Asianet News TeluguAsianet News Telugu

శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు.. మరో ఇద్దరు స్టార్స్ పేర్లు

సంజనను నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది. జైలు నిబంధనల ప్రకారం రాగిణి, సంజనలను కుటుంబ సభ్యులు, న్యాయవాదితో మాట్లాడుకునేందుకు జైలు అధికారులు అనుమతించడంతో వారు కొంత సమయం కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్నారు. 

Two More Actors Names are out in Drugs Case
Author
Hyderabad, First Published Sep 18, 2020, 10:33 AM IST

శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే నటీమణులు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదీలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. వారిని ఇటీవల జైలుకి కూడా తరలించారు. కాగా జైల్లో ఉన్న నటి సంజనకు ఆమె తల్లిదండ్రులు ఆహారం తీసుకురాగా.. జైలు అధికారులు నిరాకరించారు. కేవలం దుస్తులు మాత్రమే ఇవ్వడానికి అధికారులు అంగీకరించడం గమనార్హం. సంజన తల్లిదండ్రుల నుంచి  దుస్తులను మాత్రమే తీసుకున్న అధికారులు వెంట తెచ్చిన ఆహారం, పండ్ల రసం, చాక్లెట్లను తీసుకునేందుకు నిరాకరించి తిరిగి వారికే ఇచ్చేశారు.

మరోవైపు, నటి రాగిణి గత నాలుగు రోజులుగా జైలులో ఒంటరిగా ఉండగా, సంజన వచ్చిన తర్వాత ఆమెను కూడా అదే బ్యారక్‌లో ఉంచారు. వెంట తెచ్చుకున్న పుస్తకాలను చదువుతూ ఇద్దరూ కాలక్షేపం చేస్తున్నారు. బ్యారక్ బయట తిరిగే అవకాశం ఉన్నప్పటికీ వారిద్దరూ గదిని విడిచి బయటకు రావడం లేదని అధికారులు తెలిపారు. మరోవైపు, రాగిణి, సంజన ఇద్దరికీ జైలు అధికారులు ఇతర ఖైదీలకు అందించే సాధారణ ఆహారాన్నే ఇచ్చారు.

సంజనను నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది. జైలు నిబంధనల ప్రకారం రాగిణి, సంజనలను కుటుంబ సభ్యులు, న్యాయవాదితో మాట్లాడుకునేందుకు జైలు అధికారులు అనుమతించడంతో వారు కొంత సమయం కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్నారు. కాగా, తన బ్యారక్‌లో దోమలు విపరీతంగా ఉన్నాయని, వాటి కారణంగా తనకు నిద్ర పట్టడం లేదంటూ సంజన జైలు అధికారులతో వాదనకు దిగినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. సంజన, రాగిణి విచారణలో మరో ఇద్దరు స్టార్స్ పేర్లు బయటపెట్టినట్లు తెలుస్తోంది. త్వరలో వారిద్దరినీ కూడా అదుపులోకి తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios