరుకులపై ఓ కన్నేసి సరైన సాగు (Cultivation) చేస్టే కాసుల పంటే. వరి సాగు కంటే వాణిజ్య పంటలు ఎక్కువ లాభాలు&nbsp;తెచ్చిపెడుతున్నాయి. ఉద్యానవన శాఖ ఇలాంటి విషయాన్ని వెల్లడించింది. వెదురును సాగు చేస్తే బంగారాన్ని సాగు&nbsp;చేసినట్టేనని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. వెదురు (Bamboos)ను ఒక ఎకరంలో రూ. 20 వేల పెట్టుబడితో సాగు చేస్తే ఏడాదికి రూ. 2&nbsp;లక్షల ఆదాయం పొందవచ్చని ఉద్యానవన శాఖ చెబుతున్నది.</p>  <p>దేశవ్యాప్తంగా వెదురు సాగు (Agriculture)కు భారీగా డిమాండ్ ఉన్నది. ఇటీవలి కాలంలోనే వెదురుకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇప్పుడు&nbsp;థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వెదురు గుళికలు వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బొగ్గు వినియోగంతో&nbsp;ఎక్కువ వాయు కాలుష్యం ఏర్పడుతున్నదని, దానికి బదులు వెదురు గుళికలు వినియోగించాలని సూచించింది. తద్వార&nbsp;థర్మల్ విద్యుత్ కేంద్రాలకు భారీగా వెదురు గుళికలు అవసరం పడుతున్నాయి. ఈ అవసరమే.. వెదురు సాగును లాభాల&nbsp;బాటలో నడిపించనుంది.&nbsp;</p>  <p>రూ. 20 వేల పెట్టుబడితో ఎకరం భూమిలో వెదురు సాగు చేస్తే.. అది ఏపుగా పెరగడానికి ఏడాది కాలం పడుతుంది. ఈ&nbsp;వెదురు బొంగులకు మార్కెట్‌లో లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ధర రానుంది.</p>  <p>రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 24.74 లక్షల టన్నుల వెదురు బొంగులు అవసరం పడుతున్నది. వీటి మార్కెట్ విలువ&nbsp;సుమారు రూ. 2,969,85 కోట్లుగా ఉంటుందని ఉద్యానవన శాఖ తమ అధ్యయనంలో తేల్చింది. దాదాపు లక్ష ఎకరాల్లో&nbsp;వెదురు సాగు చేస్తే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా వెదురు గుళికలు అందుబాటులోకి వస్తాయని వివరించింది.</p>  <p>ఒడిశాలోని అంగూల్ ప్రాంతంలో జిందాల్ ఇండియా థర్మల్ పవర్ కంపెనీ కొత్తగా రెండు ప్లాంట్‌లను నెలకొల్పుతున్నది.&nbsp;600 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్‌లను ఏర్పాటు చేయనుంది. ఈ రెండు ప్లాంట్లకు 26 వేల టన్నుల&nbsp;వెదురు గుళికలు అవసరం పడుతుందని టెండర్లు కూడా పిలిచింది.</p>  <p>దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే &nbsp;కాలుష్యాన్ని నియంత్రించడానికి బొగ్గుకు బదులుగా వెదురు&nbsp;గుళికలు వాదాలని కేంద్రం తన కొత్త ఇంధన విధానంలో పేర్కొంది. వెదురు గుళికలు తప్పనిసరిగా వాడాలని ఆదేశాలు జారీ&nbsp;చేసింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు వినియోగం వల్ల ఏటా 21 లక్షల టన్నులకు పైగా బొగ్గు పులువు వాయువులు&nbsp;వాతావరణంలోకి ఉద్గారితం అవుతున్నది. దీని వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతున్నదని కేంద్ర విద్యుత్ శాఖ ఓ&nbsp;రిపోర్టులో వెల్లడించింది. అందుకే బొగ్గును కాల్చే సమయంలో ఏడు శాతం వెదురు గుళికలను వాడాలని కేంద్రం స్పష్టం&nbsp;చేసింది.</p>  <p>ఈ డిమాండ్ దృష్యా వెదురు సాగు చేయాలని ఉద్యానవన శాఖ ప్రోత్సహిస్తున్నది. వెదురును సాగు చేయడం అంటే బంగారం&nbsp;పండించినట్టేనని చెప్పకనే చెప్పింది.</p> ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01fwdw6m0hdzzyh7w8p0gsdpc1/fmcmdueamam5jvw_760x400.jpg"/>
    </item>
    <item>
      <title>తక్కువ పెట్టుబడితో ఊహించని లాభాలు తీసుకోచ్చే 5 పంటలు ఇవే!</title>
      <link>https://telugu.asianetnews.com/agriculture/good-profits-with-these-5-agro-based-industries-investment-is-also-low-r82hh0</link>
      <guid>https://telugu.asianetnews.com/agriculture/good-profits-with-these-5-agro-based-industries-investment-is-also-low-r82hh0</guid>
      <pubDate>Tue, 01 Mar 2022 18:30:36 +0530</pubDate>
      <description><![CDATA[<p>ఎవరైనా సరే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందుకోవాలని చూస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో తక్కువ పెట్టుబడితో ఎటువంటి వ్యాపారాలు చేయలేము. వ్యాపారాలే కాకుండా వ్యవసాయ పరంగా కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టడం కష్టమనే చెప్పవచ్చు. &nbsp;కానీ తక్కువ పెట్టుబడితో వ్యవసాయంలో కూడా ఐదు రకాల పంటలు చేయవచ్చని దాని వల్ల ఊహించని లాభాలు కూడా ఉంటాయని తెలుస్తుంది.</p>  <p>ఇంతకు ఆ పంటలు ఏంటంటే.. ప్రస్తుతం దేశంలో పుట్టగొడుగుల వాడుక బాగా ఆదరణ లో ఉంది. ఇక ఈ పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ప్రతి ఒక్కరూ ఈ పంటపై బాగా ఆసక్తి చూపిస్తున్నారు. పైగా తక్కువ పెట్టుబడి కావటంతో చాలా మంది పుట్టగొడుగులను పెంచుతున్నారు. ముఖ్యంగా పాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.</p>  <p>పాల వల్ల కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందుకోవచ్చు. ఇక సేంద్రియ వ్యవసాయానికి కూడా మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు. సేంద్రియ ఎరువులను తయారు చేసి సరఫరా చేస్తే ఎక్కువ లాభాలు అందుకోవచ్చు. దీనికి కూడా పెట్టుబడి పెట్టే అవసరం ఎక్కువగా ఉండదని చెప్పవచ్చు. ఇక ఈ మధ్య చాలామంది ప్రజలు ఇంగ్లీష్ వైద్యం కంటే ఆయుర్వేద వైద్యం కు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.</p>  <p>మెడిసిన్స్ వాడటం కంటే ఆయుర్వేద మందులు వాడటం వల్ల తమకు అనారోగ్య సమస్యలు తక్కువ అవడంతో దేశంలో ఔషధ మొక్కలను పెంచటానికి రైతులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక దీని వల్ల కూడా ఎక్కువ పెట్టుబడి ఉండకపోగా.. కొంతవరకు ఔషధ మొక్కలను పెంచితే చాలు ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చని ముందు అడుగులు వేస్తున్నారు. కాబట్టి మీరు కూడా తక్కువ పెట్టుబడి తో లాభాలు పొందాలనుకుంటే ఈ 5 రకాల పంటలను సులువుగా చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరి కొన్నిరకాల తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు కూడా ఉన్నాయి.</p> ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01fx2s0dkjhzqbwcg6c93004yw/vanannqx-jpg_760x400.jpg"/>
    </item>
    <item>
      <title>సేంద్రీయ వ్యవసాయంలో వచ్చే సవాళ్లు, పరిష్కార మార్గాలు..</title>
      <link>https://telugu.asianetnews.com/agriculture/challenges-of-organic-farming-and-solutions-r82acu</link>
      <guid>https://telugu.asianetnews.com/agriculture/challenges-of-organic-farming-and-solutions-r82acu</guid>
      <pubDate>Tue, 01 Mar 2022 15:56:54 +0530</pubDate>
      <description><![CDATA[<p>సేంద్రీయ వ్యవసాయంలో ఎటువంటి రసాయనిక పురుగు మందులు గానీ ఎరువులు గానీ అస్సలు ఉపయోగించకూడదు. ఈ వ్యవసాయ పద్దతిలో కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులను మాత్రమే వాడాల్సి ఉంటుంది. అలాగే వేపపిండి, ఆవుపేడ, కోళ్ల పెంట, పందుల పెంట, ఎండిన ఆకులతో ఎరువులను తయారు చేసి పంటకు వేస్తే మంచి దిగుబడి వస్తుంది.&nbsp;</p>  <p>సేంద్రీయ వ్యవసాయాన్ని రెండు పద్దతుల్లో చేస్తారు. ఇందులో మొదటి &nbsp;పద్దతి ప్రకారం.. ప్రకృతి సిద్ధమైన ఎరువులు అంటే చాలా రోజులు నిల్వ ఉన్న ఆవుపేడ, వర్మీ కంపోస్ట్, ఆకు తుక్కు, వేప పిండి వంటి వాటిని ఉపయోగించి వ్యవసాయం చేయడం. ఇది సాధారణ సేంద్రీయ వ్యవసాయ పద్దతి. ఈ పద్దతిని ఎక్కువగా కేరళ, ఈశాన్య రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి.</p>  <p>ఇక రెండో పద్దతిని సుభాస్ పాలేకర్ లేదా గో-ఆధారిత పద్దతి అనికూడా అంటారు. ఈ పద్దతి ప్రకారం.. జీవామృతాన్ని ఉపయోగించి పంటలను పండిస్తారు. సహజ రసాయనాలైన అగ్ని అస్త్రం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి వాటిని పంటకు ఉపయోగిస్తారు.&nbsp;</p>  <p>సేంద్రీయ వ్యవసాయం వల్ల పండించిన కూరగాయల వల్ల మన ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. ఈ పద్దతిలో నాణ్యమైన పంటలు చేతికొస్తాయి. ముఖ్యంగా ఈ పద్దతిలో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. అలాగే నీటి ఖర్చు, కరెంటె ఖర్చు కూడా తక్కువే. ఈ వ్యవసాయానికి బ్యాంకుల నుంచి రుణాలను కూడా తీసుకోవక్కర్లేదు. ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం వల్ల వాతావారణ కాలుష్యం ఎంతో తగ్గుతుంది.అందుకే ప్రభుత్వాలు సైతం సేంద్రీయ వ్యవసాయం చేయడానికి రైతులను ప్రోత్సహిస్తున్నాయి.&nbsp;</p>  <p>సేంద్రీయ వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలు:&nbsp;</p>  <p>సేంద్రీయ వ్యవసాయంలో పంటలను పండించినా.. వీటి ఎగుమతులకు ఆర్గానిక్ సర్టిఫికెట్ పొందడం తప్పనిసరిగా ఉంది. ఇలాంటప్పుడు వాటిని ఎగుమతి చేయడం రైతులకు కష్టంగా మారుతుంది.&nbsp;</p>  <p>సేంద్రీయ వ్యవసాయం మొదలు పెట్టిన రెండు నుంచి మూడేండ్లలో &nbsp;కూడా పంట ఉత్పత్తి తక్కువగానే ఉంటుంది. దీనివల్ల రైతులకు నష్టమే తప్ప లాభం ఉండదు.&nbsp;</p>  <p>ఎందుకంటే రసాయనిక మందుల ప్రభావం ఉన్న పంటపొలాల్లో సేంద్రీయ వ్యవసాయం కష్టతరమవుతుంది. ఆ రసాయనాలన్నీ విచ్చిన్నం కావడానికి దాదాపుగా రెండు నుంచి మూడేండ్లు పడుతుంది. ఈ తర్వాతే స్వచ్ఛమైన సేంద్రీయ దిగుబడులను పొందగలం.&nbsp;</p>  <p>ముఖ్యంగా రసాయనాలను వాడే పొలాలకు, సేంద్రీయ పంట పొలాలు దాదాపు 100 మీటర్ల దూరంలో ఉండటం ఎంతో ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అస్సలు సాధ్యం కాదు.&nbsp;</p>  <p>పరిష్కార మార్గాలు: &nbsp;సేంద్రీయ వ్యవసాయం చేసేవారు సంత విత్తనం మాత్రమే వాడాలి. ముఖ్యంగా పంట మార్పిడి పద్దతులను తప్పక పాటించాల్సి ఉంటుంది.&nbsp;</p>  <p>రసాయనిక ఎరువులను కొంచెం కూడా వాడకూడదు. కేవలం జీవన ఎరువు, సేంద్రీయ ఎరువులను మాత్రమే ఉపయోగించాలి.&nbsp;</p>  <p>పక్క పొలాల్లో రసాయనిక మందులను పిచికారి చేస్తున్నప్పుడు, ఆ రసాయనాలు సేంద్రీయ పంటల్లోకి రాకుండా చూసుకోవాలి.&nbsp;</p>  <p>పంట కాలం ముగిసిన తర్వాత మొక్కలను, ఆకులను అస్సలు కాల్చకూడదు. వాటిని అచ్చాదనకు ఉపయోగిస్తే భూసారం పెరుగుతుంది. ఒకే రకం పంటలను పండించకూడదు. కలుపు మందులను అస్సలు ఉపయోగించకూడదు.&nbsp;</p>  <p>మొక్కకు మొక్కకు దూరం ఖచ్చితంగా ఉండాలి. &nbsp;<br /> &nbsp;</p> ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01esv0htgk6qax9xpy3e02h8sw/whatsapp-image-2020-12-18-at-18-56-42-jpeg_760x400.jpg"/>
    </item>
    <item>
      <title>దేశానికి ఆదర్శంగా.. మహారాష్ట్ర వ్యవసాయ ఎగుమతి విధానం..</title>
      <link>https://telugu.asianetnews.com/agriculture/focus-on-exports-infra-harvest-management-in-maharashtras-agriculture-export-policy-r825cw</link>
      <guid>https://telugu.asianetnews.com/agriculture/focus-on-exports-infra-harvest-management-in-maharashtras-agriculture-export-policy-r825cw</guid>
      <pubDate>Tue, 01 Mar 2022 14:08:57 +0530</pubDate>
      <description><![CDATA[<p>మహారాష్ట్ర : ఫిబ్రవరి 25న మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ ఎగుమతి విధానాన్ని తెలిపింది. ఈ పాలసీ ప్రకారం 21 వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. 2018 &nbsp;డిసెంబర్ లో కేంద్రం వ్యవసాయ ఎగుమతి విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంట్లో భాగంగా నిర్షిష్టమైన ప్రాంతంలో పండే ప్రత్యేకమైన ఉత్తత్తులు, geographical indication certification కలిగిన ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడంపై దృష్టి సారించి, వాటి ఉత్పత్తి విషయంలో వారి స్వంత విధానాన్ని రూపొందించాలని రాష్ట్రాలను ఆదేశించింది. కేంద్రం ఆదేశాలను అనుసరించి, మహారాష్ట్ర ప్రభుత్వం 2019 మేలో ఒక విధానాన్ని రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది.</p>  <p><strong>పాలసీ ఏమి చెబుతుంది?</strong><br /> ఎగుమతి ప్రమోషన్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం 21 కమోడిటీ-నిర్దిష్ట క్లస్టర్‌లను గుర్తించింది. వీటిలో అల్ఫోన్సో మామిడి, కేసర్ మామిడి, అరటి, దానిమ్మ, ఉల్లిపాయ, జీడిపప్పు, నారింజ, ద్రాక్ష, sweet lime, పూల పెంపకం, ఎండుద్రాక్ష, బాస్మతీయేతర బియ్యం, పప్పులు, తృణధాన్యాలు, కూరగాయలు, నూనెగింజలు, బెల్లం, సుగంధ ద్రవ్యాలు (ఎర్ర మిరపకాయ, పసుపు) పాల ఉత్పత్తులు, మత్స్య, జంతు ఉత్పత్తులు ఉన్నాయి.</p>  <p>రాష్ట్రం 26 వ్యవసాయ ఉత్పత్తులకు GI ట్యాగ్‌ పొందింది. ఎగుమతి విధానం ఈ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడంపై దృష్టి పెడుతుందని మహారాష్ట్ర స్టేట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ పవార్ అన్నారు. వ్యవసాయ ఎగుమతుల ప్రోత్సాహానికి బోర్డు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఇది కాకుండా, సేంద్రీయ ఉత్పత్తులను ఎగుమతి చేయడం, మౌలిక సదుపాయాలను సృష్టించడం, సముద్ర ప్రోటోకాల్, ట్రయల్ సరుకులను అభివృద్ధి చేయడంలో ఈ విధానం సహాయపడుతుంది. AEP కింద, రాష్ట్రంpost-harvest management కోసం అంతర్జాతీయ కన్సల్టెంట్‌లను నియమించుకుంటుంది. నిర్దిష్ట ఉత్పత్తులకు చీడపీడలు లేని ప్రాంతాలను ఎంపికచేసుకుంటుంది. ఇది సమర్థవంతమైన ట్రేస్‌బిలిటీ సిస్టమ్‌ను అమలు చేయడంలో కూడా పాల్గొంటుంది.</p>  <p>అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA), మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (MPEDA) వంటి కమోడిటీ బోర్డులు supply chain యాజమాన్యం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందజేస్తాయి. ఇందులో రైతు రిజిస్ట్రేషన్‌లు, సాంకేతిక సంస్థల ద్వారా రైతు శిక్షణ, FPO ఏర్పాటు, నాణ్యమైన ఇన్‌పుట్‌లను అందించడం, ధరల ఆవిష్కరణ, థార్డ్ పార్టీ ధృవీకరణ వంటివి ఉంటాయి.</p>  <p><strong>పాలసీ ఎలా సహాయపడుతుంది?</strong><br /> రైతుల నికర ఆదాయాన్ని 40-45 శాతం పెంచే అవకాశం ఉన్న ఎగుమతులపై ఈ విధానం దృష్టి సారిస్తుందని, వ్యవసాయ ఎగుమతి చైన్ లోని వాటాదారులకు మహారాష్ట్ర ముఖ్య కార్యదర్శి (సహకారం, మార్కెటింగ్) అనూప్ కుమార్ చెప్పారు."రైతులకు లాభదాయకమైన రాబడిని ఇవ్వడానికి దేశీయ మార్కెట్ పరిమిత సామర్థ్యాన్ని కలిగి ఉంది" అని కుమార్ చెప్పారు.</p>  <p>వ్యవసాయ ఎగుమతులలో పారిశ్రామికవేత్తలను అభివృద్ధి చేయడంలో, export basketను వైవిధ్యపరచడంలో కూడా AEP సహాయం చేస్తుంది. మహారాష్ట్ర AEP ప్రకారం, ప్రస్తుతం పంటల కోత తరువాత కలిగే నష్టాల్లో పాడైపోయే వస్తువులకు 5-10 శాతం, పాడైపోయే వస్తువులకు 30 శాతంగా ఉన్నాయి.</p>  <p><strong>ఇతర రాష్ట్రాలు పరిస్తితి ఏంటి?</strong><br /> కేంద్రం 2018లో AEPని ప్రారంభించినప్పటి నుండి, 21 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు తమ రాష్ట్ర-నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలను ఖరారు చేశాయి. దేశవ్యాప్తంగా, AEP 18 ఉత్పత్తుల ఎగుమతి ప్రచారం కోసం 41 క్లస్టర్‌లను గుర్తించింది, వీటిలో షోపియాన్ (జమ్మూ అండ్ కాశ్మీర్), కిన్నౌర్ (హిమాచల్ ప్రదేశ్) యాపిల్స్ కోసం, అనంతపూర్ (ఆంధ్రప్రదేశ్), థేని (తమిళనాడు) అరటిపండ్ల కోసం, లక్నో (ఉత్తరప్రదేశ్), కచ్ (గుజరాత్) మహబూబ్ నగర్ (తెలంగాణ) మామిడి పండ్లకోసం, నాసిక్ (మహారాష్ట్ర) ద్రాక్ష కోసం, పైనాపిల్స్ కోసం సిఫాహిజాల (త్రిపుర), పసుపు కోసం పశ్చిమ జైంతియా హిల్స్ (మేఘాలయ)లు ఉన్నాయి.</p> ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01frq51rgt9c6b97dbd3drpbn8/honey_760x400.jpg"/>
    </item>
    <item>
      <title>లిల్లీ పూల సాగులో ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు ఇవే!</title>
      <link>https://telugu.asianetnews.com/gallery/agriculture/lilly-crop-farmers-must-know-this-in-farming-know-full-details-inside-r7wi0h</link>
      <guid>https://telugu.asianetnews.com/gallery/agriculture/lilly-crop-farmers-must-know-this-in-farming-know-full-details-inside-r7wi0h</guid>
      <pubDate>Sat, 26 Feb 2022 12:56:42 +0530</pubDate>
      <description><![CDATA[<p>లిల్లీ (Lily) పరిమళాలు వెదజల్లే అందమైన మొక్క. సాధారణంగా లిల్లీ పువ్వులను సంపంగి పూలు అని కూడా పిలుస్తారు.<br /> &nbsp;</p> <img src='https://static.asianetnews.com/images/01fwteh7qgysa7swsqt6mkvvbc/2-6-jpg.jpg' alt="" /><p>&nbsp;లిల్లీ అనేది లిలియేసి (Liliaceae) కుటుంబానికి చెందినది. లిల్లీ పువ్వు సాగులో వివిధ దశల్లో ఆశించే పురుగుల ఉదృతి కారణంగా రైతులు అధికంగా నష్టపోతున్నారు. వాటి నివారణ చర్యలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..<br /> &nbsp;</p>  <img src='https://static.asianetnews.com/images/01fwtejagtfdb2jjgpnv55zq6b/download--1--jpg.jpg' alt="" /><p>లిల్లీ, ఉల్లి (Onion) మాదిరిగా భూమిలో దుంప కలిగిన జాతి. సమశీతోష్ణ స్థితి కలిగిన వాతావరణ పరిస్థితుల్లో లిల్లీ పువ్వులు చక్కగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. లిల్లీ పువ్వులకు వెలుతురు బాగా ఉండి 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత (Temperature) ఉన్న ప్రదేశాలు అనుకూలమైనవి.&nbsp;<br /> &nbsp;</p>  <img src='https://static.asianetnews.com/images/01fwtekrxnhdy784amxejft662/li21-jpg.jpg' alt="" /><p>40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే పూల నాణ్యత బాగా తగ్గుతుంది. అత్యల్ప ఉష్ణోగ్రత గల నేలలు, మంచుపడే ప్రదేశాలు (Snowy places) లిల్లీ పూల సాగుకు అసలు పనికిరావు. తేలికపాటి ఇసుక నేలలు, ఒండ్రు నేలలు (Alluvial soils), ఎర్ర గరప నేలలు లిల్లీ పువ్వుల సాగుకు అనుకూలంగా ఉంటాయి.<br /> &nbsp;</p>  <img src='https://static.asianetnews.com/images/01fwtemevgxkhspcwrzc7yx6ke/download--2--jpg.jpg' alt="" /><p>వాతావరణంలో తడి అధికంగా ఉన్నప్పుడు నీరు నిలిచే నేలలో లిల్లీ పంట సాగుకు అనుకూలంగా ఉండదు. సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే లిల్లీ పూల సాగు జూలై ఆగస్టు నెలలో నాటేందుకు అనువుగా ఉంటుంది. లిల్లీ పూలలో సింగిల్ (Single), డబుల్ (Double), సెమిడబుల్, వెరిగేటెడ్ అనే రకాలు బాగా ప్రాచుర్యం పొందినవి.&nbsp;<br /> &nbsp;</p>  <img src='https://static.asianetnews.com/images/01fwten7m5c79nnbtdzgr2mzcz/images-jpg.jpg' alt="" /><p>మొగ్గ తొలుచు పురుగు: పూత దశలో మొగ్గ తొలిచే పురుగు రంధ్రాలు చేయడంతో పూమొగ్గలు పనికి రాకుండా పోతాయి. ఈ పురుగు నివారణకు గాను క్వినాల్ఫాస్ (Quinalphos) 2 మి.లీ. లేదా థయోడికార్బ్ (Thiodicarb) 1 గ్రా. చొప్పున లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకుంటే సరిపోతుంది.<br /> &nbsp;</p>  <img src='https://static.asianetnews.com/images/01fwtenycav7jgkxfmd7wq5267/41jhvijklel-jpg.jpg' alt="" /><p>కాండం కుళ్ళు తెగులు: వాతావరణంలో తడి అధికంగా ఉన్నప్పుడు, నీరు నిలిచే నేలలో కాండం కుళ్ళు తెగులు (Stem rot) లిల్లీ మొక్కలను ఆశిస్తాయి. వీటి నివారణకు గాను లీటరు నీటికి 5 గ్రాముల కార్బండిజమ్ (Carbonism) కలిపి పిచికారి చేసుకోవాలి.<br /> &nbsp;</p>  <img src='https://static.asianetnews.com/images/01fwteqg87f707yn66c48ffe2x/flower-3763573-1280-1-jpg.jpg' alt="" /><p>తామర పురుగు: లిల్లీ పంటకు తామర పురుగులు సోకితే పూమొగ్గలు &nbsp;సరిగా విడిపడక వాడి రాలిపోతాయి. వీటి నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ (Dimethoate) 2 మి.లీ. గానీ లేదా ఫిప్రోనిల్ (Fipronil) 2.0 మి.లీ. గానీ కలిపి పిచికారి చేయాలి.<br /> &nbsp;</p>  <img src='https://static.asianetnews.com/images/01fwter304b8h7n0xhk36d4cdk/lilies-1512813-1280-jpg.jpg' alt="" /><p>ఎర్ర నల్లి: సాలెపురుగు జాతికి చెందిన ఎర్ర నల్లి &nbsp;ఆకుల అడుగుభాగాన చేరి రసాన్ని పీల్చేసి మొక్కలను బలహీనపరుస్తుంది. పొడి వాతావరణం ఉన్న సమయంలో ఈ తెగులు ముక్కలను అధికంగా ఆశిస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి డైమీథోఎట్ (Dimethoate) 2 మిల్లీలీటర్లు గాని లేదా ఫిప్రోనిల్ (Fipronil) 2.0 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి &nbsp;పిచికారీ చేయాలి.</p>  ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01fwtegf2z7kw7exzb22t30x7x/hhnuj-jpg_760x400.jpg"/>
    </item>
    <item>
      <title>వ్యవసాయం చేసి లక్షలు సంపాదించాలనుకుంటున్నారా.. అయితే ఈ ఔషధ మొక్కలు గురించి తెలుసుకోండి!</title>
      <link>https://telugu.asianetnews.com/agriculture/earn-lakhs-with-this-medicinal-plants-agriculture-know-full-facts-inside-r7v1sk</link>
      <guid>https://telugu.asianetnews.com/agriculture/earn-lakhs-with-this-medicinal-plants-agriculture-know-full-facts-inside-r7v1sk</guid>
      <pubDate>Fri, 25 Feb 2022 18:08:44 +0530</pubDate>
      <description><![CDATA[<p>ఔషధ విలువలు కలిగిన మొక్కలను ఔషధ మొక్కలు (Medicinal Plants) అంటారు. వీటిని ఔషధాలను తయారుచేయటంలో ఉపయోగిస్తారు. ఈ మొక్కలలో అనేకం మనం ఇంటిలోనే పెంచవచ్చు. ఉధాహరణకు తులసి, జిల్లేడు, నాగజెముడు, కలబంద వంటి మొక్కలు.</p>  <p>ప్రస్తుత కాలంలో అందరూ అధునాతన మందులను ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం గురించి దాదాపుగా &nbsp;మరిచిపోతున్నారు. కానీ ఆయుర్వేదంలో కొన్ని ఔషధ మొక్కలు, మూలికలు ఉన్నాయి. ఇవి చాలా రకాల ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా చికిత్స చేసి నయం చేయగలవు. ఈ ఔషధ మొక్కలు ప్రాచీన కాలం నుండి మన జీవితంలో ఒక భాగమై వివిధ ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాము. ఔషధ విలువలు కలిగిన &nbsp;పసుపు, అల్లం, తులసి ఆకులు, పుదీనా, దాల్చినచెక్క వంటి మూలికలను సాధారణంగా భారతీయ వంటకాలలో ఉపయోగిస్తారు. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయటంలో సహాయపడతాయి. ఇవి జలుబు, ఫ్లూ, ఒత్తిడిని నిరోధించటం, జీర్ణక్రియను మెరుగుపరచటం, &nbsp;రోగనిరోధక శక్తిని పెంచటం వంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఔషధ విలువలు కలిగిన కొన్ని మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..</p>  <p>1.కలబంద:</p>  <p>కొన్ని ప్రాంతాలలో దీనిని "కూటి కలబంద" అని అంటారు. దీని శాస్త్రీయ నామం అలోవిరా .కలబంద మొక్కను పెంచటానికి ఎక్కువ నీటి అవసరం వుండదు. అందుకే ఇవి &nbsp;పొడి పరిస్థితులలో కూడా పెరుగుతాయి. &nbsp;మీ ఇంటి పెరటులో &nbsp;చాలా సులభంగా ఎటువంటి అదనపు జాగ్రత్తలు అవసరం లేకుండా వీటిని పెంచవచ్చు.కలబంద వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.కలబంద మలబద్దకాన్ని నిర్మూలించటం,వ్యాధి నిరోధక శక్తిని మెరుగు పరచటం,జీర్ణ క్రియను వృధ్ధి చేయటంలో దోహద పడుతుంది.</p>  <p>2.తులసి</p>  <p>తులసి మొక్క హిందూ మతంలో చాలా ప్రాముఖ్యతను కలిగివుంది.దీనిని సర్వ రోగ నివారిణిగా భావిస్తారు. తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది.అంతే కాకుండా తులసి దగ్గు, గుండె జబ్బులు,మధుమేహం.జుట్టు రాలటం వంటి సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది.</p>  <p>3. పుదీనా</p>  <p>ఈ తాజా వాసన గల ఔషధ మొక్కను అనేక విధాలుగా ఉపయోగిస్తారు. &nbsp;మీ మానసిక స్థితిని మెరుగుపరచటం &nbsp;నుండి అజీర్ణ చికిత్స వరకు పుదీనా ఉపయోగపడుతుంది.ఈ మొక్క పెరగడానికి చాలా నీరు అవసరం.అందుకని పుదీనా విత్తనాలను నాటిన తరువాత విరివిగా నీటిని అందించాల్సి వుంటుంది.పుదీనా చాలా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచటంలో, రోగనిరోధక శక్తిని పెంచటంలో ఉపయోగపడుతుంది.పుదీనా &nbsp;శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కూడా నయం చేయటంలో సహాయపడుతుంది.</p>  <p>4. కొత్తిమీర</p>  <p>కొత్తిమీరను భారతీయ వంటలలో ఎక్కువుగా &nbsp;వాడుతుంటారు. కొత్తిమీర &nbsp;ఆకులు, దనియాలు,దనియాల &nbsp;పొడి ఇవన్నీ కూడా మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి మీ వంటలకు రుచిని పెంచటంతో పాటు వివిధ రకాల ఔషధ విలువలను జతచేస్తాయి.కొత్తిమీర మిమ్మల్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుతుందంటే, ఇది ఆహారం త్వరగా పాడవకుండా కాపాడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరుచటంలో కొత్తిమీర దోహదపడుతుంది.</p>  <p>5.అల్లం</p>  <p>&nbsp;అనేక రకాల ఆరోగ్య సమస్యలకు అల్లం ఒక పరిష్కారం. మీ ఇంటి పెరటులో అల్లం ను చాలా సులభంగా పెంచవచ్చు. దీనికి పెంచటానికి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం లేదు.విలక్షణమైన రుచి కారణంగా ఇది భారతీయ ఆహారంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అల్లం మీ ఆరోగ్యానికి చాలా &nbsp;ప్రయోజనాలు కలిగిస్తుంది.ఇది తలనొప్పి, రక్తపోటును నియంత్రించటంతో పాటు &nbsp;జలుబు, దగ్గు, ఫ్లూ ను నయం చేయటంలో సహకరిస్తుంది.</p>  <p>&nbsp;6.అశ్వగంధ</p>  <p>అశ్వగంధ ఆయుర్వేద వైద్యంలో చాలా ముఖ్యమైనది. &nbsp;ఇది కేవలం 35-75 సెంటీమీటర్ల ఎత్తులో అంటే, 1.25 మీటర్ల ఎత్తులో గుబురుగా పొదలా పెరిగే మొక్క. &nbsp;అశ్వగంధ మొక్క వేళ్ళు పొడవుగా, ఉండి చాలా ఔషధగుణాలు కలిగివుంటాయి. ఇది సాధారణంగా సమశీతోష్ణ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. , ఉదరసంబంధవ్యాధులకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది., అశ్వగంధ జ్ఞాపక శక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగాను, ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, కేన్సర్‌ కు దీనిని మించిన ఔషధం మరొకటి లేదంటే, ఆశ్చర్యపడనక్కర్లేదు. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కుంటున్న ఒత్తిడిని నివా రించడంలో దీనికిదే సాటి. నీరసాన్ని, నిస్త్రా ణని దగ్గరకి రానివ్వదు.<br /> &nbsp;<br /> &nbsp;7.మెంతులు</p>  <p>మెంతులలో చాలా &nbsp;ఔషధ గుణాలు వుంటాయి. మెంతి మొక్క సతత హరిత మొక్క. తాజా మెంతికూర, ఎండబెట్టిన మెంతికూరను వైద్యపరమైన అవసరాల కోసం ఉపయోగిస్తారు. మెంతులను మసాలా దినుసుగా వాడతారు. &nbsp;కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిచటంలో, జుట్టు రాలడాన్ని తగ్గించటంలో, ఆకలిని పెంచుటంటో మెంతులు సహాయపడతాయి. &nbsp;బ్లడ్ షుగర్ తో బాధపడేవారు మెంతులను ఆహారంగా తీసుకొంటే.. రక్తంలో ఇన్సులిన్ స్థాయులు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా మధుమేహం అదుపులోకి వస్తుంది.<br /> &nbsp;<br /> 8.స్టీవియా</p>  <p>స్టీవియా తులసి జాతికి చెందిన మొక్క.వీటి ఆకులో అనేక ఔషధ గుణాలు ఉండటంతో పాటు పంచదార కంటే 30 రెట్లు ఎక్కువ తీపిగా ఉంటాయి. అంటే ఒక కప్పు పంచదార స్టీవియా ఆకులతో తీసిన ఒక స్పూన్ రసానికి సమానం.స్టీవియా ఆకులను వాడటం వలన అధిక రక్తపోటును అదుపులో ఉంచవచ్చు.ఇది జీర్ణశక్తిని పెంచి కడుపులో మంట,గ్యాస్ వంటి వాటిని తగ్గిస్తుంది. ఈ ఆకులు నమలటం వలన నోటి దుర్వాసన పోయి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.మధుమేహం ఉన్నవారికి ఇది చక్కని ఔషధంలా పనిచేస్తుంది.</p>  <p>9.లావెండర్</p>  <p>లావెండర్ మొక్క చిన్న పొదలాగా పెరిగే మొక్క. ఈ మొక్కకి అందమైన పర్పుల్ బ్లూ పూలు పూస్తాయి. లావెండరు తైలాన్ని ఆరబెట్టిన పూలనుండి, పూలకంకిల నుండి ఉత్పత్తి చేస్తారు. &nbsp;లావెండర్ నూనె సుగంధ తైలం మాత్రమే కాదు దీనిలో &nbsp;ఉన్న ఔషద గుణాల కారణంగా &nbsp;వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఈ నూనె యాంటిసెప్టిక్ గా ,భాదనాశక ఔషధముగా ,మూర్ఛ నివారణ ఔషధముగా పనిచేస్తుంది.లావెండర్ నూనె కీలవాతం,అధిక రక్తపోటు ఉన్నవారు కూడా ఉపయోగిస్తారు. అంతే కాకుండా లావెండర్ నూనెను సబ్బుల తయారీలో ,చర్మం కోసం వాడే ఔషధ మందులో ఉపయోగిస్తారు.</p> ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01fwre1bmfxn6184vpx8ae9y7n/1-jpg_760x400.jpg"/>
    </item>
    <item>
      <title>సింపుల్ టెక్నిక్‌తో అద్భుతం చేసిన చెరకు రైతు.. మూడు రెట్లు పెంచుకున్న ఆదాయం</title>
      <link>https://telugu.asianetnews.com/agriculture/up-sugarcane-farmers-tripled-income-by-adopting-trench-method-r7v073</link>
      <guid>https://telugu.asianetnews.com/agriculture/up-sugarcane-farmers-tripled-income-by-adopting-trench-method-r7v073</guid>
      <pubDate>Fri, 25 Feb 2022 17:34:16 +0530</pubDate>
      <description><![CDATA[<p>హైదరాబాద్: సంచార జీవితానికి చెక్ పెట్టడానికి మనిషి సాగును ఎంచుకున్నాడు. అప్పటి నుంచి వ్యవసాయం(Agriculture) చేసుకుంటూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించాడు. అందుకే మానవ పరిణామంలో వ్యవసాయం కీలకమైనదిగా భావిస్తారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగు విధానాల్లో కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. అధిక దిగుబడినిచ్చే సాగు పద్ధతుల కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)కు చెందిన ఓ రైతు చెరుకు(Sugarcane) సాగులో అద్భుతం సృష్టించాడు.</p>  <p>ఉత్తరప్రదేశ్‌లో మొరదాబాద్‌లోని బిలారీ ప్రాంతానికి చెందిన రైతు మహమ్మద్ మోబిన్ తన చెరకు సాగులో కొత్త విధానాన్ని అవలంభించి పంటను దిగుబడిని రెండింతలు పెంచుకున్నాడు. దీంతో ఆదాయం మూడింతలు పెరిగింది. ఆయన ట్రెంచ్ విధానాన్ని అవలంభించారు. దీని ద్వారా ఆయన 23 అడుగుల పొడవైన చెరుకును పండించారు. అందుకే ఈ విధానం గురించి ఆయన ఎంతో ఆసక్తిగా చెబుతున్నారు. అంతేకాదు, తన తరహాలోనే ఇతర రైతులూ లబ్ది పొందాలని భావిస్తున్నారు. అందుకే ఇతరులూ ఈ ట్రెంచ్ విధానాన్ని అవలంభించాలని కోరుతున్నారు.</p>  <p>ఉత్తరప్రదేశ్‌లో చెరకు పంట అధికంగా పండిస్తారు. ముఖ్యంగా పశ్చిమ యూపీలో ఈ పంట అధికంగా ఉంటుంది. కానీ, రైతులు సనాతన పద్ధతుల్లోనే సాగు చేయడం మూలంగా దిగుబడులు పెరగడం లేదు. దీనికి పరిష్కారం చూడాలని మహమ్మద్ మోబిన్ భావించాడు. సాగులో కొత్త పద్ధతుల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఆయన ట్రెంచ్ పద్ధతిని మొదలుపెట్టాడు. ఈ పద్ధతిలో ఆయన యూ ఆకారపు కందకాలు తవ్వాడు. కందకం లోతు 20 నుంచి 25 సెంటిమీటర్లు ఉండేట్టుగా చూసుకున్నాడు. లైన్‌ల మధ్య కనీసం 80 సెంటిమీటర్ల ఎడం ఉండేలా చూసుకున్నాడు. కందకాల మధ్యలో సాళ్లలో చెట్లను నాటాడు. ఇలా చెరకును నాటగా.. అది ఏపుగా పెరిగింది. గతంలో మోబిన్ ఒక బిగా భూమిలో 40 నుంచి 50 క్వింటాళ్ల చెరకు పంటను పండించాడు. కానీ, ఈ ట్రెంచ్ పద్ధతిలో సాగు దిగుబడిని 100 క్వింటాళ్లకు పెరిగింది.</p>  <p>ఈ పద్ధతి ఉప ఉష్ణమండలంలో చెరకు పండించే ప్రాంతాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నది. దీనికి కారణం ఈ పద్ధతిలో సాగుదారులు ఎక్కువగా దిగుబడి పొందడమే. ఈ పద్ధతిలో చెరకు మొక్కల మధ్య అంతర్ పంటలను పండించడానికి అవకాశం ఉంటుంది. ఈ అంతర్ పంటలుగా పప్పు ధాన్యాలు, కూరగాయలు, నూనె గింజలు, తృణ ధాన్యాలను వేస్తున్నారు.</p> ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01f9rp5pfn59wvv6fxr1axchgq/gettyimages-902934090-170667a-jpg_760x400.jpg"/>
    </item>
    <item>
      <title>organic farming:  సేంద్రీయ వ్యవసాయంతో లాభాలెన్నో..</title>
      <link>https://telugu.asianetnews.com/agriculture/benefits-of-organic-farming-r7uxvw</link>
      <guid>https://telugu.asianetnews.com/agriculture/benefits-of-organic-farming-r7uxvw</guid>
      <pubDate>Fri, 25 Feb 2022 16:44:20 +0530</pubDate>
      <description><![CDATA[<p><span style="font-size:14px;"><strong>benefits of organic farming: </strong></span>సహజ వనరులను ఉపయోగించి వ్యవసాయం చేసే పద్దతినే సేంద్రీయ వ్యవసాయం అంటారు. ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఎలాంటి రసాయనిక ఎరువులను గానీ, పురుగు మందులను గానీ ఉపయోగించకూడదు. ఈ పద్దతి ప్రకారం వ్యవసాయం చేయడం కాస్త కష్టతరమైనప్పటికీ.. దీని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.&nbsp;</p>  <p>సేంద్రీయ వ్యవసాయం ద్వారా భూసారం మరింత పెరుగుతుంది. పంటలు కలుషితం కావు. &nbsp;అందుకే ప్రభుత్వాలు కూడా ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. తాజా పరిశోధనల ప్రకారం.. సేంద్రీయ పద్దతిలో పండించిన కూరగాయలు, పండ్లల్లో 40 శాతం ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని వెల్లడైంది.&nbsp;</p>  <p>ముఖ్యంగా సేంద్రీయ పద్దతుల ద్వారా పండించిన ఆహారం తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, హై బ్లడ్ షుగర్ తగ్గుతుందని పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఈ ఆర్గానికి ఫుడ్స్ లో కెమికల్స్ ఏ మాత్రం ఉండవు. ఇలాంటి ఆహారంలో న్యూట్రిషియన్స్ అధిక మొత్తంలో ఉంటాయి. ఈ ఆర్గానిక్ ఫుడ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే..</p>  <p>సేంద్రీయ ఎరువులతో పండించిన ఆహారాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. అంతేకాదు ఈ ఆహారం ఎన్నో పోషకవిలువలను కలిగి ఉంటుంది. అలాగే న్యూట్రీషియన్స్ కూడా అధికంగా ఉంటాయి. ఆర్గానిక్ వ్యవసాయం వల్ల వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఈ వ్యవసాయంలో శారీరక శ్రమ కూడా తక్కువగానే ఉంటుంది.</p>  <p>సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల &nbsp;ప్రకృతికి మేలే కానీ నష్టం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఆర్గానిక్ వ్యవసాయానికి మన దేశంలో ఉన్న భూములన్నీ అనుకూలిస్తాయి. ఈ భూముల్లోనే పండుతయి.. ఈ భూముల్లో పండవు అనే సమస్యే ఉండదు.&nbsp;</p>  <p>సేంద్రీయ పద్దతిలో పంటలను పండించేటప్పుడు ఒకే సారి కాకుండా.. క్రమ క్రమంగా పెంచుకుంటూ పోవాలి. ఒకే సారి ఈ పంటను పెద్దమొత్తంలో పండించలేరు. ఆర్గానిక్ ఫార్మింగ్ లో దిగుబడిలో ఎలాంటి మార్పులు రావు.</p>  <p>మొదటి సారి సేంద్రీయ వ్యవసాయం చేసేవారు .. పంటలకు 60 శాతం ఆర్గానిక్ పురుగుమందులకు 40 శాతం రసాయన పురుగు మందులను వాడాలి. అయితే ఇది వరకు వాడిన రసాయనిక పురుగుల మందు ప్రభావం పొలంలో తగ్గాలంటే .. ఆర్గానిక్ మందులను ఉపయోగించాలి.&nbsp;</p>  <p><br /> &nbsp;</p> ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="http://static.asianetnews.com/images/58c53938-25f9-494d-ad0c-518d995ec73b/image_760x400.jpg"/>
    </item>
    <item>
      <title>అంతర్జాతీయ విత్తన పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి..!</title>
      <link>https://telugu.asianetnews.com/agriculture/minister-niranjan-reddy-launched-international-seed-test-lab-in-telangana-r7uxke</link>
      <guid>https://telugu.asianetnews.com/agriculture/minister-niranjan-reddy-launched-international-seed-test-lab-in-telangana-r7uxke</guid>
      <pubDate>Fri, 25 Feb 2022 16:37:27 +0530</pubDate>
      <description><![CDATA[<p>తెలంగాణలో అంతర్జాతీయ విత్తన పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు &nbsp;చేశారు. రాజేంద్ర నగర్ లో ఏర్పాటు చేసిన ఈ విత్తన పరీక్షా కేంద్రాన్ని.. తెలంగాణ వ్యవసాయ మంత్రి &nbsp;నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. రూ.7వేల కోట్లతో 14,652 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితరులు కూడా హాజరయ్యారు.</p>  <p>ఈ సందర్భంగా.. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు..అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తన పరిశోధన, పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. తెలంగాణ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటాల‌న్నారు. నాణ్యమైన విత్తనాలే వ్యవసాయంలో అత్యంత కీలకమ‌ని చెప్పారు.&nbsp;</p>  <p>వ్యవసాయ అభివృద్ది, అధిక దిగుబడులకు విత్తనమే ప్రామాణికమ‌ని స్ప‌ష్టం చేశారు. ప్రపంచ విత్తన భాండాగారం తెలంగాణ అని ఎఫ్ఏవో వెల్ల‌డించిన విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు. మన కీర్తి పెరగడం తెలంగాణకు గర్వకారణం. హైదరాబాద్‌ను చూసి గర్వపడే పరిస్థితి సీఎం కేసీఆర్ కల్పించారని పేర్కొన్నారు.&nbsp;</p>  <p>ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఐటీ రంగంలో తెలంగాణ ముందుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో రెండో స్థానానికి ఎదిగామ‌న్నారు. విత్తన బాంఢాగారంగా ప్రపంచస్థాయిలో కీర్తి గడిస్తున్నామ‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. ఒక్కొక్క రంగం అభివృద్ది ద్వారా హైదరాబాద్ ప్రపంచదృష్టిని ఆకర్షిస్తుంద‌న్నారు.</p>  <p>ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ, సాగు అనుకూల విధానాల మూలంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో విత్తన రంగం మీద దృష్టి సాధించడం జరుగుతున్నదని తెలిపారు. ప్రపంచంలో 70 నుంచి 80 దేశాలకు విత్తనాలు ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. విత్తనరంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలి. విత్తన దృవీకరణ, పరీక్షల ల్యాబ్ వినియోగం మరింత పెరుగుతుందని మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు.<br /> &nbsp;</p> ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01fwr8y0512epmhxscvk85gca5/niranajn-reddy-jpg_760x400.jpg"/>
    </item>
    <item>
      <title>సేంద్రియ సాగుతో సిరుల పంట.. లాభాలు తెచ్చే మార్గమిది</title>
      <link>https://telugu.asianetnews.com/agriculture/organic-farming-produces-profits-for-farmers-says-agriculture-experts-r7uvni</link>
      <guid>https://telugu.asianetnews.com/agriculture/organic-farming-produces-profits-for-farmers-says-agriculture-experts-r7uvni</guid>
      <pubDate>Fri, 25 Feb 2022 15:56:07 +0530</pubDate>
      <description><![CDATA[<p>హైదరాబాద్: వ్యవసాయం (Agriculture) చేయడం ఇప్పుడు సవాళ్లతో కూడుకున్న పని. పెట్టుబడి పది.. రాబడి రాదు అన్నట్టుగా ఉన్నది. వ్యయ ప్రయాసల కోర్చి పంట పండించినా.. చివరి నిమిషంలో వరుణ దేవుడు నట్టేట ముంచే ముప్పు ఉంటుంది. తీరా మార్కెట్ యార్డు (Market Yard) కు వెళ్లిన తర్వాత ధరల మాయాజాలంలో చిక్కుకుపోయి పెట్టుబడి (Investment) పెట్టిన పైసలు దక్కించుకుని బయట పడితే చాలు అనే దుస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే పెట్టుబడులు తగ్గించి రాబడి (Revenue) అధికంగా ఇచ్చే సాగు పద్ధతులపై అన్వేషణ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే నేడు అందుబాటులో ఉన్న సేంద్రియ సాగు (Organic Farming) ప్రస్తావన వస్తున్నది.</p>  <p>పంటసాగులో రసాయన ఎరువుల (Fertilisers) కు పెట్టుబడి పెరగడం.. వాటి మితిమీరిన వినియోగంతో నేల చౌడుబారి పోవడం రెండూ నష్టాన్నే కలిగిస్తున్నాయి. కాబట్టి, సేంద్రియ సాగు బెస్ట్ అనే అభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నాయి. అందుబాటులో ఉన్న సహజమైన వనరుల్ని వినియోగించుకుని సేద్రీయ సాగు చేి లాభాలు చేసుకోవాలని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటికే ఇటువైపుగా మొగ్గు చూపి లాభాలు ఆర్జిస్తున్నవారున్నారు. పశ్చిమ గోదావరికి చెందిన ఓ రైతు (Farmers) ఈ సాగు విధానాన్ని అవలంభించి ఆదర్శంగా నిలుస్తున్నారు.</p>  <p>పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెరవలి మండలంలో బొప్పాయి, అరటి, జామతోపాటు వంగ,బెండ, దొండ, చిక్కుడు, పొట్ల, బీర, కాకర వంటి కూరగాయలను సేంద్రీయ విధానంలో సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇదే విధానంలో వరిసాగునూ విజయవంతంగా చేపట్టి.. లాభాలు ఆర్జిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎకరానికి 40 నుంచి 50 బస్తాల దిగుబడులు సాధిస్తున్నారు.&nbsp;</p>  <p>భూముల చౌడుబారిపోవడంతో పంట దిగుబడి తగ్గుతున్నది. కాబట్టి, సేంద్రియ సాగులో పశువుల ఎరువు, పచ్చిరొట్ట పైర్ల సాగు వంటివి వీటికి విరుగుడుగా పని చేస్తున్నాయి. అందుకు జనుము, జీలుగ, పిల్లిపిసర వంటి పంటలు వేస్తే ఎకరానికి రెండు టన్నుల ఎరువు అందుతుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, సేంద్రియ విధానంలో పండిన పంటకు మార్కెట్‌లో మంచి గిట్టుబాటు ధర పలుకుతుందని వివరిస్తున్నారు.</p>  <p>పంటలపై వచ్చే తెగుళ్ల నివారణకు రకరకాల కషాయాలు తయారు చేసి పంటలపై పిచికారి చేయాలి.</p>  <p>పశ్చిమ గోదావరికి చెందిన ఓ రైతు తాను చేపట్టిన సాగు రైతు గురించి మాట్లాడారు. తాను రెండేళ్లుగా అరటి సాగు సేంద్రియ విధానంలో చేస్తున్నానని చెప్పారు. గతేడాది ఎకరానికి రూ. 50వేల లాభం వచ్చిందని వివరించారు. పెట్టుబడి తక్కువ, నాణ్యమైన దిగుబడి రావడంతో ఈ పంటకు మార్కెట్‌ లో మంచి ధర లభించిందని పేర్కొన్నారు. ఈ ఫలితాలు తనను ఎంతో సంతోష పెట్టాయని, అందుకే ప్రస్తుతం అరటితో పాటు వరి కూడా సేంద్రియ విధానంలో సాగు చేస్టున్నట్టు తెలిపారు. రసాయ ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని మానేసి తెగుళ్ల నివారణకు కేవలం కషాయాలు మాత్రమే వాడుతున్నామని, ఈ విధానంలో సాగు లాభాలను తెచ్చి పెడుతున్నదని వివరించారు. కాబట్టి.. రైతులు నష్టాలను తగ్గించుకునే దారిలో వెళ్లడం సముచిత నిర్ణయమే.</p> ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01ftt5bbnmy9gzyxbd7g201mfa/zero-budget-national-farming_760x400.jpg"/>
    </item>
    <item>
      <title>మొక్కజొన్న పంటకు వివిధ దశల్లో ఆశించే పురుగులు, నివారణ చర్యలు ఇవే!</title>
      <link>https://telugu.asianetnews.com/agriculture/corn-crop-farmers-need-to-take-this-type-pesticides-know-full-details-inside-r7uv55</link>
      <guid>https://telugu.asianetnews.com/agriculture/corn-crop-farmers-need-to-take-this-type-pesticides-know-full-details-inside-r7uv55</guid>
      <pubDate>Fri, 25 Feb 2022 15:45:06 +0530</pubDate>
      <description><![CDATA[<p>మొక్కజొన్న పంటలు (Corn crops) పండించుకోవడానికి నీరు ఇంకే నల్లరేగడి, నీటి వసతి ఉన్న ఎర్ర నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి. మన రాష్ట్రంలో మొక్కజొన్నను ఖరీఫ్, రబీ సీజన్లలో విస్తారంగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ లో ఈ పంటను జూన్ మొదటి వారం నుంచి &nbsp;జులై 15 వరకు విత్తుకోవచ్చు. మొక్కజొన్న సాగులో దశల్లో ఆశించి పురుగుల ఉదృతి కారణంగా రైతులు అధికంగా నష్టపోతున్నారు. వాటి నివారణ చర్యలు (Preventive measures) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..</p>  <p><br /> ఎకరానికి 7 నుంచి 10 కిలోల మొక్కజొన్న విత్తనాలు సరిపోతాయి. నీరు ఇంకనీ నల్ల భూములు, వర్షాధారిత ఎర్ర నేలలు, ఆమ్లక్షార, చౌడు భూములు మొక్కజొన్న సాగుకు అనుకూలంగా ఉండవు. తేమ (Moisture), ఉష్ణోగ్రత (Temperature) అధికంగా ఉన్న వాతావరణంలో మొక్కజొన్న పంటకు తెగుళ్లు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కనుక రైతులు వాటి నివారణ చర్యలను తీసుకుంటే మొక్కజొన్న సాగు అత్యధిక ఉత్పత్తిని పొందవచ్చు.</p>  <p>బూజు తెగులు: మొక్కజొన్న పంటను బూజు తెగులు (Powdery mildew) ఆశించినట్లయితే ఆకులు వంకలు తిరిగి, ముడతలు పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ తెగలను గమనించి వాటి నివారణ కోసం టలాక్సిల్ (Talaxyl) 4గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. అదే మొక్కలపై బూజు తెగుళ్లు కనిపిస్తే మెటలాక్సిల్ 2గ్రా. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇలా చేస్తే బూజు తెగులు తగ్గి మొక్కజొన్న పంట సాగు బాగుంటుంది.</p>  <p>కాండం తొలుచు పురుగులు: మొక్కజొన్న పంటకు ఈ తెగులు పూత దశ నుంచి సోకే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ తెగులు లక్షణాలు కాండంపై గోధుమ రంగు చారలు (Brown stripes) ఏర్పడి పంట కోతకు రాకముందే కాండం (Stem) భాగం తిరిగి నేలపై పడిపోతుంది. ఇటువంటి మొక్కలను చీల్చి చూసినప్పుడు లోపలి బెండు భాగం కుళ్లి నలుపు రంగులోకి మారుతుంది. వీటి నివారణ కోసం ఎండాకాలంలో నేలను లోతుగా దున్నుకోవాలి. పంటకోత తర్వాత తెగులు ఆశించిన మొక్క భాగాలను కాల్చివేయాలి.</p>  <p>ఆకు ఎండు తెగులు: ఆకు ఎండు తెగులు రెండు రకాలు.</p>  <p>మొదటి రకం ఆకు ఎండు తెగులు: ఆకు ఎండు తెగులు రెండు రకాలు. మొదటి రకం తెగుళ్లు ఆకులపై కోలగా మచ్చలుగా ఉండి నీటితో తడిచినట్లుగా అనిపించి క్రమంగా ఈ మచ్చ &nbsp;పరిమాణం (Scar size) పెరుగుతుంది. క్రమేపీ ఆకు మొత్తం వ్యాపించి ఆకులు పూర్తిగా ఎండిపోయాయి. ఎక్కువ తేమ ఉన్న వాతావరణంలో (Humid climate) మొక్కలు చనిపోతాయి. కనుక తేమ లేకుండా చూసుకోవాలి.</p>  <p>రెండవ రకం ఆకు ఎండు తెగులు: ఆకులపై కోలగా చిన్న చిన్నగా ఉండే బూడిద లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి తరువాత ఈ మచ్చల పరిమాణం (size of the spots) పెరిగి దీర్ఘచతురస్రాకారంలో మారుతాయి వాతావరణంలో అధిక తేమ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ తెగలు తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ తెగల నివారణ కోసం మాంకోజెబ్ (Mancozeb) 2.5గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.</p> ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01fwr5r8qx1kp33b9y6qtf05nz/u2xa4t37-jpg_760x400.jpg"/>
    </item>
    <item>
      <title>Organic Farming: సేంద్రీయ వ్యవసాయం అంటే ఏమిటి? ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?</title>
      <link>https://telugu.asianetnews.com/agriculture/precautions-to-be-taken-in-organic-farming-r7ustb</link>
      <guid>https://telugu.asianetnews.com/agriculture/precautions-to-be-taken-in-organic-farming-r7ustb</guid>
      <pubDate>Fri, 25 Feb 2022 14:54:48 +0530</pubDate>
      <description><![CDATA[<p><span style="font-size:14px;"><strong>Organic Farming: </strong></span>సంప్రదాయ పద్దతిలో.. కేవలం సహజ వనరులను ఉపయోగించే వ్యవసాయం చేయడాన్ని సేంద్రీయ వ్యవసాయం అంటారు. ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఎలాంటి రసాయనిక ఎరువులను గానీ, కలుపు మందులను గానీ, పరుగు మందులను గానీ వాడకూడదు. ఈ పద్దతిలో &nbsp;కృత్రిమ వనరులను మొత్తానికే వినియోగించకూడదు.&nbsp;</p>  <p>అయితే 1965-2000 మధ్య కాలంలో పురుగు మందుల వాడకం, రసాయనిక ఎరువుల వాడకం బాగా పెరిగింది. అధిక దిగుబడి, అధిక లాభాల పేరుతో వీటిని విచ్చల విడిగా ఉపయోగించేవారు. దీని వల్ల ఫ్యూచర్ లో ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటామని ప్రభుత్వం హెచ్చరించినా.. ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. వీటి వాడకం వల్ల ఎన్నిసత్పలితాలు వచ్చాయో.. అంతకు మించి దుష్పలితాలను చవి చూసారు. చూస్తూనే ఉన్నారు. మనం తాగే నీరు, పీల్చే గాలి, తినే తిండి, పండే పంట పూర్తిగా కలుషిత మయమయ్యాయి.&nbsp;</p>  <p>అందులోనూ విచక్షణా రహితంగా రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూ సారం పూర్తిగా దెబ్బతింటుంది. వీటిని ఎక్కువగా వాడటం వల్ల కొన్నేళ్ల తర్వాత ఆ పొలంలో చిన్నకలుపు మొక్క కూడా పెరగదని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. వీటి మూలంగానే భూ కాలుష్యం, నీటి కాలుష్యాలు బాగా పెరిగాయి. ఇక విచ్చల విడిగా పురుగుల మందు వాడకంతో వాతావరణ కాలుష్యం పెరిగింది. కలుషిత నీరు, కలుషిత గాలి, కలుషిత తిండితో మనం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు వీటితో ఈ భూమిపై ఉండే ఎన్నో జీవులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి.&nbsp;</p>  <p>ముఖ్యంగా భూసారాన్ని పెంచే వానపాములు పూర్తిగా అంతరించి పోయే స్టేజిలో ఉన్నాయి. తేనె టీగలు కూడా పెద్ద మొత్తంలో చనిపోతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కొందమంది రైతులు ప్రజలకు మేలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. వీరు పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ.. తక్కువ ధరలకే అమ్ముతున్నారు. ఈ సేంద్రీయ వ్యవసాయ పద్దతిలో దిగుబడులు తక్కువొచ్చిన ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది.</p>  <p>సేంద్రీయ వ్యవసాయంలో తీసుకోవాల్సిన అంశాలు, జాగ్రత్తలు:&nbsp;</p>  <p>సహజ వనరులు మెండుగా లభించినా.. ఎప్పటి కప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు, నేల, నీరు కాలుష్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పంట సరిగ్గా రాదు.</p>  <p>తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే మార్గాలను కనుక్కోవాలి. ఇందుకోసం జీవన ఎరువులు, అన్ని రకాల సేంద్రీయ ఎరువులను ఉపయోగించాలి.&nbsp;</p>  <p>ఒకవేళ పంటకు నష్టం కలిగించే తెగులు, క్రిమికీటకాలు దాడి చేసినప్పుడు వాటికి జీవ సంబంధ పదార్థాలు లేదా వృక్ష సనంద పదార్థాలతో వాటికి తరిమికొట్టుచ్చు.&nbsp;</p>  <p>పంట ప్రతి దశలో యాజమాన్య పద్దతలును ఉపయోగిస్తే దిగుబడి పెరిగే అవకాశముంటుంటుంది.&nbsp;</p>  <p>కోడి పెంట, ఆవు గేదెల పేడ, &nbsp;మేక ఎరువులు, వామి కంపోస్టు, పచ్చి ఆకు ఎరువులు, పంది పెంట, చెరకు మద్ది వంటి ఎరువులను ఎక్కువగా వాడితే పంట దిగుబడి బాగుంటుంది. &nbsp;</p> ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01esv0htgk6qax9xpy3e02h8sw/whatsapp-image-2020-12-18-at-18-56-42-jpeg_760x400.jpg"/>
    </item>
    <item>
      <title>ఈ ఏడు మార్గాలతో.. దేశీయ వ్యవసా రంగంలో సమూల మార్పులు.. ప్రధాని మోడీ..</title>
      <link>https://telugu.asianetnews.com/agriculture/prime-minister-narendra-modi-enlists-seven-ways-to-transform-indian-agriculture-r7up9u</link>
      <guid>https://telugu.asianetnews.com/agriculture/prime-minister-narendra-modi-enlists-seven-ways-to-transform-indian-agriculture-r7up9u</guid>
      <pubDate>Fri, 25 Feb 2022 13:38:18 +0530</pubDate>
      <description><![CDATA[<p>న్యూఢిల్లీ : స్టార్టప్‌లు, బ్యాంకింగ్ రంగం, పెట్టుబడిదారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సహకార సంస్థల సహాయంతో వ్యవసాయ రంగానికి 2022-23 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలను రూపొందించి, అమలు చేయడం ప్రారంభించాలని policymakers, stakeholdersకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విజ్ఞప్తి చేశారు. దేశ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, భారతదేశంలో వ్యవసాయాన్ని "ఆధునికంగా, స్మార్ట్"గా మార్చే "ఏడు మార్గాల"పై మాట్లాడారు.</p>  <p>ఈ ఏడు మార్గాలలో మిషన్ మోడ్‌లో natural farming, AI, డ్రోన్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, edible oils దిగుమతిని తగ్గించడానికి మిషన్ ఆయిల్ పామ్, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం కొత్త లాజిస్టిక్స్, వ్యవసాయ-వ్యర్థాల నిర్వహణ, ఉపయోగం. రైతులకు సాధారణ బ్యాంకింగ్ సేవలు, వ్యవసాయ పరిశోధన, విద్యను అందించడానికి 1.5 లక్షల పోస్టాఫీసులను ఏర్పాటు చేయడం లాంటివి ఉన్నాయి.</p>  <p>ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ‘Smart Agriculture' అనే వెబ్‌నార్‌లో ప్రసంగించారు. ఈ సమయంలో భారతీయ వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చే ఈ ఏడు మార్గాలను చెప్పుకొచ్చారు. ఇవి 2022-23 బడ్జెట్ వ్యవసాయ పరివర్తనకు దోహదపడుతుందని చెప్పుకొచ్చారు. కేంద్రం ప్రవేశ పెట్టిన 'income support scheme', PM కిసాన్ సమ్మాన్ నిధి (PM-కిసాన్) స్కీంలు ప్రవేశపెట్టి మూడేళ్లు గడిచిన సందర్బంగా జరిగిన వెబినార్ ఇది. ఈ &nbsp;వెబ్‌నార్‌కు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆయన మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.</p>  <p>PM-Kisan పథకం కింద గురువారంనాటికి సుమారు 11.78 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందారు. ఫిబ్రవరి 24, 2019 నుండి దేశవ్యాప్తంగా వివిధ వాయిదాలలో రూ. 