Asianet News TeluguAsianet News Telugu

నవరాత్రి ఉత్సవాలకు వెళ్లి వస్తున్న యువతిపై గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణమైన సంఘటన జరిగింది. నవరాత్రి ఉత్సవాలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు 

Teenager molested in UP, while reurning from Navratri Festival
Author
lucknow, First Published Oct 23, 2020, 7:57 AM IST

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. 19 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. 

బుధవారం రాత్రి నవరాత్రి ఉత్సవాలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా కిడ్నాప్ చేసి యువతిపై ముగ్గురు వ్యక్తులు సామాహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 

పాన్వాడి ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తమకు సమాచారం అందిందని పోలీసు సూపరింటిండెంట్ అరుణ్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. ముగ్గురు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఓ ఇంటి వెనక ఉన్న నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి యువతిపై అత్యాచారం చేశారు. యువతిని వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios