Asianet News TeluguAsianet News Telugu

మెట్రో స్టేషన్ నుంచి ఆటోలో కిడ్నాప్ చేసి మహిళపై గ్యాంగ్ రేప్

మెట్రో స్టేషన్ లో నిరీక్షిస్తున్న ఓ మహిళను ఆటోలో కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన గురుగ్రామ్ లో జరిగింది. పోలీసులు నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు.

Three offer ride to woman, rape her in Gurugram
Author
Gurugram, First Published Jan 11, 2020, 2:56 PM IST

గురుగ్రామ్: సికిందర్ పూర్ మెట్రో స్టేషన్ లో నిరీక్షిస్తున్న ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు ఆటోలో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వజీరాబాద్ లోని ఓ గదికి తీసుకుని వెళ్లి ఆమెపై ముగ్గురిలో ఇద్దరు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ముగ్గురు వ్యక్తులకు కూడా నేర చరిత్ర లేదు. 

నిందితుల్లో భీవానీకి చెందిన ప్రదీప్ (25) ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. 25 ఏళ్ల శ్యామ్ అనే వ్యక్తి  బస్సు కండక్టర్ గా పనిచేస్తున్నాడు. మోహన్ లాల్ (27) కూడా ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 

ఆ సంఘటన గురువారంనాడు చోటు చేసుకుంది. క్యాటరింగ్ జాబ్ చేస్తున్న మంగోల్పూర్ కు చెందిన మహిళ గురుగ్రామ్ కు వెళ్లింది. పని ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్లడానికి మెట్రో స్టేషన్ లో నిరీక్షిస్తోంది. దాదాపు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఆటోలో అక్కడికి వచ్చారు. 

ఓ మిత్రుడిని అడిగి తెచ్చుకున్న ఆ ఆటోలో ప్రదీప్, మోహన్ లాల్ అనే ఇద్దరు ఆమెకు లిఫ్ట్ ఇస్తామని చెప్పారు. తాము ఢిల్లీకే వెళ్తున్నామని, తమ ఆటోలో రావచ్చునని ఆమెకు చెప్పారు. అయితే, ఆమె ఢిల్లీకి తీసుకుని వెళ్లకుండా వజీరాబాద్ లోని ఓ గదికి తీసుకుని వెళ్లారు. 

అప్పటికే గదిలో ఓ వ్యక్తి ఉన్నాడు. అతన్ని శ్యామ్ గా ప్రదీప్ పిలిచాడు. మహిళపై తొలుత ప్రదీప్ ఆ తర్వాత శ్యామ్ అత్యాచారం చేశారు. ఎట్టకేలకు తాను తెల్లవారు జామున 1.55 గంటల ప్రాంతంలో పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయగలిగానని, వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాంగ్మూలం రికార్డు చేశారని బాధితురాలు చెప్పింది.

Follow Us:
Download App:
  • android
  • ios