Asianet News TeluguAsianet News Telugu

యువతిని కిడ్నాప్ చేసి, అమ్మేశారు: ఆ తర్వాత రేప్ చేశారు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువతిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అమ్మేశారు. కొనుగోలు చేసుకున్నవారు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు.

Six arrested in in a kidnap case in Madhya pradesh
Author
bhopal, First Published Aug 16, 2020, 7:26 AM IST

భోపాల్: ఓ యువతి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించిన కేసులో మధ్య ప్రదేశ్ పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. 24 ఏళ్ల యువతిని దుండగులు కిడ్నాప్ చేసి, ఆమెను అమ్మేశారు. ఆ తర్వాత ఆమెను రేప్ చేశారు. ఆరుగురు నిందితులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను మొరేనా జిల్లా ఎస్పీ అనురాగ్ సుజానియా అందించారు. భోపాల్ కు చెందిన యువతి ఓ ప్రైవేట్ కంపెనీలో పని కోసం కొద్ది రోజుల క్తిరం గ్వాలియర్ వెళ్లింది. ఈ ఏడాది జూన్ లో జూన్ లో మాయా శాక్యా అనే మహిళ ఆమెకు పరిచయమైంది. 

ఆ పరిచయంతో బాధిత యువతిని ఆమె మొరేనా తీసుకుని వెళ్లింది. మాయా అక్కడ జౌరాకు చెందిన మరో ముగ్గురు స్నేహితులు మొహర్ సింగ్ రాజక్, ఓమ్ వంటి, లోకేంద్ర శర్మలతో కలిసి బాధితురాలిని కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఆమెను మొరేనాలోని బాన్మోర్ ప్రాంతానికి ఇద్దరు అవివాహిత సోదరులు రణ్ వీర్, విజయ్ గుర్జార్ లకు రెండు లక్షల రూపాయలకు విక్రయించారు. 

రణ్ వీర్, విజయ్ లు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. ఆమెపై దాడి కూడా చేశారు. బాధితురాలు ఓ గ్రామస్థుడి సాయంతో భోపాల్ లోని తన సోదరుడికి సమాచారం అందించింది. అతడు అప్పటికే నెల రోజుల నుంచి గాలిస్తు్నాడు.

సమాచారం అందుకున్న యువతి సోదరుడు మధ్యప్రదేశ్ హైకోర్టులోని గ్వాలియర్ బెంెచ్ లో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాన్మోరే ప్రాంతంలో మంగళవారం బాధితురాలిని రక్షించారు. అయితే, నిందితులు పారిపోయారు. 

నిందితుల ఆచూకీ కోసం ఒక్కొక్కరికి రూ.5 వేల రివార్డు ప్రకటించారు. ఎట్టకేలకు పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios