Asianet News TeluguAsianet News Telugu

థానేలో దారుణం: మంచినీళ్ల కోసం వచ్చి వృద్దురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం

మానసికంగా బాధపడుతున్న 65 ఏళ్ల వృద్దురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకొంది. మహిళలపై  అత్యాచారాలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

Security Guard held for raping mentally ill senior citizen In Thane
Author
New Delhi, First Published Nov 10, 2021, 10:05 AM IST

 ముంబై:వృద్దురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకొంది. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకొని సెక్యూరిటీ గార్డు ఆమెపై అత్యాచారం చేశాడు.  మానసికంగా బాధపడుతున్న 65 ఏళ్ల వృద్దురాలిపై సెక్యూరిటీ గార్డు ఈ దారుణానికి పాల్పడ్డాడు. 25 ఏళ్ల సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు.థానేలోని నౌవడలోని హౌసింగ్ సోసైటీ వద్ద 25 ఏళ్ల యువకుడు  సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.

మానసికంగా బాధపడుతున్న వృద్దురాలు ఈ సోసైటీలోని ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెను  చూసేందుకు బంధువులు వారంలో  రెండు దఫాలు వచ్చి పోతుంటారు. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు వృద్దురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ నెల 3వ తేదీన మంచినీళ్లు ఇవ్వాలని వృద్దురాలి ఇంట్లోకి వెళ్లాడు Security Guard. ఇంట్లోకి వెళ్లి ఆమె నీళ్లు తీసుకొచ్చేలోపుగా ఇంటి తలుపులు పెట్టి ఆమెపై Rapeకి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన నాటి నుండి ఆమె తన ఇంట్లోనే బాధపడుతూ ఉంది. అయితే వృద్దురాలు బాధపడుతున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు ఆమె బందువులకు సమాచారం ఇచ్చారు.

senior citizen బంధువులు వచ్చి ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ ఆమెను పరీక్షించారు. ఈ పరీక్షలో అసలు విషయం వెలుగు చూసింది.  ఈ విషయమై బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్యూరిటీ గార్డును విచారించారు. పోలీసుల విచారణలో సెక్యూరిటీ గార్డు తాను వృద్దురాలిపై అత్యాచారం చేసినట్టుగా ఒప్పుకొన్నాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

also read:అత్యాచారం-హత్య కేసుల్లో మైనర్లకు మరణశిక్ష.. ! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. !!

మానసికంగా ఇబ్బంది పడుతున్న వృద్దురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని సోసైటీ సభ్యులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.  ఈ తరహా ఘటనలు  మరోసారి జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని  స్థానికులు కోరుతున్నారు.మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు జరగకుండా  పలు ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చినా కూడా ఈ తరహా ఘటనలు ఆగడం లేదు.

నిర్భయ, దిశ లాంటి ఘటనలు చోటు చేసుకొన్న సమయంలో నిరసనల సమయంలో ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం ఈ తరహా ఘటనలు జరగకుండా చూస్తామని హమీలు ఇస్తున్నారు. కానీ ఆచరణలో అమలు కావడం లేదు. మరో వైపు అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు ఆరు మాసాల్లోపుగానే కఠినమైన శిక్షలు పడితే భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవనే అభిప్రాయాలను మహిళా సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. చట్టాలు చేయడమే కాదు ఆ చట్టాలను  అమలు చేయాల్సిన అవసరం ఉందనే  మహిళా సంఘాల నేతలు  కోరుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios