Asianet News TeluguAsianet News Telugu

యువతిని కిడ్నాప్ చేసి, ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన పక్కింటి వ్యక్తి.. ప్రతిఘటించడంతో విషం పెట్టి..

యువతిపై పక్కింట్లో నివసించే వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిని ఆమె ప్రతిఘటించడంతో విషం పెట్టాడు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. 

The neighbor who kidnapped the young woman, took her to the house and raped her.. When she resisted, poisoned her.
Author
First Published Jan 4, 2023, 10:47 AM IST

మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా యూపీలోనూ ఇలాంటి దారుణమే ఒకటి వెలుగులోకి వచ్చింది. 18 ఏళ్ల యువతిని ఓ పక్కింటి వ్యక్తి కిడ్నాప్ చేసి, అత్యాచారినికి ఒడిగట్టాడు. అనంతరం ఆమెకు విషం పెట్టాడు. 

షాకింగ్.. విమానంలో మహిళపై మూత్ర విసర్జన,ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ..అసభ్య ప్రవర్తన.. చివరికి..

ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలిబిత్ జిల్లా జెహనాబాద్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధి నివసించే 18 ఏళ్ల యువతిని ఆమె పక్కింట్లో ఉండే కమల్ అనే వ్యక్తి జనవరి 1వ తేదీ తెల్లవారుజామున కిడ్నాప్ చేశాడు. ఆమెను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లాడు. నోరు బిగించి అత్యాచారానికి పాల్పడ్డారు.

అయితే ఈ సమయంలో ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టాడు. అనంతరం విషం కూడా ఇచ్చాడు. అయితే ఈ ఘటన బాధితురాలి తల్లికి తెలిసింది. ఆమె కుటుంబ సభ్యులతో నిందితుడి ఇంటికి చేరుకుంది. దీంతో నిందితుడి కుటుంబ సభ్యులు బాధితురాలి తల్లిపై కూడా దాడి చేశారు. అయితే జెహనాబాద్ పోలీసులు మొదట ఈ ఫిర్యాదును స్వీకరించలేదని తల్లి ఆరోపించింది. తన కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని, పిలిభిత్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తల్లి ఫిర్యాదులో పేర్కొంది.

కారు కింద నా ఫ్రెండ్ ఇరుక్కుపోయిందని వారికి తెలుసు.. ఉద్దేశపూర్వకంగానే కారు నడిపారు - అంజలి సింగ్ స్నేహితురాలు

పోలీస్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు కమల్, అతడి సోదరుడు సంజు, సోదరి శీతల్, తల్లి మాయాదేవి, తండ్రి సత్యపాల్‌పై సంబంధిత సెక్షన్ల కింద మంగళవారం సాయంత్రం కేసు నమోదు చేసినట్లు జెహనాబాద్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌హెచ్‌ఓ) కొత్వాలి ప్రభాష్ కుమార్ తెలిపారు. అయితే నిందితులు ఇంటికి తాళం వేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు.

ఇలాంటి ఘటనే తాజాగా బీహార్ లోనూ వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక పాట్నాలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్ లో క్లాస్ లు ముగించుకొని ఇంటికి మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటికి వస్తోంది. అయితే ఈ సమయంలో ఓ ఆటోలో పలువురు వ్యక్తులు ఆ బాలికను కిడ్నాప్ చేశారు. అనంతరం జల్లా ప్రాంతంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లారు.

కోచింగ్ నుంచి వస్తున్న 8వ తరగతి బాలిక కిడ్నాప్, గ్యాంగ్ రేప్.. నిందితులను అరెస్టు చేయాలని నిరసనలు 

బాలికను సమీపంలోని ఓ గదిలోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టారు. దీంతో బాలిక స్పృహతప్పి పడిపోయింది. అనంతరం మైనర్ ను శని దేవాలయం సమీపంలో పడేసి వెళ్లిపోయారు. అయితే కొంతసేపటి తర్వాత బాలిక స్పృహలోకి రావడంతో వచ్చింది. తరువాత ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు తనపై జరిగిన దాడిని వివరించింది. తల్లిదండ్రులు బైపాస్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను గోలు కుమార్, ముఖేష్ కుమార్, ప్రమోద్ కుమార్, సుగ్రీవ్ కుమార్, ఆటోరిక్షా డ్రైవర్‌గా గుర్తించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులను నిరసనలకు దిగారు. కాగా.. నిందితుల్లో నలుగురు పరారీలో ఉన్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఆటో డ్రైవర్ ను మాత్రమే అరెస్టు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios