Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం: భర్తను చంపి పూడ్చిన భార్య

వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భర్తను  భార్య హత్య చేసింది. గేదే మృతదేహాన్ని పూడ్చిపెట్టే పేరుతో జేసీబీతో గొయ్యిని తవ్వి భర్త మృతదేహాన్ని పూడ్చి పెట్టింది.
 

Wife kills husband for extra marital affair in karnataka
Author
Karnataka, First Published Sep 7, 2020, 4:57 PM IST

బెంగుళూరు: వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భర్తను  భార్య హత్య చేసింది. గేదే మృతదేహాన్ని పూడ్చిపెట్టే పేరుతో జేసీబీతో గొయ్యిని తవ్వి భర్త మృతదేహాన్ని పూడ్చి పెట్టింది.

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలోని నిప్పానిలోని హంచనలో ఈ ఘటన చోటు చేసుకొంది. హంచన గ్రామానికి చెందిన సచిన్ కు అనితతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్న విషయం తెలిసింది.

ఈ విషయమై భార్యతో సచిన్ తరచుగా గొడవపడేవారు. వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని భర్త సూచించాడు. కానీ ఆమె మానుకోలేదు.ఇదే విషయమై ఈ నెల 3వ తేదీన భార్యాభర్తల మధ్య గొడవ చోటు చేసుకొంది. ఈ గొడవలో భర్తను కర్రతో కొట్టి ఆమె చంపేసింది. ఈ విషయం బయటకు తెలిస్తే తనకు ప్రమాదమని భావించింది.

also read:వివాహేతర సంబంధం: రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకొని చితకబాదిన భార్య

చనిపోయిన గేదేను పూడ్చిపెట్టేందుకు గాను జేసీబీని పిలిపించింది. గొయ్యి తవ్విన తర్వాత సచిన్ మృతదేహాన్ని గొయ్యిలో వేసి పూడ్చివేసింది. ఈ మృతదేహాన్ని పూడ్చడానికి ఆమె తన సోదరి, సోదరుడి సహాయాన్ని తీసుకొంది.ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios