Asianet News TeluguAsianet News Telugu

ఆన్ లైన్ క్లాసులో పోర్న్ లింక్.. టీచర్ పై పోక్సో యాక్ట్...

ఆన్ లైన్ క్లాస్ చెబుతున్న టీచర్ చేసిన ఓ పని అందరికీ షాకిచ్చింది. ఉదయ్ పూర్ లోని సెయింట్ పాల్స్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ధ్రువ్ కుమార్ గత శనివారం విద్యార్ధులకు ఆన్ లైన్ ద్వారా పాఠం చెప్పేందుకు స్కూల్ యాప్ లో లింక్ పోస్ట్ చేశాడు. అయితే అది పోర్న్ లింక్ కావడం సంచలనంగా మారింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆ వీడియో చూసి షాక్  అయ్యారు. వెంటనే ధ్రువ్ కుమార్ కు, స్కూలు యాజమాన్యానికి ఫోన్ చేసి విషయం చెప్పారు. అప్పటికే సర్వర్ బ్రేక్ అవడం వల్ల ఆ లింక్ తొలగించడానికి వీలు కాలేదు. 

 

Porn link in online class, Pokso act on teacher in Rajasthan
Author
Hyderabad, First Published Jan 24, 2022, 2:03 PM IST

రాజస్థాన్ : ప్రస్తుతం కరోనా వల్ల చాలా రాష్ట్రాల్లో ఆన్ లైన్ తరగతులు జరుగుతున్నాయి. Rajasthan లోనూ కరోనా కేసులు ఎక్కువ కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇచ్చేసింది. online class లకు పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయ్ పూర్ లోని సెయింట్ పాల్స్ పాఠశాల యాజమాన్యం కూడా ఆన్ లైన్ ద్వారానే తమ studentలకు విద్యాభోదన చేస్తోంది.

అయితే ఆన్ లైన్ క్లాస్ చెబుతున్న teacher చేసిన ఓ పని అందరికీ షాకిచ్చింది. ఉదయ్ పూర్ లోని సెయింట్ పాల్స్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ధ్రువ్ కుమార్ గత శనివారం విద్యార్ధులకు ఆన్ లైన్ ద్వారా పాఠం చెప్పేందుకు స్కూల్ యాప్ లో link పోస్ట్ చేశాడు. అయితే అది Porn link కావడం సంచలనంగా మారింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆ వీడియో చూసి షాక్  అయ్యారు. వెంటనే ధ్రువ్ కుమార్ కు, స్కూలు యాజమాన్యానికి ఫోన్ చేసి విషయం చెప్పారు. అప్పటికే Server Break down అవడం వల్ల ఆ లింక్ తొలగించడానికి వీలు కాలేదు. 

దాదాపు రెండు గంటలపాటు ఆ వీడియో అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత డిలీట్ అయింది. కాగా, సదరు ఉపాధ్యాయుడి మీద పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడి మీద పోలీసులు pocso చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా, అది మానవ తప్పిదం మాత్రమేనని స్కూలు యాజమాన్యం సర్దిచెప్పే ప్రయత్నం చేసింది.  

ఇదిలా ఉండగా, ఆన్ లైన్ క్లాసుల్లో అపరిచితులు చొరబడడం, పోర్న్ లింకులు పెట్టడం గతంలో కూడా జరిగాయి. ఇక గత డిసెంబర్ 8న బెంగళూరులో ఆన్ లైన్ క్లాసులు ఓ వ్యక్తి వివాహేతర సంబంధం బయటకు రావడానికి కారణమైంది. దీంతో తనకు భర్త నుంచి విడాకులు కావాలని భార్య కోరింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలోని నాగమంగళ తాలూకాలో ఈ ఘటన చోటు చేసుకొంది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం బైటికి రావడంతో తనకు విడాకులు కావాలంటూ భార్య కోరుతోంది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త మీద ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యాభర్తలకు 18 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారి వయసు 17 సం.లు, 15 సం.లు.. కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండడంతో.. తన ఫోన్ ను కూతురికి ఇచ్చాడు తండ్రి.

అయితే ఆన్ లైన్ క్లాసుల కోసం ఫోన్ ఓపెన్ చేయగా అందులో మరో మహిళతో తండ్రి ఏకాంతంగా ఉన్న దృశ్యాలు ఆమె కంటపడ్డాయి. దీంతో ఆమె తన తల్లికి ఈ విషయాన్ని చెప్పింది. వీడియో కూడా చూపించింది. అంతేకాదు సదరు మహిళ వీరికి సమీప బంధువు. దీంతో భర్తనుంచి విడాకులు కావాలని భార్య భీష్మించుకుంది. భర్త మాత్రం తప్పు జరిగిపోయిందని.. తాను కుటుంబంతోనే ఉంటానని చెబుతున్నాడు. దంపతులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ ఫలితం లేకుండా పోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios