Asianet News TeluguAsianet News Telugu

అమానుషం : రేప్ కి సహకరించలేదని.. వేడి కత్తితో కళ్లు కాల్చి, చితకబాది...

లలిత్ పుర్ జిల్లా బార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ, మార్కెట్ కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తోంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన హిమాన్షు, గంగారామ్ అనే ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెను బలవంతంగా నిర్జన ప్రదేశంలోకి లాక్కెళ్లి.. అత్యాచారానికి యత్నించారు.

UP : Woman brutally assaulted for protesting molestation, eyes and eyebrows burnt with hot knife after beating - bsb
Author
Hyderabad, First Published Jul 28, 2021, 5:01 PM IST

ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పుర్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై దుండగులు క్రూరత్వానికి పాల్పడ్డారు. వేడి చేసిన కత్తితో కళ్లు, కనుబొమ్మలపై కాల్చారు.

లలిత్ పుర్ జిల్లా బార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ, మార్కెట్ కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తోంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన హిమాన్షు, గంగారామ్ అనే ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెను బలవంతంగా నిర్జన ప్రదేశంలోకి లాక్కెళ్లి.. అత్యాచారానికి యత్నించారు.

అయితే సదరు మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితులు... లైటర్ వెలిగించి, కత్తిని వేడి చేసి.. మహిళ కళ్లు, కనుబొమ్మలపై కాల్చారు. అనంతరం తీవ్రంగా కొట్టడంతో బాధితురాలు స్పృహ కోల్పోయింది.

మార్కెట్ కు వెళ్లిన మహిళ ఎంతకీ ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం వెతకటం ప్రారంభించారు. ఓ నిర్జన ప్రదేశంలో స్పృహ కోల్పోయి ఉండటాన్ని గుర్తించి ఆమెను నేరుగా బార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

ఆ తరువాత పోలీసుల సూచనతో ఆస్పత్రిలో చేర్చారు. తమ ఇంటి సమీపంలోనే ఉండే ఈ నిందితులు.. మూడు నెలల క్రితం తమ మరదలు, ఆమె భర్తను కూడా ఇదే విధంగా వేధించారని బాధితురాలు పేర్కొంది. దీనిమీద పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. కాగా తాజా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios