Asianet News TeluguAsianet News Telugu

రేప్ చేసి, చంపి, ఇద్దరు బాలికల శవాలను చెట్టుకు వేలాడదీశారు

అస్సాంలోని కాక్రోఝర్ జిల్లాలోని మారుమూల గ్రామంలో జరిగిన ఇద్దరు బాలికల అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.

Two minor girls mystery case solved by Assam police
Author
Guwahati, First Published Jun 16, 2021, 7:56 AM IST

గౌహతి: ఇద్దరు మైనర్ బాలికల అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసి, వారిని చంపి చెట్టుకు వేలాడదీసినట్లు, తద్వారా ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన అస్సాంలోని కోక్రాఝర్ జిల్లాలో శనివారం జరిగింది. 

ఆ కేసుకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాము ఏడుగురిని అరెస్టు చేశామని, వారిలో ముగ్గురు బాలికలపై అత్యాచారం చేశారని, ఆ తర్వాత చంపేసి శవాలను చెట్టుకు వేలడదీశారని, నిందితులు నేరాన్ని అంగీకరించారని కోక్రాఝర్ ఎస్పీ ప్రతీక్ విజయ్ చెప్పారు. కేసును ఛేదించడానికి ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని, 72 గంటల్లో కేసును ఛేదించామని ఆయన చెప్పారు. 

నిందితులను అరెస్టు చేసినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్విట్టర్ వేదికగా కూడా తెలియజేశారు. తాను బాధితుల కుటుంబాన్ని ఆదివారంనాడు పరామర్శించానని, నిందితులను గుర్తించడం సంతృప్తిగా ఉందని ఆయన అన్నారు.

16, 14 ఏళ్ల వయస్సు గల బాలికల శవాలు కోక్రాఝర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో చెట్టుకు వేలాడుతూ కనిపించాయని పోలీసులు చెప్పారు. ఇద్దరు బాలికలు కూడా ఒకే కుటుంబానికి చెందినవారు. 

Follow Us:
Download App:
  • android
  • ios