Asianet News TeluguAsianet News Telugu

యూపీలో రూరల్ టూరిజం : ఆజంగఢ్‌లో కొత్త అధ్యాయం

ఉత్తరప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు యోగి సర్కార్ కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆజంగఢ్ జిల్లాలోని నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో పర్యాటకులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించనున్నారు.

UP Government Boosts Rural Tourism: Azamgarh Division Embarks on a New Chapter AKP
Author
First Published Oct 3, 2024, 4:09 PM IST | Last Updated Oct 3, 2024, 4:09 PM IST

లక్నో, అక్టోబర్ 3. ఉత్తరప్రదేశ్‌ రూరల్ టూరిజాన్ని ప్రోత్సహించడంలో యోగి సర్కార్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. యూపీలోని సాంప్రదాయ గ్రామీణ వాతావరణాన్ని దేశ, విదేశీ పర్యాటకులకు పరిచయం చేసే ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పుడు ఆజంగఢ్ ప్రాంతాన్ని చేర్చారు. ఆజంగఢ్ పరిధిలోని మౌ, బలియాలోని 4 గ్రామాలలో రూరల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్రామాల్లో పర్యాటకుల కోసం సౌకర్యాలను అభివృద్ధి చేస్తారు.

ఆజంగఢ్ ప్రాంతంలోని గ్రామాలను ఈ పథకంలో చేర్చడంతో యూపీలోొ రూరల్ టూరిజం కోసం అభివృద్ధి చేయబడుతున్న గ్రామాల సంఖ్య 97కి చేరుకుంది. దేవిపట్నం, చిత్రకూట్, అయోధ్య, లక్నో, వారణాసి ప్రాంతాల్లో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా గుర్తించిన గ్రామాలను త్వరలో ఈ ప్రక్రియలో చేర్చుతారని భావిస్తున్నారు. ఈ అన్ని పర్యాటక అభివృద్ధి, నిర్మాణ పనులను ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ పూర్తి చేస్తోంది.

పర్యాటక శాఖ పథకానికి ఊతం

సీఎం యోగి దార్శనికతకు అనుగుణంగా ఆజంగఢ్ లోని మౌ, జౌన్ పూర్ జిల్లాల్లోని మొత్తం 4 గ్రామాలను రూరల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి ఎంపిక చేశారు. నాలుగు గ్రామాల్లో ఒక విలేజ్ కోఆర్డినేటర్, ఒక జిల్లా కోఆర్డినేటర్, ఒక టూరిజం నిపుణుడు, ఒక గ్రామీణాభివృద్ధి నిపుణుడు, టీం లీడర్‌ను నియమిస్తారు. ప్రతి గ్రామంలో 10 స్థానిక గైడ్‌లు, మరో 5 మంది కథకులు, స్థానిక వంటలను అందించడానికి 5 కుటుంబాలకు బాధ్యతలు అప్పగిస్తారు. అదనంగా చేనేతకారులు, శిల్పులు, కుమ్మరి వంటి చేతివృత్తులవారు వుంటారు, బోటింగ్, ఫిషింగ్, పండ్లు, కూరగాయలు తీయడం, సైక్లింగ్ వంటి సౌకర్యాలను అందించడానికి 20 మంది కళాకారులు, స్థానికులకు బాధ్యతలు అప్పగిస్తారు. గ్రామ స్థాయిలో 10 హోమ్ స్టేల వరకు నిర్మించవచ్చు. వాటి రిజిస్ట్రేషన్, అభివృద్ధి, నియంత్రణ ప్రక్రియలను స్థానిక పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పూర్తి చేస్తారు. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ మార్గదర్శకాల ప్రకారం అన్ని ప్రక్రియలను పూర్తి చేస్తారు.

సోషల్ మీడియా ద్వారా ప్రచారం

ప్రాజెక్ట్ ప్రకారం అన్ని హోమ్ స్టేలు నిధి ప్లస్ పోర్టల్‌తో అనుసంధానించబడతాయి. అదనంగా పర్యాటక ఆస్తుల అభివృద్ధి అవకాశాలను కూడా అన్వేషిస్తారు. ప్రాజెక్ట్ కింద ప్రతి మూడు నెలలకు గ్రామాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా, ఈ గ్రామాలన్నింటికీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఖాతాలను సృష్టించి వాటిని ప్రోత్సహిస్తారు. గ్రామాల్లో 15 గదుల వరకు సామర్థ్యం గల హోమ్ స్టేలను అభివృద్ధి చేస్తారు. మొత్తం అభివృద్ధి ప్రక్రియను 6 నెలల 3 దశలు, 4 నెలల నాల్గవ దశ మరియు 2 నెలల ఐదవ దశ రూపంలో 24 నెలలు అంటే రెండు సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేస్తారు.

 దేశీయ పర్యాటకుల పరంగా ఉత్తరప్రదేశ్ ను దేశంలోనే నంబర్ వన్ పర్యాటక గమ్యస్థానంగా తీర్చదిద్దాలని యోగి సర్కార్ ప్రయత్నిస్తోంది. ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు, రాష్ట్రంలో సహజ, అటవీ, జానపద కళల ఆధారిత పర్యాటకానికి అపార అవకాశాలున్నాయి. ఉత్తరప్రదేశ్ సంస్కృతి, ప్రకృతిని చూడటానికి  దేశీయ, విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. అందుకే రాష్ట్రంలో గ్రామీణ పర్యాటక అవకాశాలను విస్తృత స్థాయిలో సద్వినియోగం చేసుకునే దిశగా యోగి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక గమ్యస్థానాలకు సమీపంలోని గ్రామాల్లో హోమ్ స్టేలు, ఇతర పర్యాటక సౌకర్యాల అభివృద్ధిపై దృష్టి సారించారు. అంతేకాకుండా, గ్రామీణ, అటవీ, ఇతర ప్రధాన పర్యాటక సర్క్యూట్‌లలో టూర్ గైడ్‌లు, ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వడానికి రాష్ట్రంలో విస్తృత స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios