ప్రభుత్వ హాస్పిటల్లో టీనేజీ బాలికపై ప్యూన్ అత్యాచారం.. ఢిల్లీలో ఘటన
ఢిల్లీలోని ఓ ప్రభుత్వ హాస్పిటల్లో టీనేజీ బాలికపై ప్యూన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రత్యేకంగా ఓ గదికి తీసుకెళ్లి రేప్ చేసినట్టు బాధితురాలు ఆరోపించారు. నిందితుడు, బాధితురాలు ముందుగానే పరిచయస్తులు అని పోలీసులు తెలిపారు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ హాస్పిటల్లో టీనేజీ బాలికపై ప్యూన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తూర్పు ఢిల్లీలో గురువారం ఈ ఘటన జరిగింది. నిందితుడు, బాధితురాలు ఇద్దరూ ఇరుగు పొరుగు వారేనని తెలిసింది. 25 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
అత్యాచారానికి గురైన 16 ఏళ్ల బాలిక ఉత్తరప్రదేశ్ వాసి. ఆమెను ప్రభుత్వ హాస్పిటల్లోని ఓ గదిలోకి తీసుకెళ్లి ఆమెపై ప్యూన్ లైంగిక దాడికి దిగినట్టు ఆమె ఆరోపించింది.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు ఆమెకు ముందే తెలుసు అని సదరు బాధిత బాలిక పోలీసులకు తెలిపింది. ఆమె స్వయంగా ఆ నిందితుడికి ఫోన్ చేసి కలవడానికి వెళ్లింది. ప్రభుత్వ హాస్పిటల్లో కాంట్రాక్టు ఉద్యోగి (ప్యూన్)గా చేస్తున్న నిందితుడు ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను రేప్ చేశారు. బాలికకు మెడికల్ ఎగ్జామినేషన్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పోక్సో యాక్ట్ సహా రేప్ కేసు నమోదుచేశారు. నిందితుడిని అరెస్టు చేశారు. దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు చెప్పారు.
Also Read: సెక్స్ వీడియోలకు అడిక్ట్.. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. మైనర్ అరెస్టు
హాస్పిటల్లో ఇప్పటికే ఐసీసీ కమిటీ ఉన్నదని, ఈ కమిటీ ఘటనను దర్యాప్తు చేస్తుందని ఓ హాస్పిటల్ అధికారి వివరించారు. పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం ప్రారంభించారని తెలిపారు.