బస్టాండులోకి దూసుకెళ్లిన కారు: ఏడుగురి మృతి, మరో ఏడుగురికి తీవ్ర గాయాలు
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కోయంబత్తూరు ఆసుపత్రికి తరలించారు.
కోయంబత్తూరు:తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కోయంబత్తూరు ఆసుపత్రికి తరలించారు.
కోయంబత్తూరులోని సుందరాపురంలో బస్టాండ్లోకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఇద్దరు కాలేజీ విద్యార్ధులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు కూడ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.
ఈ ఘటనలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బస్స్టేషన్లోని జనంపైకి దూసుకెళ్లింది.
అయితే కారు అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడ విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు.