Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడులో రోడ్డు ప్రమాదం: గర్భిణీ సహా ముగ్గురు మృతి

తమిళనాడు రాష్ట్రంలోని కల్లాకురిచ్చి వద్ద గురువారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్భిణీ సహా ముగ్గురు మరణించారు. 

Three killed in road accident in Tamilnadu lns
Author
Chennai, First Published Jun 10, 2021, 10:17 AM IST

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కల్లాకురిచ్చి వద్ద గురువారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్భిణీ సహా ముగ్గురు మరణించారు. గర్భిణినీ అంబులెన్స్‌లో  ఆసుపత్రికి తీసుకెళ్తుండగా  ఈ ప్రమాదం చోటు చేసుకొంది. అంబులెన్స్  కల్లాకురిచ్చి వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  అంబులెన్స్‌లో ఆసుపత్రికి వెళ్తున్న గర్భిణీ తో పాటు మరో ఇద్దరు మరణించారు. ఈ అంబులెన్స్ లో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

అంబులెన్స్ అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని   పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గర్భిణీతో పాటు గర్భంలో కూడ శిశువు కూడ మరణించినట్టుగా వైద్యలు తెలిపారు.  గాయపడిన ఇద్దరి పరిస్థితి కూడ విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం  ా కుటుంబంలో విషాదాన్ని నింపింది.అంబులెన్స్ అతి వేగంగా నడపడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొందనే అభిప్రాయంతో ఉన్నారు పోలీసులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios