తమిళనాడులో రోడ్డు ప్రమాదం: గర్భిణీ సహా ముగ్గురు మృతి
తమిళనాడు రాష్ట్రంలోని కల్లాకురిచ్చి వద్ద గురువారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్భిణీ సహా ముగ్గురు మరణించారు.
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కల్లాకురిచ్చి వద్ద గురువారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్భిణీ సహా ముగ్గురు మరణించారు. గర్భిణినీ అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. అంబులెన్స్ కల్లాకురిచ్చి వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్లో ఆసుపత్రికి వెళ్తున్న గర్భిణీ తో పాటు మరో ఇద్దరు మరణించారు. ఈ అంబులెన్స్ లో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అంబులెన్స్ అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గర్భిణీతో పాటు గర్భంలో కూడ శిశువు కూడ మరణించినట్టుగా వైద్యలు తెలిపారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి కూడ విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం ా కుటుంబంలో విషాదాన్ని నింపింది.అంబులెన్స్ అతి వేగంగా నడపడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొందనే అభిప్రాయంతో ఉన్నారు పోలీసులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.