ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానంలో పైలెట్ పై దాడి ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానం ఆలస్యంగా బయలు దేరే విషయంలో ఆలస్యం గురించి ప్రకటన చేసే సమయంలో ఓ ప్రయాణీకుడు పైలెట్ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయమై విమానంలోని ఓ ప్రయాణీకుడు సోషల్ మీడియాలో తన వెర్షన్ ను పోస్టు చేయడంతో సంఘటన మరో మలుపు తిరిగింది. ఈ విమానంలో ప్రయాణీస్తున్న రష్యన్ -భారత నటి మోడల్ ఎవ్జెనియా బెల్స్కియా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు.
ఢిల్లీ- గోవా విమానం (6ఈ-2175) ఆదివారంనాడు ఉదయం ఏడున్నర గంటలకు టేకాఫ్ కావాల్సి ఉంది. అయితే ఉదయం ఆరు గంటలకే విమానాశ్రాయానికి చేరుకున్నామని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. విమానం ఆలస్యమైందన్నారు. దాదాపు 10 గంటలు ఎదురు చూసినట్టుగా చెప్పారు. ఆ తర్వాత విమానంలోకి వెళ్లినట్టుగా తెలిపారు. విమానంలో కూర్చున్న తర్వాత కూడ రెండు నుండి మూడు గంటల పాటు వెయిట్ చేసినట్టుగా ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు.
వీడియో మరింత ఆలస్యమైన విషయమై ప్రయాణీకులు పూర్తిగా సహనం కోల్పోయారన్నారు. ఈ విషయమై ప్రయాణీకులు క్యాబిన్ సిబ్బందిని ప్రశ్నించడం ప్రారంభించారన్నారు. అదే సమయంలో విమానం ఇంకా ఆలస్యంగా బయలు దేరే విషయాన్ని పైలెట్ చెప్పారన్నారు. ఈ విషయమై ప్రయాణీకులు పూర్తిగా తమ సహనాన్ని కోల్పోయారన్నారు. అయితే ఈ సమయంలో ప్రయాణీకుడు పైలెట్ పై దాడి చేయడం తప్పేనని ఎవ్జెనియా బెల్స్కియా అంగీకరించారు.
ఈ విషయమై ప్రయాణీకులను రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రయాణీకులు తమ సహనాన్ని కోల్పోయారన్నారు.ఢిల్లీ-గోవా ఇండిగో విమానం (6E-2175) పైలెట్ అనూప్ కుమార్ విమానం మరింత ఆలస్యంగా బయలుదేరనుందని ప్రకటించే సమయంలో ఓ ప్రయాణీకుడు అతడిపై దాడి చేశాడని ఎయిర్ లైన్స్ వర్గాలు ప్రకటించాయి.ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
అయితే దాడి చేసిన ప్రయాణీకుడితో పాటు ఇతరులను విమాన సిబ్బంది శాంతింపజేసేందుకు యత్నించారు. ఈ ఘటనపై ఏవియేషన్ సెక్యూరిటీ ఏజెన్సీ అప్రమత్తమై విచారణ ప్రారంభించింది.
