Asianet News TeluguAsianet News Telugu

రేప్ చేసి 20 సార్లు కత్తితో పొడిచిన దుండగుడు: మహిళ మృతి

దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై దుండగుడు అత్యాచారం చేసి, ఆమెను 20 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Woman stabbed 20 times, molested, dies in Delhi
Author
Delhi, First Published Jun 15, 2021, 7:32 AM IST

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన చోటు  చేసుకుంది. ఓ దుండగుడు 62 మహిళపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత 20 సార్లు కత్తితో పొడిచాడు. ఆ మహిళ మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయని పోలీసులు చెప్పారు.

ఆ సంఘటనకు సంబంధించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి గురించి  ఓ ఆస్పత్రి నుంచి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మహిళను చూశారు. ఆమె గొంతుపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు గుర్తులు ఉన్నాయి. కడుపుపై పలు గాయాలు కనిపించాయి. 

ఆస్పత్రికి తరలించే లోపునే మహిళ మరణించిందని వైద్యులు తేల్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దాని ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. మహిళపై దాడికి వాడిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన జరిగినప్పుడు నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. 

నిందితుడు తొలుత ఆమె మెడను కత్తితో కోశాడని, ఆ తర్వాత శ్రీరంపై 20 సార్లు పొడిచాడని, ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు అర్థమవుతోందని పోలీసులు అన్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

నోయిడాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహిళ కుమారుడు ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె రక్తం మడుగులో కనపించింది. మృతురాలి స్వస్థలం బీహార్ లోని బెగుసరాయ్. తన కుమారుడితో, మనవడితో కలిసి ఢిల్లీలోని గ్రామానికి వచ్చి నివాసం ఉంటోంది.

Follow Us:
Download App:
  • android
  • ios