1.82 లక్షల కోట్ల నిధులు విడుదల చేయబడ్డాయి. ఇందులో రూ.1.29 లక్షల కోట్లు ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి కాలంలో విడుదల చేశారు. ఈ పథకం కింద, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) విధానంలో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రతీ భూస్వామి, రైతు బ్యాంకు ఖాతాకు నేరుగా సంవత్సరానికి మూడు సమాన వాయిదాలలో రూ.6,000 బదిలీ చేయబడుతుంది. దేశంలో ఇలాంటి రైతులు దాదాపు 14 కోట్ల మంది ఉన్నారు.</p>  <p>"ఈ పథకం దేశంలోని చిన్న రైతులకు బలమైన మద్దతుగా మారింది" అని ప్రధాని అన్నారు. విత్తనం నుండి మార్కెట్ వరకు విస్తరించి ఉన్న అనేక కొత్త వ్యవస్థల గురించి, వ్యవసాయ రంగంలో గత ఏడేళ్లలో పాత వ్యవస్థలలో సంస్కరణల గురించి కూడా ఆయన మాట్లాడారు. “కేవలం ఆరేళ్లలో వ్యవసాయ బడ్జెట్‌ను అనేక రెట్లు పెంచాం. గత ఏడేళ్లలో రైతులకు వ్యవసాయ రుణాలు కూడా రెండున్నర రెట్లు పెరిగాయి” అని ఆయన చెప్పారు.</p>  <p>2023 సంవత్సరాన్ని 'అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం'గా గుర్తించిన మోదీ, దేశీయ తృణధాన్యాలను బ్రాండింగ్ చేయడంలో, ప్రోత్సహించడంలో కార్పొరేట్ ప్రపంచం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భారతీయ తృణధాన్యాల నాణ్యత, ప్రయోజనాలను ప్రాచుర్యం పొందేందుకు సెమినార్లు, ఇతర ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని విదేశాల్లోని ప్రధాన భారతీయ మిషన్లను ఆయన కోరారు.</p>  <p>పర్యావరణ అనుకూల జీవనశైలి పట్ల అవగాహన పెంచుకోవాలని, సహజ, సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్‌ను పెంచాలని కూడా ప్రధాన మంత్రి కోరారు. 'కృషి విజ్ఞాన కేంద్రాలు' (కెవికె) ప్రమోషన్ కోసం ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకుని సహజ వ్యవసాయంపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల ఆరేళ్ల క్రితం రూ.2 వేల కోట్లు ఉన్న ఎగుమతులు ప్రస్తుతం రూ.7 వేల కోట్లకు పెరిగి.. సేంద్రియ ఉత్పత్తుల మార్కెట్ రూ.11,000 కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు.</p>  <p>భారతదేశంలో భూసార పరీక్షలు చేయించే అలవాటు పెంచాల్సిన అవసరాన్ని కూడా ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. 'సాయిల్ హెల్త్ కార్డ్స్'పై ప్రభుత్వ దృష్టిని ఎత్తిచూపుతూ, నిర్ణీత వ్యవధిలో భూసార పరీక్షల అభ్యాసాన్ని సులభతరం చేయడానికి స్టార్టప్‌లు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 21వ శతాబ్దంలో వ్యవసాయం, వ్యవసాయానికి సంబంధించిన ట్రెండ్‌ను కృత్రిమ మేధస్సు (ఏఐ) పూర్తిగా మార్చబోతోందని మోదీ ఉద్ఘాటించారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరగడం ఈ మార్పులో భాగమే అన్నారు. “అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించినప్పుడు మాత్రమే డ్రోన్ టెక్నాలజీ ఓ స్థాయిలో అందుబాటులో ఉంటుంది. గత మూడు-నాలుగేళ్లలో దేశంలో 700కు పైగా అగ్రి స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయన్నారు.&nbsp;</p>  <p>వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయంలో డ్రోన్ల వాడకం మీద అనేక రకాల ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. పంట రక్షణ కోసం, పురుగుమందులను చల్లడానికి, మట్టిని పిచికారీ చేయడానికి ఇలాంటి మానవరహిత వైమానిక వాహనాల (UAVs) వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లో ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను (SOPs) విడుదల చేసింది. ఇందులో SOPలు ఉపయోగం, అత్యవసర నిర్వహణ ప్రణాళిక కోసం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అంశాలు ఇందులో ఉంటాయి.&nbsp;</p>  <p>పురుగుమందులు చల్లడానికి డ్రోన్లు వాడాలనుకుంటే.. అలాంటి డ్రోన్ నియంత్రణ కోసం SOPల్లో చట్టబద్ధమైన నిబంధనలు, విమానయాన అనుమతులు, దూర ప్రాంత పరిమితులు, బరువు వర్గీకరణ, రద్దీగా ఉండే ప్రాంతాల పరిమితి, డ్రోన్ రిజిస్ట్రేషన్, భద్రతా బీమా, పైలటింగ్ ధృవీకరణ, ఆపరేషన్ ప్లాన్, ఎయిర్-ఫ్లైట్ జోన్‌లు, వాతావరణ పరిస్థితులు వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తాయి.</p>  <p>డ్రోన్‌ల ప్రభావవంతమైన, సురక్షితమైన కార్యకలాపాల కోసం ఈ రంగంలోని అన్నిరకాల వాటాదారులతో సంప్రదించి వ్యవసాయ మంత్రిత్వ శాఖ దీనిని తయారు చేసింది. జాతీయ డ్రోన్ విధానం, డ్రోన్ రూల్స్ 2021 ఇప్పటికే దేశంలోని వ్యక్తులు, కంపెనీలు డ్రోన్‌లను వాడేలా, స్వయంగా ఆపరేట్ చేయడాన్ని సులభతరం చేశాయి. 2020లో వివిధ రాష్ట్రాల్లో మిడతల దాడులను అరికట్టడంలో దేశంలోనే తొలిసారిగా డ్రోన్‌లను ఉపయోగించారు.</p> ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01fwkk5941e71ps9z3vc97a4xj/farmers-759-jpg_760x400.jpg"/>
    </item>
    <item>
      <title>విప్లవాత్మక వ్యవసాయానికి తెరలేపిన మెకానిక్...!</title>
      <link>https://telugu.asianetnews.com/agriculture/meet-the-mechanic-who-is-revolutionising-farming-r7up5r</link>
      <guid>https://telugu.asianetnews.com/agriculture/meet-the-mechanic-who-is-revolutionising-farming-r7up5r</guid>
      <pubDate>Fri, 25 Feb 2022 13:35:51 +0530</pubDate>
      <description><![CDATA[<p>వ్యవసాయం అంటే.. ఈ రోజుల్లో &nbsp;చాలా మంది నచ్చని పదం. ఒకప్పుడు మన తండ్రులు, తాతలు, ముత్తాతలు అందరూ వ్యవసాయం చేసిన వారే. కానీ.. తర్వాతర్వాత వ్యవసాయం మీద అందరి ఇష్టం పోయింది. వ్యవసాయం అంటే దండగ అనే అభిప్రాయం చాలా మందిలో పడిపోయింది. అయితే... తెలివిగా చేస్తే.. వ్యవసాయంతో లాభాల బాట పట్టొచ్చు.. భూమిలో బంగారం పండించవచ్చని చాలా మంది నిరూపించారు. అయితే.. వ్యవసాయం అంటే.. రైతు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఆ కష్టాలను చలించిన ఓ వ్యక్తి.. రైతుల &nbsp;కోసం కొన్ని యంత్రాలను ఆవిష్కరించాడు.</p>  <p>రాజస్థాన్‌లోని ఒక వ్యక్తి తన అసాధారణ ఆవిష్కరణలతో రైతుల జీవితాలను సులభతరం చేస్తున్నాడు. 46 ఏళ్ల శర్వాన్ కుమార్ బజ్యా ఒక మోటార్ సైకిల్ మెకానిక్. ప్రతిరోజూ తమ గ్రామంలో రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన శర్వాన్... ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాడు. మనుషులు చేసే పనిని యంత్రాలతో చేయాలని అనుకున్నాడు. &nbsp;అతను మాన్యువల్ లేబర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి , వృధాను తగ్గించడానికి అనేక ఉపయోగకరమైన పరికరాలను అభివృద్ధి చేశాడు.</p>  <p><br /> రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన శర్వాన్ చేతితో, బ్యాటరీతో పనిచేసే సీడ్ డ్రిల్స్, బహుళ ప్రయోజన విత్తనాలు , జలమార్గాన్ని సృష్టించే యంత్రం, కలుపు తీసే యంత్రం, ఉల్లిపాయ హార్వెస్టర్ , సాల్ట్ టర్నర్‌తో సహా అనేక పరికరాలను నిర్మించారు.&nbsp;</p>  <p>ఇప్పటి వరకు చాలా యంత్రాలను అతను తయారు చేశాడు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తాడు. కేవలం యంత్రాలు తయారు చేయడం మాత్రమే కాదు.. వాటిని ఆర్డర్స్ మీద అందరినీ సరఫరా కూడా చేస్తాడు. &nbsp;అతనికి సౌదీ అరేబియా వంటి దేశాల నుండి కూడా ఆర్డర్‌లు వస్తున్నాయట. ఈ విషయంపట్ల అతను సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం.</p> ]]></description>
      <media:content height="400" width="760" medium="image" url="https://static.asianetnews.com/images/01frtgkxnjx97wn344ndea1ysp/agri_760x400.jpg"/>
    </item>
  </channel>
</rss>