Asianet News TeluguAsianet News Telugu

అమానవీయం...మహిళపై గ్యాంగ్ రేప్... బాధితురాలిపైనే గ్రామ బహిష్కరణ

అత్యాచార బాధితురాలే నేరం చేసినట్లు గ్రామం నుండి బహిష్కరించాలని గ్రామ పెద్దలు నిర్ణయించిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 

Village panchayat orders boycott of rape victim's family
Author
Aurangabad, First Published Dec 31, 2020, 4:27 PM IST

ఔరంగాబాద్: తనపై లైంగికదాడి జరిగి తీవ్ర మనోవేదనకు గురయిన మహిళకు మనోధైర్యాన్ని నింపాల్సింది పోయి మరింత వేధనకు గురిచేశారు గ్రామస్తులు. బాధిత మహిళే నేరం చేసినట్లు గ్రామం నుండి బహిష్కరించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఆ గ్రామం నుండి ఎక్కడ అత్యాచార మహిళ తమ గ్రామానికి వస్తుందేమోనని చుట్టుపక్కల మరో రెండు గ్రామాలు కూడా రానివ్వకూడదని తీర్మాణం చేశాయి. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 30ఏళ్ళ మహిళపై అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ ఘటన 2015లో జరగ్గా ఇటీవల యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు కోర్టులో రుజువయ్యింది. దీంతో యువకులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇలా యువకులకు శిక్ష పడటంతో గ్రామస్తులు బాధిత మహిళపై కోపాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలోనే అత్యాచార బాధితురాలు తమ గ్రామంలో వుండొద్దంటూ బహిష్కరించారు. చుట్టుపక్కల మరో రెండు గ్రామాలు కూడా సదరు మహిళను గ్రామంలోకి అనుమతించకుండా తీర్మానం చేశాయి. 

ఈ చర్యలతో తీవ్ర మనస్థాపానికి గురయిన మహిళ పోలీసులను ఆశ్రయించింది.  దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత మహిళ పట్ల అమానవీయంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios