Asianet News TeluguAsianet News Telugu

కదులుతున్న ట్రైన్‌లో యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన దొంగలు.. ఆయుధాలతో బెదిరించి దారుణం

లక్నో-ముంబయి పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం జరిగింది. ఇగ్తాపురిలో ట్రైన్ ఎక్కిన కొందరు దొంగలు పదునైనా ఆయుధాలతో బెదిరించి ప్యాసింజర్లను దోపిడీ చేయడమే కాదు, ఓ 20ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ చేశారు. కాసరా స్టేషన్‌లో ట్రైన్ ఆగిన తర్వాత బాధితురాలు సహాయం కోసం అరుపులు వేయగా పోలీసులు అప్రమత్తమై నలుగురు నిందితులను పట్టుకున్నారు.
 

woman gangraped in train in maharastra by robbers
Author
Mumbai, First Published Oct 9, 2021, 2:56 PM IST

ముంబయి: కదులుతున్న trainలో 20ఏళ్ల womanపై కొందరు దొంగలు gang rape చేశారు. weaponలతో ట్రైన్‌లోకి వెళ్లి ట్రైన్ కొండ ప్రాంతాల్లోకి వెళ్లగానే దోచుకోవడం మొదలుపెట్టారు. అదే క్రమంలో ఓ 20ఏళ్ల యువతిపై లైంగికదాడి చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసినవారిపై ఆయుధాలతో దాడి చేశారు. చివరికి ట్రైన్ ఓ స్టేషన్‌లో ఆగగానే బాధితురాలు సహాయం కోసం కేకలు వేశారు. రైల్వే స్టేషన్‌లోని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎనిమిది మంది నిందితులపై కేసు నమోదు చేశారు. అందులో నలుగురిని పట్టుకోగలిగారు.

లక్నో -ముంబయి పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ దారుణం జరిగింది. ట్రైన్ మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది. ఎనిమిది మంది robbers ఆయుధాలతో దోచుకోవాలనే ఇగ్తాపురి టౌన్‌లో ట్రైన్ ఎక్కారు. ట్రైన్ కొండ ప్రాంతాల గుండా వెళ్తుండగా ఇగ్తాపురి, కాసరా రైల్వే స్టేషన్‌ల మధ్య ఈ దారుణానికి ఒడిగట్టారు. ట్రైన్ ఎక్కగానే పదునైన ఆయుధాలతో ప్యాసింజర్లను బెదిరించారు. స్మార్ట్ ఫోన్లు, నగదును గుంజుకున్నారు. అదే క్రమంలో ఓ యువతిపైనా సామూహిక లైంగికదాడి చేశారు. కొందరు ప్రయాణికులు ఈ దారుణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ, ఆ దొంగలు వారిపైనా దాడి చేశారు. ఈ దాడిలో ఐదారుగురు ప్రయాణికులు గాయపడ్డారు.

ట్రైన్ కాసరా రైల్వే స్టేషన్‌లో ఆగగానే సదరు యువతి సహాయం కోసం గవర్నమెంట్ రైల్వే పోలీసులకు వినిపించేలా అరుపులు వేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ట్రైన్ ఎక్కారు. నలుగురు నిందితులను పట్టుకున్నారు. వారు రూ.96వేల విలువైన వస్తువులను దొంగిలించారని చెప్పారు. ఇందులో ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 34వేల విలువైన ప్రాపర్టీని రికవరీ చేసుకున్నట్టు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios