Asianet News TeluguAsianet News Telugu

చెన్నైలో నిర్భయ తరహా ఘోరం... కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్

దేశ రాజధాని డిల్లీలో జరిగిన నిర్భయ తరహా దారుణమే తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. కదులుతున్న కారులో ఓ యువతి బంధించి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు దుండగులు. 

nirbhaya like Incident in Chennai... Girl Gang Raped In Moving Car
Author
Chennai, First Published Sep 12, 2021, 8:41 AM IST

చెన్నై: కదులుతున్న బస్సులో నిర్భయను అత్యంత ఘోరంగా అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటను ఇంకా దేశప్రజలు మరిచిపోకముందే అలాంటి దారుణమే తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. కదులుతున్న కారులో ఓ 20ఏళ్ళ యువతిని పథకం ప్రకారం కిడ్నాప్ చేసిన ఐదుగురు యువకులు కారులో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. కారును నగరంలో తిప్పుతూ ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి చివరకు రోడ్డుపై పడేసి వెళ్ళిపోయారు. 

వివరాల్లోకి వెళితే... చెన్నై నగరంలోని ఓ మొబైల్ స్టోర్ లో 20ఏళ్ల యువతి పనిచేస్తోంది. అదే స్టోర్ లో గుణశీలన్ అనే యువకుడు  కూడా పనిచేస్తున్నాడు. ఒకేదగ్గర పనిచేస్తుండటంతో అతడితో యువతి కొద్దిగా చనువుగా వుండేది. దీంతో ఆమెపై కన్నేసిన అతడు దారుణానికి ఒడిగట్టాడు. 

సదరు యువతిని మాయమాటలతో నమ్మించి తనవెంట తీసుకెళ్లి మత్తుమందు కలిపిన డ్రింక్ తాగించాడు. దీంతో మత్తులోకి జారుకున్న యువతిని మరో నలుగురు స్నేహితులతో కలిసి కారులో ఎక్కించాడు. కారును రోడ్డుపై పోనిస్తూ ఈ దుర్మార్గులు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. 

read more  ప్రియుడితో కలిసి... ప్రేమగా పెంచిన తల్లిని చంపిన కసాయి కూతురు

బాధిత యువతికి స్పృహ వచ్చి తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని గుర్తించింది. దీంతో గట్టిగా కేకలు వేయగా బయపడిపోయిన దుండగులు రోడ్డుపైనే యువతిని పడేసి పరారయ్యారు. అర్ధనగ్నంగా నడవలేని స్థితిలో రోడ్డుపై పడివున్న యువతిని గుర్తించిన స్థానికులు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి హాస్పిటల్ కు తరలించారు.  

కాస్త కోలుకున్న తర్వాత యువతి తనపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గుణశీలన్ ను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు మిగతా నిందితులకు కూడా  అరెస్ట్ చేశారు. వారందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios