దారుణం : ఇన్ స్టాగ్రామ్ లో న్యూడ్ ఫొటోలు.. విద్యార్థిని ఆత్మహత్య..
ఇన్ స్టాగ్రామ్ లో తన మార్ఫింగ్ అశ్లీల చిత్రాల వెలుగుచూడడంతో తట్టుకోలేక ఓ కాలేజీ విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది. జిల్లాకు చెందిన ఓ యువతి (20) ప్రైవేటు కాలేజీలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. కొద్ది రోజుల క్రితం ఆమె పేరుతో దుండగులెవరో ఇన్ స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు.
ఇన్ స్టాగ్రామ్ లో తన మార్ఫింగ్ అశ్లీల చిత్రాల వెలుగుచూడడంతో తట్టుకోలేక ఓ కాలేజీ విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది. జిల్లాకు చెందిన ఓ యువతి (20) ప్రైవేటు కాలేజీలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. కొద్ది రోజుల క్రితం ఆమె పేరుతో దుండగులెవరో ఇన్ స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు.
దీంట్లో వేరే నగ్న ఫొటోలకు ఆమె తలను అతికించి.. ఫొటోలు మార్ఫింగ్ చేసి నగ్న, అశ్లీల చిత్రాలను పోస్ట్ చేశారు. ఆ న్యూడ్ ఫొటోలు చూసి ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురై బాధపడసాగింది. రెండు రోజులకు ముందు ఇంట్లోనుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు.
ప్రియుడితో యువతి పరార్.. పక్కింట్లోనే కాపురం పెట్టినా..!...
ఆమె ఆచూకీ కోసం తల్లిదండ్రులు, బంధువులు అన్ని చోట్లా వెతికారు. చివరకు ఆ గ్రామంలోనే ఉన్న బావిలో ఆమె మృతదేహం పడి ఉండడం చూసి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెంగల్పట్టు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల దర్యాప్తులో ఇన్ స్టాగ్రామ్ లో న్యూడ్ ఫొటోలు చూసి దిగ్భ్రాంతితో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది. చెంగల్పట్టు పోలీసులు ఈ సంఘటన మీద సైబర్ క్రైం పోలీసు విభాగం నిపుణుల ద్వారా ఇన్ స్టాగ్రామ్ లో ఆ యువతి పేరుతో నకిలీ ఖాతాను ప్రారంభించిన దుండగుల ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు.